
∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల
పెనుగొండ: స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లోని చలువ పందిరిలో కొలువైన గణపతికి మంగళవారం రూ.27 లక్షల నోట్లతో రూపొందించిన మాలను అలంకరించారు. రెడ్డియ్య దంపతులు పూజలు చేసి ఈ నోట్ల కట్టలను మాలగా స్వామిమెడలో వేశారు. పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు