Krishna pushkaralu
-
‘పుష్కర’ విధులతో గొప్ప అనుభూతి
సమష్టి కృషితో కృష్ణాపుష్కరాలు విజయవంతం కలెక్టర్ టీకే శ్రీదేవి మహబూబ్నగర్: కృష్ణా పుష్కరాల విధులు నిర్వహించడం గొప్ప అనుభూతి అని కలెక్టర్ టీకే శ్రీదేవి అన్నారు. పుష్కరాలు విజయవంతంగా ముగిసిన సందర్భంగా మంగళవారం స్థానిక అన్నపూర్ణ గార్డెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అభినందనసభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను స్వయంగా ఏర్పాట్లు చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసిందని, మన జిల్లాలోనే సీఎం కేసీఆర్ పుణ్యస్నానం చేయడం సంతోషకరమన్నారు. సమష్టి కృషి వల్ల పుష్కరాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పుష్కరఘాట్లలో తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనుల్లో భాగంగా మరుగుదొడ్ల ఏర్పాట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించారని అభినందించారు. ఎక్కడ అపశృతి జరగకుండా పుష్కరాలను నిర్వహించినట్లు చెప్పారు. గ్రామస్థాయి అధికారి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేశారని కొనియాడారు. పుష్కరాల విధులు తన సర్వీస్లో గొప్పగా నిలిచిపోతాయని చెప్పారు. జిల్లాలో కోటి 86 లక్షల భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. జిల్లాలోని ప్రతిఘాట్ను అందంగా తీర్చిదిద్దామని, ఎక్కడ ఎలాంటి చిన్న తప్పు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం పుష్కరవిధుల్లో పాల్గొన్న అధికారులకు ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ దామోదర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ పద్మనాభరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పొగడ్తల రాజసూయం
అక్షర తూణీరం అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ఆనాడు ధర్మరాజు రాజ సూయం చేశాడు. అది మహా భారతంలో ఒక సువర్ణ అధ్యాయం. ఆ యజ్ఞం చేయ డానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. పుష్కలంగా నిధులు కావాలి. అర్జునుడు లోకం మీదపడి, రాజుల్ని గెలిచి ధనం దండుకువచ్చాడు. అప్పట్నించీ ‘ధనంజయుడు’ అనే కీర్తినామం ధరించాడు. ఆ సందర్భంలోనే మయుడు ఒక మహత్తరమైన సభా మండపాన్ని నిర్మించి పాండవులకు కానుకగా సమర్పించాడు. రాజ సూయానికి సుయోధనుడు కూడా మంచిమనసుతోనే వచ్చాడు. ఆయనను ఖజానావద్ద కూర్చోబెట్టారు. రారాజు చేతిలో పరుసవేది ఉంది. అంటే ఆ చేతులతో ధనధాన్యాలను తీస్తుంటే, ఎన్నితీసినా అవి అడు గంటవు. గల్లాపెట్టె అక్షయపాత్రగా నిలుస్తుంది. రాజ సూయం వెనకాల సచివుడు సారథి శ్రీకృష్ణుడున్నాడు కనుక కిటుకులు చెప్పి ముందుకు నడిపించాడు. అత్యంత శోభాయమానమైన మయసభను సుయో ధనునికి విడిదిగా ఇచ్చారు. మయసభ రారాజుకి ‘అయోమయ సభ’ అయింది. ఆపైన పాంచాలి పరిహ సించుటయా! మయసభలోనే కురుక్షేత్ర మహా సంగ్రా మానికి బీజం పడింది. శ్రీకృష్ణుడిని అగ్రపూజకు ఎంపిక చేశారు. కొందరు హర్షించి ఊరుకున్నారు. శిశుపాలుడు మాత్రం సభాముఖంగా రెచ్చిపోయాడు. కృష్ణునిలో పర మాత్ముని పక్కనపెట్టి, ఉతికి ఆరేశాడు. నిండుసభలో సుదర్శనానికి శిశుపాలుడు బలైపోయాడు. నలుగురు సోదరులు నాలుగు వేదాలై నిలవగా, ధర్మజుడు యజ్ఞ కుండమై భాసిల్లాడని వ్యాసమహర్షి అభివర్ణించాడు. రాజసూయంలో పాండవులపై కురిసిన పొగడ్తలు అన్నీ ఇన్నీ కావు. శేష జీవితానికి సరిపడా, పళ్లు పులిసేలా పొగిడేశారు సామంతులు. ఇక్కడ ఇది చాలా అసందర్భమే కానీ, ఎందుకో కృష్ణా పుష్కరాలని ఆరంభం నించి చివరి ఆస్ట్రేలియా బాణసంచా దాకా చూశాక రాజసూయ ఘట్టం గుర్తుకు వచ్చింది. ‘‘పుష్కరాలు విజయవంతం’’ అవడమంటే ఏమిటో ప్రజలకు అర్థం కావడం లేదు. అడవి రాముడు సినిమా విజయవంతమైందంటే అర్థం ఉంది. అదేదో సంగమం దగ్గర కృష్ణానదిని ఆవహించినంతగా ఉంది. దాదాపు నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు డుమ్మా కొట్టాయి. కలెక్టర్ల నుంచి దిగువ దాకా అందరూ ‘‘ఆన్ డ్యూటీ’’గా పుష్కర ఘాట్లలో మునిగి తేలారు. అసుర సంధ్యవేళ మహా సంకల్ప దీక్ష చెప్పించడం ఒక ఫార్సు! ‘‘అటుపోతే బ్యారికేడ్లు, ఇటు చూస్తే నీటి ప్రవాహం – ఈ మధ్యలో త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాం. ఏ దారీ లేక గోదారి అన్నట్టు, అక్కడ దొరికిపోయాం. పైగా పోలీసులు’’ అని ఒక భక్తుడు తడిబట్టలతో బాధపడ్డాడు. ‘‘మొత్తానికి బాబు మాస్ హిస్టీరియా క్రియేట్ చేశాడు’’ అని ఓ హేతువాది నిర్భ యంగా వ్యాఖ్యానించాడు. ‘‘ప్రజాధనం గంగలో పోశారు’’ అంటూ బెజవాడ పాత కమ్యూనిస్టు కష్ట పడ్డాడు. ‘‘ఒక రోజు పెళ్లికి మొహమంతా కాటుక’’ అన్నట్టు ఈ మాత్రం దానికి ఇంత హంగామా అవ సరమా అని చాలామంది అనుకున్నారు. కిలోమీటర్ల పొడవున ఎంతో ఉదారంగా నిర్మించిన స్నానఘట్టాల మెట్లన్నీ తోలు తీసిన ఆవుదూడల్లా కనిపిస్తున్నాయి. పైన పరిచిన టైల్స్ని పీక్కుపోవడం ప్రారంభమైంది. ఎంతైనా మన జాతి అసామాన్యమైన జాతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
కృష్ణా పుష్కరాల్లో తెనాలి మువ్వల సవ్వడి
తెనాలి (గుంటూరు): కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తజన కోటిని తన అక్కున చేర్చుకుని ఆశీస్సులిచ్చిన కృష్ణవేణి, తన సామీప్యంలో మువ్వల సవ్వడులకు పులకరించింది. చిన్నారుల్నుంచి, ప్రఖ్యాత నర్తకీమణుల వరకు భక్తి తన్మయత్వంలో చేసిన నృత్య ప్రదర్శనలను కనులారా వీక్షించి, మురిసింది. కృష్ణమ్మ్మ సన్నిధిలో భక్త జనం ఎదుట తమ నాట్యకళాప్రతిభను చాటడాన్ని పలువురు ఔత్సాహిక, వర్ధమాన కళాకారులు తమకది ఒక అద్భుత అవకాశంగా భావిస్తున్నారు. రాష్ట్ర భాషా, సాంస్కతికశాఖ నిర్వహించిన సాంస్కృక ప్రదర్శనల్లో తెనాలికి చెందిన బాల, యువ నర్తకిలు వందమందికి పైగా పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. ఇదొక అనిర్వచనీయమైన జ్ఞాపకంగా తమ జీవితంలో మిగిలిపోతుందని వారు సంబరపడుతున్నారు. శ్రీలక్ష్మీ నృత్యకళా కేంద్రం నుంచే 50 మంది... కళల కాణాచి తెనాలిలో శ్రీలక్ష్మీ కూచిపూడి నృత్య కళాకేంద్రం విద్యార్థులు యాభై మంది వరకు పుష్కరాల సందర్భంగా ప్రదర్శనలివ్వడం విశేషం. కళాకేంద్రం నృత్యగురువు ఎ.వెంకటలక్ష్మి నేతృత్వంలో అష్టలక్ష్మి వైభవం, శంకరశ్రీగిరి, శివాష్టకం, మహిళాసుర మర్ధిని నృత్యరూపకాలను వీరు ప్రదర్శించారు. మరొక ప్రముఖ నత్యకారిణి, నృత్యశిక్షకురాలు బి.రంగనాయకి మంగళగిరి ఎయిమ్స్, పుష్కరనగర్–సీతానగరంలో తన శిష్యులు బి గ్రేడ్ కూచిపూడి నర్తకి బి.కమలాశ్రుతి, మాధవి, సాయిస్వరూప్, సాయిమోహన్లతో కలిసి వినాయక కౌతం, మరకత, శ్రీరంగశబ్దం, దశావతార శబ్దం అంశాలను ప్రదర్శించారు. మళ్లీ మెరిసిన తేజస్వి బాల్యం నుంచి నాట్యంలో విశేష ప్రతిభ ప్రదర్శిస్తున్న ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, ఈ పర్యాయం ఎం.సురేంద్ర (హైదరాబాద్) శిక్షణలో ప్రత్యేకంగా సాధన చేసిన ‘అర్ధనారీశ్వరం’ అంశాన్ని ప్రదర్శించారు. శ్రీశైలంలోని భ్రమరి కళామందిరం, మంగళగిరిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. వర్ధమాన నత్యకారిణి ఆలపాటి ప్రజ్ఞ, కొత్త లక్ష్మీసాయి జిష్ణవి గురువు ఎండీ గిరి నేతృత్వంలో అవనిగడ్డ, పెనుమూడి ఘాట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రం, మంగళగిరి ఆలయం, ఉద్దండరాయునిపాలెం, తాళాయపాలెంలో తరంగం, మహిళాసుర మర్దిని, రామాయణ శబ్దం, బ్రహ్మంజలి ప్రదర్శనలిచ్చారు. శ్రీలాస్య కూచిపూడి నాట్యాలయం గురువు జంధ్యాల వెంకట శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జంధ్యాల శ్రీలాస్య, శ్రీలేఖ సోదరీమణులు దాచేపల్లి మండలం పొందుగల ఘాట్ వద్ద నాట్యప్రదర్శన చేశారు. మరొక చిన్నారి మన్నె టీనాచౌదరి గురువు వేదాంతం దుర్గాభవాని ఆధ్వర్యంలో గోరంట్ల, ఎయిమ్స్, శైవక్షేత్రంలో మంజునాధ, పౌర్ణమి, రామాయణ శబ్దం అంశాల్లో నర్తించింది. వర్ధమాన నర్తకిలు ఎన్.అక్షయ, దివ్యలక్ష్మి, వసంత, నత్యగురువు నిర్మలా రమేష్ శిష్యురాళ్లు మరికొందరు పుష్కర సాంస్కృతిక సంరంభాల్లో తమ నర్తనంతో పాలుపంచుకున్నారు. -
పుష్కర వేతనాల కోసం కార్మికుల నిరసన
విజయవాడ: బెజవాడలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పుష్కరాల పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వలేదంటూ మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం కార్మికులు నిరసన బాట పట్టారు. కృష్ణా పుష్కరాల్లో రోజుకు 8 గంటలు పని చేయాలని చెప్పి... తర్వాత 16 గంటలు పనిచేయించారని కార్మికులు వాపోయారు. డబ్బులు ఇస్తానని చెప్పిన కాంట్రాక్టర్ కనిపించకుండా పోయాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటలకు రూ.400 ఇస్తామని చెప్పి...16 గంటలు వెట్టిచాకిరీ చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదన్నారు. వెంటనే తమకు డబ్బులు చెల్లించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించామని చెబుతున్న బాబు సర్కార్.... కార్మికులకు డబ్బులు చెల్లింపులో జాప్యంపై విపక్షాలు తీరు స్థాయిలో మండిపడుతున్నాయి. -
పుష్కలంగా పుష్కర ఆదాయం..
రైల్వేకు రూ.47 కోట్లు..ఆర్టీసీకి రూ.7 కోట్లు సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆర్టీసీ, రైల్వేలకు కాసులు కురిపించాయి. రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు పుష్కరాలకు తరలి వెళ్లారు. పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 12 నుంచి 23 వరకు మొత్తం 691 స్పెషల్ సర్వీసులు నడపగా.. రద్దీ దృష్ట్యా 4,871 అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సుమారు 41 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగించారు. దీంతో రూ.47 కోట్ల వరకు ఆదాయం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్కుమార్ తెలిపారు. ఇక హైదరాబాద్ నుంచి వివిధ పుష్కరఘాట్లకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ 1,500కుపైగా అదనపు బస్సులు నడిపింది. సుమారు 8 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించినట్లు అధికారుల అంచనా. అదనపు బస్సులు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7 కోట్లకుపైగా ఆదాయం లభించినట్లు ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఈడీ వేణు తెలిపారు. -
పుష్కర స్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలు చివరి రోజు పుష్కరస్నానం కోసం బీచుపల్లికి వెళ్లి, 44వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. షాద్నగర్ మండలం బుర్గుల పంచాయతీ పరిధిలోని తండాకు చెందిన మూడవత్తు దస్రు (55) మంగళవారం బీచుపల్లిలో పుష్కరస్నానం చేశాడు. సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు జాతీయ రహదారి దాటుతుండగా లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సూచనమేరకు హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య దస్తి, ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులున్నారు. కుమారుడు రామ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటిక్యాల ఏఎస్ఐ జిక్కిబాబు పేర్కొన్నారు. ఎర్రవల్లి చౌరస్తాలో వృద్ధుడు.. కొడంగల్ రూరల్(కోస్గి): కోస్గి మండలకేంద్రానికి చెందిన జలంధర్రెడ్డి(71)మంగళవారం ఇంటి నుంచి పుష్కరాలకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఎర్రవల్లి చౌరస్తాలో దిగి మరో బస్సును ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కడి పోలీసులు కోస్గిలోని జలంధర్రెడ్డి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు బుధవారం ఉదయం అక్కడికి వెళ్లి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. -
ఆర్టీసీకి ‘పుష్కర'౦గా ఆదాయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ రీజియన్కు పుష్కరాల ఆఖరు రోజుల్లో ఆదాయం బాగా సమకూరింది. తొలి వారం రోజుల పాటు ప్రయాణికుల ఆదరణ లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాల కోసం ఈ నెల 12 నుంచి విజయవాడకు 924 సర్వీసులను నడిపింది. ఈ బస్సులు మొత్తం 7.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 76 వేల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే ఆరంభంలో ప్రయాణికులు అంతగా బస్సుల్లో ప్రయాణించలేదు. దీంతో రోజుకు 80 బస్సుల చొప్పున నడపాలనుకున్న అధికారులు బాగా కుదించారు. బస్సులు పూర్తిగా నిండాకే వాటిని విజయవాడకు పంపేవారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో క్రమేపీ ఈ నెల 19 నుంచి భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో 19 నుంచి 22 వరకు పెద్ద సంఖ్యలో వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా ఈ 12 రోజులూ విశాఖ రీజియన్కు రూ.2.38 కోట్ల పుష్కర ఆదాయం సమకూరింది. గతంలో కృష్ణా పుష్కరాలకు ఈ రీజియన్ నుంచి 360 బస్సులను నడిపారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఘాట్ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం 220 బస్సులను ఈ రీజియన్ నుంచి పంపారు. సుమారు వెయ్యి మంది కండక్టర్లు, డ్రైవర్లు అక్కడ విధులకు వెళ్లారు. మరో 400 మంది ఇతర సిబ్బంది కూడా పుష్కర సేవల్లో పాల్గొన్నారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటు విశాఖ ద్వారకా బస్స్టేషన్లో 24 గంటలూ సిబ్బంది విధులు సేవలందించారు. పుష్కరాలకు ఆర్టీసీ సేవా దృక్పథంతోనే తప్ప లాభార్జనతో బస్సులను నడపలేదని రీజనల్ మేనేజర్ జి.సుధేష్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. పుష్కర ఆదాయం సంతృప్తికరంగానే ఉందన్నారు. పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. డిపోల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. -
ఆర్టీసీకి ‘పుష్కర’ంగా ఆదాయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్టీసీ రీజియన్కు పుష్కరాల ఆఖరు రోజుల్లో ఆదాయం బాగా సమకూరింది. తొలి వారం రోజుల పాటు ప్రయాణికుల ఆదరణ లేకుండా పోయింది. కృష్ణా పుష్కరాల కోసం ఈ నెల 12 నుంచి విజయవాడకు 924 సర్వీసులను నడిపింది. ఈ బస్సులు మొత్తం 7.30 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి 76 వేల మంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే ఆరంభంలో ప్రయాణికులు అంతగా బస్సుల్లో ప్రయాణించలేదు. దీంతో రోజుకు 80 బస్సుల చొప్పున నడపాలనుకున్న అధికారులు బాగా కుదించారు. బస్సులు పూర్తిగా నిండాకే వాటిని విజయవాడకు పంపేవారు. పుష్కరాలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో క్రమేపీ ఈ నెల 19 నుంచి భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో 19 నుంచి 22 వరకు పెద్ద సంఖ్యలో వీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఫలితంగా ఈ 12 రోజులూ విశాఖ రీజియన్కు రూ.2.38 కోట్ల పుష్కర ఆదాయం సమకూరింది. గతంలో కృష్ణా పుష్కరాలకు ఈ రీజియన్ నుంచి 360 బస్సులను నడిపారు. మరోవైపు కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో ఘాట్ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లడం కోసం 220 బస్సులను ఈ రీజియన్ నుంచి పంపారు. సుమారు వెయ్యి మంది కండక్టర్లు, డ్రై వర్లు అక్కడ విధులకు వెళ్లారు. మరో 400 మంది ఇతర సిబ్బంది కూడా పుష్కర సేవల్లో పాల్గొన్నారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటు విశాఖ ద్వారకా బస్స్టేషన్లో 24 గంటలూ సిబ్బంది విధులు సేవలందించారు. పుష్కరాలకు ఆర్టీసీ సేవా దృక్పథంతోనే తప్ప లాభార్జనతో బస్సులను నడపలేదని రీజనల్ మేనేజర్ జి.సుధేష్కుమార్ ‘సాక్షి’కి చెప్పారు. పుష్కర ఆదాయం సంతృప్తికరంగానే ఉందన్నారు. పుష్కరాల్లో ఉత్తమ సేవలందించిన సిబ్బందిని గుర్తించి వారికి ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. డిపోల వారీగా వారిని గుర్తించే ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. -
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'
-
'పుష్కరాల పేరుతో ఇంతటి నీచమా?'
