nit
-
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15,000 సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు (IITs) యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్లనే కౌన్సెలింగ్లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిటఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్టినంగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి. సీటు అక్కడే కావాలి... జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి (IIT Bombay) మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ (IIT Hyderabad) నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు. ఎన్ఐటీల్లో... ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్ఐటీలో కంప్యూటర్ సైన్స్కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది. తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. చదవండి: ఊరంతా ఉద్యోగులే.. ప్రతి ఇంట్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి..ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
ఐఐటీలు, ఎన్ఐటీల్లో మరో 15వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది.ప్రాథమిక అంచనా ప్రకారం 15 వేల (ఐఐటీల్లో 5 వేలు, ఎన్ఐటీల్లో 10 వేలు) సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి. కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు. దాదాపు 1.45 లక్షల మంది ఈ బ్రాంచ్లనే కౌన్సెలింగ్లో మొదటి ఐచ్ఛికంగా ఎంచుకున్నారు. సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతోపాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నాయి. వీటికి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలో నిర్ణయం రావొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఐఐటీల్లో ఈ ఏడాది ఏఐ/ఎంఎల్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/మిషన్ లెర్నింగ్), డేటా సైన్స్ తదితర కంప్యూటర్ కోర్సుల్లో కనీసం 4 వేల సీట్లు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 17 వేల సీట్లు ఉన్నాయి.సీటు అక్కడే కావాలి...జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు పొందిన వారు బాంబే–ఐఐటీపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల సీట్ల పెంపునకు కేంద్రం అంగీకరిస్తే బాంబే–ఐఐటీకి మొదటి ప్రాధాన్యమిచ్చే వీలుంది. ఆ తర్వాత ఢిల్లీ, కాన్పూర్, మద్రాస్ ఐఐటీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వీటి తర్వాత స్థానంలో హైదరాబాద్ ఐఐటీ నిలిచింది. బాంబే ఐఐటీలో ఓపెన్ కేటగిరీలో బాలురు 67, బాలికలు 291వ ర్యాంకుతో క్రితంసారి సీటు కేటాయింపు ముగిసింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకూ సీటు దక్కింది. అయితే, విద్యార్థులు అంతగా ప్రాధాన్యమి వ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకూ సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో బిలాల్ ఐఐటీ ఉంది. ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెంచడం అవసరం లేదని భావిస్తున్నారు.ఎన్ఐటీల్లో...ఐఐటీల్లో సీట్ల పెంపు నేపథ్యంలో ఎన్ఐటీల్లో ఈసారి కటాఫ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్ ఎ¯న్ఐటీలో కంప్యూటర్ సైన్స్కు అంతకుముందు 1996 ర్యాంకు వరకూ సీటు వస్తే, 2024లో బాలురకు 3115 ర్యాంకు వరకూ సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2025లో 4 వేల ర్యాంకు వరకూ సీటు వచ్చే అవకాశముంది.తమిళనాడు తిరుచిరాపల్లి ట్రిపుల్ఐటీలో బాలురకు గత ఏడాది 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోగా, ఈ ఏడాది మాత్రం బాలురకు 1,509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా కంప్యూటర్ సైన్స్ను ఎంచుకోగా, రెండో ప్రాధాన్యత కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. మొత్తం మీద గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకూ బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్కు మాత్రం 58 వేల ర్యాంకు వరకూ ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్గా ఉంది. బయోటెక్నాలజీకి 48 వేల వరకూ సీటు వచ్చింది. ఈసారి సీట్లు పెరిగితే ఈ కటాఫ్లో మార్పులు ఉండొచ్చని భావిస్తున్నారు. -
జేఈఈ మెయిన్కు దరఖాస్తుల జోరు
సాక్షి, అమరావతి: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ పరీక్షకు ఈ ఏడాది కూడా దరఖాస్తుల జోరు కొనసాగింది. జేఈఈ మెయిన్–2025 జవనరి సెషన్ కోసం సుమారు 12 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. జవనరి 22 నుంచి 31వరకు తొలి సెషన్, ఏప్రిల్ 1 నుంచి 8 వరకు రెండో సెషన్ పరీక్షలకు షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. విద్యార్థులు జనవరి 19 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం జనవరి సెషన్కు అక్టోబర్ 28 దరఖాస్తుల విండో ప్రారంభమైనా... మొదటి రెండు వారాల్లో కేవలం 5.10లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్త విధానాలు, అర్హత ప్రమాణాల మార్పులు విద్యార్థులను గందరగోళానికి గురిచేసినట్లు నిపుణులు చెబుతున్నారు. దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు ప్రత్యేకంగా అప్లోడ్ చేయాల్సి రావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయినా చివరికి ఈ నెల 22వ తేదీన గడువు ముగిసే నాటికి 12లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గత ఏడాది కంటే దరఖాస్తులు స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎన్టీఏ ప్రకటించాల్సి ఉంది.ఐచ్ఛిక ప్రశ్నలు, వయసు పరిమితి తొలగింపు..కోవిడ్ సమయంలో తీసుకొచ్చిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో సెక్షన్–బీలోని ఐచ్ఛిక ప్రశ్నల విధానాన్ని ఎన్టీఏ తొలగించింది. ఇప్పుడు సెక్షన్–బీలోని ప్రతి సబ్జెక్టులో పది ప్రశ్నలకు బదులు ఐదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. మరోవైపు న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ పద్ధతిని తీసుకొచ్చింది. అంటే మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల మాదిరిగానే ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది. ఎన్టీఏ కొత్తగా వయోపరిమితిని సైతం సడలించింది. 12వ తరగతి విద్యా అర్హత కలిగిన ఎవరైనా ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.టై బ్రేక్ రూల్స్ మార్పు...– జేఈఈ మెయిన్–2025లో ఒకే మార్కులు వచ్చినప్పుడు అభ్యర్థుల ర్యాంకుల టై బ్రేక్ రూల్స్ను ఎన్టీఏ సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం పరీక్ష రాసేవారి వయసు, దరఖాస్తు సంఖ్యను ర్యాంకింగ్ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోరు.– విద్యార్థులు ఒకే మొత్తం స్కోర్ను సాధిస్తే సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు. – గణితంలో ఎక్కువ స్కోరు సాధించిన అభ్యర్థులు టై సమయంలో ఉన్నత ర్యాంక్ పొందుతారు.– గణితంలోను ఒకే మార్కులు వచ్చినప్పుడు ఫిజిక్స్లో ఎక్కువ స్కోర్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ కూడా ఒకే మార్కులు సాధిస్తే కెమిస్ట్రీ స్కోర్ను పరిగణనలోకి తీసుకుంటారు.– వీటి ద్వారా టై సమస్య కొలిక్కి రాకపోతే అన్ని సబ్జెక్ట్లలో సరైన సమాధానాలకు, సరికాని సమాధానాల నిష్పత్తి తక్కువగా ఉన్న అభ్యర్థులకు ఉన్నత ర్యాంక్ కేటాయిస్తారు. వీటిల్లోను నిష్పత్తి టై అయితే గణితం, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో వరుసగా సరికాని సమాధానాల నిష్పత్తులను గుర్తిస్తారు. – ఈ అన్ని దశల తర్వాత కూడా టై మిగిలి ఉంటే అభ్యర్థులకు అదే ర్యాంక్ కేటాయిస్తారు. దేశ, విదేశాల్లో తగ్గిన పరీక్ష కేంద్రాల నగరాలు..దేశంలో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించే నగరాలను 300 నుంచి 284కి తగ్గించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను నిర్వహించే నగరాలను 24 నుంచి 14 కుదించారు. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, హాంకాంగ్ వంటి దేశాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను తొలగించింది. కొత్తగా బహ్రెయిన్, జర్మనీ, ఇండోనేషియా, ఏయూఈలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్లో 11 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను తొలగించడంతోపాటు మరికొన్ని నగరాల్లో సెంటర్లను తగ్గించారు. తెలంగాణాలో రెండు కొత్తగా రెండు నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.ఏపీలో పరీక్షా కేంద్రాలు ఇవే...అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.ఏపీలో పరీక్ష కేంద్రాలు తొలగించిన పట్టణాలుఅమలాపురం, బొబ్బిలి, చీరాల, గుత్తి, గుడ్లవల్లేరు, మదనపల్లె, మార్కాపురం, పుట్టపర్తి, పుత్తూరు, తాడిపత్రి, తిరువూరు. -
ఏపీ నిట్లో 125 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్లో ఉద్యోగాల జాతర త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. అర్హులైనవారు అక్టోబరు 10లోపు దరఖాస్తులు సమర్పించాలి. కేంద్ర ఉన్నత విద్యా శాఖ విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికపరమైన ఆమోదాలు, పరిపాలనా పరమైన ఆమోదాలు దాటి ఫ్యాకల్టీల భర్తీకి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు కలిపి మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–10కు సంబంధించి 48 పోస్టులను భర్తీ కానున్నాయి. వీటిలో అన్ రిజర్వ్డ్ కోటాలో 20, ఓబీసీలకు 13, ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, ఈడబ్ల్యూఎస్ కింద 5 కేటాయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–11కు సంబంధించి భర్తీ చేయనున్న 20 పోస్టుల్లో అన్ రిజర్వ్డ్కు 9, ఓబీసీకి 5, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒకటి, ఈడబ్ల్యూఎస్కు 2 పోస్టులు కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్–13 ఏ2 కేటగిరీకి సంబంధించి 30 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అన్ రిజర్వ్డ్కు 12, ఓబీసీకి 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ఈడబ్ల్యూఎస్కు 3 పోస్టులను కేటాయించారు. ప్రొఫెసర్ 14ఏ గ్రేడ్కు సంబంధించి 7 పోస్టులను భర్తీ చేయనుండగా, వీటిలో అన్ రిజర్వుడ్కు 4, ఓబీసీకి ఒకటి, ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి పోస్టులను రిజర్వు చేశారు. బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్, ఎంఎంఈ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, ఫిజిక్స్, మ్యా«థ్స్, కెమిస్ట్రీ, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్ విభాగాల్లో కొత్తగా తీసుకొనే ఫ్యాకల్టీలను నియమించనున్నారు. -
పాట్నా ఎన్ఐటీలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య
పాట్నా: ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్ధిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) పాట్నాలో ఆత్మహత్యకు పాల్పడింది. బిహ్తాలో క్యాంపస్లోని శుక్రవారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సూసైడ్ లేఖ కూడా లభ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు.శుక్రవారం రాత్రి 10.15 గంటల ప్రాంతంలో విద్యార్థిని హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్ధులు యాజమాన్యానికి తెలియజేశారు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకుని విద్యార్ధినిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే యువతి చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.మృతురాలి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అని, ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైందని, ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. అయితే విద్యార్ధిని మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని చెప్పారు. మరోవైపు విద్యార్థి మరణవార్త తెలియడంతో పెద్ద సంఖ్యలో ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఏపీ నిట్.. ప్లేస్మెంట్స్లో హిట్
తాడేపల్లిగూడెం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ప్రాంగణ నియామకాల్లో సత్తా చాటుతోంది. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నవారికి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీల్లో లేఆఫ్లు కొనసాగుతున్నా.. ఏపీ నిట్ విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు దక్కుతున్నాయి. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలను సాధిస్తున్నారు. 2022 బ్యాచ్లో 98 శాతం, 2023లో 97 శాతం మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. ఏపీ నిట్ ప్రారంభించిన దగ్గరి నుంచి ఇప్పటివరకు ఏడాదికి 300 మందికి తక్కువ కాకుండా ఉద్యోగాలు పొందడం విశేషం. త్వరలో 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆరో బ్యాచ్ బయటకు రానుంది. 258 మందికి ఉద్యోగాలుక్యాంపస్ ఇంటర్వ్యూల కోసం ఏకంగా 127 కంపెనీలు నిట్ ప్రాంగణానికి వచ్చాయి. ఆరో బ్యాచ్ విద్యార్థుల్లో ప్లేస్మెంట్స్ కోసం 392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 258 మంది (65.82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. సరాసరి వేతనం రూ.7.15 లక్షలుగా ఉంది. బీటెక్ ఫైనలియర్ సీఎస్ఈ చదువుతున్న ఆదర్‡్ష, ఈసీఈ విద్యార్థి ఆకాష్కుమార్ సిన్హా అత్యధికంగా రూ.44.1 లక్షల వార్షిక ప్యాకేజీ పొందారు. వీరిని నివిధ కంపెనీ ఎంపిక చేసుకుంది. అలాగే సీఎస్ఈ విద్యార్థి సలాది వెంకట శశిభూషణ్.. పేపాల్ కంపెనీలో రూ.34.4 లక్షల ప్యాకేజీతో, సీఎస్ఈ బ్రాంచ్కే చెందిన స్వామి సక్సేనా జెడ్ఎస్ కేలర్లో రూ.26.5 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం విశేషం. కాగా డిసెంబర్ వరకు ప్లేస్మెంట్స్ ప్రక్రియ కొనసాగనుంది.480 సీట్ల భర్తీనిట్లో 2024–25 సంవత్సరానికి సంబంధించి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మొదటి రౌండ్లో 480 సీట్లకు అలాట్మెంట్లు పూర్తయ్యాయని రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి గురువారం తెలిపారు. నిట్లో సీఈసీ, ఈఈఈ, ఈసీఈ బ్రాంచ్ల్లో 90 సీట్ల చొప్పున ఉన్నాయన్నారు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్ల్లో 60 చొప్పున, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఎంఎంఈ బ్రాంచ్ల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 480 సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు, మిగిలిన 50 శాతం సీట్లను ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా కేటాయించామన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 24లోపు ఆన్లైన్ రిపోర్టింగ్తో పాటు ఫీజు చెల్లించాలని కోరారు. ఆగస్టు మొదటి వారంలో నిట్ ప్రాంగణానికి వచ్చి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. దీని కోసం నిట్లో ప్రత్యేక కేంద్రం పనిచేస్తోందన్నారు. -
మరో 4 వేల సీట్లు!
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ఇంజనీరింగ్ సీట్లు పెంచే అవకాశం ఉందని సమాచారం. 3 వేల నుంచి 4 వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ఒకరు తెలిపారు. సీట్లు పెరగడం వల్ల సీట్ల కటాఫ్లో మార్పు జరిగి చేరికల్లో ఎక్కువ మందికి చాన్స్ లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. అదనంగా నిధులూ అవసరమవుతాయి. దీంతో ఆన్లైన్ కోర్సుల నిర్వహణ ద్వారా ఐఐటీలు కొంతమేర నిధులు సమకూర్చుకునే ప్రతిపాదన ముందుకు వస్తోంది. కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ నేపథ్యంలో.. దేశంలో కంప్యూటర్ నేపథ్యం ఉన్న కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. తక్షణ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, మంచి ప్యాకేజీల దృష్ట్యా రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎన్ఐటీలు, ఐఐటీల్లోనూ కంప్యూటర్ ఆధారిత కోర్సులపై విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. జేఈఈలో అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్ష¯న్గా పెట్టుకుంటున్నారు. మరోవైపు నైపుణ్యంతో కూడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కొరత ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ సదస్సులోనూ ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఐఐటీలు సైతం కంప్యూటర్ కోర్సుల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఐటీలు, ఐఐటీల్లో సీట్లు పెంపు దిశగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొంబయి ఫస్ట్..ఢిల్లీ, మద్రాస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో 15 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బొంబయి ఐఐటీకి ప్రతి ఏటా డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ ఐఐటీని జేఈఈ అడ్వాన్స్డు ర్యాంకు పొందిన వాళ్లు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ఖరగ్పూర్, మద్రాస్కు ప్రాధాన్యమిస్తున్నారు. తర్వాతి స్థానంలో హైదరాబాద్ ఐఐటీ ఉంటోంది. గత ఏడాది ముంబై ఐఐటీలో ఓపె¯న్ కేటగిరీలో బాలురైతే 67, బాలికలైతే 291వ ర్యాంకు వరకు సీటు కేటాయింపు జరిగింది. మొత్తం మీద మంచి పేరున్న ఐఐటీల్లో 5 వేల లోపు ర్యాంకు వరకు సీటు దక్కింది. ఇక విద్యార్థులు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఐఐటీల్లో 11,200 ర్యాంకు వరకు సీట్లు వచ్చాయి. ఈ కేటగిరీలో భిలాయ్ ఐఐటీ ఉంది. ఈ నేపథ్యంలో సీట్లు పెరిగితే మరింత మంది విద్యార్థులకు అవకాశం దక్కనుంది. ఎన్ఐటీల్లోనూ అవకాశాలు దేశవ్యాప్తంగా ఐఐటీ సీట్లు పెరిగితే ఎన్ఐటీల్లోనూ విద్యార్థులకు అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఐఐటీల్లో సీట్లు పెరగడం వల్ల మెరుగైన ర్యాంకులు పొందినవారు ఐఐటీలో చేరుతారు. మరోవైపు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరిగే వీలుంది. కాబట్టి కటాఫ్లో మార్పులు ఉండొచ్చని, ఎక్కువమందికి సీట్లు లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో వరంగల్ ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్లో 1996 ర్యాంకు వరకు సీటు వస్తే, 2023లో బాలురకు 3115 ర్యాంకు వరకు సీటు వచ్చింది. సీట్లు పెరిగితే 2024లో 4 వేల ర్యాంకు వరకు సీటు వచ్చే వీలుందంటున్నారు. తిరుచిరాపల్లి ఎన్ఐటీలో బాలురకు 2022లో 996 ర్యాంకుతోనే సీట్లు ఆగిపోయాయి. గత ఏడాది మాత్రం బాలురకు 1509 ర్యాంకు దాకా సీటు వచ్చింది. ఎన్ఐటీల్లో 82 శాతం విద్యార్థులు తొలి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్నే ఎంచుకున్నారు. రెండో ప్రాధాన్యతగా కూడా 80 శాతం ఇదే బ్రాంచ్ ఉండటం విశేషం. గత ఏడాది ఆరు రౌండ్ల తర్వాత 34,462వ ర్యాంకు వరకు బాలికల విభాగంలో సిక్కిం ఎన్ఐటీలో సీఎస్సీ సీట్లు వచ్చాయి. మెకానికల్కు మాత్రం ఇదే ఐఐటీలో 58 వేల ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీ సీట్లకు కటాఫ్గా ఉంది. బయో టెక్నాలజీలో 48 వేల వరకు సీటు వచ్చింది. -
తీవ్ర ఆందోళనలు.. శ్రీనగర్ నిట్ మూసివేత, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఎన్ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు. గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ అందరిని తక్షణమే క్యాంపస్, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిట్ వెబ్సైట్ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు స్థానికేతర నిట్వి ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్స్టిట్యూట్లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. -
తరం తల్లడిల్లుతోంది..!
