
హంస వాహనంపై ఊరేగిన లక్ష్మీనృసింహుడు
ఉరవకొండ రూరల్ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామి వారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ రమేష్బాబు, ప్రధాన అర్చకులు ద్వారకానాథాచార్యులు ఆధ్వర్యంలో భూదేవి, శ్రీదేవి సమేత శ్రీలక్ష్మీనృసింహుడిని ప్రత్యేకంగా అలంకరించి హంస వాహనంపై పురవీధుల గుండా ఊరేగించారు.