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్యోగుల విభజన సమస్యను వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వారి సమస్యను పట్టించుకునే తీరికే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలు నిర్వహించిన తీరుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ అపవిత్రం చేశారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలు జరిగినన్ని రోజులు ప్రజలను చంద్రబాబు పట్టి పీడించారని అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. 12 రోజులపాటు పుష్కరాలు జరిగాయని, కృష్ణా పరివాహక ప్రాంతం అంతటా పుష్కరాలు జరిగితే ఒక్క విజయవాడలోనే పుష్కరాలు జరిగినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడే పుష్కరాలు జరుగుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పుష్కరాలకు 18వందల కోట్లు కేటాయించి నామినేషన్ పద్దతిలో సొంత పార్టీ వారికే పనులు కేటాయించి సగానికిపైగా నిధులు స్వాహా అనిపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాల డబ్బుతో పార్టీ ప్రచారం చేసుకున్నారని ఏ ఘాట్ కు వెళ్లినా పచ్చరంగు వేశారని, ఇంత నీచానికి దిగజారుతారా అని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు ముందు శతాబ్దాలు, దశాబ్దాలుగా ఉన్న ఉన్న పవిత్ర దేవాలయాలను ధ్వంసం చేసి మున్సిపాలిటి చెత్తలో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది గర్భాన్ని చీల్చి ఇసుక మాఫియా సృష్టించింది కూడా చంద్రబాబే అని అన్నారు. కృష్ణా నదిని సర్వనాశనం చేసి పుష్కరాలు బ్రహ్మాండంగా జరిగాయని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. నిజంగా హైందవ సాంప్రదాయంపై నమ్మకం ఉంటే ఉత్తరీయం వేసుకొని మూడుసార్లు మునిగి పుష్కర స్నానం చేస్తారని, చంద్రబాబు మాత్రం ఏం చక్కా ప్యాంటు, షర్ట్ తో స్నానం చేశారని, ఆయనకు నచ్చితే షూ వేసుకొనే స్నానం చేస్తారు కూడా అని ఎద్దేవా చేశారు. పవిత్ర పుష్కరాలకోసం ప్రజలు వస్తే వారిని వెళ్లనీయకుండా గేట్లు వేసి చంద్రబాబు అనవసర ప్రసంగాలు చేసి వారిని పీడించారని, గేట్లు వేసి మరి ఉపన్యాసం చేశారని అంబటి మండిపడ్డారు. పుష్కరాలకు వచ్చినవారికి ఎవరైనా జీడీపీ రేటు 15శాతం పెంచాలని ప్రమాణం చేయిస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పుష్కరాలు జరిపించకూడదని, పుష్కర ఏర్పాట్లు చూసుకోవాలని హితవు పలికారు. -
'పుష్కరాలు విజయవంతంగా ముగిశాయి'
విశాఖపట్నం: క్రీడలకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్లో రజిత పతకం సాధించిన పివి సింధు, ఆమె కోచ్ పి.గోపిచంద్ను సముచితంగా సత్కరించామని తెలిపారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ షెడ్యూల్ను విడుదల చేశారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి 25 వరకు విశాఖపట్నంలో జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. మంగళవారం ముగిసిన కృష్ణా పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని చెప్పారు. సాంకేతిక అనుసంధానంతో పుష్కరాలు ఘనం నిర్వహించామని గంటా వెల్లడించారు. -
పుష్కర ఘాట్లో వింత!
తెలకపల్లి: కృష్ణా పుష్కరాలు చివరిరోజైన మంగళవారం మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పుష్కరఘాట్లో వింత చోటుచేసుకుంది. ఓ కుటుంబానికి చెందిన చిన్నారికి పుణ్యస్నానం చేయిస్తుండగా.. ఆమెకు మూడు చేతులు ఉన్నట్లు కనిపించాయి. దీనిని భక్తులు కృష్ణమ్మ మహత్యమేనని చర్చించుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు రెడ్డెపాకుల కృష్ణయ్య తన కుటుంబ సభ్యులతో మంగళవారం సోమశిల పుష్కర ఘాట్లోకి వెళ్లి పుణ్యస్నానాలు చేశారు. కృష్ణయ్య తన కూతురు ప్రయాగకు (11నెలలు) ఘాట్లో స్నానం చేయిస్తుండగా బయట ఉన్న బంధువులు ఫొటోలు తీశారు. అయితే ఫొటోల్లో పాపకు రెండు చేతుల బదులు మూడు చేతులు కనిపించాయి. ఈ వింతను చూసేందుకు భక్తులు ఆసక్తిచూపారు. -
ఏడాదంతా పుష్కర స్నానం చేయవచ్చు
ముక్త్యాల(జగ్గయ్యపేట):భక్తులు పుష్కర స్నానాలు ఏడాదంతా చేయవచ్చని మైసూరు అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. గ్రామంలోని కోటిలింగ హరిహర మహా క్షేత్రం పుష్కర ఘాట్లో మంగళవారం తెల్లవారు జామున పుష్కర స్నానమాచరించి భక్తులకు హితోపదేశం చేశారు. పుష్కరాలు 12 రోజులు జరుగుతాయని, అయితే భక్తులు స్నానాలు 12 రోజుల్లోనే చేయాలని లేదని, ఏడాదిలోపు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. మూడు కోట్ల మంది దేవతలు నదిలో ఉంటారని అందుకే నది శక్తివంతంగా ఉంటుందన్నారు. ఈ ప్రాంతమంతా కొద్ది రోజుల్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని, ఇక్కడ ఆశ్రమం నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్, ఈవో దూళిపాళ్ల సుబ్రహ్మణ్యం, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలకు వీడ్కోలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
-
ముగిసిన కృష్ణా పుష్కరాలు
బీచుపల్లి : తెలంగాణలో కృష్ణా పుష్కరాలు వైభవంగా ముగిశాయి. బీచుపల్లి ఘాట్ లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు లు కృష్ణమ్మకు ముగింపు హారతినిచ్చారు. ఈ హారతి కార్యక్రమంతో కృష్ణా పుష్కరాలు ముగిశాయి. పన్నెండు రోజుల పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 50 లక్షల మంది పుష్కర స్నానమాచరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి 80 లక్షలు, నల్లగొండ జిల్లాలో 70 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారు. పుష్కరాల్లో భక్తులకు విశిష్ట సేవలందించిన అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందిని మంత్రులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, జెడ్పీ ఛైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు
విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం ఆచరించేందుకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో పుష్కరస్నానం ఆచరించేందుకు వీఐపీకి ఘాట్కు కేంద్రమంత్రి సురేష్ ప్రభు... మంత్రులతో కలసి పయనమయ్యారు. ఆ తర్వాత సురేష్ ప్రభు... నగరంలోని డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల - ఎర్రగంట్ల రైల్వే లైన్, నంద్యాల - కడప పాసింజర్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సురేష్ ప్రభు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యాక్రమంలో సురేష్ ప్రభు పాల్గొంటారు. -
బెంజ్ సర్కిల్లో రోడ్డు ప్రమాదం: ఇద్దరి మృతి
విజయవాడ: నగరంలోని బెంజ్ సర్కిల్ వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం జిల్లా వాసులుగా గుర్తించారు. కృష్ణా పుష్కరాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు రూ.3 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నుంచి తిరిగి వెళ్లే యాత్రికులు వాహనాలు నడపడంలో జాగ్రతగా ఉండాలని చంద్రబాబు సూచించారు. -
పద్మావతి ఘాట్లో చక్రస్నానం
విజయవాడ: కృష్ణ పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడ పద్మావతి ఘాట్లో టీటీడీ ఆధ్వర్యంలో చక్రస్నానం ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. -
రాష్ట్రంలోనే కర్నూలు భేష్
కృష్ణా పుష్కర ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మెచ్చుకోలు – శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానని వెల్లడి – హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ సర్వీసు ప్రారంభం – పోలీసు యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల విషయంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కితాబునిచ్చారు. పుష్కర భక్తుల నుంచి తీసుకున్న అభిప్రాయ సేకరణతో పాటు నేరుగా ఫోన్లో మాట్లాడి కూడా అభిప్రాయాలను సేకరించామన్నారు. మొత్తం 93 శాతం మార్కులతో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా సేవా కార్యక్రమాలతో ఏకంగా 95 శాతం మార్కులతో అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు. సోమవారం ఉదయం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా సున్నిపెంటకు చేరుకుని అక్కడి నుంచి లింగాలగట్టు ఘాట్ను సందర్శించారు. అక్కడ నదిలో నీటిని నెత్తిపై చల్లుకొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు. చక్కటి వాతావరణంలో ఉన్న శ్రీశైలాన్ని మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతానన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి నేరుగా హెలికాప్టర్ సర్వీసును కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మల్లన్న పవర్ఫుల్ గాడ్ ఒక పక్క నీళ్లు.. ఇంకో పక్క బ్రహ్మాండమైన పచ్చదనం ఉన్న శ్రీశైలంలోని మల్లన్న పవర్ఫుల్ గాడ్ అని సీఎం అన్నారు. అటు బెంగళూరు, ఇటు హైదరాబాద్.. మరోవైపు నూతన రాజధాని అమరావతికి మధ్యలో శ్రీశైలం కేంద్ర బిందువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశంలో చాలా మంది ఇక్కడకు వస్తున్నారన్నారు. ఒక మంచి పుణ్యక్షేత్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా తయారుచేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టండి ప్రస్తుతం ప్రతి యువత చేతిలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఉంటున్నాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం తన ప్రసంగాన్ని కూడా కొద్ది మంది స్మార్ట్ఫోన్లలో రికార్డు చేస్తున్నారని.. వీటిని సోషల్ మీడియాలో పెట్టాలని కోరారు. తద్వారా కృష్ణా పుష్కరాలను మరింత మందికి చేరవేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నీరు ఉంటే ఎలాంటి సమస్యలు రావని.. అందుకే అందరూ వచ్చి కరువు సమస్య లేకుండా చూడాలని పుష్కర స్నానం చేస్తూ ప్రార్థించాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని.. అందుకే పంట కుంటలను తవ్వుకోమన్నామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్ని సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని.. ఎక్కువ సమస్యలు, ఎక్కువ బాధలు ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడతానన్నారు. ఈ సమస్యలు తీరేందుకు ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని కోరారు. జిల్లా పోలీసులు భేష్ కృష్ణా పుష్కరాలను జిల్లా యంత్రాంగం అంతా కలిసికట్టుగా సమర్థవంతంగా నిర్వహించారని సీఎం కితాబునిచ్చారు. ప్రధానంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. కేవలం పోలీసులు అంటే ఖాకీ డ్రస్ వేసుకోవడం కాదని.. సేవ కూడా చేయడమని నిరూపించారన్నారు. నూటికి 95 శాతం మంది ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని మెచ్చుకున్నారన్నారు. ముసలివాళ్లు వస్తే సహాయం చేయడం, కాళ్లు లేనివాళ్లను ఘాట్ల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించడం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారని కొనియాడారు. ఇది నిజమైన మానవత్వమని కొనియాడారు. మనిషిని చూస్తేనే కాదు.. అతని వాయిస్ను విని కూడా దొంగలను పట్టుకునే టెక్నాలజీ వచ్చిందన్నారు. శ్రీశైలం నుంచి మొత్తం సమాచారం తనకు వస్తుందని.. అక్కడి నుంచి ఇక్కడ పుష్కరాల తీరును గమనిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణ, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, భూమా నాగిరెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
27 మంది అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
విజయవాడ: విజయవాడ నగరంలో 27 మంది అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ. 7 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల నుంచి దొంగలు ఈ సొత్తును కాజేశారు. పట్టుబడిన దొంగల్లో ఒడిస్సాకు చెందిన14 మంది, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు, యూపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. వీరిలో 16 మంది మహిళలు ఉండటం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర స్నానం చేసిన హీరో వెంకటేష్
-
కృష్ణమ్మ తీరం ... భక్తజన సంద్రం
సాక్షి, అమరావతి : కృష్ణాతీరానికి పుష్కరాల పదోరోజు భక్తజనం పోటెత్తింది. ఆదివారం కావడం, మరో రెండురోజుల్లో పుష్కరాలు ముగియనుండటంతో కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని ప్రధాన పుష్కర ఘాట్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎండ తీవ్రత, ట్రాఫిక్ జామ్లు, ఇతర ఇబ్బందులను లెక్కచేయకుండా భక్తులు పుష్కర స్నానాలాచరించి పులకించిపోయారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో 29,91,750 మంది స్నానాలు చేయడం విశేషం. ఈ పుష్కరాల్లో ఇదే రికార్డు కావడం గమనార్హం. మొత్తం మీద ఈ పది రోజుల్లో పుష్కర స్నానాలు చేసిన భక్తుల సంఖ్య 1,53,66,036కు చేరింది.విజయవాడ కనకదుర్గమ్మ ఆల యంతో పాటు కృష్ణాతీరంలోని ఆలయాలన్నీ భక్తజనంతో కిటకిటలాడాయి. 23న ఆది పుష్కరాల ముగింపు కృష్ణా పుష్కరాల్లో తొలి 12 రోజుల ఆది పుష్కరాలను మంగళవారం వేడుకగా ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 23వ తేదీ రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా నదికిచ్చే హారతితో ఆది పుష్కరాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా కృష్ణా హారతి ప్రాంతంలో ప్రభుత్వం భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనుంది. ఆది పుష్కరాల ముగింపు సంద ర్భంగా వెయ్యి మంది కళాకారులతో కూచిపూడి నాట్య ప్రదర్శన నిర్వహిస్తారు. -
