penugonda
-
పెనుగొండ.. మట్టి నుంచి ఎదిగిన మాణిక్యం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు.గుంటూరులో న్యాయవాదిగా పని చేస్తూ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారని, ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సాహితీ విమర్శ కేటగిరీలో తన రచనకు జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకోవడం స్ఫూర్తిదాయకమని జగన్ అన్నారు.1972లో సమిథ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించిన లక్ష్మీనారాయణ మట్టి నుంచి ఎదిగిన మాణిక్యంగా ప్రశంసించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కించుకున్న లక్ష్మీనారాయణకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తన సందేశంలో జగన్ పేర్కొన్నారు.పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన ప్రస్తుతం గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది.. అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. -
చిలుకలన్నీ కలిసి పాము పై దాడి..
-
Miss India USA 2022: మిస్ ఇండియా యూఎస్–2022 రన్నరప్గా సంజన
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ): అమెరికా న్యూజెర్సీలో జరిగిన మిస్ ఇండియా యూఎస్–2022 పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రుకు చెందిన చేకూరి సంజన రెండో రన్నరప్గా నిలిచింది. బుధవారం రాత్రి విజేతలను ప్రకటించగా, ఆ వివరాలను శుక్రవారం పెనుగొండ మండల సర్పంచ్ల చాంబర్ అధ్యక్షురాలు దండు పద్మావతి మీడియాకు వెల్లడించారు. తన సోదరుడు చేకూరి రంగరాజు, మధు దంపతుల కుమార్తె అయిన సంజన ఎంఎస్ చదువుతూ పోటీల్లో పాల్గొందని, గత 20 ఏళ్లుగా వారు అమెరికాలో ఉంటున్నట్టు తెలిపారు. (క్లిక్: ఆర్య వల్వేకర్... మిస్ ఇండియా–యూఎస్ఏ) చదవండి: (Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త) -
ప్రగతి పధంలో పెనుకొండ..
-
చంద్రబాబు పాలనలో ప్రజలు కష్టాలు చూశారు
-
ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది. ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. ఇలసలను పులసలుగా.. పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు. -
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, అనంతపురం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యవకులు, ఇద్దరు యువతులు ఉన్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. చదవండి: ఆన్లైన్ పాఠాల పేరుతో.. అశ్లీల చిత్రాలు.. ఏసీబీకి చిక్కిన సీనియర్ ఆడిటర్ -
యమ డిమాండ్.. ఓ సారి టేస్ట్ చూడండి
పెనుగొండ పేరు చెబితే వెంటనే గుర్తొకొచ్చేది వాసవీమాత ఆలయం. దాంతోపాటే ఈ ఊరుకు మరో ‘తీపి గుర్తు’ ఉంది. అదే నోరూరించే కమ్మని కజ్జికాయ. ఇక్కడ తయారయ్యే ఈ స్వీటుకు ఖండాంతరఖ్యాతి దక్కింది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే కజ్జికాయను మళ్లీమళ్లీ తినాలని తపించని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. పెనుగొండ: బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూత రేకులు.. వీటి కోవలోకే వెళ్తుంది పెనుగొండ కజ్జికాయ కూడా. కొబ్బరి కోరుతో తయారయ్యే ఈ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. తొలుత ఓ సామాన్య వ్యాపారి తయారు చేసిన ఈ తీపి పదార్థం ఇప్పుడు గొప్పింటి వివాహ వేడుకల్లో సందడి చేస్తోంది. రాజకీయ పారీ్టల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు సంపాదించి ఔరా అనిపిస్తోంది. విదేశాలకు రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. ఈ ప్రాంత వాసులు బంధువులకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. అంతలా జనజీవితంలో భాగమైపోయింది ఈ స్వీటు. దీనిని చూడగానే హహ్హహ్హ కజ్జికాయ.. నాకే ముందు అంటూ ఎగబడని భోజనప్రియులు ఉండరు. (చదవండి: కడలిపై.. హాయి హాయిగా..) ఇతర ప్రాంతాలకూ విస్తరణ ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల్లోనూ పెనుగొండ వారి కజ్జికాయ అంటూ స్వీటు దుకాణాలు విరివిగా వెలుస్తున్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తణుకు లాంటి ప్రాంతాల్లో సంప్రదాయ స్వీటు దుకాణాల్లో పెనుగొండ వారి కజ్జికాయ అంటూ ప్రతేక ఆకర్షణతో అమ్మకాలు సాగిస్తున్నారు. వీరిలో కొంతమంది నిత్యం పెనుగొండ నుంచే తీసుకొని వెళ్లి అమ్ముతున్నారు. 45 ఏళ్లకు పైగా.. పెనుగొండ కజ్జికాయకు నలభై ఐదేళ్లకుపైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీటు పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేకంగా తయారు చేసి పేరు సంపాదించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు తర్వాత ఆయన కుమారులు కజ్జికాయకు మరింత వన్నె తెచ్చారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే చేసే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రైఫ్రూట్స్ను మిళితం చేసి మరింత రుచిగా, సుచిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు కజ్జికాయను కనీసం కేజీ తీసుకోవాలన్నా ముందుగా ఆర్డరు చేసుకోవలసిందే. అంతటి యమ డిమాండ్ మరి..! మీరూ ఓ సారి టేస్ట్ చూడండి.. -
ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన హెచ్ఎం
సాక్షి, పశ్చిమ గోదావరి : రెవెన్యూ, ఇతర శాఖల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సంఘటనలు చాలానే చూశాం. కానీ విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలంలోని జెడ్ఎన్వీఆర్ హైస్కూల్లో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. జె. శ్రీనివాస్ జెడ్వీఎన్ఆర్ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు. పెనుగొండకు చెందిన పూర్వకాలం విద్యార్థి ఎన్.సూర్యప్రకాశ్ తన పదో తరగతి సర్టిఫికెట్ పోవడంతో హెచ్ఎం శ్రీనివాస్ వద్ద దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ సూర్యప్రకాశ్ను రూ.10వేలు లంచం అడిగాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన సూర్యప్రకాశ్ లంచం విషయం వారికి వివరించాడు. అధికారులతో కలిసి స్కూల్కు వెళ్లిన సూర్యప్రకాశ్ రూ. 10వేలు శ్రీనివాస్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. హెచ్ ఎం జే. శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. -
పెనుగొండ మాజీ ఎమ్మెల్మే చినబాబు మృతి
పెనుగొండ(ప.గో): పెనుగొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కూనపరెడ్డి రాఘవేంద్రరావు (చినబాబు) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చినబాబు గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పెనుగొండలో విషాదఛాయలు అలుముకున్నాయి. చినబాబు ఇక లేరన్న వార్తతో పార్టీ కార్యకర్తల్లో తీవ్ర విషాదం నింపింది. 1999లో పెనుగొండ అసెంబ్లీ నుంచి స్వతంత్య అభ్యర్థిగా చినబాబు గెలిచారు. అనంతరం టీడీపీలో చేరారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరిన చినబాబు.. 2014లో వైఎస్సార్సీపీ పార్టీలో చేరారు. వైఎస్పార్సీపీ ఆచంట నియోజవర్గం కన్వీనర్గా చినబాబు పనిచేశారు. కూనపరెడ్డి మృతిపట్ల ఆచంట ఎమ్మెల్యే, మంత్రి శ్రీరంగనాథరాజు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
పెనుగొండ మరోసారి లాక్డౌన్
సాక్షి, పెనుగొండ (పశ్చిమగోదావరి జిల్లా): కోవిడ్–19 విజృంభణ అధికం కావటంతో అధికారులు, ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రెండు రోజుల్లో 20 మందికి పైగా కరోనా సోకడంతో ఉలిక్కిపడుతున్నారు. అదుపులోకి వచ్చిందనుకున్న పరిస్థితి తారుమారు కావడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 19న కంటైన్మెంట్ జోన్ ఎత్తివేయడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఒకేసారి అధిక సంఖ్యలో కోవిడ్–19 కేసులు నమోదు కావడంతో పెనుగొండను మరోసారి లాక్డౌన్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా ఆచంట మండలంలోనూ కేసులు పెరగడంతో అధికారులు కట్టుదిట్టం చేయడం ప్రారంభించారు. పెనుగొండలో గురువారం రాత్రి 12 మందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హుటాహుటిన తాడేపల్లిగూడెం కోవిడ్ కేర్ సెంటర్కు తరలించారు. ఆచంట మండలంలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. వల్లూరులో నలుగురికి కరోనా సోకింది. అయోధ్యలంకలో ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి నిషేధాజ్ఞలు జారీ చేశారు. (విషాదం: కొడుకు బిగ్గరగా అరిచి చెప్పడంతో..) పెనుగొండలో కట్టుదిట్టం పెనుగొండలో మరోసారి కరోనా విలయతాండవం చేయడంతో లాక్డౌన్కు అధికారులు సన్నాహాలు చేశారు. ఇప్పటివరకూ ఉదయం 11 గంటల వరకూ దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఒకేసారి 12 కేసులు నమోదు కావడంతో దుకాణాలు పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ రోడ్లుపైకి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెనుగొండలో ఆదివారం కర్ఫ్యూ స్థాయిలో కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ప్రతి బుధవారం కర్ఫ్యూ విధించటానికి సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో కూరగాయలు, నిత్యావసర వస్తువులు ఉదయం 10 గంటల వరకూ ఇళ్లకే పంపిస్తామని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం సీఐ పి.సునిల్కుమార్, ఎస్సై పి.నాగరాజు, తహసీల్దారు వై.రవికుమార్, ఎంపీడీఓ కె.పురుషోత్తమరావు పెనుగొండ ప్రధాన విధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..) -
పెనుగొండలో మళ్లీ లాక్డౌన్
సాక్షి, పెనుగొండ: కరోనా విలయతాండవం చేస్తుండటంతో పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికారులు మళ్లీ లాక్డౌన్ పెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుంచి లాక్డౌన్ ప్రారంభించారు. ఏప్రిల్ 1న ప్రారంభమైన రెడ్ జోన్ జూన్ మొదటి వారం వరకూ కొనసాగింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పెనుగొండలో నిషేధాజ్ఞలు తొలగించారు. అయితే చెరుకువాడలో కోయంబేడు కాంటాక్టుతో ప్రారంభమైన కరోనా వ్యాప్తి ఏకంగా 25 కేసులు దాటేసాయి. ఆదివారం నాటికి కొందరు ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి కాగా, చెరుకువాడలో ప్రస్తుతానికి 19 యాక్టివ్ కేసులున్నాయి. దీనికి తోడు ఆచంట నియోజవర్గంలోని పోడూరు, పాలకొల్లు నియోజకవర్గం పరిధిలోని పోడూరు మండలంలోని జిన్నూరులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో పెనుగొండ–నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధించి ఆచంట, వీరవాసరం మీదుగా ట్రాఫిక్ మళ్లించారు. (ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు) నరసాపురం రహదారిలో రాకపోకలు నిషేధిస్తూ మార్టేరులో ఏర్పాటు చేసిన బారికేడ్లు ఇదిలా ఉండగా చెరుకువాడలోనూ కరోనా కట్టడికి కఠిన నిషేధాజ్ఞలు అమలు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు, సంబంధిత అధికారులు పెనుగొండ, చెరుకువాడను పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 10 రోజులుగా చెరుకువాడకే పరిమితం చేసిన కంటైన్మెంట్ పరిధిని కిలోమీటరుకు పెంచడంతో పెనుగొండ, చెరుకువాడ పూర్తిగా నిషేధాజ్ఞల ప్రాంతంలోకి వచ్చాయి. దీంతో ఉదయం కేవలం రెండు గంటల పాటు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు అధికారులు అవకాశం కల్పించారు. రెండు గంటల సమయంలోనూ ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే మరింత కఠినంగా అమలుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిషేధాజ్ఞలతో పాటు రెండు ప్రాంతాల్లోని కల్యాణ మండపాలు, కమ్యూనిటీ భవనాలను అధికారులు పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్నారు. అధికారులకు తెలియకుండా కొందరు ఫంక్షన్లు నిర్వహిస్తున్నారన్న సమాచారం ఉండడంతో ఇబ్బందులెదురయ్యే అవకాశాల కారణంగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చెరుకువాడలోని ప్రజలు 80 రోజులకుపైగాను, పెనుగొండలో ప్రజలు సుమారు 65 రోజులపాటు కంటైన్మెంట్లో మగ్గిపోయారు. మళ్లీ కంటైన్మెంట్ ప్రారంభం కావడంతో మరికొంత కాలం మగ్గిపోవలసి వస్తుంది. దీంతో ప్రజలు ఎవరికి వారు అప్రమత్తం అవుతున్నారు. మట్టపర్రు రోడ్డు వద్ద పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేను మూసివేసిన దృశ్యం జిన్నూరులో మరో 8 కరోనా కేసులు 38కి చేరిన మొత్తం కేసుల సంఖ్య పోడూరు: కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న జిన్నూరు గ్రామంలో ఆదివారం మరో 8 కేసులు నమోదైనట్లు కమ్యునిటీ హెల్త్ ఆఫీసర్ సీహెచ్ దేవదాసు తెలిపారు. దీంతో గ్రామంలో కేసుల సంఖ్య 38 పెరిగింది. కొత్తగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురికి, మరో వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. జిన్నూరులో కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిన్నూరులో కరోనా ప్రభావంతో ఇప్పటికే పాలకొల్లు–మార్టేరు స్టేట్ హైవేపై రాకపోకలు నిషేధించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జిన్నూరు నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, బయట వ్యక్తులు గ్రామంలోకి రాకుండా అన్నిదారులూ మూసివేశారు. ఎంపీడీఓ కె.కన్నమనాయుడు, తహసీల్దార్ పి.ప్రతాప్రెడ్డి, గ్రామస్థాయి అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. (రూ.350కే కరోనా పరీక్షలు!) -
కరోనా: పెనుగొండలో నిషేధాజ్ఞలు
సాక్షి, పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో అధికంగా కరోనా విలయతాండవం చేస్తుండడంతో కఠిన నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. పెనుగొండలో మసీదు వీధి, ఉర్రేంకుల వారి వీధి, కొండపల్లివారి వీధిలో ఐదుగురు వ్యక్తులకు కరోనా సోకడంతో వీటి పరిధిలో 820 మీటర్ల మేర అత్యంత ప్రమాదకరమైన జోన్గా ప్రకటించారు. ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టం చేశారు. పెనుగొండ పంచాయతీలో కాల్సెంటర్ 08819–246081 నంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబరుకు ఫోన్ చేస్తే అత్యవసరమైన నిత్యావసరాలు, మందులు వారి చెంతకే అందేవిధంగా ఏర్పాటు చేశారు. వీటికి నగదు చెల్లించాలి. డ్రోన్లతో పర్యవేక్షణ పోలీసులు రక్షణ దుస్తులు ధరించి నిత్యం పర్యవేక్షణ చేస్తూ డ్రోన్లతో చిత్రీకరిస్తున్నారు. ఎవరైనా డ్రోన్లకు చిక్కితే కేసులు నమోదు చేయనున్నారు. ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు. ప్రజలు సహకరించాలి: మంత్రి పెనుగొండ: పెనుగొండ కరోనాకు నెలవుగా మారడంతో వ్యాప్తి నిరోధానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విజ్ఞప్తిచేశారు. కరోనా నిరోధానికి పెనుగొండలో తీసుకొంటున్న చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకూ 250 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వివరించారు. పెనుగొండలోని మూడు ప్రమాదకర ప్రాంతాలను కలిపి రెడ్జోన్గా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రాకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రానివ్వొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే మూడో విడత ఆరోగ్య సర్వే ప్రారంభమైందన్నారు. ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సత్వరం ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలన్నారు. చదవండి: కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్ -
కరోనా: వచ్చే నెల 4 వరకు పెనుగొండ సీల్
సాక్షి, పెనుగొండ: కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో పెనుగొండను వచ్చేనెల 4వ తేదీ వరకు సీల్ చేయాలని అధికారులు నిర్ణయించారు. గురువారం ఆర్డీఓ అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. కరోనా రెండో దశకు చేరడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే విపరీత పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావించారు. ఇందుకు అనుగుణంగా పెనుగొండ పరిసర ప్రాంతాలను మూడు జోన్లుగా విభజించారు. కరోనా సోకిన ప్రాంతం నుంచి 820 మీటర్ల రేడియస్ను డేంజర్ జోన్గా, మూడు కిలోమీటర్ల రేడియస్ను రెడ్ జోన్గా, 5 కిలోమీటర్ల రేడియస్ను ఆరంజ్ బఫర్ జోన్లుగా విభజించారు. డేంజర్ జోన్లో ఎటువంటి కదలికలు ఉండకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులు నిర్ణయించారు. నిత్యావసర వస్తువులు, కూరగాయలను వలంటీర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఇళ్లకే అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ జోన్, ఆరంజ్ బఫర్ జోన్లలో నిత్యం ఆరోగ్య సర్వే చేయించాలని ఆదేశించారు. డేంజర్ జోన్లో ఉన్న సుమారు 200 మంది శ్యాంపిల్స్ సేకరించి కరోనా పరీక్షలకు పంపించారు. ఆయా రిపోర్టులు వచ్చినా వచ్చేనెల 4 వరకు ఆ ప్రాంతంలో ప్రజలంతా స్వీయ నిర్బంధంలోనే ఉండాలని వైద్యులు సూచించారు. దీంతో పెనుగొండ మొత్తం హైఅలర్ట్ ప్రకటించారు. -
పెళ్లికి నిరాకరించిందని దాడి!