చిల్లా వాసు, ఏపీ సెంట్రల్ డెస్క్ బాపట్లకు చెందిన చెన్నుపాటి యశ్వంత్ చాలా తెలివైన విద్యార్థి. గతేడాది జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ గాంధీనగర్ (గుజరాత్)లో కంప్యూటర్ సైన్సులో సీటు వచ్చింది. అయితే చాలా దూరం కావడంతో జాతీయ స్థాయిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఎన్ఐటీ కాలికట్లో బీటెక్ కంప్యూటర్ సైన్సులో చేరాడు. తల్లిదండ్రులు, బంధువులు ఎంతో సంతోషించారు. యశ్వంత్కు ఉజ్వల భవిష్యత్ ఖాయమని, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి ఉద్యోగం వచ్చేస్తుందని సంబరపడ్డారు. అయితే ఈ ఆనందం వారికి ఎంతో కాలం నిలవలేదు. ఆరు నెలలకే యశ్వంత్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్ఐటీ కాలికట్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలో సీటు సాధించి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని అందరూ నివ్వెరపోయారు. ...ఒక్క యశ్వంత్ మాత్రమే కాదు.. ఇలా ఎంతో మంది విద్యార్థులు ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) వంటి వాటిలో సీట్లు సాధించి కూడా అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. కేంద్ర విద్యా శాఖ లెక్కల ప్రకారం.. 2018 నుంచి ఈ ఏడాది వరకు 33 మంది విద్యార్థులు ఐఐటీల్లో ఆత్మహత్య చేసుకున్నారు. జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో 2018 నుంచి ఇప్పటివరకు 98 మంది విద్యార్థులు చనిపోతే వీరిలో 33 మంది ఐఐటీల విద్యార్థులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక 2014–21లో ఐఐటీలు, ఎన్ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో 122 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం.. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతదేశంలో 2017 నుంచి విద్యార్థుల ఆత్మహత్యల మరణాలు 32.15% పెరిగాయి. మరోవైపు కోచింగ్ ఇన్స్టిట్యూట్ల కర్మాగారంగా, కోచింగ్ హబ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. సీటు ఎంత కష్టమంటే.. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఐఐటీలు. వీటి తర్వాత స్థానం ఎన్ఐటీలది. ఇంజనీరింగ్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం ఏటా నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ని ఈ ఏడాది దేశవ్యాప్తంగా 11 లక్షలకుపైగా రాశారు. వీరిలో దాదాపు 2.5 లక్షల మందిని తదుపరి పరీక్ష అయిన జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేశారు. దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో ఈ ఏడాదికి 17,385 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే.. 11 లక్షల మంది పరీక్ష రాస్తే చివరకు ఐఐటీల్లో ప్రవేశించేది 17,385 మంది మాత్రమే. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయినా సీట్లు రానివారు, జేఈఈ మెయిన్లో ర్యాంకులు వచ్చినవారు ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర జాతీయ విద్యా సంస్థల్లో చేరుతున్నారు. జేఈఈ కోసం ఆరో తరగతి నుంచే ఐఐటీ ఒలింపియాడ్, కాన్సెప్ట్ స్కూళ్లలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఇందుకు లక్షల రూపాయలు ధారపోస్తున్నారు. ఇలా ఆరో తరగతి నుంచి ఇంటర్మిడియెట్ వరకు ఏడేళ్లపాటు కృషి చేస్తుంటే చివరకు జేఈఈ అడ్వాన్స్డ్లో ర్యాంకు సాధించి ఐఐటీల్లో చేరుతున్నారు. ఎందుకిలా.. ఓవైపు అకడమిక్ ఎగ్జామ్స్, మరోవైపు కాంపిటీటివ్ ఎగ్జామ్స్.. ప్రాజెక్టు వర్క్, థీసిస్,ప్రాక్టికల్స్ కోసం సొంతంగా సిద్ధం కావాల్సి రావడం. సొంత రాష్ట్రానికి చాలా దూరంగా వేరే రాష్ట్రాల్లో సీటు రావడం.. భాషలు, ఆహారం, వాతావరణం అలవాటుపడలేకపోవడం గతంలో ఎంత సాధించినా.. ఐఐటీలు, ఎన్ఐటీలలో అసలు సిసలు పోటీ ప్రారంభమవడం. గతంలో బట్టీ పట్టేస్తే సరిపోయేది.. ఇపుడు సృజనాత్మకత అవసరం.. ఇక్కడ మేథస్సుకే పని. విద్యార్థులకు ఇష్టంలేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద కోర్సును ఎంపిక చేసుకోవడం. ఏం చేయాలి? విద్యాసంస్థలలో మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. చాలా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఉన్నాయి. వాటిని విద్యార్థులు ఉపయోగించుకోవాలి. ఒత్తిడిని నివారించడానికి బిజినెస్ క్లబ్బులు, ఫొటోగ్రఫీ క్లబ్బు, కల్చరల్ క్లబ్బు, యోగా క్లబ్బు, మ్యూజిక్ క్లబ్బులు ఉన్నాయి. తమ ఆసక్తికి అనుగుణంగా విద్యార్థులు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. తల్లిదండ్రుల ధోరణి కూడా మారాలి. పిల్లల చదువులకు బాగా డబ్బు ఖర్చు పెట్టామనే ఉద్దేశంతో ఒత్తిడి పెంచడం, ఇతరులతో పోల్చి తిట్టడం వంటివి చేయకూడదు. స్కూల్, కళాశాల స్థాయిల్లోనే బట్టీ పట్టే చదువులకు స్వస్తి పలకాలి. పిల్లలు సృజనాత్మకంగా ఆలోచించుకుని నేర్చుకునేలా చేయాలి. నిత్యం యోగా, ధ్యానం చేయించడంతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా చేయాలి. విద్యార్థులు సోషల్ మీడియా సైట్లు, సైబర్ బెదిరింపుల బారిన పడకుండా చూడాలి. కొద్ది రోజులే ఇబ్బంది.. మాది బాపట్ల జిల్లా. నేను ఎన్ఐటీ జంషెడ్పూర్ లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాను. మొదట్లో నాకు భాషా పరంగా కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే ఇంటికి చాలా దూరంలో పరాయి రాష్ట్రంలో ఉండాల్సి రావడం కూడా కొంచెం సమస్యగా మారింది. అయితే ఆ బెరుకును ఇన్స్టిట్యూట్లో ఉన్న కౌన్సెలింగ్ సెంటర్ సిబ్బంది పోగొట్టారు. బోధన పరంగా సంప్రదాయ విధానానికి, ఎన్ఐటీల్లో విద్యకు తేడా ఉంది. ఇక్కడ బోధన చర్చ, విశ్లేషణ.. సంపూర్ణ అవగాహన అనే రీతిలో సాగుతోంది. కొంత అదనపు సమాచారాన్ని మా అంతట మేమే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. – ఎం. సుశ్వాంత్, బీటెక్ కంప్యూటర్ సైన్స్,థర్డ్ ఇయర్, ఎన్ఐటీ, జంషెడ్పూర్ కొంత సమయం పడుతోంది.. ఇప్పుడు 8వ తరగతి నుంచే జేఈఈకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచే విద్యార్థులపై ఒత్తిడి మొదలవుతోంది. ఇంటర్మిడియెట్ వరకు టీచర్ పాఠం చెప్పడం.. బోర్డుపైన రాయడం.. నోట్సు చెప్పడం.. తర్వాత దాన్ని బట్టీ పట్టడం వంటి సంప్రదాయ విధానాలకు అలవాటు పడిన విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీల్లో కొత్త విధానాలను అలవాటు పడటానికి సమయం పడుతోంది. ఒక్కసారిగా ఇంటికి దూరం కావడం, వేరే ఎక్కడో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు రావడం వల్ల కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో అంతగా స్కిల్స్ లేనివారే ఒత్తిడి బారిన పడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, యోగా వంటివాటి వైపు విద్యార్థులను ప్రోత్సహిస్తే ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. ఆ దిశగా చర్యలు చేపట్టాలి. – ఎంఎన్ రావు, ఐఐటీ కోచింగ్ నిపుణులు, హైదరాబాద్ ప్రాథమిక దశలోనే నైపుణ్యాలు పెంపొందించాలి.. కేంద్ర విద్యా శాఖ ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించుకునేలా చర్యలు చేపట్టాలి. అన్ని రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. జేఈఈ రాసేవారిలో ఎక్కువ మంది సౌత్ ఇండియా వారే. వీరిలో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంటున్నారు. ఇంటర్లోగంటల తరబడి చదివి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ల్లో ర్యాంకులు తెచ్చుకుంటున్న విద్యార్థులకు ఐఐటీల్లో అసలు పరీక్ష మొదలవుతోంది. అక్కడ ప్రొఫెసర్లు చెప్పిన కాన్సెప్్టతో విద్యార్థులే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నైపుణ్యాలు లేనివారే ఒత్తిడికి గురవుతున్నారు. కొత్త విధానానికి అలవాటుపడలేనివారు మొదటి సెమిస్టర్ పరీక్షల్లో విఫలమవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. – కె.లలిత్ కుమార్, డైరెక్టర్, అభీష్ట ఎడ్యుగ్రామ్ లిమిటెడ్ -
‘జోసా’లో సీట్ల జోష్.. ఐఐటీ, ఎన్ఐటీలలో భారీగా పెరిగిన సీట్ల సంఖ్య
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయస్థాయి విద్యాసంస్థలలో సీట్ల సంఖ్య భారీగా పెరగడంతో విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్యావకాశాలు మరింత మెరుగవుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే జీఎఫ్టీఐలలో 56,900ల వరకు సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో సీట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక కసరత్తును చేపట్టింది. జూన్ 19 నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను చేపట్టనుంది. ఐదేళ్లలో 18వేలకు పైగా పెరిగిన సీట్లు గడచిన ఐదేళ్లలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీల్లో సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతుండడం, యువతకు ఉపాధి మార్గాలు అత్యధికంగా అందులోనే లభిస్తుండడం వంటి కారణాలతో సాంకేతిక విద్యకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. 2019కు ముందువరకు ఈ సంస్థల్లో సీట్ల సంఖ్య నామమాత్రంగానే ఉండడంతో ఉన్నత ప్రమాణాలుగల సాంకేతిక నిపుణుల అందుబాటూ అంతంతమాత్రంగానే ఉండేది. ఈ విద్యకోసం ఏటా దాదాపు 8లక్షల మంది విద్యార్థులు వివిధ దేశాలకు వెళ్లేవారు. ఇందుకు లక్షలాది రూపాయలను వారు వెచ్చించాల్సి వచ్చేది. దీన్ని నివారించి దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను వారికి అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. 2024 నాటికి ఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల సంఖ్యను పెంచడంతో పాటు సీట్ల సంఖ్యను 50% మేర పెంచేలా చర్యలు తీసుకుంది. అలాగే, 20 ప్రముఖ ఐఐటీ, ఇతర సంస్థలను ఇని స్టిట్యూట్స్ ఆఫ్ ఎమినెన్సు (ఐఓఈ)లుగా తీర్చిదిద్ది అత్య«దిక నిధులు కేటాయించింది. సంస్థలు, సీట్ల సంఖ్యను పెంచిన కేంద్రం ఇదిలా ఉండగా.. డీపీ సింగ్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఐఐటీలు, ఎన్ఐటీలు ఇతర సంస్థలు, సీట్ల సంఖ్యను 2020లో ఒక్కసారిగా పెంచింది. 2019లో దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీల్లో, జీఎఫ్టీఐలలో 38,704 సీట్లు ఉండగా దాన్ని 2020లో ఒకేసారి 50,822కు పెంచింది. వివిధ రాష్ట్రాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుతో పాటు అప్పటికే ఉన్న ఐఐటీ, ఎన్ఐటీల్లో సదుపాయాలను మెరుగుపరచి సీట్ల సంఖ్యను పెంచింది. ఆ తరువాత కూడా ఏటేటా అయా సంస్థల్లో రెండేసి వేల చొప్పున సీట్లను పెంచుకునేలా చేసింది. 2021లో 52,453 సీట్లు, 2022లో 54,477 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2024 నాటికి 50 శాతం మేర సీట్లు పెంచాలన్న లక్ష్యం మేరకు 2023–24లో కూడా సీట్ల సంఖ్య పెరిగి 56,900 వరకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారీ జోసా కటాఫ్ స్కోర్.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) చేపడుతుంది. జేఈఈ మెయిన్, అడ్వాన్సుడ్లో అత్యధిక స్కోరుతో మెరిట్ ర్యాంకులు సాధించిన వారికి వీటిల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 2023 ప్రవేశాలకు సంబంధించి జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జనవరి, ఏప్రిల్ నెలల్లో పూర్తిచేసి ఇటీవల తుది ర్యాంకులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. మెయిన్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సుడ్ను నిర్వహించనున్నారు. అడ్వాన్సుడ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ దరఖాస్తులను మే 7 వరకు స్వీకరిస్తారు. జూన్ 4న జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్ష జరుగుతుంది. ఈ ఫలితాలు జూన్ 18న విడుదలవుతాయి. అనంతరం జూన్ 19 నుంచి జోసా రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే ఆరు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకు జోసా కటాఫ్ ర్యాంకులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మహిళలకు 20 శాతం కోటా.. ఇక ఐఐటీల్లో మహిళల చేరికలు నామమాత్రంగా ఉండడంతో వారి సంఖ్యను పెంచేందుకు వీలుగా అన్ని ఐఐటీల్లో 2018–19 నుంచి 20% మేర అదనపు కోటాను పెంచి సూపర్ న్యూమరరీ సీట్లను కేంద్రం ఏర్పాటుచేయించింది. మూడేళ్లపాటు దీన్ని తప్పనిసరిగా అన్ని సంస్థల్లో కేంద్రం కొనసాగించింది. దీంతో 2021 నాటికే ప్రముఖ ఐఐటీల్లో మహిళల చేరికలు 20 శాతానికి పైగా పెరిగాయి. తరువాత మహిళలకు సూపర్ న్యూమరరీ సీట్లపై ఆయా ఐఐటీలే నిర్ణయం తీసుకునేలా చేసింది. -
NIT Warangal: నిట్లో వసంతోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న కళారూపాలు (ఫొటోలు)
-
‘జేఈఈ’ సెషన్–2కు అభ్యర్థుల తాకిడి
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2023 సెకండ్ సెషన్కు అభ్యర్థుల తాకిడి విపరీతంగా పెరగనుంది. జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షలకన్నా రెండో సెషన్కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఆయా విద్యా సంస్థల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో తొలిసెషన్ కన్నా రెండో సెషన్నే ఎక్కువ మంది ప్రాధాన్యతగా తీసుకున్నారు. అయితే, ఈసారి తొలిసెషన్ పరీక్షలలో కూడా గతంలో కన్నా రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగిన తొలిసెషన్ కంప్యూటర్ ఆధారిత (కంప్యూటర్ బేస్డ్ టెస్టు–సీబీటీ) పరీక్షకు మొత్తం 8,60,064 మంది పేపర్–1కు.. 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది.. పేపర్–2కి 95 శాతానికి పైగా హాజరయ్యారు. వచ్చేనెల 6 నుంచి రెండో సెషన్ పరీక్షలు ఇక జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. సెకండ్ సెషన్ నిర్వహించే పట్టణాలకు సంబంధించిన సిటీ స్లిప్లను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఏప్రిల్ మొదటి వారం ఆరంభంలో అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేయనుంది. ఇదిలా ఉంటే.. తొలి సెషన్ పరీక్షల సమయంలో ఇంటర్మీడియెట్, సీబీఎస్ఈ ప్లస్2కు సంబంధించిన ప్రాక్టికల్స్ నేపథ్యంలో విద్యార్థుల నుంచి పరీక్షల షెడ్యూల్లో మార్పుల కోసం అనేక వినతులు ఎన్టీయేకు అందాయి. అదే సమయంలో కొందరు విద్యార్థులు ఉన్నత న్యాయస్థానంలో కేసులూ దాఖలు చేశారు. అయితే, పరీక్షల వాయిదాకు కోర్టు అంగీకరించలేదు. దేశవ్యాప్తంగా 574 పరీక్ష కేంద్రాలు.. ఇంటర్మీడియెట్ పరీక్షల సన్నద్ధత సమయంలోనే జేఈఈ తొలి సెషన్లో 8.6 లక్షల మందికిగాను 8.22 లక్షల మంది హాజరయ్యారు. రెండో సెషన్ ప్రారంభమయ్యే నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తికానున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువమంది హాజరయ్యే అవకాశం ఉంటుందని ఆయా కాలేజీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తొలి సెషన్లో పాల్గొన్న వారితో పాటు కొత్తగా మరింత మంది ఈ పరీక్షకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా 290 పట్టణాల్లోని 574 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఏపీలోని 25 పట్టణాల్లో జరుగుతుంది. తుది ఫలితాలు ఏప్రిల్ 30 లోపు ఇక జేఈఈ మెయిన్ తుది ఫలితాలు ఏప్రిల్ 30లోపు వెలువడనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. మెయిన్లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్లో దరఖాస్తుకు అవకాశముంటుంది. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసెషన్లో దేశవ్యాప్తంగా 100 స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థులు 20 మంది ఉన్నారు. 100 స్కోర్ పాయింట్లతో పాటు అత్యధిక స్కోర్ పాయింట్లు సాధించిన విద్యార్థుల్లో సగం మంది తెలుగువారే. బాలికల్లో టాప్ స్కోరు పాయింట్లను సాధించిన వారిలోనూ తెలుగు అమ్మాయిలే ఉన్నారు. -
JEE Mains 2023 Result: జేఈఈ మెయిన్ తొలిసెషన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ తొలివిడత పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. ఎన్టీఏ వెబ్సైట్లో ఫలితాలను ఉంచారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీవరకు జరిగిన ఈ పరీక్షలకు 9 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షకు 8.6 లక్షల మంది, పేపర్–2 (బీఆర్క్, బీప్లానింగ్) పరీక్షకు 46 వేల మంది హాజరయ్యారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. దాదాపు 95.8 శాతం మంది పరీక్షకు హాజరవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నందున తొలిసెషన్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. జేఈఈ తొలిసెషన్ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ ఫిబ్రవరి 1వ తేదీనే విడుదల చేయగా, ఫిబ్రవరి 2 నుంచి 4వ తేదీవరకు అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించింది. ఏప్రిల్ 6 నుంచి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జేఈఈ మెయిన్ రెండోవిడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. మార్చి 7వ తేదీవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సెకండ్ సెషన్కు సంబంధించిన అప్లికేషన్ ఫారం " https:// jeemain. nta. nic. in' వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని ఎన్టీఏ తెలిపింది. జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల సిటీ స్లిప్లను మార్చి 3వ వారంలో విడుదల చేయనున్నారు. మార్చి చివరి వారంలో రెండోసెషన్ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఎన్టీఏ విడుదల చేయనుంది. -
వేల సంఖ్యలో ఉద్యోగాల కోత.. అక్కడ మాత్రం జాబ్ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయ్!
టెక్నికల్ విద్య, బోధన విషయంలో ఐఐటీలు, ఎన్ఐటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. వాస్తవ ధృక్పథంతో ఈ విద్యాసంస్థలు పాటించే ప్రమాణాలు, విద్యార్థులకు అందించే నైపుణ్యాలు, జాబ్ రెడీ స్కిల్స్ విద్యార్థుల కెరీర్కు సోపానాలుగా మారుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఈ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు సంస్థలకు హాట్ ఫేవరెట్స్గా నిలుస్తున్నారు. భారీగా ప్యాకేజ్ ► ఐఐటీలు, ఎన్ఐటీ క్యాంపస్ డ్రైవ్స్లో ఈ ఏడాది రూ.కోటికిపైగా వార్షిక ప్యాకేజ్తో ఆఫర్లు ఖరారు కావడం విశేషం. ముఖ్యంగా ఫస్ట్ జనరేషన్ ఇన్స్టిట్యూట్లుగా గుర్తింపు ΄పొందిన ఐఐటీ–ఖరగ్పూర్,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, చెన్నై వంటి క్యాంపస్ల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ► ఐఐటీ ఖరగ్పూర్లో 2023 బ్యాచ్కు సంబంధించి ప్లేస్మెంట్ ప్రక్రియ తొలి దశలో అత్యధిక వార్షిక వేతనం రూ.2.68 కోట్లుగా నమోదైంది. ఈ క్యాంపస్లో తొలి దశ డ్రైవ్స్లో 1600 మందికి ఆఫర్లు లభించాయి. రూ.50 లక్షలు కనిష్ట వార్షిక వేతనంగా నమోదైంది. 16 మందికి అంతర్జాతీయ ఆఫర్లు అందాయి. ► ఐఐటీ కాన్పూర్లో రూ.1.9 కోట్ల వార్షిక ప్యాకేజ్తో ఆఫర్ లభించింది. ఇలా మొత్తం 33 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా ΄్యాకేజ్ ఖరారైంది. మొత్తంగా చూస్తే 947మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా, వాటిలో 74 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉండడం గమనార్హం. ► ఐఐటీ ఢిల్లీలో 1300కు పైగా ఆఫర్లు ఖరారవగా, 50 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక ΄్యాకేజ్ లభించింది. ఈ క్యాంపస్లో గరిష్ట వేతనం ఏకంగా రూ.నాలుగు కోట్లుగా నమోదవడం విశేషం. అదే విధంగా 30 మంది విద్యార్థులకు అంతర్జాతీయ ఆఫర్లు లభించాయి. గత ఏడాదితో ΄ోల్చితే ఈ ఏడాది ఆఫర్లలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ► ఐఐటీ చెన్నైలో రిక్రూట్మెంట్ డ్రైవ్ తొలి రోజే 445 మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారవగా.. వారిలో 25 మందికి రూ.కోటికి పైగా వార్షిక వేతనం లభించింది. అంతేకాకుండా మొత్తం 15 మంది విద్యార్థులకు నాలుగు సంస్థల నుంచి ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కినట్లు ఐఐటీ చెన్నై క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ–ముంబై క్యాంపస్ డ్రైవ్స్లో ఇప్పటి వరకు 1500 మందికి ఆఫర్లు ఖరారయ్యాయి. వీటిలో 71 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉండగా.. 63 మంది వీటికి సమ్మతి తెలి΄ారు. అదే విధంగా 25 మంది విద్యార్థులకు రూ.కోటికి పైగా వార్షిక వేతనం ఖరారైంది. ఈ క్యాంపస్ తొలి దశ డ్రైవ్స్ ముగిసే సమయానికి అత్యధిక వార్షిక వేతనం రూ.4 కోట్లుగా నమోదైంది. ► ఐఐటీ–రూర్కీలో గరిష్ట వార్షిక వేతనం రూ.1.06 కోట్లుగా నమోదు కాగా, పది మంది విద్యార్థులకు రూ.80 లక్షలకు పైగా వేతనం లభించినట్లు రూర్కీ ప్లేస్మెంట్స్æ సెల్ వర్గాలు తెలి΄ాయి. ► ఐఐటీ హైదరాబాద్లో తొలి దశ ప్లేస్మెంట్స్లో 474 మంది విద్యార్థులకు 508 ఆఫర్లు లభించాయి. గరిష్ట వేతనం రూ.63.78 లక్షలుగా నమోదైంది. 54 ఇంటర్నేషనల్ ఆఫర్లు ఉన్నాయి. ఐఐటీ–హైదరాబాద్లో ఏఐ బ్రాంచ్ తొలి బ్యాచ్లో 82 శాతం మందికి ఆఫర్లు దక్కాయి. ఈ క్యాంపస్లో సగటు వార్షిక వేతనం రూ.19.49 లక్షలుగా నమోదైంది. ► ఐఐటీ–గువహటిలో సైతం తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్లో గరిష్టంగా రూ.2.46 కోట్లతో ఇంటర్నేషనల్ ఆఫర్, రూ.1.1 కోటితో డొమెస్టిక్ ఆఫర్ ఖరారైంది. ఎన్ఐటీలదీ అదే బాట ► ఐఐటీల తర్వాత దేశంలో ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్గా పేరొందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) క్యాంపస్లలో సైతం ఈ ఏడాది భారీగా ఆఫర్స్ లభించాయి. ► తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ఐటీ–వరంగల్లో రూ.88 లక్షల గరిష్ట వేతనంతో ఆఫర్ లభించింది. ఈ క్యాంపస్లో మొత్తం వేయి మంది విద్యార్థులకు ఆఫర్లు ఖరారు కాగా.. సగటు వార్షిక వేతనం రూ.19.9 లక్షలుగా నమోదైంది. ► ఎన్ఐటీ హమీర్పూర్లో గతేడాది కంటే 39 శాతం అధికంగా సగటు వార్షిక వేతనం లభించింది. సగటు వార్షిక వేతనం రూ.12.84 లక్షలుగా, గరిష్ట వార్షిక వేతనం రూ. 52 లక్షలుగా నిలిచింది. ► ఎన్ఐటీ జంషెడ్పూర్లో అయిదుగురు విద్యార్థులకు రూ.80 లక్షల వార్షిక వేతనంతో ఇంటర్నేషనల్ ఆఫర్స్ లభించాయి. ► ఎన్ఐటీ కాలికట్లో సగటు వార్షిక వేతనం రూ.23 లక్షలుగా ఉంది. ► ఎన్ఐటీ పాట్నా క్యాంపస్లోనూ గరిష్ట వేతనం రూ.52 లక్షలుగా, సగటు వేతనం రూ.16.51 లక్షలుగా నమోదైంది. ► ఇతర ఎన్ఐటీల్లోనూ ఇదే తరహాలో గతేడాది కంటే పది నుంచి 20 శాతం అధికంగా ఆఫర్లు లభించడంతో΄పాటు, వేతనాల్లోనూ పది శాతానికిపైగా పెరుగుదల నమోదైంది. టాప్ రిక్రూటర్స్ వీరే ఐఐటీలు, ఎన్ఐటీల్లో టాప్ రిక్రూటింగ్ సంస్థలను పరిగణనలోకి తీసుకుంటే.. క్వాల్ కామ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, గూగుల్, బార్క్లేస్, ఎస్ఏపీ ల్యాబ్స్, సిటీ బ్యాంక్, వెల్ ఫార్గో, మైక్రోసాఫ్ట్, బీసీజీ, బెయిన్ అండ్ కో సంస్థలు ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవ్వడంలో ముందంజలో ఉన్నాయి. డొమెస్టిక్ ఆఫర్స్ పరంగా ఉబెర్, హనీవెల్, మైక్రాన్ టెక్నాలజీ, ఓఎన్జీసీ, ఫ్లిప్కార్ట్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఎస్టీఎం మైక్రోఎలక్ట్రికల్స్ వంటి సంస్థలు ముందు వరుసలో ఉన్నాయి. డిమాండింగ్ జాబ్ ప్రొఫైల్స్ కోర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అండ్ ్ర΄ోగ్రామర్స్, డేటా అనలిస్ట్స్, యుఎక్స్ డిజైనర్, ్ర΄÷డక్ట్ డిజైనర్, ఫుల్స్టాక్ ఇంజనీర్ జాబ్ ్ర΄÷ఫైల్స్లో అధిక సంఖ్యలో నియామకాలు జరిగాయి. డేటా అనలిస్ట్ జోరు ► ఈసారి ఐఐటీ, ఎన్ఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్స్లో డేటా అనలిస్ట్ ప్రొఫైల్ జోరు కొనసాగింది. ముఖ్యంగా కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లోని సంస్థలు ఈ నియామకాలు చేపట్టాయి. బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ సంస్థలు క్లయింట్స్, వినియోగదారులను పెంచుకునే వ్యూహంతో అడుగులు వేస్తున్నాయి. దీంతో డేటా అనలిస్ట్ జాబ్స్కు డిమాండ్ కనిపించింది. ► ఐటీ మొదలు ఆన్లైన్ టెక్నాలజీస్ ఆధారంగా సేవలందిస్తున్న అన్ని రంగాల్లోని సంస్థలు సాఫ్ట్వేర్స్ ్ర΄ోగ్రామింగ్, డిజైనింగ్కు ్ర΄ాధాన్యమిస్తుండడంతో.. కోడింగ్ విభాగంలో జాబ్ ప్రొఫైల్స్కు కూడా డిమాండ్ కనిపించింది. ఎస్పీఓల్లోనూ వృద్ధి ఐఐటీలు, ఎన్ఐటీల్లో ఈ ఏడాది సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్లోనూ వృద్ధి కనిపించింది. దాదాపు అన్ని క్యాంపస్లలో నూటికి 80 శాతం మందికి సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్ లభించాయి. గరిష్టంగా రెండు నెలల కాలానికి ఆయా సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసేందుకు ఇచ్చే సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్స్లో స్టయిఫండ్ మొత్తాలు కూడా ఆకర్షణీయంగా నమోదయ్యాయి. కనిష్టంగా రూ.50 లక్షలు, గరిష్టంగా రూ.80 లక్షలు, సగటున రూ.30 లక్షల స్టయిఫండ్తో పలు సంస్థలు విద్యార్థులకు ఇంటర్న్ ట్రైనీగా పని చేసేందుకు సమ్మర్ ప్లేస్మెంట్ ఆఫర్లు ఖరారు చేశాయి. రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ఐఐటీలు, ఎన్ఐటీల్లో క్యాంపస్ డ్రైవ్స్లో పాల్గొన్న సంస్థలు రెండు, మూడు రౌండ్లలో ఎంపిక ప్రక్రియ నిర్వహించాయి. తొలుత రిటెన్ టెస్ట్, ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్, చివరగా టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలు చేపట్టి.. ప్రతిభ ఆధారంగా ఆఫర్లు ఖరారు చేశాయి. కోడింగ్కే ప్రాధాన్యం సంస్థలు విద్యార్థుల్లోని కోడింగ్ నైపుణ్యాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. కంపెనీలు రిటెన్ టెస్ట్లు, టెక్నికల్ రౌండ్స్లో కోడింగ్ సంబంధిత నైపుణ్యాలను ఎక్కువగా పరిశీలించినట్లు ఆయా క్యాంపస్ల ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొన్నాయి. కోర్ ఇంజనీరింగ్, సర్క్యూట్ బ్రాంచ్లకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్పై విద్యార్థులకు ఉన్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలి΄ారు. మార్చి నాటికి నూరుశాతం క్యాంపస్ డ్రైవ్స్ ప్రతి ఏటా డిసెంబర్లో ్ర΄ారంభమై.. మరుసటి ఏడాది మార్చి వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం అన్ని క్యాంపస్లలో తొలి దశ ముగిసింది. ఇందులో దాదాపు 80 శాతం మందికి ఆఫర్లు లభించాయి. మార్చి నాటికి నూటికి నూరు శాతం మందికి ఆఫర్లు లభిస్తాయని ఐఐటీల క్యాంపస్ ప్లేస్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. స్వీయ అన్వేషణ దిశగా ఇప్పటికే పలు సంస్థలు లే అఫ్లు కొనసాగిస్తున్నప్పటికీ.. వాటి కార్యకలా΄ాల నిర్వహణకు మానవ వనరుల అవసరం ఏర్పడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఫ్రెషర్స్ను నియమించుకుని తమ విధానాలు, సాంకేతికతలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే అవకాశముందంటున్నారు. టైర్–2 ఇన్స్టిట్యూట్స్కు చెందిన విద్యార్థులు మాత్రం ఉద్యోగ సాధనలో క్యాంపస్ డ్రైవ్స్పైనే ఆశలు పెట్టుకోకుండా.. స్వీయ అన్వేషణ దిశగానూ అడుగులు వేయాలని సూచిస్తున్నారు. సంస్థలు కోరుకుంటున్న కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ వంటి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకుని.. జాబ్ మార్కెట్లో ΄ోటీకి సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్.. ముఖ్యాంశాలు ► ఐఐటీలు, నిట్ల్లో 2023 బ్యాచ్కు ముగిసిన తొలి దశ క్యాంపస్ డ్రైవ్స్. ► ఐఐటీ–ఢిల్లీలో రూ.4 కోట్ల గరిష్ట వార్షిక వేతనంతో ఆఫర్. ప్రతి క్యాంపస్లోనూ గరిష్టంగా రూ.కోటికి పైగా వేతనం నమోదు. ► సగటు వార్షిక వేతనం రూ.36 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నమోదు. ► గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 నుంచి 20 శాతం పెరుగుదల. ► కోడింగ్, ఏఐ–ఎంఎల్, ఐఓటీ స్కిల్స్పై ప్రత్యేక దృష్టి పెడుతున్న సంస్థలు. -
మెయిన్స్ షెడ్యూల్పై మళ్లీ సందిగ్థం
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2023 నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జేఈఈ–2023కి సంబంధించి షెడ్యూల్ అంటూ సామాజిక మాధ్యమాల్లో పలు తేదీలు ప్రచారం అవుతుండడంతో వారు గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ను గతంలో ఒక్కసారే నిర్వహించేవారు. ఒకపక్క బోర్డు పరీక్షలకు తయారవ్వడం, మరోపక్క మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు తొట్రుపాటుతో తక్కువ మార్కులతో అవకాశాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఐఐటీ వంటి జాతీయ విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు మరో ఏడాదిపాటు ఆగాల్సి వచ్చేది. ఈ కారణాలతో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేలా మార్పు చేశారు. జనవరి, మార్చి ఆఖరు లేదా ఏప్రిల్లో నిర్వహించేవారు. జనవరి సెషన్కు సంబంధించి నవంబర్కు ముందే ఎన్టీఏ షెడ్యూల్ విడుదల చేసేది. కానీ, ఈసారి నవంబర్ మూడో వారంలోకి ప్రవేశిస్తున్నా ఇప్పటివరకు ఎన్టీఏ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు.. జేఈఈ పరీక్షలు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ బోర్డు సహా పలు రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఇంచుమించు అదే సమయంలో జరుగుతుంటాయని, దీనివల్ల తాము ఇబ్బందికి గురవుతామని విద్యార్థులు విన్నవిస్తున్నారు. జేఈఈ పరీక్షలకు సంబంధించి ఎన్టీఏ ఒక స్పష్టతనిస్తే ప్రణాళిక ప్రకారం సిద్ధంకావడానికి వీలుంటుందంటున్నారు. గత ఏడాది తీవ్ర గందరగోళం.. కరోనాతో రెండేళ్ల పాటు జేఈఈ పరీక్షల్లో అనిశ్చిత పరిస్థితి ఏర్పడినా 2022లో కోవిడ్ తగ్గుముఖం పట్టినందున అన్నీ సకాలంలో జరుగుతాయని విద్యార్థులు భావించారు. కానీ, జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏ పలుమార్లు షెడ్యూళ్లు మార్పుచేసి విద్యార్థులను, బోర్డులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. జేఈఈ మెయిన్స్–2022 షెడ్యూల్ను 2021 నవంబర్, డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలను చేపట్టాలి. కానీ, ఎన్టీఏ ఐదు రాష్ట్రాల ఎన్నికల సాకుతో 2022 మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ప్రకటించి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. అలాగే, తొలి సెషన్ పరీక్షల తేదీల విషయంలో ఆయా రాష్ట్రాల బోర్డు పబ్లిక్ పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16–21 వరకు, మే 24–29 వరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని తేదీలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు సహ అనేక రాష్ట్రాల ఇంటర్మీడియెట్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అంతకుముందే ప్రకటించినా వాటిని పట్టించుకోలేదు. జేఈఈ పరీక్షలను అవే తేదీల్లో ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీలను ఆ ఏడాది ఏప్రిల్ 22 తరువాత ఉండేలా మార్పులుచేసుకున్నాయి. కానీ, ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్ను మార్పుచేసింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు మళ్లీ మార్పు చేసుకున్నాయి. ఆ తర్వాత ఎన్టీఏ మూడోసారి మళ్లీ షెడ్యూల్ను మార్పుచేసింది. 2022 జూన్, జులైలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించి ఆయా రాష్ట్రాల బోర్డులను సమస్యల్లోకి నెట్టింది. ఇలా జేఈఈ మెయిన్–2022 పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం చేయడంతో ఫలితాల విడుదలపైనా దాని ప్రభావం పడింది. మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6కల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. వీటిలో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మందిని అడ్వాన్సుకు అనుమతిస్తారు. కానీ, చివరి నిమిషం వరకు మెయిన్స్ ఫలితాలపై గందరగోళానికి గురిచేసింది. ఈసారి అలాంటి గందరగోళానికి లేకుండా పరీక్షలపై స్పష్టతనివ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ఐఐటీ సీట్లు మొత్తం భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐ టీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఆరు దశల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) సీట్ల కేటాయింపు చేపట్టింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో, ఏ బ్రాంచ్లో సీటు వచ్చిందనేది తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ఐఐటీల్లో దాదాపు సీట్ల కేటాయింపు పూర్తయినప్పటికీ, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టి, మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసే వీలుంది. ఈ ఏడాది జేఈఈ మెయిన్స్కు దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 8 లక్షల మందికిపైగా పరీక్ష రాశారు. ఇందులో ఐఐటీ సీటు కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు 2.5 లక్షల మంది అర్హులైనప్పటికీ పరీక్ష రాసింది మాత్రం కేవలం1.60 లక్షల మందే ఉన్నారు. వీరిలో 42 వేల మంది అర్హులుగా ప్రకటించారు. జేఈఈ మెయిన్స్ ర్యాంకు ఆధారంగా ఎన్ఐటీ, ఐఐటీ, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. ఆ సంస్థల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్ఐటీల్లో 54477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈసారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళ లకు 1,567 సీట్లున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐఐటీల్లో మొత్తంగా 500 సీట్ల వరకూ పెరిగాయి. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడంతో ఈ పెంపు అనివార్యమైంది. ఎన్ఐటీలో 23, 994 సీట్లు ఉంటే, ఇందులో మహిళలకు 749 సీట్లున్నాయి. ట్రిపుల్ ఐటీల్లో 7,126 ఇంజనీరింగ్ సీట్లు (మహిళలకు 625), జీఎఫ్ఐ టీల్లో 6,759 (మహిళలకు 30) సీట్లున్నాయి. -
NIT Tadepalligudem: క్యాంపస్ ప్లేస్మెంట్లో నిట్ విద్యార్థుల సత్తా
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): క్యాంపస్ ప్లేస్మెంట్లలో నిట్ 2018–22 బ్యాచ్ విద్యార్థుల్లో 97.19 శాతం మంది ఉద్యోగాలు సాధించారు. సీఎస్ఈ విద్యార్థిని సూరపరాజు సాయి కీర్తన అమెజాన్లో రూ. 47.3 లక్షల వేతనం పొందగా.. ఈఈఈ విద్యార్థిని ఊర్వశి డాంగ్ అమెజాన్లో రూ. 47.3 లక్షల వేతనం అందుకోనున్నారు. సీఎస్ఈ విద్యార్థి కేతన్ బన్సాల్ స్కైలార్క్ ల్యాబ్స్లో రూ. 37.8 లక్షల వేతనం, అదే గ్రూపునకు చెందిన గాదె అశ్రితరెడ్డి అమెజాన్లో రూ.37 లక్షల వేతనంతో ఉద్యోగం పొందారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ప్రత్యేక కృషితో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించారు. దేశంలోని 31 నిట్లలో క్యాంపస్ ప్లేస్మెంట్ విషయంలో ఏపీ నిట్ సత్తా చాటింది. ఈ బ్యాచ్లో 511 మంది 262 కంపెనీలు జరిపిన ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలు పొందారు. (క్లిక్ చేయండి: ఒకేసారి డబుల్ డిగ్రీలు.. యూజీసీ మార్గదర్శకాలు ఇవే..) -
హ్యాకర్ల కంట పడకుండా సమాచార ప్రసారం!
కాజీపేట అర్బన్: ప్రతి రంగంలోనూ సమాచార ప్రసారం, దాని భద్రత ఎంతో కీలకం. ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీలతో ఈ సమాచారం హ్యాకర్ల చేతిలో పడుతోంది. హ్యాకర్లు ఆ సమాచారంతో తప్పుడు పనులకు పాల్పడుతున్న ఘటనలూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆన్లైన్లో సురక్షితంగా సమాచారాన్ని ప్రసారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని తొలగించి రక్షణ కల్పించేందుకు వీలయ్యే సరికొత్త అల్గారిథమ్ను వరంగల్ నిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ సురేశ్బాబు పేర్ల అభివృద్ధి చేశారు. ‘మోడల్ టు ఎన్హాన్స్ సెక్యూరిటీ అండ్ ఇంప్రూవ్ ద ఫాల్ట్ టాలరెన్స్’అంశంపై పరిశోధన చేసి రూపొందించిన ఈ అల్గారిథమ్కు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ హక్కులు కూడా పొందినట్టు ఆయన వెల్లడించారు. గతంలో దేశంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ నెట్వర్క్లలో హ్యాకర్లు చొరబడి విద్యుత్ సరఫరాను స్తంభింప జేసిన ఘటనల నేపథ్యంలో ప్రత్యేక అల్గారిథమ్ రూపొందించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వినియోగించవచ్చు ‘‘పవర్గ్రిడ్, టెలీ కమ్యూనికేషన్స్తోపాటు అన్ని రంగాల్లో సమాచారాన్ని పూర్తి రక్షణతో ప్రసారం చేసేందుకు నేను రూపొందించిన అల్గారిథమ్ను వినియోగించవచ్చు. ఇది సమాచార ప్రసారంలో హ్యాకర్లను గుర్తించి ఆ సమాచారం అందుకోకుండా ఆపుతుంది. సరైన వ్యక్తులను గుర్తించి సమాచారాన్ని ప్రసారం చేసేందుకు తోడ్పడుతుంది..’’అని సురేశ్బాబు తెలిపారు. -
జేఈఈ మెయిన్ ఫలితాలపై ఉత్కంఠ
సాక్షి, అమరావతి: ఇటు మెయిన్ తుది ఫలితాలు రాలేదు కానీ.. అటు అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్లు మాత్రం అప్పుడే మొదలయ్యాయి. జేఈఈ మెయిన్ షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి ఎన్టీఏ విద్యార్ధులను గందరగోళానికి గురి చేస్తోంది. ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ 2022 తుది ఫలితాల వెల్లడిలో చోటు చేసుకుంటున్న జాప్యంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం నాటికే మెయిన్ రెండో సెషన్ ఫలితాలు వెలువడాల్సినా ఆదివారం రాత్రి వరకు కూడా విడుదల కాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల రిజిస్ట్రేషన్కు ముంబై ఐఐటీ షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా పోర్టల్ అందుబాటులోకి తేవడం ఈ ఆందోళనను మరింత పెంచుతోంది. మెయిన్ తుది ఫలితాలపై స్పష్టమైన తేదీ, సమయాన్ని ప్రకటించాలని రెండు రోజులుగా విద్యార్థులు సామాజిక మాధ్యమాలు, ఎన్టీఏ హెల్ప్లైన్ కేంద్రాల ద్వారా విన్నవిస్తున్నా ఎలాంటి స్పందన లేకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలు డ్రాప్ శుక్రవారం రాత్రికే విడుదల కావాల్సిన జేఈఈ మెయిన్ 2వ సెషన్ పరీక్ష ఫైనల్ కీ ఆదివారం మధ్యాహ్నానికి కానీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయలేదు. రెండో సెషన్ ఫైనల్ కీలో ఆరు ప్రశ్నలను ఎన్టీఏ డ్రాప్ చేసింది. ఆయా ప్రశ్నలకు ఒకటికి మించి సరైన సమాధానాలు ఉండడంతో వాటన్నిటినీ డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాము ఇచ్చిన సమాధానాల సంఖ్యకు, రెస్పాన్స్ షీట్లలోని సంఖ్యకు వ్యత్యాసం ఉండడంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పలువురు ఎన్టీఏకు నేరుగా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా విన్నపాలు పంపుతున్నారు. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదలలో సమస్యలు నెలకొన్నట్లు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా మెయిన్స్ రెండో సెషన్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఆగస్టు 3వ తేదీన ఎన్టీఏ విడుదల చేసింది. దీంతోపాటు విద్యార్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసినా వాటిలోనూ పొరపాట్లు దొర్లాయంటున్నారు. తొలిసెషన్ ప్రొవిజనల్ కీ తప్పుల తడక జూన్లో నిర్వహించిన తొలిసెషన్కు సంబంధించిన ప్రాథమిక కీని ఎన్టీఏ జూలై 3వ తేదీన ప్రకటించింది. ఇందులో కొన్ని తేదీల్లో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఇచ్చిన కీ తప్పుల తడకగా ఉంది. ఒక విభాగం కీ వేరొక విభాగానికి జతచేయడంతో గందరగోళానికి గురయ్యారు. 130 నుంచి 200 మార్కులు వస్తాయనుకున్న విద్యార్థులకు 60 మార్కులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎన్టీఏకు విన్నపాలు వెల్లువెత్తాయి. అనంతరం ఎన్టీఏ ప్రాథమిక కీలో దొర్లిన పొరపాట్లను సవరించి మళ్లీ ప్రకటించింది. అడ్వాన్స్డ్ షెడ్యూల్ జారీ జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను ఆగస్టు 5 లేదా 6వ తేదీకల్లా ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది. ఇందులో ఉత్తీర్ణులైన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. జేఈఈ అడ్వాన్సుడ్కు ఆగస్టు 7 నుంచి 11వ తేదీవరకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ పరీక్షల నిర్వహణ సంస్థ ఐఐటీ ముంబై షెడ్యూల్ జారీ చేయడమే కాకుండా ఆదివారం నుంచి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ల పోర్టల్ కూడా అందుబాటులోకి తెచ్చింది. మూడో విడతకు విన్నపాలు మరికొందరైతే ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ రెండు సెషన్ల సమయంలో వరదలు, వర్షాల వల్ల సరిగా రాయలేకపోయామని, పరీక్షలకు హాజరు కాలేకపోయామని అందువల్ల మరో సెషన్ పరీక్షలకు అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఆదినుంచి అయోమయమే.. జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను 2021 నవంబర్ – డిసెంబర్ నాటికే విడుదల చేయాలి. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి అనంతరం నెల వ్యవధిలో పరీక్షలు చేపట్టాలి. కానీ ఎన్టీఏ మార్చి వరకు షెడ్యూల్, నోటిఫికేషన్పై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరుతో షెడ్యూల్ ప్రకటించకుండా నాన్చింది. చివరకు మార్చి 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. జేఈఈ మెయిన్స్ 2021 పరీక్షలను నాలుగు సెషన్లలో నిర్వహించగా ఈదఫా రెండు సెషన్లకే పరిమితం చేసింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నల విభాగంలో మైనస్ మార్కులు లేవు. ఈసారి మాత్రం అన్ని విభాగాలకూ మైనస్ మార్కులను ప్రకటించింది. తొలి సెషన్ పరీక్షల తేదీలపై ఆయా రాష్ట్రాల బోర్డుల పబ్లిక్ పరీక్షలను పరిగణలోకి తీసుకోకుండా ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు తొలిసెషన్, మే 24 నుంచి 29వ తేదీవరకు రెండో సెషన్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. అయితే ఏపీ, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇంటర్, ప్లస్ 2 తరగతుల పరీక్షలు అవే తేదీల్లో నిర్వహించేలా అప్పటికే షెడ్యూల్ విడుదలయ్యాయి. జేఈఈ పరీక్షలను కూడా అదే సమయంలో నిర్వహించేలా ఎన్టీఏ షెడ్యూల్ ఇవ్వడంతో ఆయా రాష్ట్రాలు తమ బోర్డుల పరీక్షా తేదీల్లో మార్పులు చేసుకున్నాయి. అలా బోర్డులు మార్పులు చేసిన తరువాత ఎన్టీఏ మళ్లీ జేఈఈ షెడ్యూల్ను సవరించి ఏప్రిల్ 21 నుంచి మే 4వ తేదీవరకు పరీక్షలు జరుగుతాయని ప్రకటించింది. దీంతో ఆయా ఇంటర్ బోర్డులు తమ పరీక్షల షెడ్యూళ్లను మళ్లీ మార్పు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా అవి మార్పులు చేశాక ఎన్టీఏ మూడోసారి మళ్లీ జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ను మార్చింది. జూన్ 20 నుంచి 29 వరకు తొలి సెషన్, జూలై 21 నుంచి 30 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. ఆ పరీక్షలను కూడా షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేదు. తొలిసెషన్ను జూన్ 24 నుంచి, రెండో సెషన్ను జులై 25 నుంచి చేపట్టింది. -