పుష్కరాల్లో రైల్వే సేవలపై అధికారుల సంతృప్తి
సాక్షి, విజయవాడ: పుష్కరాలకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తున్నామని, ఘాట్లలోనే రైల్వే టిక్కెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామని రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (క్యాటరింగ్ అండ్ ప్యాసింజర్ సర్వీసెస్) విజయభాస్కర్ పేర్కొన్నారు. పుష్కరాల తొలి రోజు నుంచి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రైలులో సీటు కోసం ఎంతటి ప్రయాసనైనా ప్రయాణికులు లెక్కచేయడం లేదు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రయాణికులను తిరిగి వారి స్వస్థలాలకు సురక్షితంగా పంపేందుకు రైల్వే అధికారులు అహర్నిశలూ పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్కర ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పుష్కరాల్లో రైల్వే సేవలపై ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి: పుష్కర రద్దీ బాగా ఉంది. రైల్వేశాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది? విజయభాస్కర్: ఇతర ప్రయాణ సాధారణల చార్జీలతో పోల్చితే రైల్వే టిక్కెట్చార్జీలు చాలా తక్కువ. అందువల్ల పుష్కర ప్రయాణికులంతా రైల్వేలోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. రోజు మూడు లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలను ఉపయోగించుకుంటారని భావించి ఐదు లక్షలు మంది వచ్చినా తట్టుకునే విధంగా ఏర్పాట్లు చేశాం.షెడ్యుల్డ్ ైరె ళ్లు కాకుండా అదనంగా 650 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాం. ఇవికాకుండా రద్దీని బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లు వే సి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. సాక్షిః ప్రత్యేక ఏర్పాట్లు ఏమైనా చేశారా? విజయభాస్కర్: దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా పున్నమి, పవిత్రసంగమం, బస్టాండ్లలో రైల్వే టిక్కెట్ మిషన్లు పెట్టి ప్రయాణికులకు టిక్కెట్లు అందచేస్తున్నాం. ఇవికాకుండా రెగ్యులర్ కౌంటర్లు కాకుండా 79 అదనపు టిక్కెట్ కౌంటర్లు ఏర్పాట్లు చేశాం. ఇవి 24 గంటలు పనిచేస్తున్నాయి. 520 మంది కమర్షియల్ సిబ్బంది రైల్వే ప్రయాణికుల సేవలో ఉన్నారు. ఆదివారం బాగా రద్దీ పెరిగినా పది నిముషాల్లో టిక్కెట్ తీసుకునే ఏర్పాటు చేశాం. చివర రోజు వరకు ఇంతే రద్దీ ఉంటుందని భావిస్తున్నాం. సాక్షిః క్యాటరింగ్ సౌకర్యం ఎలా ఉంది? భక్తులకు నాణ్యమైన భోజనం అందుతోందా? ధరలు మాటేమిటీ? విజయభాస్కర్: ప్రతి ప్లాట్ఫాం పైనా 5 అదనంగా క్యాటరింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ప్రతి మూడు గంటలకు ఫుడ్ఇన్స్పెక్టర్లు, ఆఫీసర్లుతో ఆహారం శాంపిల్స్ తీసుకుని పరీక్షలు చేయిస్తున్నాం. హడావుడిగా రైలు ఎక్కే వారికి కూడా అందుబాటులో ఉండే విధంగా రైలు వద్దనే విక్రయాలు జరిగేటట్లు చూస్తున్నాం. పాలు, ప్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటున్నాయి. నిర్ణయించిన ధర కంటే ఏ మాత్రం ఎక్కువ రేటు అమ్మినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించాం. నాణ్యత, ధరల విషయంలో ప్రయాణీకుల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు లేదు. సాక్షిః శాటిలైట్ స్టేషన్లలో సౌకర్యాలు మాటేమిటీ? విజయభాస్కర్: హైదరాబాద్ నుంచి హెచ్ఓడీలతో పాటు నేను ఇక్కడే ఉంటున్నాం. మధురానగర్, గుణదల, కృష్ణాకెనాల్, రాయనపాడు స్టేషన్లు తరుచుగా తనిఖీలు చేస్తున్నాం. అక్కడ ప్రయాణీకుల రద్దీని బట్టి టిక్కెట్కౌంటర్లు పెంచుతున్నాం. అక్కడ కూడా పదినిముషాల్లో టిక్కెట్ తీసుకుని రైలు ఎక్కవచ్చు. 24 గంటలు క్యాటరింగ్ సౌకర్యం ఉంది. శాటిలైట్ స్టేషన్లతో పాటు తారాపేట, పార్శిల్ ఆఫీసు, స్టేడియంలలో షెల్టర్స్(పుష్కరనగర్)లు ఏర్పాటు చేశాం. ప్రయాణికులు వీటిని బాగా ఉపయోగించుకుంటున్నారు. సాక్షిః రైల్వేకి ఆదాయం ఎలా ఉంది? విజయభాస్కర్: శనివారం వరకు సుమారు 11లక్షల మంది ప్రయాణికులు రైల్వే సేవలు వినియోగించుకున్నారు. సుమారు రూ.14.50 కోట్లు ఆదాయం వచ్చిందని అంచనా. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 75వేల మంది ప్రయాణికులు రైల్వేస్టేషన్కు వచ్చారు. రాత్రికి ఇది రెట్టింపు అవ్వవచ్చు. పుష్కరాలు పూర్తయి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయే వరకు ప్రత్యేక ఏర్పాట్లన్ని యధావిధిగా కొనసాగిస్తాం. భక్తులు క్షేమంగా ఇంటికి వెళ్లడమే మా ఉద్దేశం. -
గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రయాణికుల రద్దీ
గన్నవరం : కృష్ణా పుష్కరాల సందర్భంగా గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి ఎక్కువైంది. సాధారణ ప్రయాణికులతో పాటు పుష్కర స్నానమచరించేందుకు దేశ, విదేశాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. దీనితో గత పది రోజులుగా ఈ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొంటున్నాయి. పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఎయిర్పోర్టు అధికారులు ఏర్పాటు చేసిన ఆత్మీయ స్వాగత ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాణికులను, పుష్కర యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి. పుష్కర ప్రారంభానికి రోజువారి విమాన సర్వీసుల సంఖ్య 24 నుంచి 28 వరకు ఉండగా ప్రస్తుతం 34 నుంచి 36 సర్వీసులకు చేరుకున్నాయి. ఇక్కడికి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా గతంలో రోజుకు 1,500 నుంచి 1,800 వరకు ఉండేది. పుష్కరాల ప్రారంభంతో ఈ సంఖ్య రెట్టింపు అయి మూడు వేల నుంచి 3,500 మంది ప్రయాణికులకు చేరుకుంది. ముఖ్యంగా న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. అయా నగరాలకు నడిచే విమానాల్లో ప్రయాణికుల అక్యుపెన్సీ రేషియో కూడా 90 నుండి 95 శాతం వరకు ఉన్నట్లు విమానాశ్రయ వర్గాలు తెలుపుతున్నాయి. దిగిరాని విమాన టిక్కెట్ల ధరలు పెరిగిన ప్రయాణికుల రద్దీతో విమాన టిక్కెట్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో రూ. 1,200 నుంచి రూ. 5 వేలలోపు ఉండే టిక్కెట్ ధరలు గత పది రోజులుగా రూ. 10 నుంచి రూ. 15 వేలు వరకు పలుకుతున్నాయి. పుష్కరాల సందర్భంగా ప్రయాణికులు అప్పటికప్పుడు టిక్లెట్లు బుక్ చేస్తుండడం విమానయాన సంస్థలకు లాభసాటిగా మారింది. గత మూడు రోజులుగా ట్రూజెట్ విజయవాడ నుంచి చెన్నైకు టిక్కెట్ ధర రూ. 13,329 చేరుకుంది. స్పైస్జెట్ విజయవాడ-బెంగళూరు మధ్య తిరిగే విమాన సర్వీసుల టిక్కెట్ ధర రూ. 12,400 నుంచి రూ. 14,500కు చేరింది. విజయవాడ నుంచి చెన్నై సర్వీస్ టిక్కెట్ ధర రూ. 11,299 ఉండగా, తిరుపతి, వైజాగ్ సర్వీసుల టిక్కెట్ల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి ఎయిరిండియా విమాన టిక్కెట్ ధర 14,405కు చేరుకుంది -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు. -
తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్త ఏరివేత
బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం : జిల్లాలోని పుష్కరఘాట్లలో ఎప్పటికప్పుడు క్లీన్అండ్ గ్రీన్ చేస్తున్నారు. పుష్కారాలు ప్రారంభమై తొమ్మిది రోజుల్లో 300 టన్నుల చెత్తను ఏరివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెల్లారుజామునుంచి ఘాట్లకు భక్తుల వస్తుండడంతో వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా, పారిశుద్ధ్యం లోపించకుండా చూస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ద డస్ట్బిన్లను ఏర్పాటు చేసి చెత్తను అందులో వేయాలని అధికారులు మైక్ల ద్వారా చెబుతుండడంతో నేరుగా భక్తులు వాటిలోనే వేస్తున్నారు. రోజూ ఘాట్లలో నీటిస్థాయితోపాటు శుద్ధిని పరీక్షిస్తున్నారు. పుష్కరాల్లో లక్షాలాది మంది స్నానం చేసే ఘాట్లలో భక్తులకు ఎలాంటి చర్మవ్యాధులు ప్రబలకుండా పటిక(అలం)ను ఎప్పటికప్పుడు వేస్తూ నీటిని శుభ్రం చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో 700 మంది పంచాయతీకార్యదర్శులు, 60 మంది ఈఓఆర్డీలు, 500 మంది గ్రామపంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో 4 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రతకు ప్రభుత్వం రూ.4కోట్లు కేటాయించినట్లు డీపీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. కృష్ణపుష్కారాలకు వచ్చే లక్షాలాది మంది భక్తుల సౌకర్యార్థం ఎక్కడ కూడా ఘాట్లలలో చెత్తచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
9వ రోజు 27,58,638
కృష్ణమ్మ ఒడిలో తనివీతీరా పుష్కరస్నానాలు గొందిమళ్లలో గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ పుష్కర స్నానం పలు ఘాట్లకు పెరిగిన వీఐపీల తాకిడి నేడు రద్దీ మరింత పెరిగే అవకాశం సోమశిల ఘాట్లో తగ్గిన నీటిమట్టం..షవర్లకింద స్నానాలు జాతీయ రహదారి, సోమశిల రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణానదీ తీరం..జనతీరమైంది. నదీమతల్లి ఒడిలో తనివితీరా సేదదీరారు. పుష్కరుడి సేవలో భక్తులు తరించిపోయారు. జిల్లాలోని పుష్కరఘాట్లకు శనివారం పోటెత్తారు. పుష్కరాల ముగింపు సమయం సమీపిస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఒక్కరోజే 27,58,638 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు ప్రారంభమైనప్పటినుంచి ఇదే రికార్డు. మరోవైపు పుష్కరఘాట్లలో నీటిమట్టం క్రమేణా తగ్గడంతో వరుసగా నాలుగోరోజు జూరాల ఘాట్ను మూసివేశారు. అత్యధిక భక్తులతో కిటకిటలాడుతున్న సోమశిలలో సైతం శనివారం పుష్కరఘాట్లో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో ఘాట్లో పూర్తిగా మునిగి సాన్నం చేయడానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఘాట్ పైనున్న షవర్ల ద్వారా పుణ్యస్నానాలు ఆచరించారు. అక్కడినుంచి చాలామంది మంచాలకట్టకు వెళ్లారు. బీచుపల్లి, సోమశిల, రంగాపూర్, గొందిమళ్ల, క్యాతూర్, గుమ్మడం, కొండపాడు, మంచాలకట్ట, నది అగ్రహారం, పస్పుల, కృష్ణ, పంచదేవ్పాడు, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కరస్నానం ఆచరించారు. శనివారం ఒక్కరోజే దాదాపు 27,58,638 మంది పుణ్యస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. అలంపూర్లోని జోగుళాంబ దేవాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఉదయం వేళలో భక్తుల రద్దీ వీఐపీల తాకిడి వల్ల అమ్మవారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. జిల్లాలోని ప్రధాన ఘాట్లలో పుష్కరస్నానాలు కృష్ణ 1,01,578 పస్పుల 60,500 గొందిమళ్ల 1,58,000 నదీఅగ్రహారం 1,44,125 బీచుపల్లి 4,40,000 రంగాపూర్ 6,40,000 సోమశిల 7,30,000 పాతాళగంగ 23,860 (మిగతా వారు ఇతర ఘాట్లలో స్నానమాచరించారు) వీఐపీలు ఇలా.. రాష్ట్ర గవర్నర్ ఈఎల్ నరసింహన్ ఆయన సతీమణి విమల నరసింహన్ దంపతులు శనివారం జిల్లాలోని గొందిమళ్ల పుష్కరఘాట్లో పుణ్యస్నానమాచరించారు. అనంతరం కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ రంగాపూర్, గొందిమళ్ల ఘాట్లను సందర్శించారు. గొందిమళ్ల వీఐపీ ఘాట్లో పుష్కరస్నానం ఆచరించి జోగుళాంబను దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రి మాదాల జానకిరాం, ఆదోల్ ఎమ్మెల్యే, సినీనటుడు బాబుమోహన్ జోగుళాంబ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించి జోగుళాంబ దర్శనం చేసుకున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామ్లక్ష్మణ్ గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి, ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ మంచాలకట్టలో పుణ్యస్నానమాచరించగా, ఐజీపీ మల్లారెడ్డి, వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్రావు సోమశిల పుష్కరఘాట్లో స్నానమాచరించారు. రంగాపూర్ పుష్కరఘాట్లో మాజీ మంత్రి ముత్యంరెడ్డి, కోరుట్ల శాసనసభ్యుడు విద్యాసాగర్రావులు పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ రంగాపూర్ ఘాట్లోని ఆర్యవైశ్య అన్నదాన శిబిరాన్ని సందర్శించారు. ట్రాఫిక్ జామ్.. శనివారం అన్ని పుష్కర ఘాట్లకు భక్తుల రద్దీ పెరగడంతో హైదరాబాద్ కర్నూల్ జాతీయ రహదారిలోని భూత్పూర్ వద్ద ట్రాఫిక్ స్తంభించింది. రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సోమశిలకు భక్తులు క్యూ కట్టడంతో కర్నూల్ సోమశిల వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అడ్డాకుల టోల్గేట్ వద్ద కూడా వాహనాలు నిలిచిపోయాయి. కోటి దాటింది.. కృష్ణా పుష్కరాలు సందర్భంగా జిల్లాలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య కోటి దాటింది. ఇప్పటి వరకు మొత్తం 1,07,88,575మంది పుష్కరస్నానం చే శారు. తొలి ఎనిమిది రోజుల వరకు 80,19,937 మంది భక్తులు పుష్కరస్నానాలు చేయగా, ఒక్క శనివారమే 27,58,638మంది పుణ్యస్నానాన్ని ఆచరించారు. -
పుష్కరాల కలెక్షన్లు భేష్!