సాక్షి, పశ్చిమగోదావరి(పెనుగొండ) : పెళ్లికి నిరాకరించడంతో యువతిపై చాకుతో దాడి చేసి ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం మార్టేరుకు చెదిన గ్రంధి మణికుమార్(28), రామోజు శాంతకుమారి(22) మార్టేరులోని ఒక ప్రైవేటు షాపులో పనిచేసేవారు. మణికుమార్ ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధించేవాడు. ఇందుకు శాంతకుమారి నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం పెనుగొండ గాంధీ బొమ్మల సెంటరుకు పనిమీద వచ్చిన యువతిపై మణికుమార్ చాకుతో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి స్వల్ప గాయం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆమెపై దాడికి పాల్పడిన మణికుమార్ అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రిలో మణికుమార్ కోలుకుంటున్నాడు. యువతి ఫిర్యాదు మేరకు పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెనుగొండ వాసవీ శాంతి ధాంలో చోరీ
సాక్షి, పెనుగొండ : ప్రసిద్ధిగాంచిన పెనుగొండ వాసవీ శాంతి ధాంలో వాసవీమాత అభిషేక విగ్రహం అపహరణకు గురైంది. శనివారం ఉద యం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వచ్చిన అర్చకులు మరకిత వాసవీ మాత విగ్రహం పాదాల వద్ద ఉండే పంచలోహ విగ్రహం కనిపించకపోవడంతో శాంతి ధాం నిర్వాహకులకు సమాచారం అందించాం. సుమారు 1.5 అడుగుల పంచలోహ విగ్రహంతో పాటు 6 అం గుళాల ఇత్తడి వినాయకుని విగ్రహం, మరకిత శిల విగ్రహంలో అలంకరించిన రోల్డ్గోల్డ్ ఆభరణాలు మాయమైనట్టు నిర్వాహకులు గుర్తిం చారు. ఈమేరకు పెనుగొండ పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీంతో పెనుగొండ ఎస్సై పి.నాగరాజు ఆధ్వర్యంలో క్లూస్ టీం, జాగిలంతో పో లీసులు రంగ ప్రవేశం చేసి ఆధారాలు సేకరించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే విగ్రహం చోరీకి గురైందని పోలీసులు భావిస్తున్నారు. వాసవీ శాంతి ధాంకు నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని గుర్తించారు. బంగారు విగ్రహం అంటూ వదంతులు ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం, బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయంటూ వదంతులు రావడంతో పెనుగొండ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే, వాసవీ మాత ఆలయంలో అమ్మవారికి పవిత్ర దినాల్లో మాత్రమే బంగారు ఆభరణాలను అలంకరిస్తుంటారు. అంతేగాకుండా, ఆలయంలో బంగారు వాసవీ మాత విగ్రహం ఇప్పటివరకూ తయారు చేయలేదని సమాచారం. 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహానికి బంగారు పూత మాత్రమే పూయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ధామంలో బంగారు విగ్రహాలు లేవని నిర్వహకులు తెలిపారు. ఆభరణాలు సురక్షితంగా లాకర్లలో ఉంచుతారని స మాచారం. దీంతో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొన్నారు. నా నాటికీ పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని వాసవీ శాంతి ధాంలో విలువైన వస్తువులు ఉండటం వలన భద్రతపై దృష్టి సారిం చాలంటూ పలువురు సూచిస్తున్నారు. -
కూతురు.. అల్లుడు.. ఓ సవిత!
సాక్షి, పెనుకొండ/అనంతపురం టౌన్: ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా పెనుకొండ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి కుటుంబ పాలన ముసుగులో ప్రకృతి సంపదను అడ్డంగా దోచేశారు. ప్రజలకు చేసింది శూన్యం కాగా.. అల్లుడు, కూతురు, బంధువుల పేరిట సాగించిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు మెటల్ క్వారీల లీజు పేరుతో చేసిన దందా చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలు పిండి చేశారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అక్రమ మార్గంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారు. సోమందేపల్లి మండలం గూడిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 64లో నాలుగు హెక్టార్ల స్థలంలో క్వారీకి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి కుమార్తె బీకే రోజా పేరిట 2015 జూలై 4న లీజుకు తీసుకున్నారు. అయితే ఇక్కడ క్వారీకి పర్యావరణ అనుమతుల్లేవు. అయినప్పటికీ నాలుగేళ్లుగా అక్రమ తవ్వకం కొనసాగుతోంది. బీకే పార్థసారధి అప్పట్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోయారు. 2016 నుంచి ఇప్పటి వరకు ఈ క్వారీకి సంబంధించి 20వేల క్యూబిక్ మీటర్లకు మాత్రమే రాయల్టీ చెల్లించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సుమారు 2లక్షల క్యూబిక్ మీటర్లకు పైనే తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. రొద్దం మండలం కొగిరి గ్రామంలోని 454, 456–2 సర్వే నెంబర్లలో బీకే సాయి కన్స్ట్రక్షన్స్ పేరిట ఐదు హెక్టార్ల రోడ్డు మెటల్ క్వారీ నిర్వహణకు బీకే పార్థసారధి అల్లుడు పి.శశిభూషణ్ అనుమతి తీసుకున్నారు. ఈ క్వారీకి నిబంధనల మేరకు అన్ని అనుమతులు ఉన్నాయి. అయితే దీనికి తోడు అదే గ్రామ సర్వే నంబర్ 456లో 2017లో వెయ్యి క్యూబిక్ మీటర్లకు మాత్రమే తాత్కాలిక పర్మిట్ పొంది తవ్వకాలు చేపట్టారు. ఇక్కడ సైతం తాత్కాలిక పర్మిట్ పొందేందుకు భూగర్భ గనుల శాఖ అధికారులపై పూర్తిస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముసుగులో కొన్ని వేల క్యూబిక్ మీటర్లను అక్రమంగా తవ్వేశారు. కియా పరిశ్రమ పక్కన తాత్కాలిక పర్మిట్లతో ఎస్.సవిత పేరిట నిర్వహిస్తున్న క్వారీ పెనుకొండ మండలం మునిమడుగు సర్వేనంబర్ 152లో నిర్వహిస్తున్న ఈ రోడ్డు మెటల్ క్వారీ కియా పరిశ్రమ పక్కనే ఉంది. నిబంధనల మేరకు పరిశ్రమలు ఉన్న ప్రాంతానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటికే అనుమతి ఇవ్వాలి.అయితే మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి అండదండలతో కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి మూడు తాత్కాలిక పర్మిట్లు పొందారు. పర్మిట్లను మించి ఇప్పటికే 80వేల క్యూబిక్ మీటర్ల తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రతీ క్వారీకి తాత్కాలిక పర్మిట్లను పొందారు. పార్థసారధి కూతురు రోజా పేరిట నిర్వహిస్తున్న క్వారీకి అసలు అనుమతులే లేకపోవడం గమనార్హం. కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్.సవితమ్మ పేరిట ఓ క్వారీ లీజుకు తీసుకోగా.. కియా పరిశ్రమ సమీపంలో మూడు తాత్కాలిక పర్మిట్లతో పెద్ద ఎత్తున కొండలను పిండి చేస్తున్నారు. నిబంధనల మేరకు లీజు ఒక చోట తీసుకోవడం, తవ్వకాలు మరో చోట చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ప్రభుత్వం మారినా ఆ ప్రాంతంలో ఇప్పటికీ దందా కొనసాగుతోంది. గనుల శాఖ నిబంధనల మేరకు క్వారీలకు ఎలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక పర్మిట్లను ఇవ్వరాదు. క్వారీలకు లీజు ఇవ్వాలంటే పర్యావరణ అనుమతులతో పాటు కాలుష్య నియంత్రణ మండలి అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కావడంతో బీకే పార్థసారధి నాకేంటి అడ్డు అన్నట్లుగా వ్యవహరించారు. అధికారులను భయభ్రాంతులకు గురిచేసి తాత్కాలిక పర్మిట్ల ముసుగులో దోపిడీ అత్యవసర ప్రభుత్వ పనులకు మాత్రమే తాత్కాలిక పర్మిట్లను జారీ చేస్తారు. ఈ ముసుగులో బీకే కుటుంబ సభ్యులు దోరికినంతా దోచేశారు. ఎస్.సవితమ్మ 80వేల క్యూబిక్ మీటర్లకు తాత్కాలిక పర్మిట్లు తీసుకొని దాదాపు రూ.20కోట్లకు పైగా విలువ చేసే రోడ్డు మెటల్ను తవ్వేశారు. 2015నుంచి నేటి వరకు ప్రతి క్వారీలోను అక్రమంగా తవ్వాలు చేపట్టినా గనులశాఖ అధికారులు చుట్టపు చూపుగా కూడా పరిశీలించలేదంటే ఏస్థాయిలో బీకే పార్థసారధి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో అర్థమవుతోంది. వీరి కనుసన్నల్లో నడుస్తున్న ఏ ఒక్క క్వారీని కనీసం తనిఖీ చేసే సాహసం కూడా అధికారులు చేయలేకపోయారు. వారు చెల్లించిందే రాయల్టీ అనే రీతిన క్వారీలను నిర్వహిస్తున్నారు. బీకే పార్థసారధి కుటుంబ సభ్యుల కనుసన్నల్లో నిర్వహిస్తున్న క్వారీలపై అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. -
శంకరనారాయణ అనే నేను..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్నారాయణకు చోటు దక్కింది. రాజధాని అమరావతిలో నేడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లాకు దక్కిన ఒకే మంత్రి పదవిని బీసీలకు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. దీంతో పాటు శంకర్నారాయణను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని 2014లో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చినట్లయింది. శంకర్నారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా దాదాపు ఏడేళ్లు పనిచేశారు. ఆ తర్వాత హిందూపురంపార్లమెంట్ అధ్యక్షుడిగా సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైఎస్సార్సీపీ తరఫున బరిలోకి దిగారు. 17,415 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్థసారథికి 79, 793 ఓట్లు పోలైతే, శంకర్నారాయణకు 62,378 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పెనుకొండ బరిలో నిలిచి 16,494 ఓట్లు సాధించారు. అప్పట్లో రఘువీరా బరిలో లేకపోతే శంకర్నారాయణ గెలిచే వారనే చర్చ నడిచింది. ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,058 ఓట్లతో శంకరనారాయణ విజయం సాధించారు. సౌమ్యుడిగా, చిన్నా పెద్ద తేడా లేకుండా కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది. ‘అనంత’లో బీసీలకు పెద్దపీట: అనంతపురం జిల్లాలో బీసీలకు జగన్మోహన్రెడ్డి మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నేత పైలా నర్సింహయ్యను మొదట కొనసాగించారు. తర్వాత శంకరనారాయణకు సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, అనంతపురం రెండు ఎంపీ స్థానాల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలుగా గెలిపించారు. దీంతో పాటు పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్లను శంకర్నారాయణ, ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్రారెడ్డిలకు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీ కోటాలో శంకర్నారాయణకు చోటు కల్పించారు. జిల్లాలో బోయ, కురుబతో పాటు బీసీలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. దీంతో జిల్లాలో బీసీలకు వైఎస్సార్సీపీ పెద్దపీట వేసినట్లయింది. మంత్రివర్గంలో కూడా అత్యధికంగా బీసీలకు చోటు కల్పించారు. వైఎస్సార్సీపీ తీసుకున్న నిర్ణయాల పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 23ఏళ్ల తర్వాత పెనుకొండకు మంత్రి పదవి పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గానికి 23 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి లభించింది. 1996లో అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1987–89 మధ్యకాలంలో ఎస్.రామచంద్రారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత బీకే పార్థసారథిపై వైఎస్సార్సీపీ తరపున గెలుపొందిన మాలగుండ్ల శంకర్నారాయణను మంత్రి పదవి వరించింది. బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తా నాకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలకు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, అండగా నిలిచిన తోటి ఎమ్మెల్యేలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా. తోటి ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తా.– శంకర్నారాయణ, మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే ప్రొఫైల్ పేరు: మాలగుండ్ల శంకర నారాయణ విద్యార్హత: బీకాం, ఎల్ఎల్బీ తండ్రి: మాలగుండ్ల వకీలు పెద్దయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్, ధర్మవరం తల్లి: యశోదమ్మ సతీమణి: జయలక్ష్మి సోదరులు : మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున పిల్లలు: మాలగుండ్ల పృద్వీరాజ్, నవ్యకీర్తి రాజకీయ నేపథ్యం 1995లో టీడీపీ జిల్లా కార్యదర్శి 2005లో ధర్మవరం మున్సిపల్ కౌన్సిలర్ 2011లో వైఎస్సార్సీపీలో చేరిక 2012లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి 2019లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,041 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం. -
90 అడుగుల వాసవీ అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతిధాం 102 రుషీగోత్ర స్తంభ మందిరంలో ఏర్పాటు చేసిన 90 అడుగుల శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం వైభవంగా జరిగింది. జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు దంపతులు అమ్మవారి విగ్రహావిష్కరణ చేసి తొలి అభిషేకం చేశారు. వాసవీ శాంతి ధాంలో 700 రోజుల పాటు శ్రమించి 90 అడుగుల వాసవీ మాత పంచలోహ విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు 42 టన్నుల రాగి, 20 టన్నుల జింకు, 1.3 టన్నుల తగరం, 600 కేజీల వెండి, 40 కేజీల బంగారం కలిపి 65 టన్నుల విగ్రహాన్ని తయారు చేశారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11 నుంచి హోమ క్రతువులు, నిత్య కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం 102 ఆర్యవైశ్యుల గోత్రీకులకు చిహ్నంగా 102 స్తంభాల రుషీగోత్ర మందిరాన్ని ప్రారంభించారు. అరుదైన మరకత శిలతో చెక్కించిన 3 అడుగుల మరకత శిలా విగ్రహాన్ని ప్రతిష్టించి అభిషేకాలు నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు ఆధ్వర్యంలో జరిగిన ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవీ కన్యకాపరమేశ్వరి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించడానికి కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్యవైశ్యులు వేలాదిగా తరలి వచ్చారు. -