6న జేఈఈ మెయిన్ తుది ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు. కంప్యూటరాధారితంగా నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్టీఏ బుధవారం రాత్రి విడుదల చేసింది. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది. ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఈ నెల 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది. 7 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు కాగా జేఈఈ మెయిన్లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఈ నెల 7 నుంచి 11లోపు అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లోనూ మిగులు సీట్లు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ ఏటా సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించలేకపోవడంతో సీట్లు మిగిలిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని కేటగిరీల్లో అర్హుల కొరతతోనూ సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని పేర్కొంటున్నారు. మరోవైపు చేరినవారిలోనూ కొంతమంది వేర్వేరు కారణాలతో మధ్యలో చదువు మానుకుంటున్నారు. దీనివల్ల కూడా ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు ఖాళీ అవుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ), పీహెచ్డీ విభాగాల్లో గత రెండు, మూడేళ్లుగా మిగిలిపోతున్న సీట్లను గమనిస్తే ఈ అంశం స్పష్టమవుతోందని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మిగిలిపోతున్న సీట్లు.. కొన్ని కేటగిరీల్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోతుండడంతో గత కొన్నేళ్లుగా సీట్లు మిగిలిపోతున్నాయి. దేశంలో 23 ఐఐటీల్లో వివిధ బ్రాంచ్లకు సంబంధించి బీఈ, బీటెక్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో వేలాది సీట్లు మిగిలిపోతున్నాయి. ఐఐటీల్లో 2020–21లో 5,484 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో 476 సీట్లు బీటెక్లోనివే. ఇక పీజీ కోర్సుల్లో 3,229 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఇక 2021–22 విద్యాసంవత్సరంలోనూ 5,296 సీట్లు మిగిలిపోయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. యూజీలో 361 సీట్లు, పీజీలో 3,083 సీట్లు, పీహెచ్డీలో 1,852 ఖాళీగా ఉండిపోయాయి. ఎన్ఐటీల్లోనూ మిగులు.. ఇక ఎన్ఐటీల్లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా లేదు. మొత్తం 31 ఎన్ఐటీల్లో 2020–21లో 3,741 సీట్లు, 2021–22లో 5,012గా ఉన్నాయి. యూజీ కోర్సుల్లో కంటే పీజీ కోర్సుల్లో ఎక్కువ సీట్లు మిగిలిపోతున్నాయి. 2021లో 2,487 మిగలగా 2021–22లో ఈ సంఖ్య 3,413కి చేరింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్లో నిర్ణీత అర్హత మార్కులు సాధించలేకపోవడమే సీట్లు మిగిలిపోవడానికి కారణమని కేంద్రం గతంలోనే తేల్చింది. జాతీయ విద్యాసంస్థల్లోకి ప్రవేశించాలంటే నిర్ణీత పరీక్షల్లో అభ్యర్థులు అర్హత మార్కులను సాధించాల్సిందే. ముఖ్యంగా వివిధ రిజర్వేషన్ల కేటగిరీల్లో సీట్లు మిగిలిపోతున్నాయి. 2022–23కి సీట్ల అందుబాటు ఇలా.. 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి జేఈఈ మెయిన్ తొలి విడతను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇటీవలే పూర్తి చేసింది. ఇక రెండో విడత పరీక్షలు జూలై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి. అనంతరం జేఈఈ అడ్వాన్స్డ్ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 7 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. సెప్టెంబర్ 11న అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతరం జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీలు, ఎన్ఐటీలు తదితర విద్యాసంస్థల్లో సీట్లను అర్హులైన అభ్యర్థులకు కేటాయించనుంది. ఈసారి యూజీ ప్రథమ సంవత్సరానికి ఐఐటీల్లో 16,234, ఎన్ఐటీల్లో 23,997 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 110 జాతీయ విద్యాసంస్థలు దేశంలో ఐఐటీలు సహ వివిధ కేటగిరీల్లో 110 జాతీయ విద్యాసంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, కేంద్ర ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నవే. 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, 1 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 7 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సు ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లు (ఐఐఎస్ఈఆర్లు), 29 కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వివిధ విభాగాల వారీగా 50,882 సీట్లు ఉన్నాయి. వీటిలో ఐఐటీలు, ఎన్ఐటీలకు విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వీటిలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్కు ఏటా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారు. వీరిలో నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించినవారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్నారు. ఇందులోనూ నిర్దేశిత అర్హత మార్కులు సాధించి టాప్లో నిలిచినవారిని ఐఐటీలకు ఎంపిక చేస్తున్నారు. మిగిలినవారికి ఎన్ఐటీల్లో సీట్లు కేటాయిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం.. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ (నాన్ క్రిమీలేయర్), దివ్యాంగులు ఇలా ఆయా కేటగిరీల్లో సీట్లు కేటాయింపు జరుగుతోంది. -
జేఈఈ సెకండ్ సెషన్పై కన్ను
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్స్)–2022 సెకండ్ సెషన్కు అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుంది. మొదటి సెషన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తొలి సెషన్ ఫైనల్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. తొలి సెషన్ పేపర్లలోని ప్రశ్నల స్థాయి ఒకింత క్లిష్టంగా, ఆధునికంగా (మోడరేట్) ఉండి విద్యార్థులను అయోమయానికి గురి చేశాయి. ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్ఛిక సమాధానాలన్నీ ఇంచుమించు ఒకేలా.. సరైన సమాధానాలుగా స్ఫురించేలా ఇచ్చారు. దీంతో అభ్యర్థులు కొంత తికమక పడ్డారు. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగిటివ్ మార్కులను అమలు చేస్తున్న నేపథ్యంలో పొరపాటున తప్పుడు సమాధానామిచ్చే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో న్యూమరికల్ ప్రశ్నలకు నెగిటివ్ మార్కులుండేవి కావు. ఇప్పుడు అన్ని విభాగాలకూ నెగిటివ్ మార్కులున్న నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులకు మార్కుల స్కోరులో తగ్గుదల ఉందని కార్పొరేట్ జూనియర్ కాలేజీలు, కోచింగ్ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. సెకండ్ సెషన్పైనే అభ్యర్థుల దృష్టి ఇలాంటి పరిస్థితుల కారణంగా మొదటి సెషన్లో పరీక్షలు రాసిన విద్యార్థులు తిరిగి సెకండ్ సెషన్ పరీక్షలలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. తొలిసెషన్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థి రెండో సెషన్కు మళ్లీ రిజిస్ట్రేన్ చేసుకుంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఎన్టీఏ పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. రెండో సెషన్కు దరఖాస్తు ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు తొలుత ప్రకటించింది. ఆ తరువాత విద్యార్థుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు జూలై 2 నుంచి మళ్లీ అవకాశం కల్పించింది. మొదటి విడత పరీక్షల ఫైనల్ కీ విడుదల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించింది. తాజాగా బుధవారం ఎన్టీఏ మరో పబ్లిక్ నోటీస్ను విడుదల చేస్తూ జూలై 9వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఇచ్చింది. ఆ రోజు రాత్రి 11.50 నిముషాల వరకు ఆన్లైన్ ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల సమర్పణను కొనసాగించవచ్చని సూచించింది. ఇలా ఉండగా జేఈఈ సెకండ్ సెషన్ పరీక్షలు జులై 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలలో కూడా పాల్గొని తమ మార్కుల స్కోరును పెంచుకోవాలనే ఉద్దేశంతో అభ్యర్థులు ఉన్నారు. ఈసారి రెండు సెషన్లలోనే జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తుండడంతో ఇదే తుది అవకాశంగా పట్టుదలతో పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. -
జేఈఈ మెయిన్–2022 నిబంధనల్లో మార్పులు.. నెగెటివ్ మార్కులతో జాగ్రత్త!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 నిబంధనల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పు చేసినందున విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ మెయిన్లో అన్ని సెక్షన్ల ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ను అమలు చేయనున్నామని ఎన్టీఏ ఇంతకు ముందే ప్రకటించి ఉన్నందున అభ్యర్థులు సరైన సమాధానాలను మాత్రమే గుర్తించాలని, తప్పుడు సమాధానాలు గుర్తిస్తే మార్కుల్లో కోత పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో సెక్షన్–ఎ లోని బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలకు మాత్రమే నెగెటివ్ మార్కులుండేవి. ఈసారి సెక్షన్–బి లోని న్యూమరికల్ వేల్యూ ప్రశ్నలకు కూడా నెగెటివ్ మార్కులుంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. బీఈ, బీటెక్తో పాటు బీఆర్క్కు సంబంధించిన పేపర్ 2ఏలోని సెక్షన్–బిలో ప్రతి ప్రశ్నకూ నెగెటివ్ మార్కు ఉంటుంది. ప్రశ్నల్లో విద్యార్థులకు చాయిస్ కరోనా కారణంగా కాలేజీలు ఆలస్యంగా తెరచుకోవడంతో 2021–22 విద్యా సంవత్సరంలోనూ పలు రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్ను కుదించాయి. అయితే ఎన్టీఏ సిలబస్ కుదించలేదు. అయితే విద్యార్థులకు ఉపశమనంగా కొన్ని మినహాయింపులను ప్రకటించింది. పేపర్1, పేపర్ 2ఏ, 2బీ విభాగాల్లో పార్టు1లలోని ప్రశ్నల్లో చాయిస్ను ఇచ్చింది. ఆయా విభాగాల్లో తమకు వచ్చిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు ఇవ్వవచ్చు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో కూడా ఉంటాయి. ప్రాంతీయ భాషా ప్రశ్న పత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే అందిస్తారు. ఏపీ, తెలంగాణల్లో ఇంగ్లిష్ తో పాటు తెలుగు మాధ్యమ ప్రశ్నపత్రాలు ఇస్తారు. టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పు ఈసారి టై బ్రేకర్ నిబంధనల్లోనూ మార్పులు జరిగాయి. సమానమైన స్కోరు సాధించిన వారి విషయంలో వయసును కూడా ప్రమాణంగా తీసుకోవాలని నిర్ణయించింది. 2021లో ఈ పద్ధతిని రద్దు చేసిన ఎన్టీఏ మళ్లీ అమల్లోకి తెచ్చింది. సమాన మార్కులు వచ్చిన విద్యార్థులుంటే మొదట స్కోర్ల వారీగా వరుసగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అనంతరం తప్పుడు సమాధానాల నిష్పత్తిని అవే సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తారు. అప్పటికీ సమాన స్థాయిలో ఉంటే వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ సాధ్యం కాకుంటే ముందస్తు దరఖాస్తుదారులకు ప్రాధాన్యం ఇస్తారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది హాజరు జేఈఈ మెయిన్ను 2021లో నాలుగు విడతలుగా నిర్వహించగా ఈసారి రెండు విడతలకే పరిమితం చేశారు. తొలి విడత ఈనెల 20 నుంచి 29 వరకు, మలివిడత జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. ఈనెల 1 నుంచి ప్రారంభమైన మలివిడత దరఖాస్తు ప్రక్రియ 30వ తేదీతో ముగియనుంది. తొలి విడతకు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది వరకు హాజరవుతారని భావిస్తున్నారు. ఏపీ నుంచి 1.60 లక్షల మంది మెయిన్ రాసే అవకాశం ఉంది. చిరునామా ఆధారంగా పరీక్ష కేంద్రం కేటాయింపు ఈసారి అభ్యర్థి చిరునామాను అనుసరించి మాత్రమే సమీపంలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిచ్చిన ఎన్టీఏ.. వాటిలో ఒకదానిని కేటాయిస్తుంది. గతంలో ఇతర రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలను కూడా ఎంపిక చేసుకొనే విధానముండేది. అయితే 2021 మెయిన్లో కొందరు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడడం, మాస్ కాపీయింగ్ జరగడంతో సీబీఐ విచారణ, అరెస్టులు కూడా చోటుచేసుకున్నందున ఈసారి ఆ విధానాన్ని మార్చారు. పరీక్ష కేంద్రాల సంఖ్యను 334 నుంచి 514కు ఎన్టీఏ పెంచింది. ఆంధ్రప్రదేశ్లో 29 పరీక్ష కేంద్రాల్లో ఈ జేఈఈ మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలు ఇవీ అమరావతి, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం -
వరంగల్ నిట్లో ఘనంగా స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు (ఫొటోలు)
-
జేఈఈ మెయిన్ రెండో సెషన్ యథాతథం
సాక్షి, అమరావతి: ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్– 2022–23 సెకండ్ సెషన్ షెడ్యూల్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. ముందుగా ప్రకటించినట్టే మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్ సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ఏటీ) తెలిపింది. జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తామని ఐఐటీ బాంబే పేర్కొన్నప్పటికీ మెయిన్ సెకండ్ సెషన్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్ మొదటి సెషన్ను ముందు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ బోర్డుల పరీక్షల తేదీలతో అవి క్లాష్ అవుతుండడంతో ఆ తేదీలను ఎన్టీఏ మార్చింది. ఏప్రిల్ 21 నుంచి మే 4 వరకు మెయిన్ మొదటి సెషన్ పరీక్షలకు కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో సెకండ్ సెషన్ తేదీల్లో కూడా మార్పులు ఉండొచ్చని విద్యార్థుల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఏ ఈ మేరకు స్పష్టతనిచ్చింది. జేఈఈ మెయిన్లో క్వాలిఫై అయిన టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హులు. కాగా జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఆన్లైన్ దరఖాస్తులో వివరాలు సవరించుకోవడానికి ఈసారి అవకాశం లేనందున విద్యార్థులు ముందే తగు జాగ్రత్తలు పాటించాలని ఎన్టీఏ సూచించింది. న్యూమరికల్ ప్రశ్నలకూ నెగెటివ్ మార్కులు జేఈఈ మెయిన్లోని పేపర్–2 సెక్షన్ బీలో న్యూమరికల్ ప్రశ్నలకు గతంలో నెగెటివ్ మార్కులు ఉండేవి కావు. అయితే ఈసారి వాటికి కూడా ఎన్టీఏ నెగెటివ్ మార్కులను ప్రకటించింది. ప్రతి తప్పు సమాధానానికి ఒక్కో మార్కు కోత పడనుంది. ఈ విషయాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకొని సమాధానాలు రాసేటప్పుడు జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘మెయిన్’కు తగ్గిపోతున్నారు!
సాక్షి, అమరావతి: జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. విద్యాసంస్థల సంఖ్య, సీట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ పరీక్షలకు నమోదయ్యే విద్యార్థుల సంఖ్య మాత్రం పెరగకపోవడం విశేషం. గత పదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. లక్ష నుంచి లక్షన్నర వరకు తగ్గుదల 2012లో 12.20 లక్షల మంది, 2014లో 13.56 లక్షల మంది అభ్యర్థులు మెయిన్కు నమోదుకాగా 2021లో ఆ సంఖ్య 10.48 లక్షలకు తగ్గిపోయింది. 2018 వరకు మెయిన్స్ పరీక్షను ఏడాదికి ఒకసారే నిర్వహించేవారు. ఈ విధానంవల్ల విద్యార్థులు అటు ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత మెయిన్ పరీక్షలతో తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. పైగా ఈ సీట్ల సాధన కోసం అభ్యర్థులు లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకోవడంవల్ల ఏడాదిపాటు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2019 నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. కానీ, 2021లో కరోనావల్ల నాలుగుసార్లు నిర్వహించారు. అయితే.. 2021లో మినహా అంతకు ముందు సంవత్సరాల్లో మెయిన్కు నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే తగ్గుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2012లో 12.20 లక్షల మంది నమోదు కాగా.. 2013లో ఆ సంఖ్య 12.82 లక్షలకు పెరిగింది. 2014లో 13,56,805కు చేరింది. ఆ తర్వాత 2015 నుంచి విద్యార్థుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తోంది. 2015లో 13.04,495 మందికి తగ్గగా 2016కు వచ్చేసరికి 11,94,938కి.. 2017లో 11,86,454 మందికి పడిపోయింది. కానీ, 2018లో మాత్రం 12.59 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ 2019నుంచి రెండుసార్లు నిర్వహించేలా జేఈఈ విధానాన్ని మార్చినప్పటికీ అభ్యర్థుల సంఖ్య పెరగకపోగా తగ్గడం విశేషం. 2019లో 9,35,741 మంది, 2020లో 9,21,261 మంది, 2021లో 10,48,012 మంది నమోదయ్యారు. సీట్లు పెరిగినా పెరగని అభ్యర్థుల సంఖ్య దేశంలో 2016 నాటికి మొత్తం ఐఐటీలు (23), ఎన్ఐటీలు (31), ఐఐఐటీలు (26), జీఎఫ్ఐటీ (18)లలో 28,000 సీట్లు ఉండగా అవి 2021 నాటికి 37,952కు పెరిగాయి. ఐఐటీలలో 2016–17లో 10,572 సీట్లు ఉండగా ప్రస్తుతం 16,053కు చేరాయి. పైగా ఐఐటీల్లో మహిళల సంఖ్యను పెంచేందుకు వారికోసం ఆయా సంస్థల్లో సూపర్ న్యూమరరీ కింద 20 శాతం మేర సీట్లు అదనంగా కేటాయిస్తోంది. హాజరవుతున్న వారూ తగ్గుముఖం మరోవైపు.. మెయిన్కు రిజిస్టర్ అవుతున్న వారి సంఖ్యతో పోలిస్తే పరీక్ష రాస్తున్న వారి సంఖ్య మరింత తక్కువగా ఉంటోంది. లక్ష మందికి పైగా హాజరవ్వడంలేదు. ► 2021లో నాలుగు సెషన్లలో జేఈఈ మెయిన్ను నిర్వహించగా దేశవ్యాప్తంగా మొత్తం 10,48,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 9,39,008 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ► 2020లో 9,21,261 మంది నమోదు చేసుకోగా 8,69,010 మంది హాజరయ్యారు. ► 2019లో 9,35,741 మందికి గాను 8,81,096 మంది రాశారు. ► 2018లో 12.59 లక్షల మంది నమోదు కాగా 10.50 లక్షల మందే పరీక్షకు హాజరయ్యారు. ► 2017లో 11,86,454 మందిలో 10.20 లక్షల మంది.. ► 2016లో 11,94,938కి గాను 11 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ► ఇక 2015లో 13,04,495 మందికిగాను 12.34 లక్షల మంది రాశారు. జేఈఈకి ప్రత్యేకంగా తర్ఫీదు కావలసి ఉండడం, ఐఐటీలు సహ ఇతర సంస్థలు ఎక్కడో దూరంగా ఉండడం, పైగా ఆయా సంస్థలలో ఫీజులను భరించే స్థోమత లేకపోవడంతో ఎక్కువమంది విద్యార్థులు స్థానికంగా ఉండే ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. -
నీట్ పీజీ కటాఫ్లో...15 పర్సంటైల్ తగ్గింపు
న్యూఢిల్లీ: పీజీ మెడికల్ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2021 నీట్–పీజీలో అన్ని కేటగిరీల్లోనూ కటాఫ్ను 15 పర్సంటైల్ మేరకు తగ్గించాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ను ఆదేశించింది. ఎన్బీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మినూ బాజ్పాయ్కి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సభ్య కార్యదర్శి బి.శ్రీనివాస్ ఈ మేరకు లేఖ రాశారు. అన్ని అంశాలనూ చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ మేరకు క్వాలిఫయింగ్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 35వ పర్సెంటైల్కు, ఫిజికలీ హాండీక్యాప్డ్ (జనరల్)కు 30కి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వుడ్ కేటగిరీలకు 25 పర్సెంటైల్కు తగ్గించాలని పేర్కొన్నారు. ఆలిండియా, రాష్ట్రాల కోటాల్లో రెండేసి రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత కూడా దాదాపు 8,000 సీట్లు మిగిలిపోనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ మెడికల్ కమిషన్తో విస్తృతంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ‘‘దీనివల్ల సీట్ల వృథాకు అడ్డుకట్ట పడుతుంది. తాజా నిర్ణయం వల్ల కనీసం మరో 25 వేల మంది అభ్యర్థులు ప్రస్తుత కౌన్సెలింగ్లో మాప్ రౌండ్లో పాల్గొనగలరు’’ అని చెప్పారు. (చదవండి: భారత్లో చదువుతామంటూ...‘ఉక్రెయిన్’ విద్యార్థుల పిటిషన్) -
రెండు విడతలుగా జేఈఈ మెయిన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ – 2022 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. రెండు విడతలుగా నిర్వహించే ఈ పరీక్షలు ఏప్రిల్లో 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. రెండో విడత పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి. కంప్యూటర్ ఆధారితంగా పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షల దరఖాస్తు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పేపర్–1, పేపర్–2 లుగా మెయిన్స్ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష ఉంటుంది. బీఈ బీటెక్ కోర్సులకు పేపర్–1, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్–2 పరీక్ష పెట్టనున్నారు. బీఆర్క్కు పేపర్–2ఏను, బీ ప్లానింగ్కు పేపర్–2బీ నిర్వహిస్తారు. పేపర్–2ఏ లోని పార్టు 3లో డ్రాయింగ్ టెస్టును పెన్ను, పేపర్తో ఆఫ్లైన్ మోడ్లో రాయాలి. పరీక్షలను ఇంగ్లీషు, హిందీ, తెలుగు, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. ఒకేసారి ఇంటర్మీడియట్, జేఈఈ పరీక్షలు ఒక పక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు, మరోపక్క జేఈఈ పరీక్షలు ఒకేసారి జరుగనుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరుగనున్నాయి. తొలి విడత జేఈఈ పరీక్షలు కూడా అవే తేదీల్లో జరగనున్నాయి. దీంతో రెండిటికీ సన్నద్ధం కావడం కష్టంగా మారనుంది. ఒకే సమయంలో జేఈఈ, బోర్డు పరీక్షలు రాయాల్సి రావడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురవుతామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది తొలివిడత చాన్సును వదులుకోవలసి వస్తుందని చెబుతున్నారు. మేలో జరిగే రెండో విడత జేఈఈ మెయిన్స్కు మాత్రమే హాజరు కాగలుగుతామని అంటున్నారు. గతంలో జేఈఈ చాన్సులు నాలుగు ఉండడంతో బోర్డు, జేఈఈ పరీక్షలకు కొంత వ్యవధి తీసుకొని రాసే అవకాశం ఉండేది. ఈసారి చాన్సులను రెండుకు కుదించడంతో పాటు పరీక్షలను ఏప్రిల్, మేలలో పెడుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. ఇవే కాకుండా జేఈఈకి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, పీజుల చెల్లింపు, ధ్రువపత్రాల సమర్పణ వంటి పనులు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ, బోర్డు పరీక్షలకు సిద్ధం కావడం, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం కావడం అన్నీ ఒకే సమయంలో చేయాల్సి ఉంటుందని, ఇది పరీక్షలలో విద్యార్థుల సామర్థ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాలేజీలు ఆలస్యంగా తెరవడంతో బోధనకూ ఆటంకం 2021–22 విద్యా సంవత్సరంలో కాలేజీలను తెరవడం ఆలస్యమయింది. జూన్లో కాలేజీలు ఆరంభం కావలసి ఉండగా కరోనా కారణంగా అక్టోబర్లో తెరిచారు. ఆ తరువాత కూడా బోధన, అభ్యసన ప్రక్రియలు సరిగా సాగలేదు. గత రెండు మూడు నెలలుగా మాత్రమే బోధనకు అవకాశం ఏర్పడింది. కాలేజీలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ను 30 శాతం మేర తగ్గించింది. కానీ జేఈఈ సిలబస్లో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదని ఎన్టీఏ ప్రకటించింది. అసలే సమయం లేక ఇంటర్ పరీక్షలు రాసేందుకు నానా అవస్థలు పడుతుంటే జేఈఈ మెయిన్స్ పూర్తి సిలబస్తో జరగడం వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పీజీ చదివేవారేరి?