అక్షర తూణీరం వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. ‘‘...మరి ఈ ఒక్క సింధుయే కాదు, మన నవ్యాంధ్ర నుంచి ఇంటికో సింధు రావాలని కోరు కుంటున్నా. క్రీడా రంగంలో మన రాష్ట్రం ప్రపంచం లోనే నంబర్వన్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే, వచ్చే ఒలింపిక్స్ మన నవ్యాం ధ్రప్రదేశ్లో జరిపించేందుకు గట్టిగా ప్రయత్నిస్తాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్టేడియంని నిర్మిస్తాం. అవసరమైతే దానికోసం లక్ష ఎకరాలను మన రైతుల నుంచి సేకరిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం...’’ అంటూ మంచం దిగి చీకట్లో వెళ్లిపోతుంటే ఇంట్లోవాళ్లు ఆపారు. ఏమిటో! ఈమధ్య నాకివే కలవరింతలు! పూర్తిగా మేల్కొన్నాను. పది రోజులుగా పుష్కర విశేషాలు వినీ వినీ – అవే కలలు. అవే కలవరింతలు. ఏవిటో కలల్లో పుష్కర స్నానా నికి రానివారు వచ్చినట్టు, వచ్చినవారు రానట్టు కని పిస్తున్నారు. ప్రత్యేకంగా వెళ్లి సగౌరవంగా ఆహ్వానించినా మోదీ రానేలేదు. తీరా ఆయన వచ్చాక పుష్కర ఘాట్లో నిలబెట్టి ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా సంక ల్పం చేయించి, నిండా మునకలు వేయిస్తారని భయం కావచ్చునని కొందరు వేరే ఘాట్లో అనుకుంటుంటే వినిపించింది. శాస్త్రోక్తమైన పవిత్ర పుష్కర సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవచ్చని మొదటిసారి అర్థమైందని – ఓ తలపండిన నేత నివ్వెరపోయాడు. దేన్నైనా ఒక వేలంవెర్రి కింద మార్చేయడం కొందరికి వెన్నతో పెట్టిన విద్య. పుష్కర వేళ కోట్లాది రూపా యలతో నడిపిస్తున్న సాంస్కతిక కార్యక్రమాలు నీరుకారుతున్నాయని ఓ విలేకరి వ్యాఖ్యానించాడు. పుష్కరాలు పవిత్రమైనవే కావచ్చు. నమ్మకాలున్నవారు గతించిన తమ పెద్దలకు తర్పణలు వదిలే ఒకానొక సందర్భం. అందుకు తగిన అదనపు ఏర్పాట్లు చేయడం పాలకుల బాధ్యత. అంతకుమించి ఏం చేసినా అది ఎక్స్ట్రా. ప్రతిరోజూ భక్తుల కలెక్షన్లు చెప్పడం, అంతేగాక రేపు ఎల్లుండిలో పికప్ అయ్యే అవకాశం ఉందని మంత్రులు బాకాలూదటం సినిమా విడుద లని తలపిస్తున్నాయ్. ముందునుంచే ఇన్ని కోట్లమంది వస్తారు, అన్ని కోట్లమంది వస్తారని అవసరమైన ఊహాగానాలను వదలడం చాలా అవసరం. విజయవాడలో పుష్కరాల సందర్భంగా ఎట్నించి ఎటు వెళ్లాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. అందులో ఎక్కుతున్నవారు పెద్దగా లేరు. ఒక సామాన్యుడేమన్నాడంటే – ఇదంతా వేస్టు. రేపు నష్టాలొచ్చాయంటూ టిక్కెట్లు పెంచడానికి ఇదంతా’’. ఏర్పాట్లకి జనం సంతప్తిపడాలిగానీ చిరాకు పడకూడదు. వీవీఐపీలు అందరూ ‘‘ఏర్పాట్లు మహాద్భుతం’’ అన్నారు. వాళ్ల ఏర్పాట్ల కోసమే మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా పనిచేస్తుందని వారికీ తెలుసు. అయినా అదొక మర్యాద. అదొక సంప్రదాయం. కష్ణా డెల్టాలో నాట్లు పడలేదు. సాగర్ కింకా చిరునవ్వైనా రాలేదు. ముఖ్యమంత్రి పుష్కర తీర్థంలో తలదాచుకుంటున్నారు. ఇవికాగానే వినాయక చవితి, దాని తర్వాత నిమజ్జనోత్సవం వస్తాయి. ఈలోగా కొత్త కాపిటల్లో మంత్రుల చాంబర్స్ని తిరిగి కట్టడం పూర్తవుతుంది. అప్పుడు మళ్లీ మొదట్నుంచీ పరిపాలన ప్రారంభం అవుతుంది. - శ్రీరమణ వ్యాసకర్త ప్రముఖ కథకుడు శ్రీరమణ -
గొందిమళ్లలో గవర్నర్ పుష్కర స్నానం
మహబూబ్నగర్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు శనివారం కృష్ణా పుష్కర స్నానం ఆచరించారు. మహబూబ్నగర్ జిల్లాలోని గొందిమళ్లలో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఆధికారులు గవర్నర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వారు అలంపూర్ చేరుకుని.. జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. గురువారం విజయవాడలో పున్నమి ఘాట్లో గవర్నర్ దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గవర్నర్ దంపతులు దర్శించుకున్న సంగతి తెలిసిందే. -
జనజాతర
పుష్కరాలకు 8వ రోజు 20 లక్షల మంది * పాలమూరులో 14 లక్షలు, నల్లగొండలో 6 లక్షలు * తెలంగాణ అమరులకు కోదండరాం పిండ ప్రదానం * అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణ కూలీలకు పిండ ప్రదానాలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాలకు 8వ రోజు శుక్రవారం భక్తులు పోటెత్తారు. పుష్కరాలు మరో 4 రోజుల్లో ముగియనుండటంతో రాష్ట్రం నలుమూలల నుంచీ లక్షలాది మంది తరలివచ్చారు. మహబూబ్నగర్లో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో 6 లక్షల మంది యాత్రికులతో ఘాట్లు కళకళలాడాయి. ఉదయం ఐదింటి నుంచే భక్తులతో కిటకిటలాడాయి. పాలమూరులో రంగాపూర్ ఘాట్కు ఏకంగా నాలుగున్నర లక్షల మంది పోటెత్తారు. బీచుపల్లి, సోమశిల ఘాట్లు మూడేసి లక్షల మందితో కళకళలాడాయి. పలు ఘాట్లకు కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి పుణ్యస్నానమాచరించారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువనుంచి వరద నీరు భారీగా తగ్గడంతో జూరాల ఘాట్ను వరుసగా నాలుగో రోజూ మూసేశారు. సోమశిల పుష్కరఘాట్లో జేఏసీ చైర్మన్ కోదండరాం, జేఏసీ నేతలు పుష్కర స్నానం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరులో అమరులైన వారికి కోదండరాం పిండ ప్రదానం చేశారు. నల్లగొండ జిల్లాలో శుక్రవారం 6 లక్షల మంది స్నానాలు చేశారు. ఒక్క నాగార్జునసాగర్లోనే ఏకంగా 1.8 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అంచనా. ఇక్కడి శివాలయం ఘాట్లో 1.3 లక్షల మంది స్నానాలు చేయడంతో భక్తులను అక్కడికి వెళ్లకుండా 2 గంటల సేపు నిలిపేసి సురికి వీరాంజనేయస్వామి ఘాట్కు తరలించారు. వాడపల్లి ఘాట్ వద్ద 1.3 లక్షలు, మట్టపల్లిలో లక్ష మంది, కనగల్ మండలం దర్వేశిపురం ఘాట్లో 70 వేల మంది స్నానాలు చేశారు. కృష్ణా పుష్కరఘాట్లో విధులు నిర్వహిస్తున్న బ్రహ్మన్న అనే గజ ఈతగాణ్ని పాము కరవడంతో అతన్ని మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అమర జవాన్లకు, సాగర్ డ్యామ్ నిర్మాణంలో అసువులు బాసిన కూలీలకు పిండ ప్రదానాలు చేశారు. బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు ఒలింపిక్స్ ఫైనల్లో గెలవాలని కోరుతూ నదిలో దీపాలు వెలిగించారు. వీఐపీల తాకిడి మహబూబ్నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి పుణ్యస్నానాలు ఆచరించారు. జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నేత నాగం జనార్దనరెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు స్నానాలాచరించారు. రంగాపూర్ ఘాట్లో ‘సాక్షి’ ఎడిటర్ వర్ధెల్లి మురళి సతీసమేతంగా పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గురువు వేలేటి మృత్యుంజయశర్మ మట్టపల్లి ప్రహ్లాద ఘాట్లో, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని సాగర్లో పుణ్యస్నానాలు చేశారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన పాతులోతు వెంకటేశ్వర్లు, సుశీల దంపతులు తమ 30 రోజుల చిన్నారికి పుష్కర స్నానం చేయించారు. -
ప్రయాణికులు పెరిగితేనే అంతర్జాతీయ హోదా..!
గన్నవరం : అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా గన్నవరం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు పేర్కొన్నారు. గురువారం గన్నవరం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఎయిర్పోర్టు హోదా రావాలంటే ముందు ఇక్కడ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పెరగాలన్నారు. కేంద్రమంత్రికి చేదు అనుభవం భవానీపురం : కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. అయితే ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. భూసేకరణపై చర్చలు కేంద్ర మంత్రి అశోక్గజపతిరాజుతో గన్నవరం విమానాశ్రయ విస్తరణ భూసేకరణపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, పలువురు రైతులు చర్చించారు. రైతులకు నష్టం లేకుండా భూసేకరణ చేపట్టేందుకు వీలుగా ఏలూరు కాలువ మళ్లింపు డిజైన్ను మార్పు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, డిజైన్ మార్పు విషయమై సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ పంపుతామని తెలిపారు. రాష్ట్రాభివృద్దికి సీఎం కృషి రావిచర్ల: రాష్ట్రవిభజన జరిగి రాష్ట్రం అష్టకష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన నడిపిస్తున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు అన్నారు. నూజివీడు మండలంలోని రావిచర్ల క్రాస్రోడ్డు వద్ద మామిడి తోటలో పుష్కరయాత్రికుల సౌకర్యార్థం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో కలిసి గురువారం కేంద్రమంత్రి సందర్శించారు. ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ రాజకీయ విలువల కోసం ప్రభుత్వం, పార్టీ కలిసి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పుష్కర యాత్రికుల కోసం రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని విజయవాడలో పద్మావతి, వేదాద్రిలోని ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కర్నూలు జిల్లా సంగమేశ్వరం, పాతాళగంగ ఘాట్లో భక్తులు పోటెత్తారు. అలాగే తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్లోని ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మహబూబ్నగర్ జిల్లా బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు సంఖ్య భారీగా పెరిగింది. -
చికిత్స పొందుతూ హోంగార్డు మృతి
విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఓ హోంగార్డు నిండు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కంచరపాలెంకు చెందిన వెంకటేశ్వరరావు అనే హోంగార్డు పుష్కర విధుల నిమిత్తం ఈ నెల 7వ తేదీన విజయవాడకు వచ్చాడు. 11 వ తేదీ అర్థరాత్రి ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి హోంగార్డులు ఆయన్ను సమీప ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అనంతరం వెంకటేశ్వరరావును విశాఖ కేజీహెచ్కు తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. హోంగార్డు కుటుంబానికి తోటి ఉద్యోగులు రూ.25 వేలు సాయం అందించారు. దీనిపై కనీసం ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ స్పందించడంలేదని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి ఉంటే వెంకటేశ్వరరావు బ్రతికుండేవారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. -
శిశుపాలుడిలా వంద తప్పులు చేస్తున్నారు
-
పుణ్యానికొస్తే.. జేబుకు చిల్లు
పవిత్ర సంగమం ఘాట్ లో పూజ సామాగ్రి విక్రయిస్తున్న పద్మావతి వద్దకు ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. టెంకాయ కావాలని రూ.500 నోటు ఇచ్చాడు, చిల్లర కోసం అటు తిరగ్గానే ఆమె హ్యాండ్ బ్యాగ్తో మాయమయ్యాడు. అందులో నాలుగు రోజులు వ్యాపారం చేసిన రూ.40 వేల నగదు, బంగారు రింగులు ఉన్నాయి. ఇటువంటి చేదు అనుభవం మరెందరిదో. పుష్కరాల్లో దొంగలు భక్తులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోలీసులు ఇప్పటికి వంద మందిని పైగా చోరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ నిత్యం పదుల సంఖ్యలో యాత్రికులు సొమ్ము పోగొట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణల నుంచే కాకుండా నేపాల్, బిహార్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ల నుంచి రకరకాల ముఠాలు పుష్కరాలకు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒక్క పద్మావతి ఘాట్లో రూ.10 నోట్లు పడేసి యాత్రికుల దృష్టిని మరల్చి బ్యాగులను తస్కరించిన కేసులు 31 నమోదయ్యాయి. మంగళవారం ఒక్క రోజే 11 మంది నేరగాళ్లను పోలీసులు పట్టుకుని రూ.5.5 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 23 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీ ఏమైనట్లు పుష్కరాల్లో నేరాల నివారణకు అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నామనీ, 15 వేల మంది పోలీసులను మోహరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. భక్తులకు మాత్రం దొంగల బెడద తప్పడం లేదు. పుణ్యానికి వచ్చి లూటీ అవుతున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. -
శిశుపాలుడిలా వంద తప్పులు చేస్తున్నారు: వైఎస్ జగన్
శిశుపాలుడు చేస్తున్నట్లుగా చంద్రబాబు వంద తప్పులు చేస్తున్నారని.. ఆయన పాపాలను దేవుడు క్షమించడని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పుష్కర స్నానం చేస్తూ చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాలో మృతుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, గోదావరి పుష్కరాల సందర్భంగా మృతుల కుటుంబాలకు చెల్లించినట్లే ఇక్కడ కూడా రూ. 20 లక్షలు చెల్లించాలని ఆయన అన్నారు. తాను వస్తున్నాననే విషయం తెలిసి హడావుడిగా రూ. 3 లక్షల పోస్ట్ డేటెడ్ చెక్కులను ఇచ్చి ప్రభుత్వం చేతులు దులిపేసుకుందని.. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను కోల్పోయిన కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని చెప్పారు. అందుకోసం తాను ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు. విద్యార్థుల మరణాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పుష్కరఘాట్లో స్నానాలకు వారు వెళ్తే ఈతకు వెళ్లారంటూ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఏటూరు పుష్కరఘాట్కు ఇదే దారి అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని, ప్రతిరోజూ అక్కడ ఆహార పొట్లాలు కూడా అందిస్తున్నారని, అలాంటప్పుడు ఘాట్ వద్ద ప్రమాదకర ప్రాంతాలలో ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయలేదని జగన్ ప్రశ్నించారు. పుష్కరాల్లో స్నానాలు చేయకపోతే పాపాత్ములన్న రీతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, పుష్కర ఏర్పాట్ల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారని, ఈ మరణాలకు చంద్రబాబు సర్కారు ఏం సమాధానం చెబుతుందని ఆయన నిలదీశారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించిన చంద్రబాబు వల్లే ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పారు. -
వైఎస్ జగన్ పుష్కరస్నానం
-
పున్నమిఘాట్లో వైఎస్ జగన్ పుష్కరస్నానం
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలోని పున్నమి ఘాట్లో పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. ఈ రోజు ఉదయం గన్నవరం విమానశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్టు వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, కొడాలి నాని, రక్షణనిధి, జోగి రమేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గన్నవరం నుంచి నేరుగా పున్నమిఘాట్లో ఉన్న వీఐపీ ఘాట్కు వైఎస్ జగన్ చేరుకుని పుష్కర స్నానమాచరించి, పిండ ప్రదానం చేశారు. పుష్కర స్నానానికి ముందు జగన్.. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత లబ్బిపేటలోని షిరిడీసాయిని దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానం అనంతరం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
పుష్కరాల్లో విద్యార్థుల మృతిపై విచారణ
-
భక్తజనం
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాల్లో వివిధ ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వరుసగా 6వరోజు భక్తులు పోటేత్తారు. పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటలకే భక్తుల తాకిడి మొదలైంది. సెలవు దినాలు కాకపోయినప్పటికీ పుష్కరాలు మరికొన్ని రోజులే ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తున్నారు. గురువారం అత్యధికంగా రంగాపూర్ పుష్కరఘాట్లో దాదాపు 2.80లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు. ఈ ఘాట్కు అనూహ్యంగా భక్తుల తాకిడి పెరిగింది. సోమశిల, బీచుపల్లి, గొందిమళ్ల, క్యాతూర్, పస్పుల, నది అగ్రహారం, కష్ణ, పంచదేవులపాడు, పాతాళగంగ వంటి ఘాట్లు సైతం పుష్కర భక్తులతో కళకళలాడాయి. జూరాల పుష్కరఘాట్లో నీళ్లు పూర్తిస్థాయిలో అడుగంటడంతో వరుసగా రెండో రోజు మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు తగ్గడంతో దిగువ ప్రాంతానికి నీటి విడుదలను అధికారులు నియంత్రించారు. దీంతో అనేక పుష్కరఘాట్లలో నీటి మట్టం గురువారం మరింత తగ్గింది. గొందిమళ్ల, సోమశిల, పాతాళగంగ పుష్కరఘాట్లకు శ్రీశైలం వరద జలాలు వస్తుండడంతో ఆ ఘాట్లు మాత్రం జలకళ సంతరించుకున్నాయి. గొందిమళ్ల ఘాట్ పరిశీలన గొందిమళ్లలోని పుష్కరఘాట్ల ఏర్పాటును హైదరాబాద్ జోన్ ఐజీ శ్రీనివాస్రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ రెమారాజేశ్వరి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్రావు తదితరులు పరిశీలించారు. బుధవారం కడా బీచుపల్లి, రంగాపూర్, సోమశిల ఘాట్లలో ట్రాఫిక్ ఆంక్షలను కొనసాగించారు. వీఐపీలు ఇలా.. రంగాపూర్ పుష్కరఘాట్లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 102 సంవత్సరాల వయసు గల నిరంజన్రెడ్డి తల్లి సైతం పుష్కరస్నానం ఆచరించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి రంగాపూర్ ఘాట్లో పుణ్యస్నానమాచరించారు. సాయంత్రం కృష్ణమ్మ తల్లికి నది హారతి ఇచ్చారు. అలంపూర్ కలెక్టర్ టీకే శ్రీదేవి నదీమా తల్లికి హారతి ఇచ్చారు. నది అగ్రహారం పుష్కరఘాట్లో సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్, రైల్వే జనరల్ మేనేజర్ జ్ఞానేశ్వర్, గద్వాల వెంకట్రాంరెడ్డి తదితరులు పుణ్యస్నానాలు ఆచరించారు. గొందిమళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వియ్యంకుడు, మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు కుటుంబసభ్యులతో వచ్చి పుణ్యస్నానం ఆచరించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పాతాళగంగలో పుణ్యస్నానమాచరించారు. సోమశిల పుష్కరఘాట్లో ఎమ్మెల్సీ ప్రభాకర్ పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. నాంపల్లి ఫ్యామిలి కోర్టు జడ్జి లక్ష్మి కామేశ్వరి, రంగారెడ్డి జిల్లా జడ్జి సుజన తదితరులు సోమశిలలోని వీఐపీ ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్కు పిండప్రదానం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ మండలం మంచాలకట్ట పుష్కరఘాట్లో వైఎస్సార్సీపీ నాయకులు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి వైఎస్ చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు రాంభూపాల్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్ తదితరులు పాల్గొన్నారు. -
లోకకల్యాణం కోసం..