90 అడుగుల కన్యకా పరమేశ్వరి
హైదరాబాద్: పంచలోహాలతో 90 అడుగుల ఎత్తుతో రూపొందించిన కన్యకా పరమేశ్వరి విగ్రహాన్ని ఫిబ్రవరి 14న పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ క్షేత్రంలో ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ పీఎన్ గోవిందరాజులు, వెండి రథం కమిటీ చైర్మన్ రామ్పండుతో కలసి తమిళనాడు మాజీ గవర్నర్, శ్రీ వాసవీ పెనుగొండ ట్రస్ట్ ప్యాట్రన్ కె.రోశయ్య కార్యక్రమ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ..ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వాసవీ కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపనతో పెను గొండ వీధులు భక్తి పారవశ్యంతో విరాజిల్లనున్నాయన్నారు. పెనుగొండ క్షేత్రంలో గొప్ప కార్యక్రమం జరుగుతుందని, ఆలయ అభివృద్ధి, ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లు కాగా, విగ్రహ ఏర్పాటుకు రూ.17 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. -
సమస్యలపై లోకేష్ను నిలదీసిన గ్రామస్తులు
-
కోడిగుడ్డు సొన, బెల్లం మిశ్రమంలో
పెనుకొండ : రాజరికపు పుటల్లో చెక్కుచెదరని కట్టడాల్లో పెనుకొండ పట్టణంలోని గగన్మహల్ ఓ మధుర జ్ఙాపకంగా నిలిచింది. 14, 15, 16, 17 శతాబ్ధాల్లో ఓ వెలుగు వెలిగిన గగన్మమల్ నేడు మనకు నాటి తీపి గుర్తులను పంచుతోంది. ఇండో పార్సీయన్ ఆకారంలో గార, కోడిగుడ్డు సొన, బెల్లం, ఇసుక గవ్వలు, చలువరాయి మిశ్రమంలో దీన్ని నిర్మించారు. పోర్చుగీసు కాలంలో నిర్మించిన ఈ గగన్మహల్ను అనంతరం 14వ శతాబ్ధంలో మల్లికార్జున రాయలు, వీరవిజయరాయలు, ప్రతాపరుద్ర రాయలు ఎంతో అభివృద్ధి చేశారు. దీన్ని వేసవి విడిదిగా అప్పటి రాజులు వినియోగించే వారు. శత్రుదుర్భేధ్యమైన కట్టడంగా, రాజుల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైభాగంలో పెద్దఎత్తున పహారా కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు. సైనికులు దీనిద్వారా సుదూరం నుంచి వచ్చే శత్రువులను కనిపెట్టే సౌకర్యం ఇందులో ఉండటం విశేషం. 300 సంవ త్సరాలకు పైగా అప్పటి రాజులు దీన్ని వాడుకున్నట్లు చరిత్ర చెబుతోంది. 26 మంది చక్రవర్తులు గగన్మహల్ను కేంద్రబిందువుగా చేసుకుని తమ ప్రాంతాల్లో పాలన సాగించారట. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు సైతం ఉన్నారు. పెనుకొండకు ప్రత్యేక స్థానమిచ్చిన రాయలు 1509 నుంచి 1523 వరకు పాలన సాగించిన కృష్ణదేవరాయలు హంపీ తరువాత అంతటి ప్రాధాన్యతను పెనుకొండకు ఇచ్చారు. ప్రతినెలా మూడు నెలల పాటు ఇక్కడి నుంచే ఆయన పాలన సాగించే వారని, కొండపై సైతం అనునిత్యం లక్ష్మీనరసింహస్వామిని పవిత్రంగా పూజించడమే కాదు కొండపై ఆలయాన్ని కూడా నిర్మించారు. గగన్మహల్ నుంచి కొండపైకి రహస్య మార్గాలు ఉండేవి. నేటికీ ఆ రహస్య మార్గాలు ఉన్నా ప్రమాదమని ప్రభుత్వం వాటిని మూసివేయించింది. చల్లదనం దీని ప్రత్యేకం గగన్మహల్ యొక్క ప్రత్యేకం చల్లదనాన్ని కలిగించడమే. విభిన్న మిశ్రమాలతో నిర్మించడంతో ఏ కాలంలో అయినా చల్లదనాన్ని కలిగిస్తుంది. నాటి రాజరికపు గుర్తులను మన కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. ఎలా వెళ్లాలంటే... ఈ కట్టడాన్ని సందర్శించాలంటే అనంతపురం వైపు నుంచి పెనుకొండకు చేరుకుంటే ఆటోలో సులువుగా వెళ్ళవచ్చు. జిల్లా కేంద్రం నుంచి 75 కిలో మీటర్ల దూరం ఉంది. దీన్ని సందర్శకుల కోసం నిత్యం తెరిచే ఉంచుతారు. అలాగే బెంగళూరు, హిందూపురం వైపు నుంచి పెనుకొండకు అనేక బస్సులు ఉన్నాయి. బెంగళూరు నుంచి 127 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి వస్తే మరెన్నో కట్టడాలు, నాటి రాజరికపు ఆనవాళ్ళు మనకు కనిపిస్తాయి. -
చిరంజీవి రెడ్డి దంపతులపై కాల్పులు
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని పెనుగొండలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక వ్యాపారి మేడపాటి చిరంజీవి రెడ్డి, ధనలక్ష్మీ దంపతులపై దుండగులు తపంచాతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ధనలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి.ఆమె తలలోకి 28 సైకిల్ ఇనుపగుళ్లు, మేకులు దూసుకెళ్లాయి. వాటిని గుర్తించిన తణుకు వైద్యులు మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. మార్టేరులో వివాహానికి వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు... దంపతులపై కాల్పులు దిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మలుపులు తిరుగుతున్న కాల్పుల వ్యవహారం.. రియల్ ఎస్టేట్, వడ్డీ వ్యాపారం చేస్తున్న చిరంజీవి రెడ్డి నివాసంపై కస్టమ్స్ అధికారులు దాడులకు దిగారు. ఇంట్లో వ్యక్తులను బయటకు రానివ్వకుండా తలుపులు మూసేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
క్రేజీ స్వీట్.. కజ్జికాయ
వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలన్న నానుడిలో పెనుగొండ కజ్జికాయను చేర్చుకుంటారంటే అతిశయోక్తి కాదు. నోట్లో పెట్టుకోగానే అద్భుతమైన రుచి, కమ్మదనంతో దేశంలోని నలుమూలలకే కాకుండా ఇతర దేశాలకూ రెక్కలు కట్టుకుని వెళుతోంది పెనుగొండ కజ్జికాయ. నోరూరించే ఈ కజ్జికాయకు 40 ఏళ్ల చరిత్ర ఉంది. పెనుగొండ : బందరు లడ్డూ, తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకుల కోవలోకు చెందినదే పెనుగొండ కజ్జికాయ. పెనుగొండ పేరు చెప్పేసరికి గుర్తుకువచ్చేది కజ్జికాయే. నోరూరించే కజ్జికాయ చూసేసరికి ఒకరకమైన కాయలా కనిపించినా కొరకగానే తియ్యటి కొబ్బరి కోరుతో ఉండే పాకం నోటిలోకి వెళ్లి ’అదుర్స్’ అనిపిస్తుంది. పెనుగొండ కజ్జికాయకు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ ప్రాణం పోసుకున్న ఈ మధురమైన వంటకం పలు రాజకీయ పార్టీల సమ్మేళనాల విందు భోజనాల్లో చోటు చేసుకొని ఔరా అనిపించుకొన్న సంఘటనలు కోకొల్లలు. స్వీటు ప్రియులకు కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ తయారైన కజ్జికాయలకు రెక్కలు వచ్చి దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకే కాకుండా, అమెరికా లాంటి దేశాలకూ వెళ్తుంది. మంత్రులకు, కేంద్ర మంత్రులకు, ఉన్నతస్థాయి అధికారులకే కాదు.. సామాన్య ప్రజలకు సైతం బంధువులు ముందుగా తీసుకెళ్లేది పెనుగొండ కజ్జికాయనే. పలకరింపులకు, బంధుత్వాలకు, సిఫార్సులకు కజ్జికాయను బహుమతిగా తీసుకువెళ్లడం ఆనవాయితీగా మారిపోయింది. 40 ఏళ్ల నుంచి తయారీ పెనుగొండ కజ్జికాయకు నలభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. విసుమర్తి కాళిదాసు అనే స్వీట్ వ్యాపారి పెనుగొండలో చిన్న బండితో వినాయక స్వీట్ పేరుతో వ్యాపారం ప్రారంభించి కజ్జికాయను ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కజ్జికాయకు ఎదురు నిలిచే స్వీటు మాత్రం రాలేదు. కాళిదాసు మరణించినా కుమారులు కజ్జికాయను మరింత తీర్చిదిద్దుతూ మరింత వన్నెలద్దారు. గతంలో కేవలం కొబ్బరి కోరుతో మాత్రమే తయారయ్యే కజ్జికాయకు నేడు జీడిపప్పు, ఇతర డ్రై ప్రూట్స్ను మిళితం చేసి మరింత రుచికరంగా తయారు చేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తయారు చేస్తే 1112 గంటలకల్లా అయిపోతుంది. పెనుగొండ కజ్జికాయకు అంతటి డిమాండ్ మరి. వీరికి పెనుగొండతో పాటు తణుకులో మరో స్వీట్ షాపు ఉంది. నేటికీ తగ్గని క్రేజ్ పెనుగొండ కజ్జికాయ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక్కరూ పెనుగొండ కజ్జికాయను తీసుకు వెళుతుంటారు. సిఫార్సులు చేయించుకోవడానికి, బంధువులకు ఇచ్చుకోవడానికి పెనుగొండ కజ్జికాయ బహుమతిగానే ఉంటుంది. 40 సంవత్సరాలుగా తయారు చేస్తున్నాం. నేటికీ క్రేజ్ తగ్గలేదు. వి.కోటిలింగాలు, పెనుగొండ -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
గట్టుజారి గల్లంతవుతోంది
దొంగరావిపాలెంలో కుంగుతున్న ఏటిగట్టు మరమ్మతులు చేసిన ప్రయోజనం శూన్యం డెల్టా గ్రామాల్లో ఆందోళన పెనుగొండ : గోదావరి ఏటిగట్టు ప్రమాదంలో పడింది. మరమ్మతులు చేసినా.. అండలుగా జారి నదిలోకి కుంగిపోతోంది. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద గట్టు జారిపోతోంది. మరమ్మతులు చేపట్టినా ప్రయోజనం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం తప్పదేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిడదవోలు మండలం పెండ్యాల, పెనుగొండ మండలం దొంగరావిపాలెం, ఆచంట మండలం కోడేరులో 31/500 కిలోమీటర్ నుంచి 32/100 కిలోమీటర్ వరకు వరకూ సుమారు 600 మీటర్ల మేర ఏటిగట్టు శిథిలావస్థకు చేరింది. దీంతో గోదావరి హెడ్ వర్క్స్ అధికారులు పరిశీలించి 2015లో మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. రూ.42 కోట్లతో చేపట్టిన మరమ్మతు పనులు నేటికీ కొనసాగుతున్నాయి. అయితే, మరమ్మతులు చేసిన ప్రాంతాల్లో నాలుగు రోజులుగా గట్టు అండలు అండలుగా నదిలోకి జారిపోతోంది. రెండేళ్లలో మూడోసారి గోదావరిలోని నీటి ప్రవాహం నేరుగా ఏటిగట్టును తాకకుండా నిరోధించేందుకు 2015లో పనులు చేపట్టారు. గ్రోయిన్స్, పిచ్చింగ్ రివిట్మెంట్ పనులు ఇందులో ఉన్నాయి. పిచ్చింగ్ రివిట్మెంట్ సమయంలోనే ఏటిగట్టు రెండుసార్లు కుంగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ అధికారులు మట్టి పరీక్షలు చేయించారు. అక్కడి మట్టి ఈ పనులకు అనుకూలంగా లేదని నివేదికలు వచ్చాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేసి సాదాసీదా పనులు కొనసాగిస్తున్నారు. దీంతో నాలుగు రోజులుగా 31/500 కిలోమీటర్ నుంచి 31/600 కిలోమీటర్ వరకు ఏటిగట్టు కుంగడం ప్రారంభమైంది. ఇక్కడ గట్టు జారిపోతుండటం గడచిన రెండేళ్లలో ఇది మూడోసారి. గట్టు బలహీనపడుతుండటంతో వర్షాకాలంలో ఏమాత్రం వరద ఉధృతి పెరిగినా 1986 నాటి పరిస్థితులు పునరావృతమవుతాయనే ఆందోళన డెల్టా గ్రామాల్లోననెలకొంది. నాణ్యతా లోపమే కారణం! పనుల్లో నాణ్యతా లోపాల వల్లే గట్టు కుంగిపోతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. మరమ్మతులకు తక్కువ సైజులో ఉండే రాయిని వినియోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. అధికారులు మాత్రం వదులుగా ఉండే బంకమన్ను వల్లే కుంగిపోతోందని చెబుతున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దే విషయంలో హెడ్వర్క్స్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓఎన్జీసీ పైపుల వల్లేనంటూ ఫిర్యాదు వదులుగా ఉండే బంకమట్టితోపాటు ఓఎన్జీసీ పైపులతో నీటిని తోడుతున్న కారణంగానే రివిట్మెంట్ జారిపోతోందంటూ గోదావరి హెడ్వర్క్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడేరు బ్యాంక్ కెనాల్ ఆయకట్టు పరిధిలో సాగునీటి ఎద్దడి రావడంతో ఓఎన్జీసీకి చెందిన మోటార్లతో గోదావరి నది నుంచి నీటిని బ్యాంక్ కెనాల్లోకి తోడుతూ రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. దీనివల్ల నదిలో నీటి నిల్వలు పడిపోయి గట్టు బలహీనపడుతోందని హెడ్వర్క్స్ డీఈ వీవీ రామకృష్ణ తెలిపారు. గతంలోనూ ఎత్తిపోతల పథకం నిర్వహించినపుడు గ్రోయిన్స్ కుంగిపోయాయని వివరించారు. మరమ్మతుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించామని ఆయన చెప్పారు. అనుమతులు లేకుండా నదిలోంచి నీటిని తోడుతుండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నారు. -
చీకటి గదులు.. దుర్వాసన
పెనుగొండ : పదో తరగతి పరీక్షలకు పెనుగొండ జెడ్ఎన్వీఆర్ హైసూ్కల్లో కనీస సదుపాయాలు కల్పించడంలో విద్యాశాఖా«ధికారులు విఫలమయ్యారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభం కాగా తొలిరోజు విద్యార్థులు అవస్థలు పడ్డారంటూ శనివారం హై స్కూల్ వద్దకు తల్లిదండ్రులు భారీస్థాయిలో తరలివచ్చారు. తరగతి గదుల్లో కనీస వెలుతురు లేదని, దుర్వాసనతో పరీక్షలు రాయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు ఉక్కపోతతో విద్యార్థులు అవస్థలు పడ్డారన్నారు. దీనిపై స్థానిక విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని విలేకరుల వద్ద మొరపెట్టుకున్నారు. బెంచీలు, పారిశుద్ధ్యం నిర్వహణ ఘోరంగా ఉందన్నారు. సౌకర్యాలు కల్పిస్తాం: డీఈవో జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ఎస్ గంగాభవాని పెనుగొండలో టెన్త పరీక్ష కేంద్రాలైన జెడ్ఎన్వీఆర్ హైసూ్కల్, చైతన్య ఇంగ్లిష్ వీుడియం స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెడ్ఎన్వీఆర్ హైసూ్కల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేయడంతో ఆమె వివరణ ఇచ్చారు. పాఠశాలలో సౌకర్యాల కల్పనపై శ్రద్ధ తీసుకో వాలంటూ ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చైతన్య పాఠశాల నుంచి బెంచీలు తెప్పించాలని, తరగతి గదుల్లో ట్యూబ్లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. దుర్వాసన వెదజల్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఎక్క డా మాస్ కాపీయింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని డీఈ వో గంగాభవాని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు వచ్చినా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అన్నదాత ఆక్రోశం