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోని వివిధ పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో ఏటా సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. బీటెక్తోనే విద్యార్థులకు భారీ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. బీటెక్తోనే మంచి ఉద్యోగాలు వస్తుండటంతో ఎక్కువ మంది విద్యార్థులు పీజీ, పీహెచ్డీ వైపు మొగ్గు చూపడం లేదు. అలాగే బీటెక్లోని కొన్ని కోర్సుల్లోనూ సీట్లు భర్తీ కావడం లేదు. ఈ సమస్య ప్రధానంగా కొత్త ఐఐటీల్లో కనిపిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత రెండేళ్లలో భర్తీ కాని సీట్లు.. గత రెండేళ్లలో ఐఐటీల్లోని వివిధ కోర్సుల్లో 10,780 సీట్లు, ఎన్ఐటీల్లో 8,700 సీట్లు మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో 5,484 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల సీట్లు 476 ఉండగా పీజీ కోర్సుల సీట్లు 3,229 ఉన్నాయి. అలాగే పీహెచ్డీ కోర్సుల్లో 1,779 సీట్లు భర్తీ కాలేదు. కాగా కొత్త ఐఐటీలైన భువనేశ్వర్, గాంధీనగర్, హైదరాబాద్, ఇండోర్, జోధ్పూర్, మండి, పాట్నా, రోపార్ల్లో సీట్లు ఎక్కువ మిగిలిపోయినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక 2021–22లో అన్ని ఐఐటీల్లో 5,296 సీట్లు భర్తీ కాలేదు. వీటిలో బీటెక్ కోర్సుల్లో 361 సీట్లు, పీజీ కోర్సుల్లో 3,083 సీట్లు, పీహెచ్డీ కోర్సుల్లో 1,852 సీట్లు ఖాళీగా మిగిలిపోయినట్లు కాగ్ పేర్కొంది. ప్లేస్మెంట్లకే విద్యార్థుల ప్రాధాన్యత మరోవైపు ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీటెక్ పూర్తికాగానే విద్యార్థులు మంచి కొలువులకే ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో పీజీ, పీహెచ్డీ సీట్ల వైపు వారు మొగ్గు చూపడం లేదు. బీటెక్ ఉత్తీర్ణతతోనే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో మంచి ఉద్యోగాలు దక్కుతుండటంతో పీజీ, పీహెచ్డీల్లో చేరడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. పరిశోధనలంటే ఆసక్తి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు మాత్రమే పీజీ, పీహెచ్డీల్లో చేరుతున్నారు. అయితే వీరి సంఖ్య అతి స్వల్పంగా ఉంటోంది. పైగా ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)ను నిర్వహిస్తున్నారు. బీటెక్ ఉత్తీర్ణులు గేట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాగ్ వెల్లడించింది. 2014 నుంచి 2019 వరకు చూస్తే ఐఐటీలలోని పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో 28 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. భర్తీ కాని సీట్లు ఎన్ఐటీల్లోనే అధికం ఐఐటీలతో పోలిస్తే ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా మిగిలిపోతున్నట్టు కాగ్ వెల్లడించింది. ముఖ్యంగా కొత్త ఎన్ఐటీల్లో సీట్లు భర్తీ కావడం లేదని పేర్కొంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఆరు నుంచి ఏడు రౌండ్ల కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నా సీట్లు మిగిలిపోతుండడం గమనార్హం. కొన్నిసార్లు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ను చేపడుతున్నా ఇదే పరిస్థితి. ఐఐటీలు, ఎన్ఐటీలు పరిశోధనలకు ఉద్దేశించినవే అయినా వాటిలో పీహెచ్డీ సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. వివిధ ప్రవేశ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ చూపినవారికే ఈ కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నారు. ఈ స్థాయిలో మెరిట్ సాధిస్తున్నవారు లేకపోవడం కూడా ఈ సీట్లు మిగిలిపోవడానికి మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. కాగ్ నివేదిక ప్రకారం.. అర్హత గల అభ్యర్థులు లేకపోవడం వల్ల పీహెచ్డీ సీట్లు భర్తీ చేయలేకపోతున్నట్లు ఆయా ఐఐటీలు పేర్కొన్నాయి. టాప్ ఐఐటీల్లో ఒకటైన ఢిల్లీలో 800 పీహెచ్డీ సీట్లు ఉండగా.. ఏటా 500 మాత్రమే భర్తీ అవుతున్నాయి. -
జేఈఈకి ఎన్నికల దెబ్బ!
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర విద్యా సంస్థలలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పరీక్షకు ఈసారీ ఆటంకాలు తప్పేలా లేవు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జేఈఈ పరీక్షలు ఈ ఏడాది కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడి కానుండడంతో మెయిన్స్ పరీక్షలు ఆ తరువాతే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జేఈఈ మెయిన్స్ ఏడాదికి ఒకేసారి నిర్వహించగా 2021 నుంచి 4 దశల్లో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ ఇచ్చింది. కరోనా వల్ల ఆ పరీక్షలు అక్టోబర్ నాటికిగాని పూర్తికాలేదు. దీని ప్రభావంతో 2021 డిసెంబర్లో విడుదల కావలసిన 2022 జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ ఇప్పటివరకు రాలేదు. జనవరిలో విడుదల చేసి ఫిబ్రవరి నుంచి 4విడతల్లో పరీక్షలు నిర్వహించవచ్చని అందరూ భావించారు. అయితే.. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో జేఈఈ మొదటి దశ మార్చి ఆఖరులో నిర్వహించే అవకాశముందని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే, జూన్లలో మిగిలిన దశలను నిర్వహించి అనంతరం ‘అడ్వాన్స్’ను చేపట్టనున్నారు. ఈసారి అభ్యర్థులు పెరిగే అవకాశం జేఈఈకి అభ్యర్థుల సంఖ్య ఈసారి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల పరీక్షలు అరకొరగా జరగ్గా అనేక రాష్ట్రాల్లో అసలు జరగలేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థులందరినీ పాస్ చేశారు. సీబీఎస్ఈ కూడా కరోనా కారణంగా చదువులు దెబ్బతినడంతో మూల్యాంకనాన్ని సరళతరం చేసింది. ఆ సంస్థల్లోనూ 99 శాతం వరకు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితంగా ఈసారి జేఈఈకి విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. అక్రమాలకు వీల్లేకుండా.. గత ఏడాది జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరగడంతో సీబీఐ దర్యాప్తు.. కొందరు కోచింగ్ సెంటర్ల ప్రతినిధుల అరెస్టు.. 20 మంది విద్యార్థుల డిబార్ వంటి ఘటనలు తెలిసిందే. ఈసారి అటువంటి వాటికి తావులేకుండా ఎన్టీఏ పటిష్ట చర్యలు చేపడుతోంది. విద్యార్థులు నాలుగు విడతల్లో ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకోవచ్చు. -
జేఈఈ–2022 జాడేది?
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్, అడ్వాన్స్డ్–2022 షెడ్యూల్పై విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేఈఈ షెడ్యూల్ను పరీక్షకు ఆరు నెలల ముందుగా ప్రకటించడం ఆనవాయితీ. అయితే కరోనా, తదితర కారణాలతో గత కొన్నేళ్లుగా షెడ్యూల్ ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్–2022ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఎన్ని దశల్లో పరీక్షలుంటాయి? పరీక్ష విధానంలో మార్పులేమైనా ఉంటాయా? అనే సందేహాలు విద్యార్థుల్లో తలెత్తుతున్నాయి. కరోనాతో అస్తవ్యస్తం.. 2019 జేఈఈ మెయిన్ షెడ్యూల్ను 2018 జూలై 7న ప్రకటించారు. 2019 జనవరి, ఏప్రిల్ల్లో రెండు దశల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఇక 2020 పరీక్షల షెడ్యూల్ను 2019 ఆగస్టు 28న ప్రకటించారు. 2020 జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు పూర్తి చేసినా.. రెండో సెషన్ ఏప్రిల్ పరీక్షలను కరోనా కారణంగా సెప్టెంబర్లో నిర్వహించారు. ఇక 2021 జేఈఈ షెడ్యూల్ను 2020 డిసెంబర్ 16న ప్రకటించారు. 2020లో కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం పూర్తి కాకపోవడంతో పలువురు అభ్యర్థులు జేఈఈ మెయిన్కు హాజరు కాలేకపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2021 జేఈఈ మెయిన్ను నాలుగు విడతల్లో.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ఇచ్చింది. ఫిబ్రవరి, మార్చి సెషన్ల పరీక్షలు యథాతథంగా జరిగినా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ఆలస్యమయ్యాయి. ఈ పరీక్షలు సెప్టెంబర్ 2కి గాని పూర్తికాలేదు. గత మూడేళ్లూ పరీక్షల షెడ్యూల్ను డిసెంబర్ మధ్య నాటికే ప్రకటించారు. 2022 జేఈఈ మెయిన్ షెడ్యూల్ మాత్రం ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈసారి కూడా నాలుగు విడతలు ఉంటాయా? జేఈఈ మెయిన్ను రెండు విడతలకు బదులు 2021లో నాలుగు విడతల్లో నిర్వహించారు. 2022లో కూడా అదే విధానం ఉంటుందా? ఉండదా? అనే సందేహం వెంటాడుతోంది. నాలుగు విడతల వల్ల 2021లో ఐఐటీ అడ్మిషన్లు చాలా ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో మార్పులు చేస్తారా? అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మార్కుల వెయిటేజీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తొలగించింది. ఈసారి కూడా ఇదే విధానం ఉంటుందా? లేదా అనేదానిపైనా విద్యార్థుల్లో సందేహాలు ఉన్నాయి. ఇలా అనేక అంశాలపై ఆధారపడి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా నాలుగు విడతల్లో జేఈఈ ఉంటే.. ముందు బోర్డు పరీక్షలకు సిద్ధమై తదుపరి జేఈఈకి సన్నద్ధం కావాలని యోచిస్తున్నారు. -
ఎప్పుడైనా తాజాగా తినేలా
సాక్షి, అమరావతి: ఆహార పదార్థాలు ఎక్కువ కాలం తాజాగా ఉంచే నానో టెక్నాలజీ ప్యాకింగ్ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్–ఏపీ) అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ప్యాకింగ్లోని ఆహారం ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటుందని ప్రకటించింది. ఇందుకు సంబంధించి నిట్ బయో టెక్నాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.జగన్మోహన్రావు ఆధ్వర్యంలోని ఇంటర్ డిసిప్లినరీ బృందం చేస్తున్న పరిశోధనల వివరాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్యాకింగ్ మెటీరియల్ స్థానంలో నానోపార్టికల్ సామగ్రితో ప్యాకింగ్ చేసినట్టయితే పదార్థాలు ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయన్నారు. ఈ ప్యాకింగ్లో ఆహారం, రంగు, రుచి, వాసనతో పాటు నాణ్యత చెక్కు చెదరదన్నారు. నానో టెక్నాలజీ రోజురోజుకు ఎంతో అభివృద్ధి సాధిస్తోందని, వివిధ రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆహార పదార్థాల ప్యాకింగ్తో పాటు వ్యవసాయం సహా ఇతర రంగాల్లో వినియోగిస్తే నిల్వ సామర్థ్యం ఎంతో పెరుగుతుందన్నారు. నానో పార్టికల్ ఆధారిత ప్యాకింగ్ పదార్థాలు సంప్రదాయ, నాన్–బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయన్నారు. ప్యాక్ చేసిన పదార్థాలలో ఏవైనా వ్యాధి కారకాలు, పురుగు మందుల అవశేషాలు, అలర్జీ కారకాలు, రసాయనాలు ఉంటే సెన్సార్ల ద్వారా గుర్తించవచ్చన్నారు. ఆహార జీవిత కాలాన్ని పెంచేందుకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను ప్యాకింగ్లోని నానో సెన్సార్లు విడుదల చేస్తాయని, దీనివల్ల ఆహారం పారవేసే పరిస్థితి రాదని, ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్ జగన్మోహన్రావు వివరించారు. నానో ప్యాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన పరిశోధన బృందాన్ని ఏపీ నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీఎస్పీ రావు అభినందించారు. -
AP: 13 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మార్చి–2022 పబ్లిక్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలై మళ్లీ పరీక్షలకు హాజరవ్వాలనుకొనే విద్యార్థులు డిసెంబర్ 13వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఫీజుల వివరాలతో మంగళవారం బోర్డు ప్రకటన జారీ చేసింది. ఆలస్య రుసుములతో 2022 జనవరి 20 వరకు గడువు ఉందని పేర్కొంది. ఆలస్య రుసుము రూ.120తో డిసెంబర్ 23, రూ.500తో డిసెంబర్ 30, రూ.1,000తో 2022 జనవరి 4, రూ.2 వేలతో జనవరి 10, రూ.3 వేలతో జనవరి 17, రూ.5 వేలతో జనవరి 20 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునని వివరించింది. దరఖాస్తు రుసుము, పరీక్షలకు సంబంధించి ఫీజులను (పేపర్ల వారీగా, సంవత్సరాల వారీగా), ఇతర అంశాలను సర్క్యులర్లో పొందుపరిచింది. (చదవండి: ఏపీ నీట్ ర్యాంక్లు విడుదల) పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, తాడేపల్లిగూడెం: పీహెచ్డీ పార్ట్టైం, ఫుల్టైం కోర్సులు, ఎంఎస్ (బై రీసెర్చ్) కోర్సుల్లో చేరడానికి ఏపీ నిట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2021 సెషన్కు సంబంధించి అర్హులైన వారిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు డిసెంబర్ 4 వరకు గడువు ఉన్నట్లు నిట్ అధికారులు మంగళవారం తెలిపారు. పార్ట్టైం కోర్సులో 148 సీట్లు, ఫుల్టైం కోర్సులో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారిని రాతపరీక్ష, ఇంటర్వ్యూ పద్ధతుల్లో ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు www.nitandhra.ac.in/main/లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. -
దక్షిణ భారతదేశ ఉత్తమ విద్యా సంస్థగా ఏపీ నిట్
తాడేపల్లిగూడెం: ఏపీ నిట్కు 2021 సంవత్సరానికి గాను దక్షిణ భారతదేశ ఉత్తమ సంస్థ అవార్డు దక్కింది. వర్చువల్ పద్ధతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ గ్రోత్ అండ్ రీసెర్చ్ (సీఈజీఆర్) (ఢిల్లీ) సంస్థ నుంచి అవార్డును నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు అందుకున్నారు. సీఈజీఆర్ సంస్థ 15వ రాష్ట్రీయ శిక్ష గౌరవ్ పురస్కార్ వేడుక సందర్భంగా విద్యా నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల్లో అత్యుత్తమ కృషికి గాను నిట్కు ఈ అవార్డు అందజేసింది. ఈ సందర్భంగా సీఎస్పీ రావు మాట్లాడుతూ.. ఏపీ నిట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఇనిస్టిట్యూట్ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నూతన విద్యా విధానం–2020 మార్గదర్శకాల ప్రకారం 2020–21 విద్యాసంవత్సరం నుంచి అండర్ గ్రాడ్యుయేట్ (బీటెక్) పాఠ్యాంశాలను సవరించామన్నారు. నిరంతర మద్దతు ఇస్తున్నందుకు విద్యా మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ పి.శంకరరెడ్డి మాట్లాడుతూ.. నిట్లో నిర్మాణాలను ప్రపంచస్థాయి సదుపాయాలతో రికార్డు సమయంలో చేపట్టడానికి డైరెక్టర్ ఎంతగానో కృషిచేశారన్నారు. ఈ అవార్డు ఇచ్చిన ప్రేరణతో భవిష్యత్లో మరిన్ని మైలురాళ్లు దాటడానికి ప్రయత్నిస్తామన్నారు. -
నేటి నుంచి జేఈఈ 4వ విడత
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ–మెయిన్) 2021 4వ సెషన్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మే లో జరగాల్సిన ఈ పరీక్షలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. కంప్యూటరాధారితంగా జరిగే ఈ పరీక్షలు సెప్టెంబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 7 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలిరోజు పేపర్–2 అయిన బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ పరీక్షలు జరగనున్నాయి. బీటెక్ కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు ఆ తరువాత వరుసగా నాలుగు రోజుల పాటు ఆగస్టు 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఉదయం, సాయంత్రం రెండు బ్యాచ్లుగా జరుగుతాయి. జేఈఈ మెయిన్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంవత్సరం నుంచి నాలుగు సెషన్లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నాలుగో సెషన్ పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ మూడో వారంలో తుది విడత ఫలితాలను అభ్యర్థుల ర్యాంకులతో సహా ఎన్టీఏ ప్రకటించనుంది. -
NEET Exam: బూట్లు వద్దు.. చెప్పులే వేసుకోండి!
సాక్షి, హైదరాబాద్: కఠిన నిబంధనలు, కరోనా జాగ్రత్తల నడుమ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వచ్చే నెల 12న నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్కు హాజరయ్యే విద్యార్థులు బూట్లు ధరించకూడదని ఎన్టీఏ ప్రకటించింది. సాధారణ చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే అభ్యర్థిని పరీక్ష రాసేందుకు అనుమతించరు. ప్రధానంగా పరీక్ష హాలులోకి వచ్చే విద్యార్థులకు కఠినమైన నిబంధనలను అమలుచేస్తున్నారు. హెయిర్ పిన్ను, తాయత్తు ఏదీ వద్దు.. విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. పాస్పోర్టు సైజు ఫొటో, ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, రేషన్ కార్డు వంటివి తీసుకెళ్లొచ్చు. కరోనా నేపథ్యంలో ముఖానికి మాస్కు తప్పనిసరి. వాటర్ బాటిల్, 50 మి.లీ. శానిటైజర్ బాటిల్ తీసుకువెళ్లొచ్చు. ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేస్తారు. అభ్యర్థులు ఆభరణాలు ధరించకూడదు. ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిపోగులు, ముక్కు పోగులు, చైన్, నెక్లెస్, లాకెట్లు, బ్యాడ్జ్ మొదలైనవి పెట్టుకొని రాకూడదు. కాగితాల ముక్కలు, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పర్సు, కాలిక్యులేటర్, పెన్, స్కేల్, పెన్ డ్రైవ్లు, రబ్బరు, ఎలక్ట్రానిక్ పెన్, స్కానర్ మొదలైనవి వెంటతీసుకొని రాకూడదు. ఫోన్, బ్లూటూత్, ఇయర్ఫోన్లు, మైక్రోఫోన్, పేజర్, హెల్త్ బ్యాండ్, చేతి గడియారం, కెమెరా లాంటివి ఏవీ తీసుకెళ్లొద్దు. అలాగే వాలెట్, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు, హెయిర్పిన్లు, హెయిర్ బ్యాండ్, తాయెత్తులు పెట్టుకొని రావొద్దని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అడ్మిట్ కార్డు ట్యాంపరింగ్ చేయకూడదు.. సెప్టెంబర్ 12న ఆఫ్లైన్ మోడ్లో 11 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఆ మేరకు వచ్చే నెల 9న neet.nta.nic.in లో అడ్మిట్ కార్డు విడుదల చేస్తారు. ఈసారి దుబాయ్లో కూడా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా, అభ్యర్థులు పరీక్ష హాల్ లోపల ఇతర విద్యార్థులతో మాట్లాడొద్దు. ఎలాంటి అక్రమాలకు సహకరించొద్దు. ►విద్యార్థులు జవాబు బుక్లెట్ నుంచి ఏ పేజీనీ చించకూడదు. ►నీట్ అడ్మిట్కార్డు వంటి డాక్యుమెంట్లపై ట్యాంపరింగ్ చేయకూడదు. దరఖా స్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్ కార్డుపై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయరాదు. ►నిబంధనలు పాటించకపోయినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్ చేయడానికి ఆస్కారముంది. ►సంప్రదాయ దుస్తులు తప్పక ధరించాల్సిన అభ్యర్థులు రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ►నీట్ పరీక్ష కేంద్రాల్లో మాస్కులు అందిస్తారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి ఒక గంటలోపు పరీక్ష హాల్కు చేరుకోవాలి. ►పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు పెన్ను ఇస్తారు. ►పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లకూడదు. కేటాయించిన సమయం ముగిసిన తర్వాత మాత్రమే అభ్యర్థులు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ►పరీక్ష కేంద్రం వద్ద రద్దీని నివారించేందుకు విద్యార్థులకు నిర్ణీత టైం స్లాట్ కేటాయిస్తారు. ఆ ప్రకారం పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ మేరకు వారికి సమాచారం ఇస్తారు. -
నిట్, సిల్చార్లో నాన్ టీచింగ్ పోస్టులు
సిల్చార్(అసోం)లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 54 ► పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, లైబ్రేరియన్–01, మెడికల్ ఆఫీసర్–01, హిందీ ఆఫీసర్–01, సూపరింటెండెంట్–07, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్–01, టెక్నికల్ అసిస్టెంట్/ఎస్ఏఎస్ అసిస్టెంట్/జూనియర్ ఇంజనీర్–37, సీనియర్ అసిస్టెంట్–04. ► అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: nfapt21@nits.ac.in ► దరఖాస్తులకు చివరి తేది: 02.07.2021 ► వెబ్సైట్: nits.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు NMDC Recruitment 2021: ఎన్ఎండీసీలో 89 పోస్టులు -
కటాఫ్ ఎక్కువే!