అలంపూర్ రూరల్: అష్టాదశశక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన అలంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో కృష్ణాపుష్కరాల్లో భాగంగా గురువారం పౌర్ణమి నుంచి రాష్ట్ర ప్రభుత్వం శతచండీ యాగాన్ని నిర్వహించనుంది. ఈ మేరు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆలయంలోని కుంకుమార్చన మండపాన్ని ఇందుకు వేదికగా అధికారులు పరిశీలించారు. యాగం నిర్వహించేందుకు 40మంది రుత్వికులను పిలిపిస్తున్నట్లు దేవాదాయశాఖ అధికారి కృష్ణ తెలిపారు. అందుకు అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, అమ్మవారిని దర్శించుకునేందుకు అనువైన ప్రదేశాన్ని కలెక్టర్ టీకే శ్రీదేవి, ఐజీ శ్రీనివాస్రెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఘాట్ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్రెడ్డి,జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకష్ణ, సహాయక కమిషనర్ కష్ణ, ఈఓ గురురాజ పరిశీలించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చక స్వాములు తెలిపారు. ఎప్పటి నుంచో ఈ యాగం ఇక్కడ తలపెట్టాలని తలంచామని, ఈ యాగం విజయవంతమైన తరువాత మళ్లీ మహావిద్యాయాగం నిర్వహిస్తామని చెబుతున్నారు. ఐదురోజుల పాటు జరిగే ఈ యాగం ఆయుత చండీయాగం ఫలితం ఇస్తుందని పేర్కొన్నారు. శ్రేయస్సు కోసమే.. రాష్ట్ర దేశ ప్రజల శ్రేయస్సు, సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ పుష్కర సమయంలో ఈ శత చండీయాగాన్ని నిర్వహిస్తున్నాం. పుష్కరాల్లో చేసే యజ్ఞయాగాదులకు విశేష ఫలితం ఉంటుంది. అందుకే ఈ సమయంలో ఈ యాగం నిర్వహించాలని తలంచాం. –శ్యాంకుమార్ శర్మ, యజుర్వేద పండితులు మా కాంక్ష నెరవేరింది.. జోగుళాంబ ఆలయంలో ఈ శతచండీయాగం జరిపించాలని ఆలయ అర్చకులుగా సీఎం దృష్టికి తీసుకెళ్లాం. అందుకు వారు స్పందించి లోక కళ్యాణార్థం రాష్ట్ర ప్రజల యోగ క్షేమాల కోసం యాగాలకు ఎప్పటికీ సహకారం ఉంటుందని తెలిపారు. దీంతో మా ఆకాంక్ష నెరవేరింది. –వెంకటకృష్ణ, శాస్త్ర పండితులు అనేక శక్తులు సిద్ధిస్తాయి ఈ శతచండీయాగం ద్వారా రాష్ట్రంలోని ప్రజలందరికీ జనాకర్షణ, ధనాకర్షణ, రూపాకర్షణ శక్తులు సిద్ధిస్తాయి. ఇలాంటి యాగాలు అందరి శ్రేయస్సు కోసం తలపెట్టింది. ఈ యాగం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివద్ధికి వస్తుంది. – వేముల విక్రాంత్శర్మ, పండితులు ప్రముఖులు రానున్నారు.. పుష్కరాల్లో భాగంగా శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయంలో జరిగే శతచండీయాగానికి ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆగమసంప్రదాయబద్ధంగా జరిగే ఈ యాగం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. – ఆనంద్శర్మ, జోగుళాంబ ఆలయ ముఖ్యఅర్చకులు -
రామ్మా.. సమంత..!
రామ్మ చిలకమ్మా... ఐశ్యర్యారాయ్.. ప్రీతీజింటా.. సమంతా.. కాజల్.. ప్రియాంకచోప్రా... బయటకి రావమ్మా... అయ్యగారు వచ్చారు... నీకు కానుకలు తెచ్చారు.. దీంతో నువ్వు పండ్లు కొనుక్కోవచ్చు... నేను మందు కొనుక్కోవచ్చు.. అయ్యగారి అదృష్టాన్ని.. కీర్తిని.. హోదాని బయటకి తీయవమ్మ.. లక్ష్మీతల్లి వరించాలా.. సరస్వతమ్మ కరుణించాలా.. బెజవాడ కనకదుర్గా.. శ్రీశైలం మల్లన్న.. తిరుపతి వెంకన్నా.. నిన్ను కరుణించుగాక.. చిరంజీవి.. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ప్రభాస్.. అందరూ రండి.. అందరూ కలిసొచ్చి అయ్యగారి కార్డు తీయడానికి మా సమంత(చిలక)కు సహకరించండి.. అయ్యగారూ.. యాభై రూపాయలు అక్కడ పెట్టండి.. సమంత రావమ్మ.. నీకు కానుకలు వచ్చాయి.. అయ్యగారు చక్కగా.. బలంగా ఉన్నారు.. అయ్యగారికి తగ్గట్టు మంచి కార్డు తీయమ్మ... అయ్యగారికి ఈసారి దశ తిరిగిపోవాలి.. ఇలా చిలకజోస్యులు పుష్కరాల్లో సందడి చేస్తున్నారు. పుష్కరఘాట్ల వద్ద చిలకజోస్యం చేప్పించుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఓ వైపు పుణ్యస్నానాలను ఆచరించి అమ్మవారిని దర్శించుకుని వస్తున్న వారిని చిలక జ్యోతిస్యులు ‘ఒక్క చిన్నమాట..’ అని పిలిచి కూర్చోబెడుతున్నారు. ‘మా సమంత చెప్పింది జరగాల.. జరిగాక అయ్యగారు, అమ్మగారు మెచ్చాలా..’ అంటూ భక్తులను ఆకర్షిస్తున్నారు. చిలకలకు సినీతారల పేరు పెట్టుకుని తమ మాటలతో భక్తులను అలరిస్తున్నారు. మారిన చిత్రాలు కాలంతోపాటు చిలకజోస్యంలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో దేవుళ్లు, దేవతల చిత్రపటాలు ఉన్న ఫొటోలను చిలుకలతో తీయించి జోస్యం చెప్పేవారు. మారిన ట్రెండ్ ప్రకారం దేవతల స్థానంలో సినీనటుల ఫొటోలు వచ్చి చేరుతున్నాయి. చిలక తీసిన ఫొటోలను బట్టి వచ్చినవారి హావభావాలకు అనుగుణంగా జోస్యం చెబుతున్నారు. - విజయవాడ(గుణదల) -
పుష్కరాల్లో విద్యార్థుల మృతిపై విచారణ: డీజీపీ
కృష్ణా పుష్కరాల సందర్భంగా కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న విషాదంపై పోలీసు కేసు నమోదైంది. పుష్కర స్నానాల కోసం వెళ్లి.. కృష్ణానదిలో మునిగి ఐదుగురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. విద్యార్థుల మృతిపై విచారణ జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. ఘటనకు దారితీసిన కారణాలపై పూర్తి సమాచారం సేకరిస్తున్నామని, బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యార్థుల మృతి దురదృష్టకరమని ఏపీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అనధికార పుష్కర ఘాట్లను పూర్తిగా నియంత్రిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ఆరు రోజుల్లో మొత్తం 74 లక్షల మంది పుష్కర స్నానం చేశారని, శుక్రవారం నాడు పౌర్ణమి కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. -
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
-
గవర్నర్ దంపతుల పుష్కర స్నానం
విజయవాడ : ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించారు. సతీ సమేతంగా బుధవారం విజయవాడలోని పున్నమి ఘాట్కు చేరుకున్న గవర్నర్ పుష్కర స్నానం ఆచరించి కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గవర్నర్ దంపతులు దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి స్వాగతం పలికిన ఈవో సూర్యకుమారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనక దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అందరికి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానన్నారు. రెండు సంవత్సరాల్లో వరుసగా గోదావరి, కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానం చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. -
పుష్కర స్నానం ఆచరించిన ఏపీ స్పీకర్ కోడెల
గుంటూరు : కృష్ణా పుష్కరాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ పుష్కర స్నానం ఆచరించారు. అమరావతి, దైద, సత్రశాల శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర ఘాట్ల వద్ద నీటి ప్రవాహం అధికమైంది. జిల్లాలోని 72 పుష్కర ఘాట్ల వద్ద భక్తులు పోటెత్తారు. -
ఐదో రోజూ భక్తుల హోరు
దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు * పుష్కర ఘాట్లలో తగ్గుతున్న నీటిమట్టం * జూరాల ఘాట్కు భక్తులను అనుమతించని పోలీసులు * నల్లగొండలో ఇంద్రకరణ్, జగదీశ్రెడ్డి విహంగ వీక్షణం * వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సతీమణి, * పార్టీ ఎంపీ రేణుక పుణ్యస్నానాలు సాక్షి ప్రతినిధులు, మహబూబ్నగర్/నల్లగొండ: కృష్ణా పుష్కరాల ఐదో రోజు మంగళవారం కూడా జనప్రవాహం కొనసాగింది. అయితే పుష్కర ఘాట్లలో నీటిమట్టం తగ్గుతుండటంతో భక్తుల సంఖ్య కూడా కాస్త తగ్గింది. వీటితోపాటు పలు పుష్కరఘాట్లలో నీటిమట్టం సైతం తగ్గింది. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. మహబూబ్నగర్లో 7,80,415, నల్లగొండ ఘాట్లలో 2 లక్షల పై చిలుకు స్నానాలు చేశారన్నారు. ఎగువ నుంచి జూరాలకు వరద నీరు తగ్గడంతో ప్రాజెక్టునుంచి నీటి విడుదలను కట్టడి చేశారు. జూరాల ఘాట్కు వచ్చిన భక్తులను మరో ప్రాంతానికి తరలించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పోలీసు అమర వీరులకు వారి కుటుంబాల సమక్షంలో ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలో పిండ ప్రదానం చేశారు. మంత్రులు మహేందర్రెడ్డి రంగాపూర్ ఘాట్లో, లక్ష్మారెడ్డి గొందిమళ్లలో పుష్కర స్నానం చేశారు. గొందిమళ్ల ఘాట్లో రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానమాచరించారు. పార్టీ ఎంపీ బుట్టా రేణుక కూడా పుష్కర స్నానం చేశారు. ఇక వరుస సెలవులు ముగియడంతో నల్లగొండ జిల్లాలో ఐదో రోజు భక్తులు తగ్గారు. మూడు ప్రధాన ఘాట్లు మినహా మిగతావన్నీ వెలవెలబోయాయి. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జగదీశ్రెడ్డి పలు ఘాట్లను రోడ్డు, ఆకాశమార్గాన పరిశీలించారు. 20న గవర్నర్ నరసింహన్ మట్టపల్లిలో పుష్కర స్నానం చేస్తారని ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్లో ఆది, సోమవారాల్లో నిబంధనలు సడలించిన పోలీసులు మంగళవారం మళ్లీ కఠినతరం చేయడంతో కిలోమీటర్ల కొద్దీ నడవలేక భక్తులు ఇబ్బందులు పడ్డారు. మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలకపోవడంతో వారు సాగర్లో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నేడు వైఎస్కు పిండ ప్రదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి కొల్లాపూర్ నియోజకవర్గం మంచాలకట్ట పుష్కరఘాట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పిండ ప్రదానం చేయనున్నారు. పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు రాం భూపాల్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు. -
భక్త కృష్ణవేణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాల్లో ఐదో రోజు జనప్రవాహం కొంత తగ్గింది. మంగళవారం ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు పనిదినం కావడంతో పుష్కర భక్తులసంఖ్య కొద్ది తగ్గడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. గద్వాల సమీపంలోని జూరాల పుష్కరఘాట్లో నీళ్లు లేకపోవడంతో ఘాట్ను మూసివేశారు. జూరాల ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వచ్చే వరదనీరు భారీగా తగ్గడంతోపాటు అదే క్రమంలో ప్రాజెక్టునుంచి దిగువ ప్రాంతాలకు నీటి విడుదలను నియంత్రించడంతో పలు ఘాట్లలో నీటిమట్టం భారీస్థాయిలో తగ్గింది. జూరాల పుష్కరఘాట్లో మినహా ఎక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇబ్బంది లేకుండా అధికారులు ఏర్పాట్లుచేశారు. మరో వారం రోజుల పాటు పుష్కరాలు ఉండడంతో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఆయా ఘాట్లలో నీటిమట్టం ఉండే లా చూడాలని నీటి పారుదల శాఖాధికారులు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం సైతం బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల, రంగాపూర్, పస్పుల, నదీ అగ్రహారం, కృష్ణ, పంచదేవులపాడ్, పెద్దచింతరేవుల ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరం..ప్రముఖం ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ హెచ్జె.దొర బీచుపల్లి పుష్కరఘాట్లో పుణ్యస్నానం ఆచరించగా, రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి సతీమణి కుటుంబసమేతంగా వచ్చి గొందిమళ్ల పుష్కరఘాట్లో పుణ్యస్నానమాచరించి అనంతరం జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి తొలుత జూరాలలో పుణ్యస్నానమాచరించాలని పర్యటన ఖరారు చేసుకున్నప్పటికీ ఆ ఘాట్ నీళ్లు లేవన్న సమాచారంతో రంగాపూర్ ఘాట్ వద్ద పుణ్యస్నానమాచరించారు. గొంది మళ్లలో మంత్రి లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా స్నానమాచరించారు. కర్నూల్ వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక గొందిమళ్ల వీఐపీ ఘాట్లో స్నానమాచరించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నది అగ్రహారంలో సంధ్యా హారతిఇచ్చారు. మంత్రులు జూపల్లి, లక్ష్మారెడ్డి పలు ఘాట్లను సందర్శించి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. కలెక్టర్ శ్రీదేవి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పరిశీలించారు. బీచుపల్లిలో స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న సేవలను పరిశీలించడంతోపాటు అక్షయ పాత్ర ఫౌండేషన్ పుష్కర డ్యూటీలో ఉన్న స్వచ్ఛంద సేవకులకు, ఉద్యోగులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. స్వచ్ఛంద సేవకులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు. అన్ని ప్రాంతాల్లో నది హారతి విధిగా ఇవ్వాలని, హారతి ప్రాధాన్యతను ఆధ్యాత్మిక ప్రశస్తిని ప్రజలకు వివరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఇటు సోమశిలలోనూ మంగళవారం భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. మంగళవారం వివిధ ప్రాంతాల్లో పుష్కరస్నానం చేసే భక్తుల రద్దీ కొంత తగ్గడంతో హైవేపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను కొంతమేర సడలించారు. అయితే ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. నేడు మంచాలకట్టలో వైఎస్కు పిండ ప్రదానం కొల్లాపూర్ సమీపంలోని మంచాలకట్ట ఘాట్ వద్ద బుధవా రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదా నం చేయనున్నారు. ఉదయం 11 గంట లకు శాస్త్రోకంగా పిండప్రదానం చేయనున్నారు. వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు భగవంత్రెడ్డి కోరారు. -