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు ఎండిన వరి దుబ్బులతో నిరసన పెనుగొండ: సాగు నీటి ఎద్దడితో పంట చేలు ఎండిపోతున్నాయంటూ రైతులు రోడ్డెక్కారు. వంతుల వారీ విధానంలోనూ నీటిని అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ వందలాది మంది రైతులు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ మండలంలోని రామన్నపాలెం వద్ద రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు రెండు గంటలకుపైగా రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ను స్తంభింపజేశారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామంటూ అధికారులు దాళ్వా ప్రారంభంలో నమ్మించి నిండా ముంచేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగు మధ్యలో నీరు అందకపోవడంతో దిక్కుతోచని స్థిలిలో ఉన్నామన్నారు. ఆచంట కాలువ పరిధిలోని వడలి, రామన్నపాలెం, తామరాడ ప్రాంతాల్లో సుమారు మూడు వేల ఎకరాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన వరి దుబ్బులను నెత్తిన పెట్టుకుని నిరసన తెలిపారు. పత్తాలేని నీటి సంఘ నాయకులు రైతులు మూకుమ్మడిగా రోడ్డెక్కి నిరసన తెలిపినా నీటి సంఘాల నాయకులు, నీటి పారుదల శాఖ ఇంజినీర్లు పత్తా లేకుండాపోయారు. కనీస సమాధానం చెప్పడానికి కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేంత వరకూ కదిలేది లేదని భీష్మించారు. కొద్దిసేపటికి నీటిపారుదల శాఖ సూపర్వైజర్ అబ్బులు రావడంతో ఏఎస్సై బి.నాగిరెడ్డి సమక్షంలో కౌలు రైతు సంఘ నాయకడు గుర్రాల సత్యనారాయణ చర్చలు జరిపారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాగు నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు యర్రంశెట్టి భాస్కరరావు, ముద్రౌతు త్రిమూర్తులు, పేరాబత్తుల సత్యనారాయణ, పేరాబత్తుల రామలింగేశ్వరరావు, చిట్యాల వీరన్న, జక్కం కృష్ణారావు తదితరులు నాయకత్వం వహించారు. శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలి సార్వా, దాళ్వా సాగులకు నీటి ఎద్దడి రాకుండా దొంగరావిపాలెం వద్ద శాశ్వత ఎత్తిపోతల పథకం ప్రారంభించాలని సీపీఎం మండల కార్యదర్శి సూర్నిడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వంతుల వారీ విధానంతో రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. -
ప్రత్యేకహోదాపై యూత్ ప్రచారం
పెనుగొండ : ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేయాలని సర్కారు కొన్ని కుయుక్తులు పన్నినా యూత్ మాత్రం పోరుబాట వీడ లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పెనుగొండలో పెనుగొండ యూత్ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక హోదా స్టిక్కర్లను బుధవారం వాహనాలకు అతికించారు. ప్రత్యేక హోదా వల్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాటం సాగించాలంటూ ప్రచారం నిర్వహించారు. ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఒకరకంగాను, ఎన్నికల అనంతరం ఒక రకంగాను వ్యవహరిస్తున్నాయంటూ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఐకమత్యంగా పోరాడితేనే ప్రత్యేక హోదా సాధించగలమని అన్నారు. కార్యక్రమంలో పెనుగొండ యూత్ సభ్యులు కడలి పురుషోత్తం, కానూరి అర్జునరావు, గుర్రాల శ్రీనివాసరావు, ఎస్ఎంఆర్ రఫీ, సుందర కనకరాజు, ఘంటసాల శివ పాల్గొన్నారు. -
సీసీ పుటేజీతో చిక్కాడు
పెనుగొండ : వృద్ధురాలి వద్ద నగదు లాక్కొని పారిపోయిన నిందితుడిని పెనుగొండ ఎస్బీఐ బ్రాంచ్ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పట్టించింది. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, సీఐ సీహెచ్ రామారావు తెలిపిన వివరాల ప్రకా రం.. గతనెల 24న చెరుకువాడకు చెందిన కుంచే బర్రెమ్మ అనే వృద్ధురాలు నగదు మార్పిడి కోసం రూ,1,08,000 తీసుకుని పెనుగొండ ఆంధ్రాబ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు సిబ్బ ంది ఆధార్, పా¯ŒS కార్డులు కావాలనడంతో తిరిగి నగదుతో వస్తుండగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ వద్ద మో టారుసైకిల్పై గుర్తుతెలియని వ్యక్తి ఆమె చేతిలోని బ్యాగ్ లాక్కుని పారిపోయాడు. దీనిపై పెనుగొండ పోలీసులు కేసు నమోదుచేశారు. దర్యాప్తులో భాగంగా ఎస్బీఐ వద్ద సీసీ కె మెరా పుటేజీ పరిశీలించగా హోండా యాక్టీవా స్కూటర్పై వెళుతున్న నేరస్తుడిని గుర్తించారు. నిందితుడు నిడదవోలు పోలీసుస్టేçÙ¯ŒS పరిధిలో సస్పెక్ట్ షీటు ఉన్న ఊర్ల శ్రీనువాసుగా నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పెనుగొండతో పాటు, తూర్పువిప్పర్రులో బ్యాంకు వద్ద జరిగిన చోరీను కూడా తాను చేసినట్టు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.37 వేలు రికవరీ చేసినట్టు చెప్పారు. కేసు ఛేదించడంలో కానిస్టేబుళ్లు కొండా, రమేష్ చురుగ్గా వ్యవహరించారన్నారు. పెనుగొండ, ఇరగవరం ఎస్సైలు బీవై కిరణ్కుమార్, జీజే ప్రసాద్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా అరెస్ట్
పెనుగొండ : పెనుగొండ సర్కిల్ పరిధిలోని రాపాక బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 కేసులతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కారు, బంగారు ఆభరణాలు, రెండు మోటారుసైకిళ్లు, నాలుగు ఎల్సీడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రాపాక వద్ద ఇరగవరం ఎస్సై జీజే ప్రసాద్తో కలిసి సీఐ సీహెచ్ రామారావు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ 37 బీఎల్ 7799 కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని పాత నేరస్తులు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన జక్కంశెట్టి నాగరాజు (27), కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన గుత్తికొండ పవ¯ŒSకుమార్ (30), హైదరాబాదు ఎల్బీ నగర్కు చెందిన ఆవుల కిరణ్కుమార్ (27)గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 400 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు టీవీలు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించడంతో నేరాలు బయటపడ్డాయి. జిల్లాలోని ఇరగవరంలో మూడు, పెనుమంట్రలో మూడు చోరీలు, తణుకులో ఓ చోరీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బ¯ŒS పరిధిలో 10 చోరీలు, ఇతర పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు, విశాఖ జిల్లాలో 7 చోరీలు, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన బంగారు ఆభరణాలు అమ్మి రేనాల్ట్ కారును కొని మండపేట కేంద్రంగా ఇతర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా 1,160 గ్రాముల బంగారు ఆభరణాలు వీరు చోరీ చేసినట్టు గుర్తించారు. వీటిలో పెనుగొండ సర్కిల్ పరిధిలో 400 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. జైలులో ముఠాగా మారి.. ఎవరికి వారు దొంగతనాలు చేసుకొని జీవించే వీరికి జైలు జీవితం నలుగురిని కలిపి ముఠాగా చేసింది. గుత్తికొండ పవ¯Œకుమార్, జక్కంశెట్టి నాగరాజు జైలు నుంచి బయటకు వచ్చి పసుపులేటి కిరణ్కుమార్ను బెయిల్పై బయటకు తీసుకువచ్చారు. అదేవిధంగా ఏలూరులో జైలులో ఉన్న ఆవుల కిరణ్కుమార్ను బెయిల్పై తీసుకువచ్చి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించారు. నలుగురు కలవడంతో చోరీలు యథేచ్ఛగా సాగాయి. అయితే, వాటల వద్ద విభేదాలు రావడంతో పసుపులేటి కిరణ్కుమార్ విడిపోయి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు పసుపులేటి కిరణ్కుమార్ కోసం వేట ప్రారంభించారు. కిరణ్కుమార్ చిక్కితే మరింత బంగారం బయట పడవచ్చని అంచనా వేస్తున్నారు. పలు పోలీస్స్టేçÙన్లలో వీరిపై నా¯ŒSబెయిల్బుల్ వారెంట్లు పెండింగ్లో ఉన్నాయి. పెనుగొండ సర్కిల్ పరిధిలోని పెనుమంట్ర, ఇరగవరం కేసులకు సంబంధించి అరెస్ట్ చేసి ముగ్గురు నేరస్తులు జక్కంశెట్టి నాగరాజు, గుత్తికొండ పవ¯ŒSకుమార్, ఆవుల కిరణ్కుమార్ను కోర్టుకు హజరు పరుస్తున్నట్టు డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. చోరీ కేసుల ఛేదించడంలో ఎస్సై జీజే ప్రసాద్, కానిస్టేబుల్ వెంకట్రావును అభినందిస్తూ రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. -
∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల
పెనుగొండ: స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లోని చలువ పందిరిలో కొలువైన గణపతికి మంగళవారం రూ.27 లక్షల నోట్లతో రూపొందించిన మాలను అలంకరించారు. రెడ్డియ్య దంపతులు పూజలు చేసి ఈ నోట్ల కట్టలను మాలగా స్వామిమెడలో వేశారు. పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు -
∙లక్ష్మీ గణపతికి కరెన్సీమాల
పెనుగొండ: స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లోని చలువ పందిరిలో కొలువైన గణపతికి మంగళవారం రూ.27 లక్షల నోట్లతో రూపొందించిన మాలను అలంకరించారు. రెడ్డియ్య దంపతులు పూజలు చేసి ఈ నోట్ల కట్టలను మాలగా స్వామిమెడలో వేశారు. పూజా కార్యక్రమాల అనంతరం లడ్డూ వేలం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు -
తృటిలో తప్పిన ప్రాణాపాయం
పెనుగొండ: పెనుగొండ కళాశాలల బస్షెల్టర్ వద్ద పెను ప్రమాదం తప్పింది. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే కళాశాలల కూడలి వద్ద మంగళవారం మితిమీరిన వేగంతో వాహనాలు వచ్చి ఎదురెదురుగా ఢీకొని బస్షెల్టర్లోకి దూసుకువెళ్లాయి. బక్రీద్ సెలవు కావడంతో విద్యార్థులు లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. రోడ్డు ఒకSవైపునే బాగుండటంతో ట్రాక్టర్, ఆటో వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో బోల్తా పడగా ట్రాక్టర్ షెల్టర్లోకి దూసుకుపోయింది. డ్రైవర్కు స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఏమీ జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
నేటి నుంచి జాతీయ సదస్సు
పెనుగొండ : తెలుగులో మహిళా రచయితల అనుభవాలు–ప్రభావాలు అంశంపై మహిళా రచయితల జాతీయ సదస్సు పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో శనివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నడింపల్లి సూర్యనారాయణ రాజు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళా రచయితల మధ్య పరస్పర సంభాషణకు, భావ వినిమయానికి అవకాశం కల్పించడం, సమకాలీన రాజకీయ ఆర్థిక పరిణామాలకు, సాహిత్యానికి పరస్పర సంబంధాన్ని చర్చించడం, మహిళా రచయితల సాహిత్య వస్తు శిల్పాల తీరుతెన్నులను విశ్లేషించడమే సదస్సు లక్ష్యమన్నారు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కలిదిండి అన్నపూర్ణ సదస్సును ప్రారంభిస్తారని, కాకినాడ ఐడియల్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక అధ్యక్షురాలు డాక్టర్ పుట్ల హేమలత, కార్యదర్శి కాత్యాయినీ విద్మహేల, వివిధ జిల్లాలకు చెందిన రచయిత్రులు, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు పితాని సూర్యనారాయణ, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కలిదిండి రామచంద్రరాజు, కోశాధికారి ఉద్దగిరి లవకుమార్ పాల్గొంటారన్నారు -
వాసవీ అమ్మవారి పాదాలు1.55 టన్నులు
పెనుగొండ: పంచ లోహాలతో తయారు చేసిన వాసవీ అమ్మవారి పాదాలివి. దీనికి 1.55 టన్నుల పంచ లోహాలను వినియోగించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవీ శాంతి ధామ్లో నెలకొల్పనున్న 90 అడుగుల వాసవీ మాత పంచ లోహ విగ్రహానికి వీటిని అమర్చనున్నారు. రూ.20 కోట్ల వ్యయంతో 45 టన్నుల పంచ లోహాలతో అమ్మవారి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. అమ్మవారి నిజ పాదుకలుగా పేర్కొంటున్న వీటిని 2014 ఆగస్టు 17న బెంగళూరు మల్లేశ్వరం క్రీడా మైదానంలో వాసవీ పీఠాధిపతులు, స్వామీజీలు ఆవిష్కరించారు. అనంతరం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సహా దేశం నలుమూలలా సుమారు 21,500 కిలోమీటర్ల మేర వీటిని రథంలో ఊరేగించి వివిధ పుణ్యక్షేత్రాలను దర్శింపచేశారు. శనివారం వీటిని పెనుగొండలోని వాసవీ శాంతిధామ్లో ప్రతిష్ఠించనున్నారు. -
20, 21 తేదీల్లో జాతీయ సదస్సు
పెనుగొండ : మానవ హక్కుల విద్యపై పెనుగొండ ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ నరసింహరాజు తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించబోయే జాతీయ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, హైకోర్టు మాజీ జడ్జి జి.భవానీ ప్రసాద్, ఆదికవి నన్నయ్య విశ్యవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు అతిథులుగా పాల్గొంటారన్నారు. కీలకోపన్యాసకులుగా ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల వేదిక సభ్యులు ఆచార్య జి. హరగోపాల్, విశిష్ట అతిథిగా రాష్ట్ర హక్కుల కమిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి డి.సుబ్రహ్మణ్యం హాజరవుతారన్నారు. ముగింపు సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మహిళా విద్యా కేంద్ర సంచాలకులు డాక్టర్ దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఆచార్య బి.రత్నకుమారి పాల్గొంటారన్నారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ జాతీయ సదస్సుకు ఇప్పటివరకూ 82 పరిశోధనా వ్యాసాలు అందడం కళాశాల చరిత్రలో విశేషమన్నారు. 20న కళాశాలలో మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి పెన్మెత్స వెంకట సుబ్రహ్మణ్యం, సెమినార్ కార్యదర్శి కె.శశికుమార్, కేవీ.సురేష్బాబు, డి.త్రిమూర్తులు పాల్గొన్నారు. -
సుగర్ ఫ్రీ రైస్ లేనే లేదు !
