జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు.
లెక్చరర్లకు కంప్యూటర్ శిక్షణ
Aug 4 2016 12:28 AM | Updated on Sep 4 2017 7:40 AM
కాజీపేట రూరల్ : జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు ఈనెల 12 నుంచి 17 వరకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కాజీపేటలోని నిట్లో భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఎలక్ట్రానిక్స్ ఐసీటీ అకడమిక్ ద్వారా తక్కువ ఫీజుతో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎల్.ఆంజనేయులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టూల్స్, ఇంటర్నెట్, ఈ–మెయిల్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ౖyð రెక్టర్, నిట్, వరంగల్ పేరిట తీసిన రూ.200 డీడీతో ప్రిన్సిపాల్ అనుమతి పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Advertisement
Advertisement