కృష్ణా పుష్కరాల భక్తులకు అల్పాహారం
రాయికల్(షాద్నగర్ రూరల్): ఫరూఖ్నగర్ మండలం రాయికల్ టోల్ప్లాజా వద్ద ఆర్యవైశ్య, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణా పుష్కరాలకు వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అందజేశారు. అల్పాహార కార్యక్రమం మంగళవారం 5వ రోజుకు చేరుకుంది. వనితా, వాసవీక్లబ్ ఆర్థిక సహకారంతో అల్పాహార కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. పుష్కరాలు ముగిసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంఘం సభ్యులు తెలిపా రు. పుష్కరాలకు వెళ్లే భక్తులకు దారిలో అల్పాహారాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆకారపునాగరాజు, వసుందర, సురేష్, శశిధర్, సూర్యప్రకాష్, విజయ్కుమార్, శారద, సుగుణ, బాల్రాజ్, కృష్ణయ్య, సంతోష్, ప్రభాకర్, లక్ష్మయ్య, నరేందర్. సింహ్మయ్య, సుభాష్, నరేష్, భారతి, వెంకటేష్, నర్సింలు, నందీశ్వర్, చంద్రయ్య, భారతి, విజయరాణి తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థుల మృతి
⇒ కృష్ణానదిలో ఇసుక గుంతల్లో పడడంతో ఘటన ⇒ డ్రెడ్జర్తో తీసిన ఇసుక గుంతలే ⇒ ఐదుగురు యువకుల ప్రాణాలను బలికొన్న వైనం ⇒ లోతు ఎక్కువగా ఉండటంతో కాపాడలేకపోయాం.. గజ ఈతగాళ్లు అమరావతి: పుష్కర స్నానాలకు వెళ్లిన ఐదురుగు యువకులను అనధికారికంగా తీసిన ఇసుక గోతులు పొట్టన పెట్టుకొన్నాయి. కృష్ణాజిల్లా నందిగామ చైతన్య డిగ్రీ కాలేజిలో బికాం ఫైనల్ఇయర్ చదువుతున్న 11 మంది విద్యార్థులు పుష్కర స్నానాలకని చందర్లపాడు మండలం ఏటూరు రేవు ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న గుంటూరు జిల్లా అమరావతి మండలం దిడుగు ఇసుక ర్యాంపు ప్రాంతాల్లో స్నానం చేద్దామని మంగళవారం ఉదయం 11గంటలకు వెళ్లారు. నదిలో నీళ్లు మాములుగా ఉన్నాయనుకుని ఒక విద్యార్థి దిగగా...డ్రెడ్జర్తో తోడిన సుమారు 30నుంచి 35 అడుగుల లోతులో ఉన్న నీటి గుంటలో జారి పడిపోయాడు. స్నేహితున్ని కాపాడేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. పాశం గోపిరెడ్డి, నందిగామ నగేష్, కంచిచర్ల లోకేష్ సాయి హరగోపాల్, కుమ్మవరపు హరిగోపి, ములకపల్లె హరీష్ ఐదుగురూ ఒకరినొకరు పట్టుకొని ఒడ్డుకు చేరుకొనే ప్రయత్నం చేశారు. అక్కడ లోతు ఎక్కువగా ఉండటంతో అంతా నదిలో మునిగి చనిపోయారు. చేతులు ఊపుతూ కాపాడండి అంటూ వారు చేసిన అర్తనాదాలు విని పరుగెత్తుకుంటూ వచ్చిన స్నేహితుడు వంశీ రక్షించే ప్రయత్నం చేయగా..అతని కాళ్లను ఇద్దరు పట్టుకోవడంతో ఎలాగోలా వారిని వదిలివేసి ఒడ్డుకు చేరాడు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్లకు చెప్పి, స్నేహితుల ప్రాణాలు కాపాడాలని వేడుకొన్నాడు. 15 మందిగల గజ ఈతగాళ్ల బృందం యువకులు గల్లంతు అయిన ప్రదేశానికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేసింది. ఇసుకను భారీ వాహనాలతో తీయడంతో అక్కడ 30 అడుగులమేర నీటి లోతు ఉండటంతో వారు చెతులెత్తేసి కాపాడలేమంటూ వెనుదిరిగారు. ఒడ్డున ఉన్న స్నేహితులు ఫోన్లు చేయడంతో తర్వాత మరికొందరు గజ ఈతగాళ్లు వచ్చి గాలించి ఐదుగురు యువకుల శవాలను వెలికితీశారు. సంఘటన స్థలానికి పోలీసులు హూటా హుటిన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. నందిగామ నుంచి ఇలా వెళ్లారు 11 మంది విద్యార్థులు నాలుగు బైకుల్లో కాలేజీ నుంచి ఇంటర్ వెల్ మధ్యలో పుష్కర స్నానాలకు వచ్చినట్లు తెలిపారు. ఏటూరు రేవులో నీళ్లు శుభ్రంగా ఉన్నాయని, అక్కడ అన్నదానం చేస్తున్నారని తెలియడంతో స్నానం చేసి సరదాగా గడిపి వెళ్లామని వచ్చామని స్నేహితులు తెలిపారు. అయితే కంచికర్ల లోకేష్ తండ్రి పులి శ్రీను వాసులు అన్నదానం వద్ద ఉండటంతో నాన్న అరుస్తాడు, వద్దు అని లోకేష్ వారించడంతో చనిపోయిన ఐదుగురు అన్నదానం వద్దకు పోకుండా అక్కడే అగిపోయారు. పులిహోర కోసం వెళ్లిన గువ్వల కార్తీక్, నాదెండ్ల మనోజ్కుమార్రెడ్డి, రెడ్డి దేవి వరప్రాపాద్, బొడేపూడి వంశి, కూసుగోపి, గద్దె వంశీలు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నాయనా...ఎంత జరిగింది: లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్న మృత దేహాన్ని తీసుకొస్తున్న సమయంలో చూసి అబ్బా... నా కొడుకే అంటూ లోకేష్ తండ్రి పులి శ్రీనివాసులు విలపిస్తున్న దృశ్యం చూపరులను కంటతడిపెట్టించింది. ఎంతపని జరిగింది నాయనా...కష్టపడి చదివించామని, చేతికొచ్చిన ఆధారం పోతే ఎలా బతకాలని బోరున విలపించారు. ఈయన కారుడ్రైవర్గా పని చేస్తున్నారు. పుష్కరాలకు ప్రచారం ఎందుకు : వాణి, హరిగోపి తల్లి ‘పిల్లలందరూ పదింటికి నందిగామలో మా ఇంటి దగ్గర నుంచే బయలుదేరి పుష్కరస్నానాలకు వచ్చారు. కళాశాల వారు సైతం యూనిఫాం వేసుకుని రమ్మన్నారని చెప్పటంతో ఇంటికి వచ్చామన్నారు. పిల్లలను కాపాడలేని పోలీసులు ఉంటే ఏమి లేకపోతే ఏమిటి’ అంటూ మృతుడు హరిగోపి తల్లి వాణి గుండెలవిసేలా రోదించారు. శవాలను వెలికితీస్తుంటే బయట పడ్డ శవం ఎవరిదని అంటూ ఆతల్లి అటువైపుగా పరుగుతీయటాన్ని చూసి పలువరు చలించారు. పుష్కరాలకు ప్రచారం ఎందుకు..తగలబడ్డ పుష్కరాలు ప్రాణాలు తీయటానికా అంటూ శాపనార్ధాలు పెట్టారు. నాకు ఒక్కడే కొడుకు..మేము ఎవరి కోసం బతకాలి....వాడులేని జీవితం మాకెందుకు వాడిని చూడకుండా ఉండలేనయ్యా అంటూ ఆతల్లి విలవిలాడింది. మమ్మల్ని తీసుకుని వెళ్తే పోయేది అంటూ బోరున విలపిచింది. బాధతో సీఎంను శాపనార్థాలు పెడుతున్న ఆమెను పక్కనే ఉన్న టీడీపీ నేతలు అడ్డుకున్నారు. మీ పిల్లలను బాబు ఏమన్నా ఈతకు వెళ్ళామన్నాడా అంటూ గొడవకు దిగారు. అయితే రెట్టించిన బాధతో ఆమె‘ నీ తలకాయ నెరిసింది..బుధ్ధి ఉందా’మమ్మల్సి చంపడయ్యా అంటూ ఆమె రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కలచి వేసింది. మమ్మల్ని ఆన్యాయం చేశావే... గోపిరెడ్డి తల్లి మమ్మల్ని అన్యాయం చేయటానికి ఇక్కడకు వచ్చావా నాయనా గోపిరెడ్డి తల్లి కొడుకు శవంపై పడి బోరున విలపించింది. తండ్రి వెంకటేశ్వరెడ్డికి నోట మాట రాక శవంపై పడి అలాగే ఉండిపోయారు. వారిని ఓదార్చటం ఏవరి తరం కాలేదు. వీరికి ఒక్కడే కుమారుడు. మరో సంతానం శ్రావణి డిగ్రీ చదువుతోంది. మేమంతా ప్రాణ స్నేహితులం...విజయకుమార్ (స్నానం కోసం వచ్చిన తోటి విద్యార్ధి) ఒక్కొక్క శవాన్ని ఒడ్డుకు వెలికి తీస్తుంటే...వారిని చూసి వారితో పాటు వచ్చిన తోటివిద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అటు వద్దన్నాం...వద్దన్నా వెళుతుంటే ఆపుదామని చూశాం...ఆ లోపే లోపలికి వెళ్ళారు. ఐదుగురు నడుచుకుంటూ వెళ్లారు. ఒకరు కింద పడగానే. మిగిలిన అందరు చేతులు పట్లుకొని వాడిని లాగే ప్రయత్నంలో అందరు పెద్ద నీటి గుంత కావడంతో బయటకు రాలేక నీట మునిగిపోయారు. రక్షించేందుకు ప్రయత్నించాను : వంశీ నాకు కొంత మేర ఈత రావటంతో స్నేహితులను రక్షించేందుకు ప్రయత్నించాను. నీటిలో పడిపోయిన ఇద్దరు రెండు కాళ్లు పట్టుకోవటంతో ఎలాగోలగా నేను నీటి నుండి బయటపడ్డా..వారిని రక్షించలేకపోయా..గజ ఈతగాళ్ళకు సమాచారాన్ని అందించా. మనోజ్కుమార్ , గోపి, దేవివరప్రసాద్లందరూ మేమంతా ఒకే బెంచి కూర్చునే వారం. ఎక్కడకి వెళ్ళినా..అంత కలిసే వెళ్ళావాళ్ళమని, ఇక్కడ స్నానం చేస్తామని వచ్చాం. అక్కడికి వెళ్లొద్దన్నాం : ప్రత్యక్ష సాక్షి ఎస్. సత్యన్నారాయణ పదకొండు మంది యువకులు బైకులపై ఇక్కడకు వచ్చారు. యువకులు అక్కడ ఉంటే తూర్పు వైపు వెళ్ళాలని, పడమర వైపు వద్దని చెప్పాం. వాళ్ళు అటు ఇటు ఆడుకుంటూ....పడమరవైపుకు వెళ్ళారు. వారు మునిగిపోతూ వేసిన కేకలు వినిపించాయి. ఆ లోపే పడవ వేసుకుని 15 మంది గజఈతగాళ్ళం వెళ్ళాం. అక్కడ చూసినా కనిపించలేదు. అప్పటికే నీట మునిగిపోయారు. -
మహానేతను మరవలేము
అమరావతి: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్లో సోమవారం కొందరు యువకులు పిండప్రదానం చేసి ఆయనపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పుష్కరాల్లో పవిత్రస్నానం చేయటానికి వచ్చేవారిలో అధికశాతం పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతలకు చెందిన 45 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కొందరు యువకులు వైఎస్సార్ చిత్రపటంతో తాడేపల్లి పరిధిలోని సీతానగరం ఘాట్కు చేరుకున్నారు. ముందుగా చిత్రపటంతో ఘాట్లో స్నానం చేశారు. అనంతరం పిండప్రదానం షెడ్ వద్ద చిత్రటానికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తిరిగి ఘాట్ వద్దకెళ్లి కృష్ణా నదిలో పిండాలను విడిచిపెట్టారు. వైఎస్సార్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరినీ వైఎస్ ఆదుకున్నారన్నారు. ఆయన మరణం తరువాత రాష్ట్రం అవస్థల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన సభ్యులు మూర్తాల ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓర్సు కాశయ్య, తిరుపతిరెడ్డి, గుండా కిషోర్, సర్పంచ్ గుర్రాల రాజు, ఉప సర్పంచ్ ఏలూరు సత్యనారాయణ, ఎంపీటీసీలు ఉమ్మా రామాంజనేయరెడ్డి, జి.పద్మజానాథ్రెడ్డి, బీసీ సెల్ మండల కన్వీనర్ తిరుపతిరావు, చెవిరెడ్డి ఏరువ, పమ్మి సీతారామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పుష్కర ఘాట్లకు పోటెత్తున్న భక్తులు
-
విమాన ప్రయాణ చార్జీలకు రెక్కలు
పుష్కరాల ప్రభావంతో పెరిగిన వైనం విమానాశ్రయం(గన్నవరం): కృష్ణా పుష్కరాలకు తరలివచ్చే యాత్రికుల కోసం ఆర్టీసీ ఉచిత, అదనపు బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతుంటే.... విమానయాన సంస్థలు మాత్రం ప్రయాణికుల అవసరాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. పుష్కరాలకు ఎయిర్కోస్టా హైదరాబాద్కు ప్రత్యేక సర్వీస్ మినహా మిగిలిన విమాన సంస్థలేవీ అదనపు సర్వీసులు నడిపేందుకు ముందుకురాలేదు. దీంతో ప్రస్తుతం విమాన సర్వీసులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. సాధారణ రోజుల్లో రూ.1,500 నుంచి రూ.4,500 వరకు ఉండే విమాన టికెట్ వెల పుష్కరాల ప్రారంభంతో మూడు నుంచి ఆరు రెట్లు పెరిగాయి. విజయవాడ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు విమాన సర్వీసుల చార్జీలు ఆకాశన్నంటుతున్నాయి. పుష్కరాల ముందు వరకు రూ.5 వేలు వరకు పలికిన ఎయిరిండియా విజయవాడ-న్యూఢిల్లీ సర్వీసుల చార్జీ ఆదివారం రూ. 14,111కు చేరుకుంది. ఇదే సర్వీసుకు 15న ఢిల్లీ-విజయవాడకు రూ.16,076గా ఉంది. రూ.3 వేలలోపు టికెట్ ఉండే స్పైస్జెట్ విజయవాడ-బెంగళూరు సర్వీసుకు రూ.12,400, విజయవాడ-చెన్నైకు రూ.10,400, విజయవాడ-హైదరాబాద్కు రూ.9,199, బెంగళూరు- విజయవాడకు రూ.8,499 వరకు పెరిగింది. ఎయిర్ కోస్టా విజయవాడ-బెంగళూరు సర్వీసులో రూ.5వేల లోపు చార్జీ ఉండే టికెట్ ప్రస్తుతం రూ.10,120 పలుకుతోంది. ఒక్కసారిగా విమాన చార్జీలకు రెక్కలు రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. -
కృష్ణా పుష్కరాల్లో మరో అపశ్రుతి