మార్టేరు (పెనుగొండ రూరల్): మార్కె ట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా సుగర్ ఫ్రీ రైస్ అసలు లేనే లేదని మార్టేరు వరి పరిశోధన సంస్థ డెరైక్టర్ డాక్టర్ పాల డుగు వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థలో గోదావరి మండ లం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండవరోజు సమావేశంలో ఆ యన ప్రసంగించారు. ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని సుగర్ ఫ్రీ రకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నారు. జీఐ(గ్లైసమిక్ సూచిక )లో ఇది మధ్యస్త రకం మాత్రమేనని పాలడుగు అన్నారు. మధుమేహ నియంత్రణ పరంగా వరి రకాలను మధ్యస్త, హెచ్చురకాలుగా విడదీశామన్నారు. ఈ సూచిక ప్రకారం ఆర్ఎన్ఆర్ కన్నా సాంబమసూరే సుగ ర్ రోగులకు మేలైనదన్నారు. ఆర్ఎన్ఆర్ 15048లో 57 శాతం జీఐ ఇండెక్స్ ఉంటే, బీపీటీ 5204 (సాంబ మసూరి)లో 52 శాతం, స్వర్ణ రకంలో 56 శా తం ఉందన్నారు. వరిలో సుగర్ ఫ్రీ రైస్ ఉండదన్నారు. చక్కెర తక్కువ శాతం ఉండే రకాలు మాత్రమే ఉంటాయన్నారు. తక్కువ చక్కెర శా తం రకాలపై ఎన్ఐఎన్ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్ఫలితాలు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు ఎలుకల నివారణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారం, చిరుధాన్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సాయిల్ మేనేజ్మెంట్ ప్రత్యేకాధికారి టి గిరిధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడీఆర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ శాఖ ఉభయగోదావరి జిల్లా డీడీఏలు పద్మ, లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు ఎంవీ రమ ణ, రత్నకుమారి, కె.శ్రీనివాసులు, సుధీర్, ఎం. శ్రీనివా స్, శిరీష, చాముండేశ్వరి పాల్గొన్నారు. -
తనని తప్పుగా అనుకుంటున్నారని..
పెనుకొండ: చుట్టుపక్కల వాళ్లు తన గురించి తప్పుగా అనుకుంటున్నారనే బాధతో ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలం మంగాపురంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన భావన(15) స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల కిందట బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో పెనుకొండకు చెందిన ఆటో డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. బాలిక తిరిగి ఇంటికి చేరింది. ఈ విషయం పై తన గురించి చుట్టుపక్కల వాళ్లు తప్పుగా అనుకుంటున్నారని మనస్థాపానికి గురైన భావన శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో అందరు నిద్రపోయిన తర్వాత చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పెనుకొండలో రోడ్డు ప్రమాదం
అనంతపురం(పెనుగొండ): అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం జిల్లాలోని సోమందేవపల్లి మండలానికి చెందిన వారు ఆటోలో పెనుకొండకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో పెనుకొండ ఆర్టీవో చెక్పోస్టు సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ అధికారి
పెనుగొండ: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ సబ్ ట్రెజరీ అధికారి ముద్రగడ వెంకట శ్రీనివాసరావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శనివారం సబ్ ట్రెజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన్నుంచి రూ.6,400 స్వాధీనం చేసుకున్నారు. 16 మంది టీచర్లకు రావాల్సిన బకాయిలను మంజూరు చేసేందుకు ఒక్కొక్కరు రూ.400 లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినట్టు సమాచారం. దాంతో టీచర్లు ఏసీబీకి సమాచారం అందించగా, శనివారం దాడులు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. -
సినీ నిర్మాత మృతి
పెనుగొండ రూరల్ : సినీనిర్మాత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నూలి రంగయ్య (78) శుక్రవారం మృతి చెందారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నూలి రంగయ్య నిర్మాతగా కృష్ణ హీరోగా వియ్యాల వారి కయ్యాలు, నూతనప్రసాద్ హీరోగా సమాధి కడుతున్నాం చందాలు ఇవ్వండి సినిమాలు నిర్మించారు. రంగయ్యకు ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
'అనంతలో కరువును నివారించాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో నెలకొన్న కరువును నివారించేందుకు చర్యలు చేపట్టాలని వామపక్ష కార్యకర్తలు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెనుగొండలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వామపక్ష కార్యకర్తలు నిరసన తెలిపారు. జిల్లా కరువు కోరల్లో చిక్కుకుని ఉందని... అయినా ప్రభుత్వం మాత్రం ఎలాంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపించారు. ఈ నిరసనలో సీపీఐ, సీపీఐ ఎం చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం
-
బస్సు ప్రమాదంపై విచారణ ప్రారంభం
అనంతపురం: ఈనెల రెండో వారంలో పెనుకొండ వద్ద జరిగిన బస్సు ప్రమాద దుర్ఘటనపై జిల్లా జడ్జి వెంకటేశ్వర రావు విచారణ ప్రారంభించారు. ఈ ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి గల కారణాలపై ఆర్టీసీ, రోడ్లు భవనాలు, రవాణా తదితర శాఖల నుంచి వివరాలు సేకరించారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను త్వరలో హైకోర్టుకు అందిస్తామని జడ్జి వెంకటేశ్వర రావు తెలిపారు. -
బస్సు ప్రమాదంపై న్యాయ సేవాధికార సంస్థ సీరియస్
-
వైద్యం అందితే నా కొడుకు బతికేవాడు..
హిందూపురం : సకాలంలో వైద్యం అందించి ఉంటే తన కొడుకు బతికేవాడని ఇంటర్ విద్యార్ధి గంగాధర్ తండ్రి ప్రభాకర్ కన్నీటి పర్యంతమయ్యారు. పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధులకు ఆయన తన బాధను వివరించారు. తీవ్రంగా గాయపడి చికిత్సకోసం ఆస్పత్రికి తీసుకువచ్చి.. పిల్లాడు చాలా బాధపడుతున్నాడు త్వరగా రండి.. అని డాక్టర్కు ప్రాధేయపడితే ఆయన కసురుకున్నాడని వాపోయాడు. వెంటనే వైద్యం అందించి వుంటే నా కొడుకు బతికేవాడని విలపించాడు. ఏ శవ పరీక్షలు వద్దు.. పిల్లాడి శవం ఇచ్చేయండి వెళిపోతామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నాయకులు ఆయనను శాంత పరిచారు.అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృత్యుంజయురాలు అనిత అనంతపురం జిల్లా మడకశిర బస్సు ప్రమాదంలో మేకలపల్లికి చెందిన అనిత అనే విద్యార్థిని మృత్యుంజయురాలుగా సురక్షితంగా బయటపడింది. ఘటనపై ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే... నేను పెనుకొండలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ప్రతిరోజూ మా గ్రామం నుంచి 30 మందికి పైగా విద్యార్థులం ఈ బస్సులో పెనుకొండకు వస్తూ ఉంటాం. రోజులాగే మా గ్రామానికి చెందిన విద్యార్థులు బధవారం ఉదయం 8 గంటలకు బస్సు ఎక్కాము. బస్సు డ్రయివర్ వేగంగా నడుపుతూ వచ్చాడు. బస్సులోని ప్రయాణికులతోపాటు కండక్టర్ కూడా నెమ్మదిగా పోనివ్వాలని చెప్పారు. బస్సుకు ఆటో అడ్డురావడంతోనే దాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురిచేశాడు. బస్సు లోయలో పడిన విషయం మాత్రమే తెలుసు. తరువాత ఏమి జరిగిందో తెలియదు. మా టీచర్ బాలాజీ నన్ను లేపిబయటకు పంపాడు. నాతోపాటు మరో పది మందిని కాపాడాడని ఆమె వివరిచింది. -
డీఎస్సీ దరఖాస్తు కోసం వెళ్తూ..
అమరాపురం : మండల పరిధిలోని హేమావతి గ్రామంలో బుధవారం విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 5.30 గంటలకు శ్రీనివాస్(30) డీఎస్సీ దరఖాస్తు చేసుకోవడానికి బస్సులో బయలు దేరాడు. మడకశిరలో స్నేహితుడి కోసం దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సు ఎక్కాడు. పెనుకొండ సమీపంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హిందూపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహాన్ని హేమావతి గ్రామానికి తీసుకువచ్చారు. తల్లి సరోజమ్మ, భార్య శశికళ, అక్క అనిత, బంధువులు రోధిస్తున్న తీరు వర్ణనాతీతం. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించి కుటుంబాన్ని పోషిస్తాడనుకుంటే పరలోకానికి వెళ్లిపోయావా అంటూ భార్య, తల్లి రోధించారు. తల్లడిల్లిన పల్లెలు మడకశిర ఘాట్లో జరిగిన బస్సు ప్రమాదంతో పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాల్లో విషాద వాతావరణం ఏర్పడింది. మా పిల్లవాడు కళాశాలకు బస్సులో వెల్లాడు, మా పాప కళాశాలకు వెల్లింది, ఎమైందో అంటూ పరుగు పరుగున ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఎక్కడ ఉన్నారోనని కన్నీరు పెట్టుకుంటూ తాపత్రయ పడడం కనిపించింది. విషాదంతో ప్రతి ఒక్కరూ గ్రామంలో ఒకరినొకరు ఓదార్చుకున్నారు. సంతోషంతో చదువుకోవడానికి వెళ్లిన తమ బిడ్డలు ఏమయ్యారోనని వారు పడిన బాధ మాటల్లో చెప్పలేనిది. ప్రమాదంలో గాయపడిన వారిని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి సీఐ రాజేంద్రనాథ్యాదవ్, ఎస్ఐ శేఖర్ సిబ్బందితో పాటు స్థానికులు క్షతగాత్రులను అనంతపురం, హిందూపురం ఆస్పత్రులకు స్కూల్ బస్సులు, జీపుల్లో తరలించడానికి ముమ్మర చర్యలు చేపట్టారు. మరవలేని విషాద ఘటన పెనుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం జీవితంలో మరిచిపోలేని విషాద ఘటన అని పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య, ఆరైఓ వెంకటేశులు, డీవైఈఓ వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. బుధవారం ఉదయం ప్రమాద ఘటనలో తమ కళాశాల విద్యార్థులు చనిపోయారన్న సమాచారం అందడంతో చలించిపోయిన వారు ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు వచ్చి కంటతడిపెట్టుకున్నారు. ఆర్డీఓ రామమూర్తి మాట్లాడుతూ ప్రమాద ఘటన ఘోరమని పేర్కొన్నారు. విశిష్ట సేవలు అందించిన 108 సిబ్బంది: పెనుకొండ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో 108 సిబ్బంది విశేష సేవలు అందించారు. -
రైలు ప్రమాదం మరువకముందే..
పెనుకొండ : మండలంలోని మడకశిర ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం ఈ ప్రాంతంలో జరిగిన రెండో పెద్ద ప్రమాదంగా నమోదైంది. 20 12 ఏప్రిల్ 24న స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో హంపీ ఎక్స్ప్రెస్ నిలచి ఉన్న గూడ్స్ రై లును ఢీకొనడంతో 26 మంది మరణించారు. ఆ ఘటనను మరువకముందే ఈ ఘోరం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బస్సు ప్రమాదంల పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, మడకశిర ప్రాంత ప్రజలను శోక సంద్రంలో ముంచింది. 14 ఏళ్ల క్రితం ప్రస్తుతం బస్సు పడిన ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు పడి 10 మంది దాకా మరణించారని స్థానికులు గుర్తు చేసుకున్నారు. సహాయక చర్యలకు ప్రత్యేక సెల్ పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి సహాయక చర్యలు చేపట్టేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఘటన జరిగిన వెంట నే 18004256401 నంబర్తో సెల్ను ప్రారంభిం చారు. దీని ద్వారా క్షతగాత్రులు ఎవరెవరు చికిత్స పొందుతున్నారు.. తదితర వివరాలను బంధువులకు అందిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పతిలో 16 మంది, హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో 27 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. హిందూపురంలో చికిత్స పొందుతూ బండ్లపల్లికి చెందిన గంగాధర్, హేమావతికి చెందిన శ్రీనివాసులు మృతి చెందారని వివరించారు. ఈ ప్రత్యేక సెల్ మరికొన్ని రోజులు కొనసాగించనున్నట్లు తెలిపారు. -
అనంత శోకం
* ఏపీలోని పెనుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం * లోతైన గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు * మృతుల్లో 12 మంది విద్యార్థులు.. 65 మందికి తీవ్ర గాయాలు * రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి * హుటాహుటిన హైదరాబాద్ నుంచి దుర్ఘటన స్థలానికి వైఎస్ జగన్ * క్షతగాత్రులకు పరామర్శ, మృతుల కుటుంబాలకు ఓదార్పు పెనుకొండ నుంచి సాక్షి ప్రతినిధి: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని ‘షీప్-ఫామ్’. బుధవారం ఉదయం 8.24 గంటలు. మడకశిర నుంచి బయలుదేరిన ‘పల్లె వెలుగు బస్సు’ పెనుకొండకు వెళుతోంది. స్కూళ్లు, కాలేజీలకు బయలుదేరిన వివిధ గ్రామాల విద్యార్థులతో పాటు 87 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. మరో 5 నిమిషాల్లో పెనుకొండకు చేరుతుందనగా.. ముందు వెళుతున్న ఆటోను దాటివెళ్లే క్రమంలో బస్సు ఘోర ప్రమాదానికి గురయ్యింది. 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. బస్సు ఇరుకు ఘాట్ రోడ్డు పక్కనే ఉన్న సుమా రు 150 అడుగుల లోతైన గుంతలో పడిపోవడంతో కుప్పలా అయిపోయింది. ఒక్కసారిగా ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మా ర్మోగింది. 11మంది అక్కడికక్కడే మరణిం చగా, నలుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందు తూ మృతి చెందారు. డ్రైవర్, కండక్టర్ సహా 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పెనుకొండ, హిందూపురం, అనంతపురం ఆస్పత్రులకు తరలించారు. మరణించిన 15 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. నిర్లక్ష్యం నిండు ప్రాణాలు తీసింది.. ఏపీ 28 జెడ్ 1053 పల్లె వెలుగు బస్సు మడకశిర నుంచి ఉదయం 6.45 గంటలకు బయలుదేరింది. 7.50కి పెనుకొండ మండలం మావటూరుకు చేరింది. బండపల్లి, నాగలూరు, మావటూరు విద్యార్థులంతా బస్సు ఎక్కారు. కూర్చునేందుకు స్థలం లేకపోవడంతో అనేకమంది నిలుచునే ప్రయాణిస్తున్నారు. మావటూరు నుంచి 8 కిలోమీటర్లు ప్రయాణం చేసిన బస్సు ఘాట్ రోడ్డులోని షీప్ ఫామ్ (గొర్రెల పెంపక కేంద్రం) సమీపంలోకి చేరింది. అక్కడి నుండి మరో 4 కిలోమీటర్లు వెళితే పెనుకొండ వచ్చేస్తుంది. ఐదారు నిమిషాలు గడి స్తే గమ్యం చేరుతుందనగా ఘోర ప్రమాదానికి గురయ్యింది. ఇరుకైన మట్టిరోడ్డు. పట్టుమని పది అడుగుల వెడల్పు కూడా లేదు. దీని పక్కనే కొత్త రోడ్డు కోసం లోతైన గుంత తవ్వారు. కానీ రోడ్డు పక్కన రక్షణ కోసం కనీసం రాళ్లు కూడా పెట్టలేదు. కాంట్రాక్టర్ హెచ్చరిక బోర్డులూ ఏర్పాటు చేయలేదు. డ్రైవర్ గంగప్ప (లేపాక్షి మండలంలోని కల్లూరు స్వస్థలం) ఆటోను ఓవర్టేక్ చేయబోగా బస్సు అదుపు తప్పడంతో రోడ్డు కోసం తవ్విన లోయలాంటి గుంతలో పడిపోయింది. చేతులు, కాళ్లు, నడుం విరిగి పోరుు కొందరు, తల పగిలి మరికొందరు ఆర్తనాదాలు చేశారు. ఇంకొందరి శరీరంలో బస్సులోని ఇనుపరాడ్లు, రేకులు దిగబడిపోయాయి. 87 మంది ప్రయాణికుల్లో నలుగురు సురక్షితంగా బయటపడగా.. ముగ్గురు బస్సు పడిపోతున్న సమయంలో రోడ్డుపైకి దూకేశారు. ఆర్తనాదాలతో మార్మోగిన ఆస్పత్రి ఘటన జరిగిన వెంటనే 108 వాహనాలు, జీపులు, ఆటోల్లో క్షతగాత్రులందర్నీ 40 పడకల పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రి ప్రాంగణంలోని వరండాలో కుప్పగా పడేశారు. సుమారు 50 మందిని హిందూపురం ఆస్పత్రికి రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉన్న బస్సు డ్రైవర్ గంగప్ప సహా 16 మందిని బెంగళూరు ఆస్పత్రి (నిమ్హాన్స్)కి తరలించారు. ఆస్పత్రిలో శ్రీనివాసులు, గంగాధర్ అనే ఇద్దరు చనిపోయారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు ఆస్పత్రి ప్రత్యేక హెల్ప్లైన్ (080-26995008, 26995021)ను ఏర్పాటు చేసింది. బస్సు దుర్ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిమ్హాన్సలో బాధితులను కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం 40 మంది హిందూపురంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురిని అనంతపురం ఆస్పత్రికి రెఫర్ చేయగా వారిలో అశోక్కుమార్, గంగాధర్ అనే ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. సీరియస్గా ఉన్న జి.అశోక్కుమార్ అనే విద్యార్థిని కర్నూలుకు రెఫర్ చేశారు. ప్రస్తుతం అనంతపురంలో నలుగురు చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..: మంత్రి శిద్ధా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సు ప్రమాదం జరిగిందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు అన్నారు. శిద్ధా తో పాటు జిల్లాకు చెం దిన మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం! పెనుకొండ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టమవుతోంది. షీప్ ఫామ్ వద్ద ఘాట్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని గత ప్రభుత్వం ఘాట్ను తవ్వి కొత్త రోడ్డు నిర్మించేందుకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను మంత్రి పరిటాల సునీత సమీప బంధువైన ఎల్.నారాయణ చౌదరికి చెందిన శ్రీ కృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ సంస్థ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రోడ్డు వేయడం కోసం ఘాట్లో ప్రస్తుతం ఉన్న రోడ్డును ఆనుకుని దాదాపు 150 అడుగుల లోతు గుంతలా తవ్వారు. ఇలాంటి చోట ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం, కనీసం హెచ్చరిక బోర్డు కూడా ఉంచక పోవడం క్షమార్హం కాని నిర్లక్ష్యమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బస్సు కండీషన్ డొల్ల ప్రమాదానికి కారణమైన పల్లె వెలుగు బస్సు మడకశిర డిపోకు చెందినది. ఏమాత్రం కండీషన్ బాగోలేదు. 8.75 లక్షల కిలోమీటర్లు తిరిగింది. స్క్రాప్కు దాదాపుగా దగ్గరలో ఉంది. పైగా స్థాయికి మించి ప్రయాణికులు ఎక్కారు. ఈ మార్గంలో ఆటోల రద్దీ ఎక్కువ. ఉదయం వేళ కాలేజీలు, పాఠశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులంతా పాసులు ఉండటంతో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు. చాలామంది డ్రైవర్లు విద్యార్థులు కన్పిస్తే బస్సు ఆపరనే ఆరోపణలున్నాయి. మరో బస్సు వచ్చేలోపు సమయం దాటిపోతుందనే ఉద్దేశంతో ఆగిన బస్సులో ఎంతమంది ప్రయాణికులున్నా విద్యార్థులు అందులోనే ఎక్కుతుంటారు. నిత్యం బస్సు టాప్పైనా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. కాగా డ్రైవర్ వేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని కొందరు చెప్పారు. మృతుల వివరాలు మురళి (11), నరేంద్ర (15), అనిల్ (16), లక్ష్మీనారాయణ (16), నరసింహమూర్తి (16), అశోక్కుమార్ (17), అనిత (17), దాసరి గంగాధర్ (17) (తండ్రి రామన్న, మావటూరు), శేఖర్ (17), హనుమంతరాయుడు (20), అశోక్కుమార్ (17), గంగాధర్ (17) (తండ్రి సజ్జప్ప, మావటూరు). వీరంతా విద్యార్థులు కాగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రామకృష్ణ (47), డీఎస్సీ అభ్యర్థి శ్రీనివాసులు (35), గంగాధర్ (16) (తండ్రి ప్రభాకర్, బండపల్లి) రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్కు పంపిన సందేశంలో రాష్ట్రపతి సూచించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు సందేశంలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధాని మోదీ కూడా ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ముందే హెచ్చరించిన ‘సాక్షి’ పెనుకొండ: అనంతపురం జిల్లా మడకశిర-పెనుకొండ రహదారిలో రోడ్డు నిర్మాణ పనుల వద్ద ప్రమాదం పొంచి ఉందని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అరుునా కాంట్రాక్టర్, అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో ఇప్పుడు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. రోడ్డు పనుల వద్ద కనీస ప్రమాణాలు పాటించడం లేదని, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదని దాదాపు నెలన్నర కిందట (2014 నవంబర్ 26న అనంతపురం టాబ్లారుుడ్ పెనుకొండ జోన్లో) ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. అధికారులు అప్పుడే స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని బుధవారం ఘటనా స్థలిలో పలువురు పేర్కొన్నారు. ‘సాక్షి’ కథనాన్ని గుర్తు చేసుకున్నారు. కన్ను మూసి తెరిచేలోగా..: ప్రత్యక్ష సాక్షులు హిందూపురం అర్బన్: రెప్పపాటు కాలంలోనే బస్సు ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘ఈ మార్గంలో ఇటీవల రెండు సర్వీసులు రద్దు చేశారు. దీంతో విద్యార్థులు, పెనుకొండకు వెళ్లే ప్రయాణికులు, కూలీలు ఈ బస్సులోనే ఎక్కారు. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది’ అని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. కుదుపులు రాగానే దూకేశా సత్తారుపల్లి నుంచి బస్సు బయలుదేరిన కొంతసేపటికే ఆటోను ఓవర్టేక్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి కుడివైపునకు ఒరిగిపోతుండడంతో ఎడమవైపు డోరు వద్దనే ఉన్న నేను ఒక్కసారిగా బయటికి దూకేశా. చూస్తుండగానే బస్సు పల్టీలుకొడుతూ గోతిలో పడిపోయింది. - నందీశ్వర్రెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి ఓవర్ టేక్ చేయబోతూ.. బస్సు వేగంగా వెళుతోంది. ఎక్కువ మందితో కిక్కిరిసివుంది. ముందుపోతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయే ప్రమాదానికి గురైంది. ఓవర్ టేక్ చేయకుంటే ప్రమాదం జరిగి ఉండేది కాదు. ప్రమాదంలో నా చేయి విరిగింది. చిన్న గాయాలయ్యాయి. - రామిరెడ్డి, ఇంటర్ విద్యార్థి, సత్తారుపల్లి వేగం వల్లే పడిపోయింది బస్సులో సీటు లేకపోవడంతో డ్రైవర్ వెనుకనే నిలబడివున్నా. బస్సు వేగంగా పోతోంది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపు ముందు గోతులపై నుంచి వెళ్లడంతో అదుర్లతో ఊగిపోయింది. అందరం కేకలు వేశాం. ఆటో పక్కనుంచి బస్సును రోడ్డుపైకి తీసుకొస్తాడని అనుకునేలోపే గోతిలోకి పడిపోయింది. తర్వాతేం జరిగిందో తెలీదు. - లలిత, సుద్దపట్లపల్లి -
వారసుడిని చూడకుండానే