విజయవాడ: కృష్ణా పుష్కరాలలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రి పవిత్ర సంఘం ఘాట్ వద్ద ఫిట్స్ వచ్చి ఓ యవకుడు నీళ్లలో పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతడిని దగ్గరోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కాసేపటికే మృతి చెందాడు. మృతుడు ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామానికి చెందిన పి. యశ్వంత్గా గుర్తించారు. మరోవైపు విజయవాడ దుర్గా ఘాట్ వద్ద పాము కలకలం రేపింది. పుష్కర స్నానం చేస్తుండగా సుమంత్ అనే బాలుడిని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గమనించిన అతడి కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గజ ఈతగాళ్లు పామును పట్టుకున్నారు. అలాగే గుంటూరు జిల్లా అమరావతిలో విషాదం నెలకొంది. పుష్కర స్నానానికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కారు పార్క్ చేస్తుండగా అస్వస్థతకు గురైన అతడు...అక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఘటనలో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళ గుండెపోటుకు గురై మృతిచెందింది. కృష్ణాజిల్లా తమిడిముక్కల మండలం ఐనపూరు ఘాట్లో సోమవారం శకుంతల(65) అనే మహిళ స్నానం చేయడానికి వచ్చింది. పుష్కర స్నానం చేస్తున్న సమయంలో గుండె పోటు వచ్చి అక్కడికక్కడే కుప్ప కూలింది. -
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణ పుష్కరాల సందడి
-
జనసంద్రంగా కృష్ణమ్మ
-
పుష్కరాలకు వచ్చే రైతులకు లఘుచిత్రాల ప్రదర్శన
రాయవరం : కృష్ణా పుష్కరాల్లో పశు సంవర్ధక శాఖకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు రిసోర్స్ పర్సన్గా తనను ప్రభుత్వం నియమించినట్లు రాయవరం పశువైద్యశాల ఏడీ డాక్టర్ ఎం.రామకోటేశ్వరరావు తెలిపారు. రాయవరంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఈమేరకు పశు సంవర్ధక శాఖ సంచాలకుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు ఆయన తెలిపారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 16, 17 తేదీల్లో పశు సంవర్ధకశాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పశుయాజమాన్యంపై రూపొందించిన లఘుచిత్రాలను అక్కడ తాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఈ టీమ్లో జిల్లా నుంచి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కె.గాబ్రియేల్, పామర్రు, ఆలమూరు, రాజమండ్రి వెటర్నరీ డాక్టర్లు‡ జాన్పాల్, ఓ.రామకృష్ణ, కె.సత్యనారాయణ, అమలాపురం ఏడీ డాక్టర్ ఎల్.అనితలు ఉన్నట్టు తెలిపారు. -
పుష్కరాలకు విచ్చేయనున్న సూపర్ స్టార్
కృష్ణా పుష్కరాలలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ గుంటూరు విచ్చేయనున్నారు. పుష్కరాలలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపించింది. త్వరలో రజనీకాంత్ గుంటూరులోని చింతపల్లిలో ఉన్న విష్ణు పంచాయతన దివ్య మహా పుణ్య క్షేత్రానికి చేరుకుని పవిత్ర పుష్కర స్నానం ఆచరించనున్నారు. గతేడాది గోదావరి పుష్కరాలకే ప్రభుత్వం రజనీకి ఆహ్వానం పంపినప్పటికీ.. ఆ సమయంలో ఆయన రాలేకపోయారు. కృష్ణా పుష్కరాలకు రజనీ హాజరవుతారని ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అనంతరం రజనీ ఓ నెల రోజులపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' రెండవ దశ షూటింగ్లో పాల్గొంటారు. రోబో 2.0లో బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. -
'పుష్కరాలను ప్రచారం కోసం వాడుకుంటున్న బాబు'
చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఆదివారం చిత్తూరులో నిప్పులు చెరిగారు. కృష్ణా పుష్కరాలను చంద్రబాబు తన ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. పుష్కర ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని విమర్శించారు. చాలా ఘాట్లలో నీరు లేకపోవడం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పురాతన ఆలయాలను కూల్చి మరుగుదొడ్లు నిర్మించడం దారుణమన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబుతోపాటు ఆయన అనుయాయులు వేల కోట్లు దోపిడీ చేశారని రోజా విమర్శించారు. -
శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ
కర్నూలు: వరుస సెలవులు రావడంతో శ్రీశైలంలోని భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలోని పుష్కర ఘాట్లులన్నీ భక్తులతో నిండిపోయాయి. అలాగే ఆలయ ప్రాంగణం అంతా జనసంద్రంగా మరింది. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఓ గంట సమయం పడుతోంది. -
తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు పిండప్రదానాల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తన అత్త, మామ బసవతారకం, ఎన్టీ రామారావులకు కూడా పిండ ప్రదానాలు చేశారు. -
రెండో రోజు కృష్ణమ్మ పుష్కర శోభ
-
మత్స్యశాఖ ఆధ్వర్యంలో పుష్కర పర్యవేక్షణ
-
సందట్లో సడేమియాలు
విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పొటెత్తుతుండటంతో.. సందట్లో సడేమియాలాగా జేబు దొంగలు తమ పని చక్కబెడుతున్నారు. పద్మావతి ఘాట్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని భక్తులు ఘాట్కు వచ్చిన డీజీపీ, ఎమ్మెల్యే గద్దెలకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పిక్ పాకెటర్లపై దృష్టి సారించి 10 మంది చోర శిఖామణులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారంతా 14 ఏళ్లలోపు వారు కావడంతో.. పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. వాళ్ల ఫోటోలు తీసుకొని పుష్కరాలు జరిగే రోజుల్లో ఆ పరిసర ప్రాంతాల్లో కనిపించొద్దని హెచ్చరించి వదిలేశారు. -
సాగర్ ఘాట్లో భక్తుల ఇక్కట్లు
నాగార్జున సాగర్: వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో.. కృష్ణా పుష్కరాల్లో పవిత్ర స్నానమాచారించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయక పోవడంతో భక్తులతో పాటు బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద ప్రస్తుతం భక్తుల రద్దీ అధికంగా ఉంది. వేలాది మంది భక్తులు పిండ ప్రధానం కార్యక్రమం చేపట్టడానికి యత్నిస్తుండగా.. వసతుల లేమి వెక్కిరిస్తోంది. ఈ రోజు భానుడి భగభగలు ఎక్కువగా ఉండటంతో.. ఎండలోనే పిండ ప్రధానం చేస్తున్న పలువురు భక్తులు సొమ్మసిల్లారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
'ఈవోనని చెప్పినా పట్టించుకోలేదు'
విజయవాడ : దుర్గ గుడి వద్ద పోలీసులు శనివారం అత్యుత్సహం ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రి కొండపైకి అనుమతి లేదంటూ దేవాలయ ఈవో సూర్యకుమారి, ప్రధాన అర్చకులు శివప్రసాద్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అంతేకాకుండా కొండపైకి నడిచి వెళ్లాలని వారికి పోలీసులు సూచించారు. తాను దేవాలయం ఈవోనని సూర్యకుమారి పోలీసులకు చెప్పింది. అయినా ఆమె మాటలను వారు పట్టించుకోలేదు. అయితే దేవాలయం ఆధికారుల సమక్షంలోనే వీఐపీల వాహనాలకు కొండపైకి అనుమతించారు. పోలీసుల తీరుపై ఆలయ అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఈవో సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసేందుకు సమయత్తమయ్యారు. -
పద్మావతి ఘాట్లో దొంగలు హల్చల్
విజయవాడ : కృష్ణా పుష్కరాలు నేపథ్యంలో పద్మావతి ఘాట్లో శనివారం దొంగలు హల్చల్ చేశారు. నదిలో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చిన భక్తుల దృష్టి మరల్చి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. అలా వచ్చిన భక్తులకు చెందిన రూ. 4500, మూడు తులాల బంగారంతోపాటు సెల్ ఫోన్ అపహరించుకుని పోయారు. దీంతో భక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
పుష్కర ఘాట్లలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
హైదరాబాద్ : కృష్ణా పుష్కరోత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరస్నానమాచరిస్తున్నారు. అదికాక నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పుష్కర స్నానం ఆచరించేందుకు పలు ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసింది. -
ప్రారంభం.. పలుచగా
ప్రారంభమైన కృష్ణా పుష్కరాలు.. పీఠాధిపతులదే తొలిపుష్కర స్నానం * వీఐపీ ఘాట్లో జయేంద్ర సరస్వతి, విజయేంద్ర స్వామి పుణ్యస్నానం * అనంతరం స్నానం ఆచరించిన సీఎం దంపతులు సాక్షి, అమరావతి/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. పన్నెండేళ్లకు ఒకసారి బృహస్పతి కన్యారాశిలో ప్రవేశంతో ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శుక్రవారం తెల్లవారుజామున 5.40గంటలకు వీఐపీ ఘాట్లో కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత కలశస్థాపన, కృష్ణవేణి స్థాపన, ఆవాహన, పూజా కార్యక్రమాలతో కృష్ణా పుష్కరాలను ప్రారంభించారు. జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వాములు తొలి పుష్కర స్నానం ఆచరించగా.. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు, లోకేష్, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర కుటుంబీకులు పుష్కర సాన్నం చేశారు. ప్రభుత్వం ప్రచారార్భాటంతో ఊదరగొట్టినప్పటికీ కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తులు చాలా తక్కువ గా పుణ్యస్నానాలు ఆచరించారు. గత ఏడాది గోదావరి పుష్కరాల తొలిరోజు దుర్ఘటన భక్తులను వెన్నాడుతుండటం... శ్రావణ శుక్రవారం కావడం... ప్రభుత్వం మితిమీరిన ఆంక్షలతో కట్టడి... వెరసి కృష్ణా పుష్కరాల తొలిరోజు భక్తుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 4,51,569 మంది భక్తులు స్నానం చేశారు. వాస్తవానికి అందులో సగంమంది కూడా రాలేదని అధికారవర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. పుష్కరాలకోసం కృష్ణా జిల్లాలో 74, గుంటూరు జిల్లాలో 79, కర్నూలు జిల్లాలో 5 ఘాట్లు ఏర్పాటు చేశారు. తొలిరోజు దాదాపు అన్ని ఘాట్లలో భక్తులు చాలా పలుచగా కనిపించారు. పుష్కర స్నానం పవిత్రం: జయేంద్ర సరస్వతి ఎనిమిది తీర్థాలు కలిసిన కృష్ణా పుష్కర స్నానం ఎంతో పవిత్రమైనదని, పుష్కర స్నానం ఆచరించిన భక్తులందరూ సుఖ సంతోషాలను కలిగి ఉంటారని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చెప్పారు. కృష్ణా పుష్కర సంకల్ప కార్యక్రమాన్ని జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర స్వామిలతో పాటు పలువురు పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించగా, పూజా కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ర్టంలోని 13 జిల్లాలోని పలు ఆలయాల నుంచి సేకరించిన పసుపు, కుంకుమ, పూలతోపాటు టీటీడీ తరఫున పట్టుచీర, పూజా ద్రవ్యాలను డాలర్ శేషాద్రి, ఇతర తిరుమల అర్చకులు సీఎం చంద్రబాబుకు అందచేశారు. సీఎం చంద్రబాబు దంపతులు కృష్ణమ్మకు సారెను సమర్పించారు పుష్కరాల తీరును పరిశీలించిన సీఎం సీసీ కెమెరా విజువల్స్లో వీక్షణ విజయవాడ (లబ్బీపేట)/ఇంద్రకీలాద్రి: కృష్ణా పుష్కరాలు జరుగుతున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలించారు. వివిధ స్నాన ఘట్టాలు, నగరంలోని ముఖ్యమైన రహదారులు, కూడళ్లలోని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల రాకపోకలు వంటి అంశాలను సీసీ కెమెరా విజువల్స్లో పరిశీలించారు. వివిధ శాఖల నుంచి అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు భక్తుల స్పందనను తెలుసుకుని, మరింత మెరుగైన రీతిలో సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఇలా ఉండగా గన్నవరం వద్ద విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన కడప జిల్లా రాజంపేట మండలం ఊతుకూరు గ్రామానికి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తొక్కిసలాట భయం వల్లే భక్తుల సంఖ్య తగ్గింది: పల్లె విజయవాడ సెంట్రల్: గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట భయం కారణంగా కృష్ణా పుష్కరాల్లో తొలి రోజు భక్తుల సంఖ్య తగ్గిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇక్కడి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా పుష్కరాల తొలిరోజు 4,51,561 మంది భక్తులు స్నానమాచరించినట్లు తెలి పారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరి గే అవకాశం ఉందని, ప్రభుత్వ అంచనా ప్రకారం 3.50 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేశామన్నారు. పోలీస్ ఆంక్షలు శృతిమించాయని మంత్రి పల్లె రఘనాథరెడ్డి అన్నారు. పోలీసుల అతి జాగ్రత్త అవసరం లేదని, భక్తులతో పాటు వివిధ శా ఖల అధికారులను ఇబ్బంది పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోలీసులు తీరుమార్చుకోవాలని హోంమంత్రి చినరాజప్ప సూచించినట్లు చెప్పారు. -
అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్పై టీఆర్ఎస్నజర్!