పెనుగొండ రూరల్ (పశ్చిమగోదావరి జిల్లా), విశాఖ: వారసుడు పుట్టాడనే ఆనందంతో బయల్దేరిన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసింది. ఐదు రోజుల క్రితం జన్మించిన కుమారుడిని చూసేందుకు తహతహతో బయల్దేరిన తండ్రి, వారసుడిని చూడబోతున్నామన్న ఆనందంతో ఉన్న తాత, నానమ్మ మార్గమధ్యంలోనే కన్నుమూశారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున కారు కల్వర్టును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం లాసన్స్బే కాలనీలో ఉంటున్న చల్లా గంగునాయుడు(55), చల్లా పార్వతమ్మ(50) దంపతులు, వారి కుమారుడు చల్లా అరుణకుమార్(30) అక్కడిక్కడే మృతి చెందారు. వీరు డెంకాడ గ్రామానికి చెందిన వారు. ప్రమాదంలో అరుణకుమార్ చెల్లెలు చల్లా సునీత, స్నేహితుడు యు.చలపతికు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి తాడేపల్లిగూడెం కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును అరుణకుమార్ డ్రైవ్ చేస్తున్నాడు. వేగంగా వెళుతూ ఓవర్ టేక్ చేసే సమయంలోగానీ, కునుకు పట్టడంతోగానీ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సునీత, చలపతిని తణుకు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ప్రమాదం వేకువజాము 4, 5 గంటల మధ్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారు కావడంతో ఇక్కడ జన సంచారం లేదు. అటుగా వెళుతున్న వాహనదారులు చూసి సమాచారం అందించడంతో పెనుగొండ ఎస్ఐ సీహెచ్.వెంకటేశ్వరరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏడాది క్రితమే వివాహం విశాఖపట్నానికి చెందిన చల్లా అరుణకుమార్కు ఏడాది క్రితం నల్లజర్ల మండలం దూబచర్లకు చెందిన అరుసుమిల్లి కూర్మారావు రెండో కుమార్తె నళినితో వివాహమైంది. ఆమె ఐదు రోజుల క్రితం తాడేపల్లిగూడెంలోని ప్రయివేటు ఆస్పత్రిలో ప్రసవించింది. కుమారుడు పుట్టాడు. శని, ఆదివారాలు సెలవు కావడంతో అందరికీ వెసులుబాటు ఉంటుందని కుమారుడిని చూడడానికి తల్లి, తండ్రి, చెల్లి, స్నేహితుడితో కారులో తాడేపల్లిగూడెంలోని ఆస్పత్రికి వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. వివాహమైన ఏడాదిలోనే అల్లుడిని కోల్పోయామంటూ కూర్మారావు కన్నీరుమున్నీరయ్యారు. పచ్చి బాలింతరాలైన కుమార్తెకు అల్లుడి మరణ వార్త ఎలా చెప్పాలంటూ విలవిల్లాడారు. ఉద్యోగంలో చేరకుండానే అరుణకుమార్ పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ వద్ద విశాఖపట్నంలో సివిల్ ఇంజినీర్గా పనిచేశాడు. అతని తండ్రి గంగునాయుడు కేజీహెచ్లో ఉద్యోగం చేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దీంతో అరుణకుమార్కు కేజీహెచ్లో ఉద్యోగం వచ్చింది. త్వరలో ఆ ఉద్యోగంలో చేరాల్సి ఉండడంతో కాంట్రాక్టర్ వద్ద ఉద్యోగం మాసేశాడు. ఈ లోపునే దుర్ఘటన జరిగిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రమాదంలో కాళ్లు, మరో ప్రమాదంలో ప్రాణాలు చల్లా గంగునాయుడు జీవితం ప్రమాదాలతోనే గడిచిపోయింది. విశాఖపట్నం కేజీహెచ్లో ఉద్యోగం చేస్తున్న ఆయనకు ఐదేళ్ల కిత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కర్రల ఊతంతో మాత్రమే కదలగలడు. ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. కొడుకును ఉద్యోగంలో చేర్చాలని ఆశపడ్డారు. ఎట్టకేలకు కుమారుడికి కారుణ్య నియామకం కింద అనుమతులు వచ్చిన తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలన్న ఆశ తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు వారసుడైన మనుమడిని కూడా చూడకుండానే వెళ్లిపోయారని కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయం తెలిసి లా సన్స్బే కాలనీవాసులు మృతుల ఇంటి పనివారు కృష్ణ, వరలమ్మ విషాదంలో మునిగిపోయారు. -
నాలుగున్నరేళ్లలో ‘పోలవరం’ నిర్మాణం
పెనుగొండ రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగున్నరేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ఆదివారం పెనుగొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి, కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, రాయలసీమకు దాహర్తి తీరుతుందని, రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండదని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు కృషి రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అన్నివిధాల కృషి చేస్తున్నారని తెలిపారు. సింగపూర్, జపాన్లలో పర్యటించి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించారన్నారు. పరిశ్రమలకు 24 గంటలు నీరు, విద్యుత్ సదుపాయాలు అందించడానికి పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ఎందరో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, దీంతో యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో 85 శాతం మందికి లబ్ధి చే కూరిందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఉద్యాన పంటలకూ రుణమాఫీని వర్తింపచేశామన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకులు మంత్రి మాణిక్యలరావును సత్కరించారు. సమావేశంలో జెడ్పీటీసీ రొంగల రవికుమార్, ఎంపీటీసీ ఏడిద కోదండ చక్రపాణి, బీజేపీ నాయకులు పిల్లి వెంకట సత్తిరాజు, కానూరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
16 మంది బంగ్లా జాతీయుల అరెస్ట్
పెనుగొండ రూరల్ :ఎటువంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు, పాస్పోర్టులు లేకుండా భారతదేశంలో ప్రవేశించిన 16 మంది బంగ్లా జాతీయులను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర ఎస్సైలు సీహెచ్ వెంకటేశ్వరరావు, జి.కాళీచరణ్, కే.వీరబాబులు వీరిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పశ్చిమబెంగాల్ ద్వారా దేశంలో ప్రవేశించిన వీరు హౌరా నుంచి రాజమండ్రి రైలులో చేరుకున్నారు. అక్కడ నుంచి పెనుగొండ వ చ్చి స్థానిక రైసుమిల్లులో భారత జాతీయులుగా చెప్పుకొని గత మూడు నెలలుగా కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక వెంకట సుబ్రహ్మణ్యం ఇండస్ట్రీయల్ రైసుమిల్లులో పనిచేస్తున్నారు. పశ్చిమబెంగాల్కు చెందినవారిగా నమ్మబలకడంతో వారిని కూలీలుగా చేర్చుకున్నట్టు రైసుమిల్లు యజమాని నార్కెడిమిల్లి సుబ్రహ్మణ్యం పోలీసులకు వివరించారు. బంగ్లా జాతీయులు కూలి డ బ్బులు సైతం పశ్చిమబెంగాల్లోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కు పంపుతుండడంతో నిజంగానే భారత జాతీయులని భావించారు. అయితే, పశ్చిమబెంగాల్లోని వీరి స్నేహితులు బిప్లబ్ బిశ్యాల్, ఫరీన్ల ద్వారా నగదును బంగ్లాదేశ్కు పంపించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇతర దేశస్థుల సంచారంపై అనుమానాలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుగొండ పోలీసులు నిఘా పెట్టారు. దీంతో మిల్లులో పనిచేస్తున్న వీరిపై పెనుగొండ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పశ్చిమబెంగాల్ వాసులుగా చెప్పుకొంటున్న షఫీకుల్ మండల్(34), మహ్మద్ సైఫుల్ (21), మహ్మద్ ఇక్భాల్ షేక్ (24), మహ్మద్ టిప్పు హవల్ద్ (20), మహ్మద్ బైజిద్ ముడల్ (21), మహ్మద్ ఇమ్దద్ ఇస్లాం (32), మహ్మద్ కమరుల్ సర్దార్ (33), మహ్మద్ ఇక్భాల్ హుస్సేన్(30), మహ్మద్ తొరికల్ ఇస్లాం (28), మహ్మద్ జాకీర్ ముల్లా (40), మహ్మమద్ జబ్బార్ (35), మహ్మమద్ అమీరుల్ ఇస్లాం (40), మహ్మద్ బుర్హన్ మున్షీ (35), మహ్మద్ మోహిన్ఖాన్ (25), మహ్మద్ ఫరూక్ హుస్సేన్ (27), మహ్మద్ అర్జాన్ అలీ(21)లపై అక్రమంగా దేశంలోకి చొరబడినట్టు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్లోని 24 పరగణాల దక్షిణ జిల్లాలోని కుంచరస్తాల్ బాగ్తా మండలం మోహిరాణి గ్రామానికి చెందిన షఫీకుల్ మండల్(34) ద్వారా భారతదేశానికి వచ్చినట్టు వారు అంగీకరించారని సీఐ రామారావు తెలిపారు. కేసును ఎస్పీ రఘరామిరెడ్డి, డీఎస్సీ రఘవీరరారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసినట్టు చెప్పారు. -
రుణమాఫీపై సమాధానం చెప్పలేకపోతున్నాం
పెనుగొండ రూరల్: రుణమాఫీ అమలుపై రైతులకు సమాధానం చెప్పలేకపోతున్నాం.. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా అమలు చేయకపోవడం, దీనిపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుండడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాం.. త్వరగా తేల్చాలని పలువురు టీడీపీ నాయకులు, రైతు సంఘాల నేతలు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాతలను ప్రశ్నించారు. సొంత పార్టీ నాయకులే ప్రశ్నల వర్షం కురిపించడంతో వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాష్ట్ర మంత్రులు సునీత, సుజాత సిద్ధాంతం వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు రుణమాఫీపై మంత్రులను పశ్నించారు. రుణమాఫీ అమలు జరుగుతుందని మంత్రులు సమాధానం చెప్పారు. అయితే, రైతు నాయకులు మాత్రం రుణమాఫీ అమలుకు విధించిన నియమ నిబంధనలు, ప్రధానంగా బీమా లబ్ధి ప్రభుత్వమే తీసుకుంటుందన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. బీమా సొమ్ము ప్రభుత్వం తీసుకుంటే రైతులకు రుణమాఫీయే అవసరం లేదన్నారు. అంతేకాక ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ రైతులను అయోమయంలోకి నెడుతోందని, కౌలు రైతులకు, రైతుమిత్ర సంఘాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్యాయం జరుగుతుందని పలువురు నాయకులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడుతోందని వివరించారు. 2013 ఖరీఫ్లో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, బీమా పరిహారం రైతులకే అందేవిధంగా నిర్ణయం తీసుకోవాలని, ఉద్యానశాఖ సర్వేలో కూరగాయల పంటలకు నిర్ణయించిన నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞాపనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని మంత్రులు చెప్పారు. -
సీనియర్ జర్నలిస్ట్ బసవయ్య మృతి
పెనుగొండ/పెనుగొండ రూరల్, న్యూస్లైన్ : సీనియర్ జర్నలిస్ట్, ఇరగవరం మండలం ఏలేటిపాడుకు చెందిన ఇవటూరి వెంకట బసవయ్య(57) మంగళవారం ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం సుస్తీ చేయటంతో తణుకు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం ఆరోగ్యం విషమించడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువ జామున మృతి చెందారు. 1988లో ఉదయం దినపత్రికతో విలేకరిగా జీవితం ప్రారంభించిన బసవయ్య అనంతరం ఆంధ్రప్రభలో పని చేశారు. ప్రస్తుతం వార్త విలేకరిగా ఉన్నారు. బసవయ్యకు కుమారుడు, కుమార్తె సంతానం. పేద కుటుంబం కావడంతో కుమారుడు జీవనోపాధి నిమిత్తం గతేడాది గల్ఫ్ దేశం వెళ్లాడు. మండలంలో ప్రతి ఒక్కరికి సుపరిచితుడైన బసవయ్య మరణవార్తకు అధికారులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏలేటిపాడులోని ఇంటివద్ద ఉంచిన ఆయన మృతదేహాన్ని ఇరగవరం, పెనుగొండ మండలాలకు చెందిన పలు పార్టీల నాయకులు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పెనుగొండ జెడ్పీటీసీ రొంగల రవికుమార్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు యాదాల ఆశాజ్యోతి, బిరుదగంటి రత్నరాజు, కడలి మంగాదేవి, కేతా భీముడు, పమ్మి మురళీ వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కేతా సత్యనారాయణ(సత్తిబాబు) తదితరులు ఉన్నారు. ఆచంట ప్రెస్ క్లబ్ రూ.10వేల ఆర్థిక సాయం ఆచంట నియోజకవర్గ ప్రెస్క్లబ్ సభ్యులు బసవయ్య కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు జవ్వాది మోహన వెంకటేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి గుర్రాల శ్రీనివాసరావు, సభ్యులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల సంతాపం ఏలూరు (ఫైర్ స్టేషన్ సెంటర్) : సీనియర్ జర్నలిస్ట్ ఐవీ బసవయ్య ఆకస్మిక మృతి పట్ల పలువురు ఉన్నతాధికారులు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సమాచార పౌరసంబంధాల శాఖ సహాయ సంచాలకులు వి.భాస్కర నరసింహం, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.భాస్కర నారాయణ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జీవీఎస్ఎన్ రాజు, కొవ్వూరు డివిజనల్ పౌరసంబందాధికారి కె. రామ్మోహనరావు, ఏలూరు డివిజనల్ పౌరసంబందాధికారి ఆర్వీఎస్ రామచంద్రారావు తదితరులు ఉన్నారు. -
ఉద్యమాలకు పుట్టిల్లు.. క్రీడలకు మెట్టినిల్లు
ఆచంట, న్యూస్లైన్ : పచ్చని పంట పొలాలు.. పుడమి తల్లికి వింజామరలు పట్టినట్టుండే కొబ్బరి తోటలు.. గలగల పారే గోదావరి.. దీవుల్లాంటి లంక గ్రామాలు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు.. ఆహ్లాదకర వాతావరణాల కలబోత ఆచంట నియోజకవర్గం. పల్లె ప్రాంతమైనా ఇక్కడి ప్రజలు మాత్రం పట్టణ వాసులకు దీటుగా రాజకీయ చైతన్యంతో వ్యవహరిస్తుంటారు. జిల్లాలోనే అత్యధికంగా కమ్యూనిస్టుల ప్రభావం కలిగిన నియోజకవర్గం ఇది. ఉద్యమాలకు పుట్టినిల్లుగా.. క్రీడలకు మెట్టినిల్లుగా భాసిల్లుతోంది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కాళీపట్నం పోరాటం.. వ్యవసాయ కూలీ ఉద్య మం.. ఆకలి యాత్ర తదితర పోరాటాలలో ఈ ప్రాంతవాసులు ప్రధాన భూమికను పోషించారు. ఉద్యమాల్లో అమరులైన ప్రేరేప మృత్యుంజయుడు, ఒక తాళ్ల బసవ మల్లయ్య వంటి ధీరులెందరో పుట్టిన గడ్డ ఇది. రిజర్వుడు నియోజకవర్గమైన ఆచంట 1962లో ఏర్పడింది. 2009 పునర్విభజనలో జనరల్ కేటగిరీకి మారింది. పునర్విభజన అనంతరం నియోజకవర్గ స్వరూపమే మారిపోయింది. పెనుగొండ నియోజకవర్గం రద్దయి పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట మండలాలతోపాటు పోడూరులో సగభాగంతో ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇప్పటివరకూ నియోజవర్గంలో 11సార్లు ఎన్నికలు జరగ్గా, అన్ని ప్రధాన పార్టీలను గెలిపించి ఆచంట ఓటరు తమ విలక్షణతను చాటుకున్నారు. ఇప్పటివరకూ ఒకసారి ఉభయ కమ్యూనిస్టు పార్టీ, మూడుసార్లు సీపీఎం, మూడుసార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 286 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున వశిష్ట గోదావరి, పడమర తణుకు నియోజకవర్గం, ఉత్తరాన ఎన్హెచ్-5 జాతీయ రహదారి, దక్షిణాన పాలకొల్లు నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. పెనుగొండలో ప్రసిద్ధి గాంచిన ఎస్వీకేపీ డిగ్రీ, పీజీ కళాశాలలు, ఆచంటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాల, పోడూరులో కల్నల్ డీఎస్ రాజు పాలిటెక్నిక్ కళాశాల, పెనుమంట్ర మండలంలో రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలు, డైట్, బీఈడీ, పీఈటీ కళాశాలలు ఉన్నాయి. మార్టేరులోని వరిపరిశోధనా కేంద్రం రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. దేశంలోనే ప్రసిద్ధి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, వాసవీధామ్, ఆచంటలోని జైన దేవాలయం, పెదమల్లంలో మాచేనమ్మ ఆలయం, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి ఆలయం, పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరంలో నత్తా రామేశ్వరస్వామి, జుత్తిగలోని సోమేశ్వర ఆలయాలు పురాణ ప్రాశస్త్యం పొందారుు. క్రీడలకు స్ఫూర్తి క్రీడలకు, క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే నియోజవర్గంగా ఆచంట వెలుగొందుతోంది. పరుగుల రాణి సత్తి గీత ఈ ప్రాంతానికి చెందినవారే. మార్టేరులో బాస్కెట్బాల్, ఆచంటలో వాలీబాల్ పోటీలను రాష్ట్రస్థారుులో నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ వాలీబాల్, బాస్కెట్బాల్ పోటీల్లో నియోజకవర్గానికి చెందిన పలువురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది. పలువురు నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. పితాని చేరికతో టీడీపీలో వర్గపోరు మొదలైంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా వెలుగొందిన ఈ నియోజకవర్గంలో క్రమంగా ఆ పార్టీ పట్టు కోల్పోరుుంది. ప్రజా సమస్యలపై పోరాటాల ద్వారా ఆ పార్టీ ఉనికిని చాటుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో వెనుకబడిన తరగతులకు చెందిన పితాని సత్యనారాయణకు జనరల్ నియోజకవర్గమైన ఆచంట టికెట్ ఇచ్చి సుదీర్ఘ విరామం తరువాత తెలుగుదేశం కంచు కోటను బద్దలు కొట్టించారు. అంతే కాకుండా పితానికి తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు. అంతకు ముందు 1967లో ఇక్కడి నుంచి గెలుపొందిన దాసరి పెరుమాళ్లు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. -
మనీ యర్నింగ్ కేంద్రాలుగా ‘మీ సేవ’లు
పెనుగొండ రూరల్, న్యూస్లైన్ : నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ, పాలనను ప్రజల చెంతకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాలు కొందరు అక్రమార్కులకు మనీ యర్నింగ్ కేంద్రాలుగా మారుతున్నాయి. సిబ్బంది చేతివాటం, కొందరు నిర్వాహకుల ధనాశ వెరసి మీసేవా వ్యవస్థ అభాసుపాలవుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీ సేవా కేంద్రాలు నివాస, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ వంటి 125 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం కొత్తగా రిజిస్ట్రేషన్లను సైతం మీసేవకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భవిష్యత్లో ఎంతో కీలకంగా వ్యవహరించనున్నాయి. ఇలా ఉండగా గురువారం పెనుగొండ పోలీసులు మీసేవ కేంద్రాల ద్వారా జరుగుతున్న అవకతవకలను బయట పెట్టడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు నిర్వాహకులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటూ కొందరు అధికారులతో కుమ్మక్కై నకిలీ ధ్రువీకరణ పత్రాలతో జేబులు నింపుకుంటున్నారు. ప్రభుత్వం అందచేసే మోనోగ్రామ్లను నకిలీలకు అంటిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్లో సంబంధిత అధికారి సంతకం కాగానే స్టాంపు వేసి ఇవ్వడానికి మీసేవా నిర్వాహకులకు అవకాశం ఉంది. ఈ అవకాశమే ఆదాయానికి ప్రధాన వనరుగా మారుతోంది. సంబంధిత అధికారుల సంతకాలు వారే చేస్తూ స్టాంపుని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మోనోగ్రాముల సంఖ్య, స్టాంపు వినియోగించిన వివరాలు ఆయా మండలాల్లోని తహసిల్దార్ కార్యాలయానికి అందించాల్సి ఉన్నా వాటిని తూతూమంత్రంగా నిర్వహిస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఒక్క పిట్టల వేమవరం మీసేవా కేంద్రంలోనే నాలుగు నెలల కాలంలో 60 జనన ధ్రువీకరణ పత్రాలు, 100 ఓటరు గుర్తింపు కార్డులు, 50 నివాస ధ్రువీకరణ పత్రాలు నకిలీవి జారీ అయితే, జిల్లావ్యాప్తంగా ఉన్న మరికొన్ని కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చునన్న భావన వ్యక్తమవుతోంది. మీ సేవ కేంద్రాల్లో నకిలీ ధ్రువీకరణ పత్రాల జారీపై జిల్లా జాయింట్ కలెక్టర్ టి. బాబూరావు నాయుడు దృష్టికి పోలీసు అధికారులు తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో విస్తృత తనిఖీలు నిర్వహించి మీసేవ కేంద్రాల్లో అక్రమార్కులను పట్టుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
పెనుగొండ, న్యూస్లైన్ : పై-లీన్ తుపాను, అల్పపీడనం కారణంగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని పలువురు రైతులు, రైతు సంఘాల నాయకులు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కోరారు. శనివారం ఉదయం స్థానిక ఏఎంసీ కార్యాలయంలో సహకార సంఘాలు దీర్ఘకాలిక రుణాలపై అందించిన ట్రాక్టర్లను, ద్విచక్రవాహానాలను రైతులకు సీఎం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనను కలిసి తమ కష్టాలను మొరపెట్టుకున్నారు. ప్రకృతి విలయాల కారణంగా ఏటా నష్టపోతున్నామని తమను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పై-లీన్ తుపాన్ కారణంగా వరి చేలు నేలనంటాయని, ఈనిక సమయంలో వర్షాలు కురిసినందున వెన్నులోని గింజలు పొల్లుగా మారాయని ములపర్రు సొసైటీ అధ్యక్షుడు టీవీసీహెచ్ నాగేశ్వరరావు సీఎంకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. సహకార సంఘాల్లో రుణాలు పొందిన రైతులకు రెండేళ్లుగా పావలా వడ్డీ రాయితీ రావాల్సి ఉందని, ఈ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఇలపర్రు సొసైటీ అధ్యక్షుడు చేకూరి సుబ్బరాజు కిరణ్కుమార్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సహకార సంఘాల ద్వారా రుణాలు తీసుకుంటున్న రైతులకు ఈసీలు మీ సేవ ద్వారా తీసుకోవడం వల్ల అదనపు ఆర్థిక భారమవుతోందని విన్నవించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం ఎన్నో పథకాలను అమలు చేసి అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని, ఉచిత విద్యుత్, ఇతర రాయితీలు అందిస్తన్నామన్నారు. ఈ సందర్భంగా రూ. 6.30 లక్షల విలువైన 16 ట్రాక్టర్లను, 16 ద్విచక్రవాహనాలను అందజేశారు. అనంతరం సీఎం కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కొత్తపల్లి సుబ్బారాయుడు, బంగారు ఉషారాణి, ఈలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, కలెక్టర్ సిద్ధార్థజైన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి వినతుల వెల్లువ ఈ సందర్భంగా పలువురు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి వినతులు అందజేశారు. అనేక గ్రామాలకు ప్రధాన కూడలిగా ఉన్న మార్టేరును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామానికి చెందిన వెలగల నాగేశ్వరరెడ్డి, నల్లిమిల్లి వివేకానందరెడ్డి, తేతలి రాజారెడ్డి, కర్రి జగధీశ్వరరెడ్డి విన్నవించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధతకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముప్పిడి మోషేమాదిగ, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాపాక ప్రభాకర్ మాదిగ సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లా అధికారులను ప్రశంసించిన సీఎం ఏలూరు : జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎంతో కష్టపడ్డారని కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ టి. బాబూరావునాయుడు, ఎస్పీ హరికృష్ణలను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్ రెడ్డి ప్రశంసించారు. కృష్ణా జిల్లా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం పెనుగొండ ఏఎంసీ గ్రౌండ్స్లో హెలికాప్టర్లో బయలుదేరే సమయంలో ముఖ్యమంత్రి జిల్లా అధికారులను ప్రశంసించారు. జేసీ బాబూరావునాయుడిని ప్రత్యేకం ము ఖ్యమంత్రి పిలిచి కరచాలనం చేసి ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి మరింత కష్టపడాలని సూచించారు. -
సీఎం పర్యటన ఖరారు
ఏలూరు, న్యూస్లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 3 గంట లకు పెనుగొండలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయూనికి చేరుకుం టారు. అక్కడ అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ప్రయూణించి 3.30 గంటలకు పోడూరు మండలం జగన్నాథపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహించే రచ్చబండ సభలో పాల్గొంటారు. వివిధ పథకాల కింద ఉపకరణాలు, మంజూరు పత్రాలు అందిస్తారు. సాయంత్రం 6గంటలకు పెనుగొండ ఏఎంసీ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. -
భవిష్యత్ నానో టెక్నాలజీదే
పెనుగొండ, న్యూస్లైన్ : నానో టెక్నాలజీకి మంచి భవిష్యత్ ఉందని, ఒక నానోమీటర్ను ఉపయోగించి అణువు, అంతకంటే తక్కువ పరిమాణం గల పదార్థాల కొలమానంపై అంచనాకు రావచ్చని హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆనంద్పాఠక్ అన్నారు. స్థానిక ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్రాజు ఆర్ట్స్ అండ్ సైన్స కళాశాల సెమినార్ హాల్లో కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ రెండో రోజు వర్కుషాప్లో ఆదివారం ఆయన మాట్లాడారు. నానో టెక్నాలజీతో కంప్యూటర్ మెమొరీ సామర్థ్యం పెంచవచ్చని, వైద్యరంగంలో క్యాన్సర్ కణాలను నియంత్రించడానికి నానో ట్యూబ్లు ఉపయోగపడతాయని చెప్పారు. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ లిమిటెడ్ హైదరాబాద్కు చెందిన మన్నం కృష్ణమూర్తి విజ్ఞానశాస్త్రం నిర్వచనం, రసాయన శాస్త్ర ప్రాధాన్యతలను, హైడ్రోకార్బన్ వర్గానికి చెందిన నూనెలు, కొవ్వు పదార్థాల సంక్లిష్ట నిర్మాణాల గురించి వివరించారు. హైదరాబాద్ కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి.కన్నన్ మాట్లాడుతూ సంఖ్యాశాస్త్రంలో రెండో ఘాతం గురించి వివరించారు. అనంతరం భౌతికశాస్త్రం, కంప్యూటర్, రసాయన శాస్త్రం, బాటనీ, జువాలజీలో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేశారు. ప్రిన్సిపాల్ జె.రాజేశ్వరరావు, క్యాంప్ కో-ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.శ్రీనివాసరావు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ ఆర్కే కొండముది, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి'
పాలకొల్లు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన నిరాహారదీక్ష రాష్ట్ర విభన కోరుకునేవిధంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. చంద్రబాబు దీక్ష సమైక్యవాదానికి తూట్లుపొడిచేలావుందన్నారు. చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు దీక్షలు, ఆత్మగౌరవ యాత్రలను ప్రజలు నమ్మేస్థితిలో లేదని చెప్పారు. 'తెలంగాణ నోట్'కు వ్యతిరేకంగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్లో మేకా శేషుబాబు ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. మరోవైపు వైఎస్ జగన్ దీక్షకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగుతున్నాయి. తణుకు నియోజకవర్గం సమన్వయకర్త చీర్ల రాదయ్య ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. పెనుగొండలో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జగన్ దీక్షకు మద్దతుగా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 62వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆకివీడు జాతీయ రహదారిపై 5000వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్తిలి బస్టాండ్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొంటున్న ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. -
8లక్షలూ నకిలీ కరెన్సీయే
పెనుగొండ, న్యూస్లైన్ : పెనుమంట్ర మండలం వెలగలేరులో ఇటీవల ఇద్దరు మహిళల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ నకిలీదని నిర్ధారణ అయింది. వెలగలేరుకు చెందిన కర్రి సుజాత రూ. 3 లక్షలు, పెనుగొండకు చెందిన మేడపాటి వెంకటలక్ష్మి రూ.5లక్షల నకిలీ నోట్లతో దొరికారు. అయితే అవి అసలు నోట్లకు తీసిపోని విధంగా ఉండటంతో వాటిని పోలీసులు పరీక్షల నిమిత్తం పంపగా అవి నకిలీవని తేలింది. పెనుగొండ సీఐ వానసల్లి సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం. యానాంకు చెందిన కోనాల సత్యనారాయణ రెడ్డి గతంలో జీడిపిక్కల వ్యాపారం చేశాడు. వ్యాపార భ్వాగస్వాములుగా కర్రి సుజాత, మేడపాటి వెంకటలక్ష్మి చేరారు. వీరిద్దరు పెట్టుబడిగా కొంత మొత్తం అతనికి ఇచ్చారు. సత్యనారాయణరెడ్డి దొంగనోట్ల కేసులో పట్టుబడి ప్రస్తుతం కోల్కతా జైలులో ఉన్నాడు. జైలు నుంచి వీరికి ఫోన్ చేసి మీకు అప్పులు పెరిగి పోతున్నాయని తెలిసి మధ్యవర్తుల ద్వారా రూ.8లక్షలు పంపుతున్నానని, వాటితో అప్పులు తీర్చుకోమని చెప్పాడు. ఆ మహిళలు ఆ డబ్బు తీసుకున్నారు. అయితే అవి దొంగ నోట్లు. నిందితులు ఇద్దరిలో మేడపాటి వెంకటలక్ష్మి 2007లో ఆచంటలో దొంగనోట్లు మార్చుతూ పోలీసులకు చిక్కింది. ఆ కేసు కోర్టులో ఉంది. నకిలీ నోట్లు తీసుకువచ్చిన మధ్యవర్తులను పట్టుకోవాల్సి ఉందని సీఐ తెలిపారు. ఇద్దరు మహిళలను అరెస్ట్చేసి తణుకు కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. వీరిని పట్టుకోవడానికి పెనుగొండ, పెనుమంట్ర ఎస్సైలు సీహెచ్ వెంకటేశ్వరరావు, డి.ఆదినారాయణ, హెడ్ కానిస్టేబుల్స్ విజయలక్ష్మి, విక్టర్, కానిస్టేబుల్స్ సుధారాణి, జానకిరామ్, శ్రీను, ఏడుకొండలు, బాబ్జీ కృషి చేశారని సీఐ తెలిపారు. నోట్లను జాగ్రత్తగా పరిశీలించండి నకిలీనోట్లు సామాన్యులు గుర్తించిలేని విధంగా ఉన్నాయని సీఐ చెప్పారు. అసలు నోట్లపై ఉండే అన్ని గుర్తులూ ఈ నోట్లపై ఉన్నాయని వివరించారు. కాగితం మందంగాను, నోటు మధ్యలో ఉండే దారంవద్ద ఉబ్బెత్తుగా ఉండడంతో అవి నకిలీ నోట్లని నిర్ధారించినట్లు తెలిపారు. రూ.500, రూ.1000 నోట్లు వచ్చినపుడు వ్యాపారులు అతిజాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. -
నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు మహిళలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ నకిలీ నోట్లు వారికి ఎలా వచ్చాయి. నకిలీ నోట్ల చలామణి ఎంత కాలంగా సాగుతోంది, నకిలీ నోట్ల ముఠాలు ఏమైన వారితో ఈ పనులు చేయిస్తున్నాయా అనే కోణంలో పోలీసులు ఆ మహిళలను దర్యాప్తులో భాగంగా విచారిస్తున్నారు.