* పుష్కర పర్యటన పొడవునా ఆయనకు ప్రాధాన్యమిచ్చిన సీఎం * అలంపూర్కు వరాలు... సంపత్ విజ్ఞప్తి వల్లేనంటూ వ్యాఖ్యలు సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా పుష్కరాలను ప్రారంభించేందుకు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్కు పర్యటన ఆసాంతం అధిక ప్రాధాన్యమివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం బస చేసిన స్థానిక పర్యాటక శాఖ అతిథి గృహానికి వెళ్లిన సంపత్కు ఊహించని ఆదరణ లభించింది. సీఎంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై నియోజకవర్గ సమస్యలను నివేదించారు. మంత్రులు, అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలెవరితోనూ పర్యటనలో సీఎం ఇలా ప్రత్యేకంగా భేటీ కాలేదు. సంపత్కు ఆయన ఇంత ప్రాధాన్యం ఇవ్వడంపై పలు ఊహాగాలు వెలువడుతున్నాయి. సంపత్ తన అలంపూర్ నియోజకవర్గ సమస్యలపై పలు వినతిపత్రాలను సీఎంకు అందజేశారు. ఆయా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. సీఎం స్థాయి నాయకుడు పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యలు తదితరులు ఇలా వినతిపత్రాలివ్వడం పరిపాటే అయినా, సంపత్ వినతుల్లో చాలావాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి కేసీఆర్ మొగ్గుచూపారు! అంతేగాక అక్కడికక్కడ విలేకరుల సమావేశంలోనే అలంపూర్పై వరాల జల్లు కురిపించడం మరింత ఆసక్తి రేపుతోంది. అంతేకాదు... అలంపూర్కు 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేస్తున్నట్లు సమావేశంలో ప్రకటించిన సీఎం, ఈ విషయాన్ని సంపత్ తన దృష్టికి తెచ్చినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు! అలాగే, ‘‘సంపత్ కోరినట్టుగా ఆర్టీసీ డిపో మంజూరు చేయలేం. కాకపోతే ఆయన కోరినట్టుగా ఈ ప్రాంతానికి ఆర్డీఎస్ నుంచి సాగునీరు అందజేస్తాం’’ అంటూ విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన సంపత్ పేరును సీఎం పదేపదే ఉటంకించారు. అంతేగాక మీడియా సమావేశం ప్రారంభమవగానే సంపత్ను సీఎం తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఇది కూడా సీఎం ఆయనకిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమేనని అంటున్నారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ సమస్యలను సీఎం ప్రస్తావిస్తూ వీలైనప్పుడల్లా సంపత్ పేరును ఉటంకించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేత అని, పలు అంశాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని కూడా అన్నారు. ఇదంతా భావి రాజకీయ పరిణామాలకు సూచికేనని టీఆర్ఎస్ శ్రేణులే అంటుండటం విశేషం! అయితే సంపత్ మాత్రం తన నియోజకవర్గానికి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాననని, పేదల సమస్యలను విన్నవించడం తప్ప తమ భేటీకి మరో ప్రాధాన్యమేమీ లేదని కొందరు పాత్రికేయులతో అనడం విశేషం. -
సైకతస్నానం
అక్షర తూణీరం ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. అన్ని ఆఫీసులు పుష్కరం ముసుగులే సుకు కూర్చున్నా ఏర్పాట్లేమో అరకొరగానే ఉన్నాయి. పుష్కరాలు కృష్ణానదికి కాదు! నవ్యాంధ్రప్రదేశ్కి. ఆ రాష్ట్ర నాయకులకి. వారి పంట పండింది. ఇట్లాంటి సహజ సందర్భాలకు చంద్రబాబు రెచ్చి పోతారు. మహా శివరాత్రి, తిరుపతి బ్రహ్మోత్సవం, సూర్య గ్రహణం, రథ సప్తమి - ఇలాంటి అవ కాశాలు ఏవి వచ్చినా వదలరు. అవన్నీ తన ప్రమేయంతో వచ్చాయన్న స్పృహ కల్పించి, అశేష ప్రజానీకానికి తనదైన శైలిలో ఒక సందేశం ఇస్తారు. మరి పుష్కరం అంటే మామూలా? ముఖ్యమంత్రి హస్తినకు ప్రత్యేక విమానంలో వెళ్లి, చేటలంత పుష్కర శుభలేఖల్ని స్వయంగా పంచి వచ్చారు. కాని వాటికేమంత గొప్ప ప్రతిస్పందనలు కనిపించడం లేదు. ఇక వెంకయ్య మనవాడు కాబట్టి, అందరి తరఫునా అన్ని కృష్ణా రేవు ల్లోనూ మునిగి తేలుతాడని అనుకుంటున్నారు. నమ్మకాలున్న వారికి పుష్కరం పెద్ద పర్వమే కావచ్చు. వేదిక ధర్మపరాయ ణులు ఆచరించే పవిత్ర క్రతువే కావచ్చు. కాని, ఇప్పుడు జరుగుతున్న ఆర్భా టాలను ప్రజలు గమనిస్తు న్నారు. అయోమయంలో మునకలు వేస్తున్నారు. ఈ వైదిక సంధ్యలో అత్యాధునిక లేజర్ షోలు ఎంత అసందర్భమో అనుకుంటున్నారు. జన సామాన్యాన్ని దారి మళ్లించే ప్రయత్నంలో ఈ పుష్కరాల పడవని మహా నౌకగా చిత్రించి చుక్కానిని పెడమార్గం పట్టించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఇప్పటికి నెల రోజుల నుంచి పుష్కరాల కబుర్లు తప్ప వేరేమీ లేవు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి దాకా పుష్కరం ముసుగులేసుకు కూర్చున్నాయి. ఇక పోలీసు శాఖ అయితే చెప్పనే అక్కర్లేదు. ఎక్కడికి వెళ్లినా ‘మీరో పని చేయండి. చూస్తున్నారుగా... ఈ హడావుడి అయ్యాక రండి’ అని సెలవిస్తున్నారు. నిజానికి పైవారు ఏ పనిలోనూ మునిగి ఉండరు. ఇంతాచేసి ఏర్పాట్లు అరకొరగానే పూర్తయ్యాయి. చేసిన పనుల న్నింటినీ, ఈ పుష్కర పర్వం పూర్తయ్యాక చూసి, బేరీజు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఒక అనుభవజ్ఞుడి సూచన. అయితే, అప్పటికి సగం దార్లు, వంతెనలు, ఘాట్లు మిగిలి ఉండకపోవచ్చు. ‘అప్ప ఆర్భాటమేగాని నూర్పిట్లో యిత్తు లేదని’ సామెత. కృష్ణమ్మ అంత దయగా ఏమీ ప్రవహించడం లేదు. బెజవాడకి దిగువన మూరెడు ఎత్తు నీరు మాత్రమే ఉంది. కొందరు మేము ఈ పుష్కర వేళ కృష్ణా ఇసుకతో స్నానం చేయవచ్చునా? సైకత స్నానం మీద బ్రహ్మశ్రీ విడమరచి చెప్పాలని భక్తులు కోరుతున్నారు. ‘మన అమరావతిని నిర్మించనున్నది జపాన్, చైనా, సింగపూర్ కంపెనీల వారే కదా. వారు పుష్కర స్నానాలకు వచ్చారా?’ అని ఓ కాపిటలిస్ట్ వాకబు చేశాడు. అక్కడ భూమి పోగొట్టుకున్న వారిని ‘కాపిటలిస్ట్’లనే బిరుదు నామంతో వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఎట్లా ఉన్నా, పుష్కరాల పుణ్యమా అని కృష్ణా తీరం మహ నీయులను స్మరించుకునే సదవకాశం వచ్చింది. కొత్త కాపిటల్లో, మందుల మాంత్రికుడు యల్లాప్రగడ సుబ్బారావుకి, జాతీయ జెండా శిల్పి పింగళి వెంకయ్యకి సముచిత స్థానం కల్పించాలి. (వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు) -
పుష్కరాలకు లోటు లేకుండా బస్సులు
తిరుపతి అర్బన్: కృష్ణ పుష్కరాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తని విధంగా బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ నాగశివుడు తెలిపారు. పుష్కరాల స్పెషల్ బస్సును శుక్రవారం ఉదయం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి డిపో గ్యారేజీ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు 420 బస్సులను నడిపితే, ఈసారి కృష్ణ పుష్కరాలకు 500కు పైగా బస్సులను నడపాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా పుష్కర యాత్రికులకు సేవ చేయడమే ప్రధాన ధ్యేయంగా బస్సులను నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి రోజుకు 40 నుంచి 50 బస్సుల వరకు పుష్కరాలకు నడపాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా యాత్రికులు గ్రూప్గా వెళ్లాలనుకుంటే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ చంద్రశేఖర్, డిపో మేనేజర్ విశ్వనాథ్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ భాస్కర్రెడ్డి, ఆర్టీసీ పీఆర్వో కృష్ణారెడ్డి, గ్యారేజీ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ దేవాలయాలకు అన్యాయం
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యం చేశారు: సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని దేవాలయాలు, వాటి విశిష్టతను అప్పటి పాలకులు కనుమరుగు చేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. పుష్కరాలకు సైతం ప్రాధాన్యం లేకుండా చేశారని, అప్పుడు జరిగిన అన్యాయాన్ని తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సరిదిద్దుతోందని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా గొందిమళ్లలో కృష్ణా పుష్కరాలను సీఎం అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అలంపూర్లోని హరిత అతిథి భవనంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఏకైక శక్తిపీఠమైన జోగుళాంబ దేవాలయాన్ని తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుందన్నారు. జోగుళాంబ దేవాలయ విస్తరణకు కొన్ని ఆటంకాలు ఉన్నాయని, వాటిపై కేంద్రంతో మాట్లాడి ఆలయాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. జోగుళాంబ తల్లి చల్లని ఆశీస్సులతో ప్రత్యేక తెలంగాణ సుసాధ్యమైందన్నారు. ఏటా 5 వేల నుంచి 10 వేల మంది దేవి ఉపాసకులు ఈ ప్రాంతానికి వస్తారని, అందుకు తగినట్లు వసతి సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ్నుంచే పాదయాత్ర ప్రారంభించానని, ఈ ప్రాంత రైతులకు గతంలో జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దేందుకు ఆర్డీఎస్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. కాగా అలంపూర్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ సీఎంను కలసి వినతిపత్రం సమర్పించారు. అలంపూర్పై వరాల జల్లు అలంపూర్కు తక్షణం 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రెండ్రోజుల్లో దీనిపై విధి విధానాలు ఖరారు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంపత్కుమార్ కోరగా.. ఆర్టీసీ ఇప్పటికే రూ.200 కోట్ల నష్టంలో ఉందని, కొత్త డిపోపై హామీ ఇవ్వలేనన్నారు. కంట్రోలింగ్ పాయింట్ లేదా మినీ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్లో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటును పరిశీలిస్తామన్నారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, జనార్దన్రెడ్డి, అంజయ్య యాదవ్, బాల్రాజు, మాజీ ఎంపీ మందా జగన్నాథం, టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ రాములు ఉన్నారు. -
నగరం నుంచి పుష్కర ప్రయాణం
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలకు సిటీవాసులు భారీగా తరలి వెళ్తున్నారు. వరుస సెలవులతో శుక్రవారం బస్సులు, రైళ్లు కిక్కిరిసాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి నగరవాసులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. విజయవాడకు వెళ్లే బస్సులు సైతం కిటకిటలాడాయి. ప్రతి రోజు నగరం నుంచి బయలుదేరే 93 రెగ్యులర్ బస్సులతో పాటు మరో 130 బస్సులను అదనంగా నడిపారు. మరోవైపు బీచుపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఘాట్లకు సైతం భక్తులు తరలి వెళ్లారు. జంటనగరాల నుంచి ప్రతి రోజు సుమారు 40 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి విజయవాడ, కాకినాడ, గద్వాల్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ మీదుగా వెళ్లే అన్ని రైళ్లలోనూ శుక్రవారం భారీ రద్దీ కనిపించింది. సికింద్రాబాద్ స్టేషన్లో వేలాది మంది ప్రయాణికులు రైళ్ల కోసం పడిగాపులు కాశారు. రిజర్వుడ్ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్ బోగీల్లో బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో నిండిపోయాయి. పుష్కర స్పెషల్ రైళ్లకు మల్కాజిగిరి రైల్వేస్టేషన్లో సబర్బన్ ట్రైన్ అండ్ బస్ ట్రావెలర్స్ అసోసియేషన్ వారు స్వాగతం పలికారు. అనంతరం భక్తులు సంతోషంగా పుష్కర స్నానాలు ఆచరించి రావాలని కోరుతూ వీడ్కోలు చెప్పారు. 250 ప్రత్యేక బస్సులు ... రైళ్లతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లోనూ జనం తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 130 ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. శ్రీశైలం,నాగార్జునసాగర్, బీచుపల్లి, వాడపల్లి, తదితర ప్రాంతాలకు మరో 120 బస్సులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాలకు రెగ్యులర్గా రాకపోకలు సాగించే 1500 ఎక్స్ప్రెస్, సూపర్లగ్జరీ , ఏసీ బస్సులకు ఇవి అదనం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు తాము ఆశించిన స్థాయి రద్దీ కనిపించలేదని, విజయవాడ వైపు వెళ్లిన ప్రయాణికుల్లో ఎక్కువ శాతం వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని వెళ్లిన వాళ్లేనని, పుష్కరాల రద్దీ మొదటి రోజు సాధారణంగానే ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ‘పుష్కర’ యాప్స్... గాజులరామారం: పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం గూగూల్ ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్లో పుష్కర్ ఘాట్స్కు ఎలా వెళ్లాలో తెలిపే రూట్ మ్యాప్స్ చక్కగా రూపొందించారు. ఆయా ఘాట్ల వద్ద పార్కింగ్ స్థలాల వివరాలు, అత్యవసర సమయాలలో చేయాల్సిన నంబర్లకు ఒన్టచ్ బటన్ల సదుపాయం తదితరాలు వివరంగా ఉన్నాయి. టీఎస్ కృష్ణ పుష్కరాలు 2016 ఈ యాప్ను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందిం చారు. దీన్ని గూగూల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొవచ్చు. అనంతరం స్క్రీన్పై ‘చెక్ వాటర్ క్వాలిటీ ఆఫ్ పుష్కర్ ఘాట్స్’ ఆప్షన్పై క్లిక్ చేయాలి. తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పుష్కర ఘాట్ల లొకేషన్లు మ్యాప్లో కనిపిస్తాయి. ఇక్కడ మనం ఎక్కడ సెలక్ట్ చేస్తే అక్కడ స్క్రీన్పై అదేరోజుకు సంబంధించిన వాటర్ రిపోర్ట్ ప్రత్యక్షమవుతుంది. ఎంబీఎన్ఆర్ కృష్ణ పుష్కరాలు 2016 మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పుష్కర ఘాట్ల పూర్తి వివరాలు ఈ యాప్లో పొందుపర్చారు. ఘాట్ ఆప్షన్స్కు వెళ్లి మనకు కావాల్సిన ఘాట్ బటన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఘాట్ లొకేషన్ రూట్, అక్కడ దర్శనీయ స్థలాలు, సౌకర్యాలు, హోటల్స్, వాతావరణం వివరాలు తెలుస్తాయి. అదేవిదంగా ఈ యాప్లో ఎస్ఓఎస్ ఆప్షన్ ఉన్నది. ప్రమాదకర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్లో పోలీస్, మెడికల్, మహబూబ్నగర్ కంట్రోల్ రూం నంబర్ బటన్లు ఉంటాయి. అనౌన్స్మెంట్ ఆప్షన్లో ఘాట్ల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. ‘కృష్ణా’ బాటిళ్లకు భలే డిమాండ్ సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ‘కృష్ణా పుష్కర జలం‘ బాటిళ్లకు డిమాండ్ పెరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి నుంచి సైతం అనూహ్య స్పందన లభించింది. మొత్తం మీద పోస్టల్ శాఖ నిర్దేశించిన లక్ష్యానికి మించి బాటిల్స్ కోసం ఆర్డర్లు బుక్ అయ్యాయి. గోదావరి పుష్కరాల్లో ‘గాడ్ జల్’ పేరిట కోటి రూపాయల మేర ఆదాయాన్ని గడించిన స్ఫూర్తితో కృష్ణా పుష్కర జలాలను కూడా పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్నారు. తెలంగాణ, ఏపీ సర్కిల్స్లో కలిపి సుమారు మూడున్నర లక్షల బాటిళ్లు విక్రయించేందుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఒక్కో బాటిల్ (అర లీటర్) ధర రూ.30 గా నిర్ణయించి, దీని కోసం జూలై మొదటి వారం నుంచి ఈ నెల 5 వ తేదీ వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ బుకింగ్ ద్వారా ఆర్డర్లు స్వీకరించింది. 3.91 లక్షల బాటిల్స్కు డిమాండ్ పోస్టల్ శాఖకు కృష్ణా పుష్కర జలం సరఫరా కోసం లక్ష్యాన్ని మించి 3.91 లక్షలకు పైగా బాటిల్స్కు ఆర్డర్లు వచ్చాయి. విజయవాడ రీజియన్లో 1.72 లక్షల బాటిల్స్, విశాఖపట్నం రీజియన్లో 92 వేల బాటిల్స్, కర్నూల్లో 6,300, హైదరాబాద్ రీజియన్లో 32,786, హైదరాబాద్ సిటీలో మూడు వేల బాటిల్స్ సరఫరా కోసం ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి. -
కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు. -
18న వైఎస్ జగన్ పుష్కర స్నానం
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పుష్కరాల బస్సులు ఇక్కడి వరకే
కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ఉంచే ప్రాంతాలపై అధికారులు వివరంగా ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 12 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు తెలిపారు. బస్సులు ఆపే ప్రాంతాలు హైదరాబాద్ రూటు నుంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతిస్తారు ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతినిచ్చారు తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు చేశారు విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేస్తారు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేస్తారు మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఆపేస్తారు తిరుపతి నుంచి ఆ మార్గంలో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర స్పెషల్ షటిల్ సర్వీసులుంటాయి రైళ్లు నిలిపే ప్రాంతాలు హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతిస్తారు విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో ఆపేయాలి గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతిస్తారు. అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు -
'ప్రభుత్వ ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయి'
గుంటూరు : నదిని కాలుష్యం చేయకుండా స్నానాలు చేయాలని భక్తులకు చిన్నజియర్ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లి సమీపంలోని కృష్ణానదిలో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం చిన్నజియర్స్వామి మాట్లాడుతూ... ఇప్పటికే మన చర్యల వల్ల నదికీ తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. పుష్కరాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు సంతృప్తిగా ఉన్నాయని చిన్నజియర్ స్వామి తెలిపారు. తాడేపల్లిలోని ఘాట్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు పుణ్యస్నానం ఆచరించారు.