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలలో ప్రవేశానికి మార్చిలో నిర్వహించిన రెండవ విడత జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ఫలితాలు ఈనెల చివరి వారంలో వెలువడనున్నాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ గడువు సోమవారం మధ్యాహ్నంతో ముగిసింది. ఫిబ్రవరిలో నిర్వహించిన తొలివిడత సెషన్ పరీక్షలకు మాదిరిగానే ఈ రెండో విడతలోనూ ప్రశ్నలు ఒకింత మధ్యస్తంగా, సులభంగా ఉండటంతో కటాఫ్ మార్కులు ఎక్కువగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.రెండో సెషన్లో 200 మార్కుల స్కోరు సాధించిన వారికి 90కి పైగా పర్సంటైల్ దక్కే అవకాశముంటుందని ప్రాథమిక కీ విడుదల అనంతరం ఆయా సబ్జెక్టుల నిపుణులు, కోచింగ్ సెంటర్ల అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల పరిశీలన పిదప సవరణలతో తుది విడత కీ విడుదల సమయంలో తుది మార్కుల స్కోరు, పర్సంటైల్ ఖరారు అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం జేఈఈ మెయిన్ కటాఫ్ ఓపెన్ కేటగిరీకి 90 నుంచి 100 పర్సంటైల్ వరకు ఉండవచ్చని, రిజర్వుడ్ కేటగిరీలో 60 నుంచి 70 పర్సంటైల్ మధ్య ఉండే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. 200 మార్కులు వచ్చే అభ్యర్థులు 90–100 పర్సంటైల్ సాధించగలుగుతారని చెబుతున్నారు. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు ఈసారి సులభంగా ఉండటంతో జేఈఈ మెయిన్ 2020 కటాఫ్ కన్నా ఈసారి కటాఫ్ ఎక్కువగానే ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో నాలుగు విడతలుగా జేఈఈ మెయిన్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి 30 వరకు మూడో విడత, మే 24 నుంచి 28 వరకు నాలుగో విడత మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. అన్ని విడతలు ముగిసిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన మార్కుల స్కోరును అనుసరించి కటాఫ్ పర్సంటైల్ను ప్రకటించనున్నారు. 2018లో తక్కువ కటాఫ్ జేఈఈ మెయిన్లో 2019లోని కటాఫ్తో పోలిస్తే 2020 కటాఫ్లు స్వల్పంగా పెరిగాయి. అంతకుముందు 2018 జేఈఈ మెయిన్లో ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ పర్సంటైల్ తక్కువగా ఉంది. జేఈఈ మెయిన్ 2017లో కటాఫ్ పర్సంటైల్ మళ్లీ అధికంగానే ఖరారైంది. ఆ కటాఫ్ గణాంకాలు పరిశీలిస్తే ఏమేరకు పెరుగుదల, తగ్గుదల ఉందో స్పష్టమవుతుంది. -
నేటి నుంచి జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ రెండో విడత (మార్చి సెషన్) పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18 వరకు మూడ్రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో వీటిని నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మూడ్రోజులకు కుదించింది. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాలి. సిబ్బందికి గ్లౌజ్లను ఏర్పాటుచేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉ.9 నుంచి 12 వరకు.. రెండో సెషన్ మ.3 నుంచి సా.6 వరకు జరుగుతుంది. మొదటి సెషన్ అభ్యర్థులు ఉ.7.30 నుంచి 8.30 గంటలలోపు.. రెండో సెషన్ అభ్యర్థులు మ.1.30 నుంచి 2.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలి. -
రేపట్నుంచి జేఈఈ మెయిన్–2
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, ఐఐఎస్ఈఆర్ తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ రెండో విడత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో విడత పరీక్షలకు 5 లక్షల మంది వరకు విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. జేఈఈ మెయిన్ను 2021 నుంచి నాలుగు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 4 రోజుల చొప్పున మేలో 5 రోజుల పాటు ఈ పరీక్షలను కంప్యూటరాధారితంగా నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గతంలో ప్రకటించింది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు తొలి విడత పరీక్షలను నిర్వహించింది. ఆ సెషన్కు 6.5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మార్చి సెషన్ను 15 నుంచి 18 వరకు నిర్వహించేందుకు తొలుత షెడ్యూల్ ఇచ్చారు. రెండో విడత పరీక్షలకు రిజిస్టర్ అయిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మార్చి సెషన్ పరీక్షలను మూడు రోజులకు కుదించారు. 16 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ నుంచి 53 వేల మంది రెండో విడత పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్రంలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెంలలో పరీక్ష నిర్వహించనున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే.. పరీక్షల నిర్వహణలో కోవిడ్–19 నియమాలను పాటించేలా ఎన్టీఏ చర్యలు చేపట్టింది. సిబ్బందితో పాటు పరీక్షలురాసే వారంతా తప్పనిసరిగా మాసు్కలు ధరించి రావాలి. సిబ్బందికి గ్లౌజ్లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే వారు తమతో పాటు పారదర్శక బాటిళ్లలో ఉండే శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. అలాగే పారదర్శక బాటిళ్లతో మంచినీరు, పారదర్శకంగా ఉండే బాల్పెన్నులను కూడా అభ్యర్థులు తెచ్చుకోవచ్చు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.30 గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. వారి అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటిటీ కార్డును తెచ్చుకోవాలి. పరీక్షలకు సంబంధించి రఫ్వర్కు చేయడానికి అవసరమైన పత్రాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారు. వాటిని తిరిగి పరీక్ష పత్రాలతోపాటు ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పేపర్–1 పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు కంప్యూటర్ బేస్డ్ విధానం నిర్వహించిన తొలివిడత పరీక్షలకు దేశవ్యాప్తంగా 6,52,627 మంది దరఖాస్తు చేయగా 6,20,978 మంది హాజరైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో అభ్యర్థుల స్కోర్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఈ ఏడాది నుంచి జేఈఈని నాలుగు విడతల్లో నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులవారీగా కేవలం స్కోర్ను మాత్రమే విడుదల చేసింది. మొత్తం నాలుగు విడతల పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు వచ్చిన బెస్ట్ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటించనుంది. ఫిబ్రవరి సెషన్లో 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆరుగురున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఒక్కరికీ100 స్కోర్ రాలేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పోతంశెట్టి చేతన్ మనోజ్ఞసాయి 99.999 స్కోర్ సాధించి రాష్ట్రాల వారీ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఏపీకే చెందిన మరో ఆరుగురు అభ్యర్థులు తక్కిన కేటగిరీల్లో అత్యధిక స్కోర్ సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ స్థానాల్లో నిలిచారు. ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీలో అనుముల వెంకట జయచైతన్య 99.9961682, గుర్రం హరిచరణ్ 99.9942523 స్కోర్లు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఓబీసీ కేటగిరీలో 99.9913217 స్కోర్తో బిత్రసాయి సిద్ధి రఘురామ్ శరణ్ రెండో స్థానం, 99.9846474 స్కోర్తో గొట్టిపల్లి శ్రీ విష్ణు సాత్విక్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. దివ్యాంగుల కేటగిరీలో ఇద్దరికి 3, 4 స్థానాలు లభించాయి. మల్లిన శ్రీ ప్రణవ్ శేషుకు 99.6393686, తల్లాడ వీరభద్ర నాగసాయి కృష్ణకు 99.6363357 స్కోర్లు దక్కాయి. -
జేఈఈ కటాఫ్ మార్కులు పెరిగే చాన్స్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2021 ప్రాథమిక ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి విడుదల చేసింది. దీనిని అనుసరించి జేఈఈ మెయిన్–2021లో కటాఫ్ మార్కులు గతంలో కన్నా స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 23నుంచి 26వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారితంగా ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బీఈ, బీ.టెక్, బీ.ఆర్క్, బీ.ప్లానింగ్ కోర్సులకు సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షలలో వచ్చిన ప్రశ్నల స్థాయిని అనుసరించి కోచింగ్ సెంటర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. ప్రాథమిక ‘కీ’ కూడా విడుదల కావడంతో కటాఫ్ మార్కులపై వేర్వేరు అంచనాలలో తలమునకలవుతున్నాయి. అన్ని సెషన్ల పరీక్షలు పూర్తయ్యాకే కటాఫ్పై స్పష్టత జేఈఈలో కటాఫ్ మార్కులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఐఐటీ విద్యాసంస్థల్లోకి ప్రవేశానికి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించేందుకు అవసరమైన కటాఫ్ మార్కులు. జేఈఈ మెయిన్లో అభ్యర్థులు సాధించిన స్కోరును అనుసరించి ఈ కటాఫ్ను నిర్ణయిస్తారు. రెండోది ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి జేఈఈ మెయిన్ స్కోరును అనుసరించి నిర్ణయించే కటాఫ్. ఈ నెల 7వ తేదీలోపు ప్రకటించే తుది ఫలితాలతో జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ను ఎన్టీఏ ప్రకటిస్తుంది. అయితే, ప్రస్తుతం నాలుగు సెషన్లలో ఫిబ్రవరి సెషన్ పరీక్షలలో అభ్యర్థులు సాధించే స్కోరును అనుసరించి మాత్రమే ఈ కటాఫ్, పర్సంటైల్ అంచనాలు వేస్తున్నా మార్చి, ఏప్రిల్, మే సెషన్ల పరీక్షలు ముగిశాక కానీ తుది కటాఫ్ తేలదు. అంతిమంగా మే సెషన్ ఫలితాల అనంతరమే దీనిపై ఒక స్పష్టత వస్తుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రతి సెషన్ పరీక్షలకు సంబంధించి తుది ఫలితాలతో పాటే వీటిని విడుదల చేస్తారు. జూన్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాల ప్రక్రియను చేపడతారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల కటాఫ్ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ ప్రకటిస్తుంది. విద్యాసంస్థల వారీగా ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులను అనుసరించి అడ్మిషన్ల కటాఫ్ మార్కులను ప్రవేశాల సమయంలో జోసా విడుదల చేయనుంది. మొత్తం అన్ని సెషన్ల పరీక్షలకు హాజరైన అభ్యర్థులు, అందుబాటులో ఉన్న సీట్లు, పరీక్షల్లో వచ్చే ప్రశ్నల కాఠిన్యత తదితరాలను అనుసరించి తుది కటాఫ్ తేలనుంది. ఫిబ్రవరి సెషన్కు 6,61,776 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 6,52,627 మంది పరీక్షలు రాశారు. ప్రాథమిక ‘కీ’ని అనుసరించి కటాఫ్ ఇలా ఈసారి కటాఫ్ గత ఏడాది జేఈఈ మెయిన్ కటాఫ్తో పోలిస్తే స్వల్పంగా పెరిగే అవకాçశం ఉందని కార్పొరేట్ విద్యాసంస్థ అధ్యాపకురాలు ఒకరు అభిప్రాయపడ్డారు. జనరల్ కటాఫ్ మార్కులు ఈసారి 90–95 శాతం వరకు ఉండవచ్చన్నారు. రిజర్వుడ్ కేటగిరీల్లో కూడా 60 నుంచి 70 శాతానికి పైగా మార్కుల స్కోరు సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 200 వరకు మార్కులు వచ్చే అభ్యర్థి 90–95 పర్సంటైల్ సాధించవచ్చన్నారు. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో ప్రాథమిక కీ జేఈఈ మెయిన్–2021 ఫిబ్రవరి సెషన్ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని జేఈఈ మెయిన్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు ఎన్టీఏ పేర్కొంది. ఆన్సర్ ‘కీ’, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్సు షీట్లను కూడా అందులో పొందుపరిచింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను బుధవారం సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్లో పొందుపర్చవచ్చు. ఛాలెంజ్ చేసే ఒక్కొక్క ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపునకు బుధవారం సాయంత్రం 6 గంటల వరకు గడువు విధించారు. దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు అవకాశం మార్చి, ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించిన జేఈఈ మెయిన్కు దరఖాస్తుల సమర్పణ, ఉపసంహరణకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సెషన్లకు ఇంతకుముందు దరఖాస్తు చేసిన వారు ఉపసంహరించుకోవడానికి లేదా తమ దరఖాస్తులో ఏమైనా మార్పులుంటే చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మార్చి సెషన్కు కొత్తగా దరఖాస్తు చేసుకోదలచిన వారికి రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 6వ తేదీ వరకు ఇచ్చింది. మార్చి సెషన్కు సంబంధించిన పరీక్షలు 15, 16, 17, 18 తేదీల్లో జరుగుతాయి. దరఖాస్తులను ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో సమర్పించవచ్చు. రిజిస్టేషన్ ఫీజును 6వ తేదీ రాత్రి 11.50 గంటలలోపు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్, మే సెషన్లకు సంబంధించి కొత్త దరఖాస్తులు, రిజిస్టేషన్ల ఫీజు గడువును ఆ తరువాత తెలియచేయనున్నట్టు ఎన్టీఏ వివరించింది. -
జేఈఈలో తొలివిడతకే ఎక్కువమంది..
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే జేఈఈ (మెయిన్) తొలివిడత పరీక్షకే ఎక్కువమంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మొత్తం నాలుగు విడతల్లో ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలకు తొలివిడతకే 6,61,761 మంది రిజిష్టర్ చేసుకున్నారు. అతి తక్కువగా ఏప్రిల్ సెషన్కు 4,98,910 రిజిస్ట్రేషన్లు ఉండగా మార్చి సెషన్కు 5,04,540, మే సెషన్కు 5,09,972 మంది రిజిష్టర్ అయ్యారు. తొలివిడత సెషన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా మొదటి విడత పరీక్షలు జరగనున్నాయి. అడ్మిట్ కార్డులు జరభద్రం అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నాక వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అలాగే.. ► ‘జేఈఈమెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ► అడ్మిట్ కార్డులను అభ్యర్థులు తమ వ్యక్తిగత మెయిల్లో వెంటనే భద్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి డూప్లికేట్లు జారీచేయరు. ► జేఈఈ అడ్మిషన్లు పూర్తయ్యేవరకు వీటిని దాచుకోవలసిన బాధ్యత అభ్యర్థులదే. ► అడ్మిట్కార్డులోని వివరాలన్నింటినీ అభ్యర్థులు తాము సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంలోని వివరాలతో సరిపోతున్నాయో లేదో సరిచూసుకోవాలి. ► అడ్మిట్కార్డు డౌన్లోడ్లో సమస్యలు ఎదురైతే 0120–6895200 నెంబర్లో ఉ.10 నుంచి సా.5లోపు సంప్రదించవచ్చు. దరఖాస్తులో అసంపూర్ణ సమాచారాన్ని నింపిన వారికి అడ్మిట్కార్డు జారీచేయడంలేదని ఎన్టీయే పేర్కొంది. ఈ–మెయిల్ ఐడీ: ‘జేఈఈఎంఏఐఎన్–ఎన్టీఏఎట్దరేట్జీఓవీ.ఐఎన్’లో కూడా సంప్రదించవచ్చు. అభ్యర్థులకు ఎన్టీఏ సూచనలు.. ► పరీక్ష కేంద్రానికి జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు, అందులో ఉన్నలాంటిదే మరో పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటో తీసుకువెళ్లాలి. దాన్ని అటెండెన్సు షీటులో నిర్దేశిత ప్రాంతంలో అంటించాలి. ► పాన్కార్డు, ఆధార్కార్డు తదితర ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. ► ఎన్టీఏ వెబ్సైట్ నుంచి అండర్టేకింగ్ ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకుని దానిపై సంతకం చేసి పరీక్ష కేంద్రంలో అందించాలి. ► కరోనా నేపథ్యంలో పారదర్శక బాటిళ్లలో శానిటైజర్, మంచినీటిని అనుమతిస్తారు. ► మధుమేహం ఉన్న అభ్యర్థులు తమతో పాటు పరీక్ష కేంద్రంలోకి పండ్లు, సుగర్ టాబ్లెట్లు తీసుకెళ్లొచ్చు. ► పారదర్శకంగా ఉండే బాల్పెన్నునే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ► రఫ్వర్కు కోసం ఖాళీ పేపర్ షీట్లను పరీక్ష హాలులో అందిస్తారు. ► పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్లే ముందు అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్ను షీట్ పైభాగంలో రాసి వాటిని ఇన్విజిలేటర్కు అందించాలి. ► పరీక్ష ప్రారంభమైన తర్వాత ఏ అభ్యర్థినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. అడ్మిట్ కార్డులేని వారినీ అనుమతించరు. నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలి అభ్యర్థులందరూ తప్పనిసరిగా నిర్ణీత సమయానికి 2 గంటలు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ► పరీక్షలు ఉదయం సెషన్ 9 నుంచి 12వరకు, మధ్యాహ్నం సెషన్ 3 నుంచి 6 వరకు జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోనికి ఉ.7.30 నుంచి 8.30 వరకు, మ. 2 నుంచి 2.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ► ఉదయం సెషన్లో 8.30 నుంచి 8.50, మ.2.30 నుంచి 2.50 వరకు ఇన్విజిలేటర్లు సూచనలు చేస్తారు. ► అలాగే, ఉ.9 నుంచి.. మ.3 నుంచి పరీక్ష ప్రారంభం అవుతుంది. ► పరీక్షా హాలులోకి ప్రవేశించిన తర్వాత, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు అటెండెన్సు షీట్ అందిస్తారు. అభ్యర్థుల పేర్లతో ఉండే ఈ షీట్లో పేరు ముందు కేటాయించిన స్థలంలో సంతకం చేయాల్సి ఉంటుంది. షీట్లో సంతకం చేయని వారిని పరీక్షకు గైర్హాజరైనట్లుగా పరిగణిస్తారు. పరీక్షహాలులోకి వీటిని అనుమతించరు.. జామిట్రీ బాక్సు, హ్యాండ్బాగులు, పర్సులు, పేపర్లు, మొబైల్ ఫోన్, ఇయర్ ఫోన్, మైక్రోఫోన్, పేజర్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు.. డాక్యుపెన్, స్లైడ్ రూలర్, లాగ్ టేబుల్స్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి పరికరాలు.. కాలిక్యులేటర్, ఎలక్ట్రానిక్ గడియారాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు సహా ఏ రకమైన ఎలక్ట్రానిక్ వస్తువులనూ అనుమతించరు. ఇంటర్/బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా.. ఇదిలా ఉంటే.. మే 24, 25, 26, 27, 28 తేదీల్లో జరిగే నాలుగో విడత జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎన్టీఏ ఇంతకుముందే షెడ్యూల్ ప్రకటించింది. అయితే, సీబీఎస్ఈతో పాటు వివిధ రాష్ట్రాల ఇంటర్మీడియెట్ బోర్డుల పరీక్షలు కూడా అదే సమయంలో ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనిపై వచ్చిన విజ్ఞప్తులకు స్పందిస్తూ ఎన్టీఏ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మే 3 నుంచి 12 వరకు ఎన్టీఏ వెబ్సైట్లోని అభ్యర్థుల అప్లికేషన్ ఫారంలో తమ 12వ తరగతి రోల్ నెంబర్, బోర్డు పేరును నమోదు చేయాలని సూచించింది. మే సెషన్ జేఈఈ పరీక్షల తేదీలైన మే 24, 25, 26, 27, 28 తేదీల్లో ఏ రోజున ఆ అభ్యర్థి బోర్డు పరీక్షకు హాజరుకానున్నారో ఆన్లైన్ దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొంది. దీనికి సంబంధించిన సమాచారానికి ఎన్టీఏ వెబ్సైట్లోని అప్డేట్ సమాచారాన్ని అనుసరించాలని సూచించింది. -
జేఈఈలో నిబంధనల సడలింపు
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)లో అభ్యర్థులకు వెసులుబాటు కల్పిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనలను సడలించింది. ఈ మేరకు మంగళవారం ఎన్టీఏ వెబ్సైట్లో అధికారిక నోట్ను పొందుపరిచింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అర్హత విషయంలో మినహాయింపులిచ్చింది. ఈ ఏడాది కూడా వాటిని కొనసాగించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈకి హాజరయ్యే అభ్యర్థులు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశం పొందాలంటే జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్లో మెరిట్ ఉండడంతో పాటు వారికి ఇంటర్మీడియెట్లో 75 శాతం మార్కులు సాధించి ఉండడం లేదా టాప్ 20 పర్సంటైల్ వచ్చి ఉండాలన్న నిబంధన ఉంది. అలా ఇంటర్లో 75 శాతం మార్కులు, లేదా టాప్ 20 పర్సంటైల్లు ఉండే వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్సుకు అనుమతిస్తారు. అందులో మెరిట్ సాధించిన వారికి ఐఐటీ ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కానీ, కరోనావల్ల గత విద్యా సంవత్సరం అనేక రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను నిర్వహించలేకపోయాయి. దీంతో ఆయా బోర్డులు విద్యార్థులను ఆల్పాస్గా ప్రకటించాయి. అలాగే, కరోనావల్ల ఏర్పడిన ఈ ప్రత్యేక పరిస్థితుల్లో జేఈఈలో కూడా విద్యార్థులకు 75 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తమకు ఇంటర్లో 75 శాతం మార్కుల నుంచి మినహాయింపునివ్వాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వస్తుండడంతో కేంద్రం స్పందించింది. అర్హత విషయంలో గత ఏడాది ఇచ్చిన మినహాయింపులను ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఏ ప్రత్యేక నోటీసును వెబ్సైట్లో పొందుపరిచింది. దీంతో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు 75శాతం మార్కులతో సంబంధం లేకుండా ఉత్తీర్ణత సాధిస్తే చాలని పేర్కొంది. మెయిన్స్కు 20 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఇదిలా ఉంటే.. జేఈఈ మెయిన్స్ తొలివిడత ఆన్లైన్ పరీక్షలు ఈనెల 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు 26 వరకు కొనసాగుతాయి. ఈ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు 11 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 20 నగరాల్లో ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అవి.. అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. -
జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్లు 21.75 లక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లోకి ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్కు ఈ విద్యా సంవత్సరంలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. గడువు ముగిసే సమయానికి 21,75,183 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ విద్యా సంవత్సరంలో జేఈఈలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా జేఈఈ పరీక్షలను 4 దశల్లో నిర్వహించే విధానం వల్ల విద్యార్థులు దీన్నొక అవకాశంగా మల్చుకోవడానికి పెద్ద ఎత్తున ఉత్సాహం చూపించారని తాజా రిజిస్ట్రేషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగేసి రోజుల చొప్పున ఉదయం, సాయంత్రం 2 సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈసారి జేఈఈ మెయిన్స్ను ఇంగ్లిష్తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గుజరాతీ, ఒడియా, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, ఉర్దూ, అస్సామి భాషల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రాంతీయ భాషల్లో ప్రశ్నపత్రాలు ఆ భాషతో పాటు ఆంగ్లంలో కూడా ఉంటాయి. çఇప్పటివరకు 21 లక్షల మంది రిజిస్టర్ అవ్వగా, వారిలో 1,49,597 మంది 10 స్థానిక భాషల్లో పరీక్షలు రాసేందుకు మొదటిసారి ఆప్షన్ ఇచ్చినట్లు ఎన్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో సగం మంది హిందీని ఎంచుకున్నారు. గుజరాతీలో రాసేందుకు 44,094 మంది, బెంగాలీలో రాసేందుకు 24,841 మంది ఆప్షన్లు ఇచ్చారు. అయితే అత్యధికులు ఆంగ్లంలోనే పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇవ్వడం గమనార్హం. మొదటి దశ పరీక్షకు 6.6 లక్షల మంది దరఖాస్తు జేఈఈ మెయిన్స్ను నాలుగు దశల్లో నిర్వహించేందుకు నిర్ణయించడంతో అభ్యర్థులు వారికి నచ్చిన దశలో పరీక్ష రాయనున్నారు. తొలిదశ పరీక్షలకు 6,61,761 మంది దరఖాస్తు చేశారు. కొందరు నాలుగు దఫాలు రాయడానికి దరఖాస్తు చేయగా, కొందరు ఒకటి, రెండు దఫాల్లో పరీక్షలు రాసేందుకు వీలుగా దరఖాస్తు చేశారు. -
నేటి నుంచి సీఎస్ఏబీ ‘స్పెషల్’ కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్టీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), గవర్నమెంట్ ఫండెడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (జీఎఫ్టీఐ)ల్లో ఖాళీ సీట్ల భర్తీకి సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ (సీఎస్ఏబీ) నిర్వహించే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ రెండు విడతల స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్కు అర్హులు. అయితే ఈ కౌన్సెలింగ్లో సీటు పొందిన అభ్యర్థి ఇంతకు ముందు సీటును పొంది ఉంటే దాన్ని కోల్పోతాడు. ఈ మేరకు ఇంతకు ముందు కేటాయించిన సీటును కోరబోమని కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులందరి నుంచి అఫిడవిట్ తీసుకోనున్నారు. ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్కు సీట్ల ఖాళీలను సోమవారం ప్రకటించనున్నారు. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్కు నమోదు చేసుకున్నవారు, సీట్లు పొంది రద్దు చేసుకున్నవారు, మధ్యలో విత్డ్రా అయినవారు, జేఈఈ మెయిన్లో అర్హత సాధించి జోసా కౌన్సెలింగ్కు రిజిస్టర్ చేసుకోనివారంతా కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులకు సూచనలు.. – అభ్యర్థులు ‘హెచ్టీటీపీఎస్://సీఎస్ఏబీ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. – రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థులు తమ అర్హతలు, జాతీయత, జెండర్, కేటగిరీ తదితర అంశాలను నమోదు చేయాలి. – అభ్యర్థులు చాయిస్లను ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేయకపోతే అవి సర్వర్ నుంచి కనిపించకుండా పోయే ప్రమాదముంది. – నిర్ణీత సమయంలో అభ్యర్థులు తాము సేవ్ చేసిన వాటిని లాక్ చేయాలి. – చాయిస్ ఫిల్లింగ్ అనంతరం వాటిని సేవ్ చేయకపోతే సమయం ముగిశాక ఆ అభ్యర్థులకు సీట్ల కేటాయింపు జరగదు. – చాయిస్ ఫిల్లింగ్ సేవ్, లాక్ చేశాక ప్రింటవుట్ను తీసుకోవాలి. – జోసా నిర్వహించిన కౌన్సెలింగ్లో పాల్గొని సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి 13 లోపు పాక్షిక ఫీజు చెల్లించి ఉండకపోతే వారి సీటు రద్దు అవుతుంది. వారు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. – జోసా కౌన్సెలింగ్లో సీటు వచ్చి పాక్షిక ఫీజు చెల్లించిన అభ్యర్థులు స్పెషల్ కౌన్సెలింగ్లో పాల్గొనని పక్షంలో ఈ నెల 16 నుంచి 21లోపు తమకు కేటాయించిన సంస్థల్లో చేరాల్సి ఉంటుంది. -
ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, అమరావతి: ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనల నుంచి అభ్యర్థులకు ఈసారి కొంత ఊరట లభిస్తోంది. ఈ సంస్థల్లో ప్రవేశాల ప్రక్రియలో పాల్గొనాలంటే జేఈఈ మెయిన్, అడ్వాన్స్ పరీక్షల్లో అర్హత సాధించడంతో పాటు ఇంటర్మీడియెట్లో 75 % మార్కులు లేదా జేఈఈలో టాప్ 20 పర్సంటైల్ సాధించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఈ నిబంధన నుంచి కేంద్ర ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. కోవిడ్ నేపథ్యంలో మినహాయింపు ► కోవిడ్–19 నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థులు కూడా కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► దీంతో ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తూ.. జేఈఈలో అర్హత సాధించి మెరిట్లో ఉన్న అభ్యర్థులకు ఆయా సంస్థల్లో సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ► ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్లో.. ఇతర సంస్థల్లో సీట్లు పొందేందుకు జేఈఈ మెయిన్లో మెరిట్ సాధించి ఉండాలి. ► ఈసారి కోవిడ్ కారణంగా అభ్యర్థులు ఆయా సంస్థల్లో చేరేందుకు ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు మాత్రం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు ► జేఈఈ అడ్వాన్స్ పరీక్ష 27న జరగనున్న నేపథ్యంలో ఐఐటీ న్యూఢిల్లీ సోమవారం నుంచి అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ► అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, ఫొటో, సంతకం, పుట్టిన తేదీ, చిరునామా, సామాజిక వర్గం సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ► ఈ ఏడాది మొత్తం 2.50 లక్షల మంది అర్హత సాధించినా కేవలం 1,60,864 మందే పరీక్షకు హాజరయ్యేందుకు నమోదు చేసుకున్నారు. 222 నగరాల్లోని 1,150 కేంద్రాల్లో... ► ఫలితాలు అక్టోబర్ 5న విడుదలవుతాయి. అక్టోబర్ 6 నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించనుంది. ► ఈసారి కౌన్సెలింగ్ ప్రక్రియను 7కు బదులు 6 విడతల్లోనే ముగిస్తారు. అభ్యర్థులకు అవగాహన కోసం 2 విడతల మాక్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ► ఐఐటీలతో పాటుగా జేఈఈ అడ్వాన్స్ ర్యాంక్తో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బర్హంపూర్, భోపాల్, కోల్కతా, మొహాలి, పూనే, తిరువనంతపురం, తిరుపతిలలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ► తిరువనంతపురంలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రాయబరేలీలోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థల్లో ప్రవేశాలకూ దరఖాస్తు చేసుకోవచ్చు. -
జేఈఈ అడ్వాన్సుకు తగ్గిన దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి నిర్వ హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సు–2020కు గతంలో కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన వారి నుంచి మెరిట్లో ఉన్న 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్సు రాసేందుకు అవకాశం కల్పించారు. అయితే శుక్రవారం రాత్రి గడువు ముగిసే సమయానికి 64 శాతం మందే అంటే.. 1.60 లక్షల అభ్యర్థులు అడ్వాన్సుకు దరఖాస్తు చేశారు. 2019 జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్సుకు 2.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించి అనుమతివ్వగా 1.75 లక్షల మంది దరఖాస్తు చేశారు. జేఈఈ అడ్వాన్సులో మంచి స్కోరు సాధిస్తే ఇష్టమైన ఐఐటీలో చేరేందుకు అవకాశం ఉన్నా కూడా 90 వేల మంది పరీక్షకు దూరంగా ఉండటం విశేషం. ► జేఈఈ మెయిన్ పరీక్షల ఫలితాలను ఈనెల 11వ తేదీన ప్రకటించారు. 12 నుంచి 18 వరకు జేఈఈ అడ్వాన్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ► జేఈఈ అడ్వాన్సును ఈసారి ఐఐటీ న్యూఢిల్లీ నిర్వహిస్తోంది. 27వ తేదీన ఉదయం పేపర్1, మధ్యాహ్నం పేపర్2 పరీక్ష ఉంటుంది. ఫలితాలు అక్టోబర్ 5 న ప్రకటిస్తారు. ఆరో తేదీ నుంచి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రవేశాల షెడ్యూల్ను జోసా ఇప్పటికే ప్రకటించింది ► కోవిడ్–19 నేపథ్యంలో ఈఏడాది జేఈఈ అడ్వాన్సు పరీక్షను నిర్వహించే నగరాలు, కేంద్రాల సంఖ్యను పెంచారు. గతేడాది 164 నగరాల్లోని 600 కేంద్రాల్లో నిర్వహించగా, ఈసారి 222 నగరాలు, 1,150 సెంటర్లకు పెంచారు. ► ఈసారి జేఈఈ మెయిన్ కటాఫ్ శాతం ఓపెన్ కేటగిరీలో తప్ప తక్కిన అన్ని కేట గిరీల్లో తగ్గింది. అయినా కోవిడ్ పరిస్థితులు, పరీక్ష సన్నద్ధతకు ఆటంకాల నేపథ్యంలో అడ్వాన్స్కు దరఖాస్తులు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకుతో ఎన్ఐటీ, ఐఐఐటీల్లో లేదా ఇతర ఎంట్రెన్సు టెస్టుల ద్వారా దగ్గరలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరవచ్చన్న అభిప్రాయంతో అడ్వాన్సుకు దరఖాస్తు చేసి ఉండకపోవచ్చని వివరించారు. ఎన్టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం కేటగిరీల వారీగా జేఈఈ మెయిన్–2020 కటాఫ్ ఇలా ఉంది.. ► కామన్ ర్యాంక్ జాబితా (సీఆర్ఎల్): 90.3765335 ► జనరల్–ఈడబ్ల్యూఎస్: 70.2435518 ► ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీ): 72.8887969 ► షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ): 50.1760245 ► షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ): 39.0696101 ► పిడబ్ల్యూడి: 0.0618524 -
అక్టోబర్ 6 నుంచి ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంస్థల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) శుక్రవారం అర్ధరాత్రి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ రెండో విడత (సెప్టెంబర్) ఫలితాలు అదే రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 21 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ అడ్మిట్ కార్డులు ► జేఈఈ మెయిన్లో మెరిట్లో నిలిచిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్కు ఎంపిక చేస్తారు. ఈ నెల 27న ఐఐటీ– ఢిల్లీ ఈ పరీక్షను నిర్వహించనుంది. ► అడ్మిట్ కార్డులను ఈ నెల 21 నుంచి 27 వరకు https:// jeeadv.ac.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కంచికచర్ల, కావలి, కర్నూలు, మచిలీపట్నం, మార్కాపూర్, మైలవరం, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, తిరువూరు, విజయవాడల్లో నిర్వహిస్తారు. ► ఈ నెల 29న ప్రొవిజినల్ ఆన్సర్ ‘కీ’ని విడుదల చేస్తారు. ► ఫైనల్ ఆన్సర్ ‘కీ’ని అక్టోబర్ 5న https://jeeadv.ac.inలో పెట్టి.. అదే రోజు ర్యాంకుల జాబితాను ప్రకటిస్తారు. ► బీఆర్కిటెక్చర్కు అభ్యర్థులు ప్రత్యేకంగా ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రాయాలి. అక్టోబర్ 5, 6 తేదీల్లో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 8న ఈ పరీక్ష నిర్వహిస్తారు. జోసా ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. ఈసారి ఆరు విడతల కౌన్సెలింగ్ ద్వారా 23 ఐఐటీలు, 32 ఎన్ఐటీలు, 26 ఐఐఐటీలు, మరో 30 ఇతర సంస్థలు కలిపి మొత్తం 111 జాతీయ విద్యాసంస్థల్లోని సీట్లను భర్తీ చేస్తారు. మొదట విడత సీట్ల కేటాయింపు కంటే ముందు రెండుసార్లు నమూనా కౌన్సెలింగ్ను నిర్వహిస్తారు. దీనివల్ల అప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకున్న వారు ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకోవచ్చు. దాన్ని అనుసరించి అభ్యర్థులు తమ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్లు పొందినవారు స్వయంగా వెళ్లి ఆయా విద్యా సంస్థల్లో రిపోర్ట్ చేయనవసరం లేదు. కరోనా దృష్ట్యా ఆన్లైన్లోనే ప్రక్రియంతా పూర్తి చేసేలా మార్పులు చేశారు. ముఖ్య తేదీలు: జేఈఈ అడ్వాన్స్డ్కు.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 12 రిజిస్ట్రేషన్ ముగింపు: సెప్టెంబర్ 17 ఫీజు చెల్లింపు తుది గడువు: సెప్టెంబర్ 18 కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు ఇలా.. అక్టోబర్ 5: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అక్టోబర్ 6 నుంచి: జోసా కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 16: మొదటి విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 21: రెండో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 26: మూడో విడత సీట్ల కేటాయింపు అక్టోబర్ 30: 4వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 3: 5వ విడత సీట్ల కేటాయింపు నవంబర్ 7: 6వ విడత సీట్ల కేటాయింపు ఏపీ నుంచి ముగ్గురికి 100 ఎన్టీఏ స్కోర్ కాగా.. జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 100 ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) స్కోర్ సాధించిన వారిలో రాష్ట్రం నుంచి ముగ్గురు చోటు దక్కించుకున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన లండా జితేంద్ర, విశాఖపట్నానికి చెందిన వైఎస్ఎస్ నరసింహనాయుడు, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన తడవర్తి విష్ణు శ్రీ సాయి శంకర్లు ఈ ఘనత సాధించారు. వీరే కాకుండా 100 స్కోర్ సాధించిన ఆర్.శశాంక్ అనిరుధ్ (కడప), రొంగల అరుణ సిద్ధార్థ్ (తూర్పుగోదావరి) ఏపీకి చెందిన వారే అయినా హైదరాబాద్లో పరీక్ష రాయడంతో ఆ రాష్ట్ర కోటాలోకి చేరారు. -
అక్టోబర్ 6 నుంచి షురూ..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) ఉమ్మడి ప్రవేశాలను వచ్చే నెల 6 నుంచి చేపట్టి నవంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) నిర్ణయిం చింది. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రవేశాల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా తాత్కాలికంగా ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ ఈనెల 6తో ముగియనుండగా, జేఈఈ అడ్వాన్స్డ్ను ఈనెల 27న ఆన్ లైన్లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూ ల్ను ఖరారు చేసింది. దీనికి అనుగుణం గానే ఫలితాలను విడుదల చేసి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఉమ్మడి ప్రవే శాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వచ్చేనెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో స్పష్టం చేసింది. మొత్తా నికి ఈసారి కూడా 7 విడతల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ను నిర్వహించనుంది. 12 నుంచి ‘అడ్వాన్స్డ్’ రిజిస్ట్రేషన్లు.. జేఈఈ మెయిన్ ఫలితాలను ఈనెల 11లోగా విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు చేస్తోంది. గత జనవరి జేఈఈ మెయిన్, ప్రస్తుత మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వారంతా ఈనెల 12 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్కు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్ను జారీ చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, 18న సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ పరీక్ష 27న ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు పేపరు–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపరు2– పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశాల్లో 12వ తరగతి చదువుకున్న, చదువుతున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు ఈనెల 5నుంచే దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. రాష్ట్రంలో 15 కేంద్రాల్లో పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలోని 15 పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట్, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేస్తామని పేర్కొంది. వచ్చే నెల 8న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టును (ఏఏటీ) నిర్వహిస్తామని, 11న వాటి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెల 6న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని వివరించింది. -
జేఈఈ మెయిన్స్కు కరోనా ఆంక్షలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పలు జాగ్రత్తలు చేపడుతోంది. కోవిడ్–19 నేపథ్యంలో ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రతి అభ్యర్థికి జారీచేసిన అడ్మిట్ కార్డుతో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఆన్లైన్(కంప్యూటరాధారితంగా)లో జరిగే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఏపీ నుంచి 45 వేల మంది వరకూ పరీక్షలు రాయనున్నట్టు అంచనా. పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో శానిటైజర్లు – నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. – అడ్మిట్కార్డులోని బార్కోడ్ రీడర్లను ప్రవేశద్వారాల వద్ద ఉంచుతారు. రీడ్ చేసిన వెంటనే అభ్యర్థుల ల్యాబ్ నంబర్ను తెలియచేస్తుంది. – గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. – అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్ను తీసేసి కొత్త మాస్క్ ధరించాలి. – శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. – పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవరాదు. – అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. – ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్కార్డులోని కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. – దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. – బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి. – డ్రాయింగ్ షీట్లో నీటి రంగు వినియోగానికి అభ్యర్థులకు అనుమతి లేదు. – ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. – అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్పోర్టు ఫొటో తేవాలి. – ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. – ఇందుకోసం అభ్యర్థులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. – రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. కావాల్సి వస్తే అదనంగా ఇస్తారు. – అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్లో వాటిని వేయాలి – సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్లో వేయాలి. ఏపీలో కేంద్రాలు అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నర్సారావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం -
25 మార్కులకే పరీక్ష
తాడేపల్లిగూడెం: మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 25 మార్కులకు పరీక్షలు రాస్తే చాలు.. పై తరగతికి ప్రమోట్ కావచ్చు.. సరళంగా ప్రశ్నలు ఉంటాయి.. గంట సమయం ఇస్తారు.. ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది.. ఇది ఏపీ నిట్ విద్యార్థులకు కరోనా నేపథ్యంలో ఇస్తున్న బంపరాఫర్. ఏదైనా కారణాల వల్ల ఆన్లైన్ పరీక్షలు రాయకపోతే, కళాశాల ప్రారంభమయ్యాక 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. 29 నుంచి పరీక్షలు ఆన్లైన్ పరీక్షల షెడ్యూల్ను నిట్ డైరెక్టర్ సీఎస్పీ రావు సోమవారం ప్రకటించారు. ఈనెల 29వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. పేపర్కు 100 మార్కులకు గాను ఇంటర్నల్స్కు 35 మార్కులు, మిడ్ సెమిస్టర్ పరీక్షలకు 40 మార్కులు ఇస్తారని, మిగిలిన 25 మార్కులకు మల్టీపుల్ చాయిస్ పద్ధతిలో గంటపాటు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆఖరి ఏడాది విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, దీంతో మిగిలిన సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక పద్ధతిలో అవకాశం కల్పించామన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞాన విధానంలో పరీక్షల ఫార్ములాను తయారు చేయడం వల్ల అవకతవకలకు అవకాశం లేదన్నారు. దేశంలోని జాతీయ విద్యాసంస్థల్లో ప్రత్యేక ఫార్ములాతో పరీక్షలు నిర్వహించేది ఏపీ నిట్ మాత్రమే అని డైరెక్టర్ రావు స్పష్టం చేశారు. ఒకవేళ పరీక్షలు రాసే అవకాశం వినియోగించుకోలేని విద్యార్థులకు కళాశాల తెరిచిన తర్వాత 50 మార్కులకు పరీక్ష రాసే అవకాశం ఇస్తామని పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షలు వద్దు: విద్యార్ధులు కరోనా నేపథ్యంలో పలు జాతీయ విద్యాసంస్థలు పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయని.. ఇదే విధానాన్ని ఏపీ నిట్ కూడా అనుసరించాలని విద్యార్థులు కోరుతున్నారు. 40 శాతం మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారని, ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్, విద్యుత్ సమస్యలు కారణంగా ఆన్లైన్ పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు లేదన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు, వారి తల్లితండ్రులు నిట్ డైరెక్టర్కు వినతుల రూపంలో తెలియజేశారు. మానసిక ఒత్తిడి, ఆవేదనలో ఉన్నామని, ఈ తరుణంలో పరీక్షలకు సన్నద్ధం కాలేమని చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో పరీక్షలు రద్దు కోవిడ్–19 నేపథ్యంలో జాతీయ విద్యాసంస్థలు సెమిస్టర్ పరీక్షలను రద్దు చేశాయి. ఢిల్లీ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వరంగల్ నిట్, నిట్ కురుక్షేత్ర, రూర్కెలా, షిబ్పూర్, నిట్ సిల్చర్, నిట్ అగర్తలా వంటివి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశాయి. -
జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా సెట్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 6 నుంచి ఒక్కొక్కటిగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో (2020–21) వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను జాతీయ సంస్థలు ఇప్పటికే ప్రకటించగా వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు తేదీలను ఖరారు చేస్తున్నాయి. వాటిల్లో ఇప్పటికే కేరళ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసి ప్రకటించాయి. జనవరి 6 నుంచి 11 వరకు దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ (మొదటి విడత) పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చర్యలు చేపట్టింది. అలాగే జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్)ను జనవరి 28న నిర్వహించేందుకు ఏఐసీటీఈ చర్యలు చేపట్టింది. అదేరోజు జాతీయ స్థాయి ఫార్మసీ విద్యాసంస్థల్లో ఎంఫార్మసీ ప్రవేశాల కోసం జీప్యాట్ నిర్వహించేందుకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 9 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు ఎన్టీఏ చర్యలు చేపట్టింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల్లో ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ప్రవేశాలకు ఎంట్రన్స్ టెస్టుల నిర్వహణకు షెడ్యూలు జారీ చేశాయి. -
వ్యవసాయంపై అందరూ దృష్టి పెట్టాలి
-
ప్లేస్మెంట్స్లో టెకీల హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం ఇంజనీరింగ్ నైపుణ్యాలకు డిమాండ్ను ఎంతమాత్రం తగ్గించలేదు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్స్)ల్లో ఫైనల్ ప్లేస్మెంట్స్లో వెల్లడైన ట్రెండ్స్ ఐటీ నియామకాలపై స్లోడౌన్ ప్రభావం లేదనేందుకు అద్దం పట్టాయి. ఈ ఏడాది ఆగస్ట్తో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్లో గత ఏడాది కంటే మెరుగ్గా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు తమ విద్యార్ధులకు అత్యధిక ఆఫర్లను దక్కించుకోవడమే కాకుండా మెరుగైన ప్యాకేజ్లను అందుకున్నాయి. ఈ ఏడాది ప్లేస్మెంట్స్కు ఆటోమొబైల్, కన్జూమర్ గూడ్స్ కంపెనీలు దూరమైనా టెక్నాలజీ, సేవల కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు దిగాయని పలు నిట్స్కు చెందిన ప్లేస్మెంట్ విభాగం అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సూరత్, వరంగల్, కాలికట్ సహా నిట్స్లో సగటు వేతనం 30 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. నిట్ జలంధర్లో సగటు వార్షిక వేతనం 54 శాతం వరకూ పెరగడం విశేషం. తమ విద్యార్ధికి మైక్రోసాఫ్ట్ రూ 39.02 లక్షల వార్షిక వేతన ఆఫర్ ఇచ్చిందని నిట్ జలంధర్ ప్లేస్మెంట్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ ఎస్ ఘోష్ తెలిపారు. తమ ఇనిస్టిట్యూట్లో సగటు వార్షిక వేతనం రూ 11 లక్షలుగా నమోదైందని చెప్పారు. గత ఏడాది కంటే అధిక వేతనంతో ఎక్కువమంది విద్యార్ధులను కంపెనీలు నియమించుకున్నాయని వెల్లడించారు. ఇక వచ్చే నెల నుంచి ఐఐటీల్లో ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభం కానుంది. ఐఐటీల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు గత ఏడాది కంటే 19-24 శాతం పెరగడం గమనార్హం. కోడింగ్, బిజినెస్ అనలిటిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లో రిక్రూట్మెంట్కు అధిక డిమాండ్ ఉందని ప్లేస్మెంట్ నిపుణులు చెబుతున్నారు. -
కొత్తగా జేఈఈ–మెయిన్
ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్స్ ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష.. జేఈఈ మెయిన్ 2020కు నోటిఫికేషన్ విడుదలైంది. జేఈఈ మెయిన్తో నేరుగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందొచ్చు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్కు సైతం అర్హత పరీక్ష జేఈఈ మెయిన్. ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్లో పరీక్ష జరగనుంది. లక్షల మంది ఇంటర్ ఎంపీసీ/10+2 విద్యార్థులు ఎదురు చూసే జేఈఈ మెయిన్ పరీక్షలో జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ) కీలక మార్పులు చేసింది. మరో నాలుగు నెలల్లోనే పరీక్ష జరగనున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్లో మార్పులు, దరఖాస్తు తీరుతెన్నులు, పరీక్ష విధానంపై సమగ్ర కథనం.. మార్పులు ఇవే గతేడాది వరకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ల నుంచి ప్రతీ దాంట్లో నుంచి 30 చొప్పున 90 ప్రశ్నలు ఉండేవి. వచ్చే జనవరి మెయిన్ పరీక్షల నుంచి వాటిలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి ఐదు ప్రశ్నలను తగ్గించి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 75 ప్రశ్నలను ఇవ్వనుంది. గతంలో మొత్తం 360 మార్కులకు పరీక్షలను నిర్వహించగా.. ఇకపై వాటిని 300 మార్కులకే పరిమితం చేసింది. గతంలో అన్నీ బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఉండగా.. ఇకపై 20 బహుళ ఐచ్చిక ప్రశ్నలు, 5 దశాంశ∙స్థాన తరహ(న్యూమరికల్ వాల్యు) ప్రశ్నలు అడగనున్నారు. గతంలో అన్ని ప్రశ్నలకు నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉండేది. ఇకపై దశాంశ స్థాన ప్రశ్నలకు రుణాత్మక మార్కుల విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. బీఆర్క్ పేపర్లో జరిగిన మార్పు బీఆర్క్లో ప్రవేశానికి నిర్వహించే మెయిన్ పేపర్ 2 పరీక్షల్లోనూ జేఏబీ మార్పులు చేసింది. బీఆర్క్ పరీక్షల్లో ఇప్పటి వరకు 100 ప్రశ్నలు ఉండేవి. ఇకపై వాటి సంఖ్యను 77కు తగ్గించింది. వీటిలో అయిదు ప్రశ్నలను న్యూమరికల్ వాల్యూ తరహా ప్రశ్నలు ఇవ్వనుంది. గతంలో డ్రాయింగ్కు సంబంధించి 3 ప్రశ్నలు అడిగితే.. ఇకపై వాటి సంఖ్యను 2 కే పరిమితం చేసింది. బీఆర్క్లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్లై న్లో జరుగుతాయి. డ్రాయింగ్ టెస్ట్ మాత్రం పెన్–పేపర్ విధానంలో ఆఫ్లైన్లో ఉంటుంది. బీప్లానింగ్ పేపర్లో ఇలా.. గతంలో బీ ప్లానింగ్లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి, ఇప్పుడు మ్యాథ్స్ మినహా మిగతా ఏ సబ్జెక్టు ఉన్న పర్వాలేదు. దీంతో ఎంఈసీ విద్యార్థులు కూడా బీప్లానింగ్లో ప్రవేశానికి అర్హులవుతారు. బీప్లానింగ్లో మ్యాథమెటిక్స్ పార్ట్–1, ఆప్టిట్యూడ్ టెస్ట్ పార్ట్–2, ప్లానింగ్ బేస్డ్ కొశ్చన్స్ పార్ట్–3 కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరుగుతాయి. పరీక్ష జేఈఈ మెయిన్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు జనవరి, ఏప్రిల్లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్–2020(జనవరి) పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఒక అభ్యర్థి రెండుసార్లు పరీక్షకు హాజరుకావచ్చు. రెండు పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే వాటినే అడ్మిషన్ సమయంలో పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో 25కు 20 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్విగా ఉంటాయి. మిగిలిన ఐ దు ప్రశ్నలు దశాంశ స్థాన తరహావి అడుగు తారు. 20 ప్రశ్నలకు నెగిటివ్ మార్కుల విధా నం ఉండగా.. మిగతా ఐదు ప్రశ్నలకు మా త్రం రుణాత్మక మార్కుల నుంచి మినహయిం పు ఉంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కు లు కేటాయిస్తే; ప్రతి తప్పు సమాధానానికి ఒక మా ర్కు కోత ఉంటుంది. న్యుమరికల్ వాల్యూ ప్రశ్నలకు సరైన సమాధానానికి 4 మార్కులు లభిస్తాయి, తప్పు సమాధానానికి ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. అర్హత ఇంటర్(ఎంపీసీ)/10+2 2018, 2019లో ఉత్తీర్ణులైన విద్యార్థులు జేఈఈ మెయిన్ రాసేందుకు అర్హులు. అలాగే 2020లో ఫైనల్ ఇయర్ ప్రవేశాలు పరీక్షలు రాయనున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్కు ఎలాంటి గరిష్ట వయోపరిమితిలేదు. కానీ, ఐఐటీల్లో ప్రవేశాలకు గరిష్ట వయోపరిమితి నిబంధన ఉంది. ప్రిపరేషన్ టిప్స్ జేఈఈ మెయిన్లో మంచి స్కోర్ సాధించేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీపై పట్టు సాధించడం తప్పనిసరి. కాబట్టి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల సిలబస్ను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలించి.. ఏ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఉందో గుర్తించాలి. సిలబస్లోని అన్ని టాపిక్స్ ముఖ్యమైనవే అయినప్పటికీ.. పరీక్ష కోణం లో కొన్ని అంశాలు కీలకంగా ఉంటాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం. ఆయా సబ్జెక్టుల ప్రిపరే షన్కు ప్రణాళిక రూపొందించుకొని ప్రతిరోజూ చదు వుతుండాలి. నాలుగు నెలల సమయం మాత్రమే అందుబాటులో ఉన్నందున అందుకు తగ్గట్లు ఎవ్రీ డే, వీక్లీ, మంత్లీ ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. కష్టమైన టాపిక్స్కు కొంత ఎక్కువ సమయం కేటాయించాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదు వుతూ.. తొలుత కాన్సెప్ట్లపై అవగాహన పెంచు కోవాలి. ఆ తర్వాత రోజూ వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆయా పుస్తకాలు చదివేటప్పుడే ముఖ్యాంశాలు, సూత్రాలు నోట్స్లో రాసుకోవాలి. ఈ షార్ట్నోట్స్ పరీక్షకు ముందు వేగంగా రివిజిన్ చేయడంలో దోహదపడుతుంది. దరఖాస్తు ఫీజు ♦ జనరల్, ఓబీసీ (అబ్బాయిలు) రూ.650; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, అమ్మాయిలకు (జనరల్, ఓబీసీ) రూ.325. ♦ ఏపీలో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, నర్సరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం. ♦ తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నల్గొండ, వరంగల్. ముఖ్య సమాచారం ♦ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 3, 2019. ♦ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2019. ♦ అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్: డిసెంబర్ 6, 2019. ♦ పరీక్ష విధానం: ఆన్లైన్లో. ♦ పరీక్ష సమయం: 3 గంటలు. ♦ పరీక్ష తేదీ : 2020, జనవరి 6 నుంచి 11 వరకు. ♦ ఫలితాల వెల్లడి : 31.01.2020. ♦ వెబ్సైట్ : www.nta.ac.in -
స్వస్థలాలకు శ్రీనగర్ నిట్లో 130 మంది తెలుగు విద్యార్థులు
-
అదనంగా 2,660 సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో (జీఎఫ్టీఐ) 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19 నుంచి విద్యార్థుల నుంచి చాయిస్ ఫిల్లింగ్కు (వెబ్ ఆప్షన్లు) అవకాశం కల్పిస్తామని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రకటించినా.. ఆదివారం నుంచే ప్రారంభించింది. మొత్తంగా ఏడు దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. జూలై 23 వరకు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదివారం షెడ్యూల్ను విడుదల చేసింది. కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేయాల్సిన రిపోర్టింగ్ కేంద్రాల వివరాలను జోసా వెబ్సైట్ లో ( https://josaa.nic.in) అందుబాటులో ఉంచింది. రిపోర్టింగ్ కేంద్రాల్లో నిర్ణీత తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టె్టన్స్/సీట్ విత్డ్రాకు అవకాశం ఉంటుందని వివరించింది. అదనంగా 4,719 సీట్లు.. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో కేంద్రం ఈసారి సీట్లను భారీగా పెంచింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ (ఈడబ్ల్యూఎస్) కోసం 10 శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ప్రత్యేకంగా సీట్లను పెంచింది. మరోవైపు ఐఐటీ, ఎన్ఐటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సూపర్ న్యూమరీ కోటా కింద ఏటేటా సీట్లను పెంచుతోంది. దీనిలో భాగంగా ఈసారి కూడా 2,059 సీట్లను పెంచింది. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కింద 2,660 సీట్లను అదనంగా పెంచింది. ఇలా మొత్తంగా 4,719 సీట్లను ఈసారి అదనంగా పెంచింది. 107 విద్యా సంస్థల్లో 45,244 సీట్లు.. ఐఐటీలతోపాటు ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్ఐటీలలో ఈసారి సీట్లు ఎక్కువగా పెరిగాయి. మహిళల సూపర్ న్యూమరీ సీట్లతోపాటు ఈడబ్ల్యూఎస్ కోటా అదనంగా రావడంతో సీట్లు ఎక్కువగా పెరిగాయి. దేశంలోని 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు, 25 ట్రిపుల్ఐటీ, 28 జీఎఫ్టీఐలు మొత్తంగా 107 విద్యా సంస్థల్లో గతేడాది 41 వేల వరకు అందుబాటులో ఉండగా, ఈసారి వాటి సంఖ్య 45,244కి పెరిగింది. ఎన్ఐటీల్లో ఎక్కువగా పెరుగుదల.. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఈసారి ఎన్ఐటీల్లో సీట్లు ఎక్కువగా పెరిగాయి. గతేడాది కంటే ఈసారి 1,384 సీట్లు అదనంగా వచ్చాయి. ఐఐటీల్లో ఈడబ్ల్యూఎస్ కోటాలో 638 సీట్లు పెరిగాయి. ఎన్ఐటీల్లో 50 శాతం సీట్లు హోంస్టేట్ కోటా కింద ఉన్నందున ఆయా రాష్ట్రాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా పెరిగిన సీట్లతో అధిక ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు మహిళల భాగస్వామ్యం కోసం అదనంగా ఇస్తున్న సూపర్ న్యూమరీ సీట్ల సంఖ్య ఐఐటీల్లో ఎక్కువగా పెరిగింది. ఈసారి 1,221 సీట్లు ఐఐటీల్లోనే పెరిగాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్.. 21–6–2019: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టు రాసే వారికి చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం 25–6–2019: ఏఏటీ, ఇతరులందరికీ సాయంత్రం 5 గంటలకు చాయిస్ ఫిల్లింగ్ ముగింపు 27–6–2019: ఉదయం 10 గంటలకు మొదటి దశ సీట్ల కేటాయింపు 28–6–2019 నుంచి జూలై 2 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ 3–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 3–7–2019: సాయంత్రం 5 గంటలకు రెండో దశ సీట్ల కేటాయింపు 4–7–2019 నుంచి 5–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్డ్రా 6–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 6–7–2019: సాయంత్రం 5 గంటలకు మూడో దశ సీట్ల కేటాయింపు 7–7–2019 నుంచి 8–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్డ్రా 9–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 9–7–2019: సాయంత్రం 5 గంటలకు నాలుగో దశ సీట్ల కేటాయింపు 10–7–2019 నుంచి 11–7–2019 వరకు: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్డ్రా 12–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే 12–7–2019: సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్ల కేటాయింపు 13–7–2019 నుంచి 14–7–2019 వరకు: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్డ్రా 15–7–2019: ఉదయం 10గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు సాయంత్రం 5 గంటలకు 6వ దశ సీట్లు కేటాయింపు 16–7–2019 నుంచి 17–7–2019: రిపోర్టింగ్ కేంద్రాల్లో డాక్యుమెంట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్/విత్డ్రా (ఐఐటీల్లో సీట్ విత్డ్రాకు ఇదే చివరి అవకాశం) 18–7–2019: ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు, మిగిలిన సీట్ల డిస్ప్లే, అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు 7వ దశ (చివరి) సీట్ల కేటాయింపు 19–7–2019: ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్, కాలేజీల్లో చేరికలు 19–7–2019 నుంచి 23–7–2019 వరకు: ఎన్ఐటీ ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సీట్ యాక్సెప్టెన్స్, ప్రవేశాలు. -
నేడు నీట్ పరీక్ష
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశానికి యేటా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఆదివారం మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది. దీనికోసం తిరుపతి, సమీప ప్రాంతాల్లో 13 కేంద్రాలను ఏర్పాటుచేశారు. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు మొత్తం 8,160మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఎడిఫై పాఠశాలకు అప్పగించారు. నీట్ సిటీ కోఆర్డినేటర్గా ఆ పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి ఎస్.నాయర్ వ్యవహరించనున్నారు. తిరుపతికి చేరుకున్న విద్యార్థులు చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి విద్యార్థులు తిరుపతిలో పరీక్ష రాయనున్నారు. పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే విద్యార్థులు చేరుకుని రిపోర్ట్ చేయాలనే నిబంధన ఉంది. అలాగే మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. 1.30 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో సుదూర ప్రాంత విద్యార్థుల్లో అధిక మంది ముందస్తుగానే శనివారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. అడ్మిట్ కార్డు, డ్రెస్ కోడ్ తప్పనిసరి నీట్కు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటో వెంట తెచ్చుకోవాలి. అలాగే అధికారులు సూచించిన డ్రెస్ కోడ్ పా టించాల్సి ఉంటుంది. షూస్(బూట్లు) ధరించకూడదు. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, హ్యాండ్ బ్యాగులు, స్మార్ట్ వాచ్, సెల్ఫోన్, పెన్నులను అనుమతించరు. గత ఏడాది బాలికల బంగారు ఆభరణాలు, చెవిపోగులు, ముక్కుపుడకలు, గాజులు, కాళ్ల పట్టీలు వంటివి తీయించివేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షకు హాజరవ్వాలని సిటీ కో–ఆర్డినేటర్ సూచించారు. డయాబెటిస్ ఉన్న వారు మందులు, కట్చేసిన పండ్లు కాకుండా పూర్తిగా ఉన్న పండ్లను అనుమతించనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూసుకుని అందులో ఇచ్చిన సూచనల మేరకు పరీక్ష కేంద్రాలకు రావాలని సిటీ కో–ఆర్డినేటర్ తెలిపారు. -
నిట్లో ‘నవ’శకం
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో తొమ్మిది పీజీ కోర్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ ఏర్పాటుచేసి నాలుగేళ్లు గడిచింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ విద్యార్థులు బయటకు వెళ్లనున్నారు. పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతులు, ల్యాబ్లు, బాలికల హాస్టళ్లు కొనసాగుతున్నాయి. నిట్ శాశ్వత భవనాల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 19 నాటికి వీటిని పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. తొలి బ్యాచ్ సర్టిఫికెట్లతో విద్యార్థులు నిట్ సొంత ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిట్లో పీజీ కోర్సుల ఏర్పాటుకు గాను సన్నాహాకాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 31 నిట్లలో ఏపీ నిట్కు తక్కువ కాలంలోనే గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పీజీ కోర్సులను కూడా ఇక్కడ ప్రారంభిస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తొమ్మిది కోర్సులకు అనుమతి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫైల్ చేరినట్టు సమాచారం. బయోటెక్నాలజీ, కెమికల్ , సివిల్ ఇంజినీరింగ్, సీఎస్ఈ, ఈఈఈ, ఈసీఈ, మెటలర్జీ ఇంజినీరింగ్తో పాటు మేనేజ్మెంటు కోర్సుల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఫైల్ వెళ్లిందని తెలిసింది. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం తెలిపితే, ఈ విద్యాసంవత్సరం నుంచి నిట్ ప్రాంగణంలో పీజీ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు కంపెనీలతో ఎంఓయూ హైదరాబాద్కు చెందిన మూడు కంపెనీలతో నిట్ ఎంఓయూలను కుదుర్చుకుంది. మెక్లీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో నెట్ వర్కింగ్ ఫీల్డ్కు సంబంధించి గతేడాది అక్టోబర్ 26న ఒప్పందం చేసుకున్నారు. ఫెర్వెంటెజ్ సెమికండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నెట్ వర్కింగ్, కమ్యూనికేషన్స్కు సంబంధించి అక్టోబర్ 22న ఒప్పందం జరిగింది. హైదరాబాద్కు చెందిన ఎనిక్సాట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్పై గతేడాది నవంబర్ ఒకటో తేదీన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు మూడేళ్లు ఉంటాయి. జూలై నాటికి హాస్టళ్లు షిఫ్టింగ్ నిట్ తొలిదశ శాశ్వత భవనాల నిర్మాణ పనులు రూ.202 కోట్లతో ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం పూణెకు చెందిన కాంట్రాక్టు కంపెనీ షిర్కే ఈఏడాది ఆగస్టు 19 నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. జూలై నాటికి నిట్ కొత్త ప్రాంగణంలో హాస్టళ్లు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు హాస్టల్ భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బాలికల వసతి గృహాల నిర్మాణం, అకడమిక్ భవనాల నిర్మాణ పనులు, గేట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ల్యాబ్, స్టాఫ్ క్వార్టర్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, అకడమిక్ భవనాల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. తొలిదశ భవనాల నిర్మాణ పనులు పూర్తయితే రెండో దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గడువులోపు నిర్మాణాలు పూర్తవుతాయని డైరెక్టర్ సీఎస్పీ రావు తెలిపారు. -
జేఈఈ ఫైనల్ ‘కీ’లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థలు (జీఎఫ్టీఐ)లలో బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం ప్రకటించింది. ప్రాథమిక ‘కీ’తో పోల్చితే అం దులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 11 ప్రశ్నలకు జవాబులు మారిపోగా 11 ప్రశ్నలను తొలగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 70 వేల మంది సహా దేశవ్యాప్తంగా 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఓఎంఆర్ రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ‘కీ’ ప్రకటించి వాటిపై విద్యార్థుల అభ్యం తరాలను స్వీకరించింది. దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకుండానే ఈ నెల 19న ఫలితాలను (విద్యార్థుల నార్మలైజేషన్ స్కోర్) ప్రకటించింది. అదే రోజు ఫైనల్ ‘కీ’ కూడా వెలువడుతుందని భావించినా ఎన్టీఏ దాన్ని బుధవారం ప్రకటించింది. ‘కీ’ని పరిశీలించిన జేఈఈ నిపుణులు ఉమాశంకర్ ప్రాథమిక ‘కీ’, ఫైనల్ ‘కీ’ మధ్య వ్యత్యాసం ఉందని అంచనా వేశారు. దీంతో 11 ప్రశ్నలను తొలగించడంతోపాటు మరో 11 ప్రశ్నలకు సంబంధించిన జవాబుల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. తొలగిం చిన 11 ప్రశ్నలకు ఆయా షిప్ట్లలో పరీక్షలకు హాజరైన విద్యార్థులకు మార్కులను కేటాయిం చినట్లు ఎన్టీఏ తెలిపింది. అయితే 8 షిఫ్ట్లలో పరీక్షలు రాసిన విద్యార్థుల స్కోర్ను నార్మలైజేషన్ చేసి వారి పర్సంటైల్ను ఇటీవల ఎన్టీఏ ప్రకటించడం తెలిసిందే. దీనిలో భాగంగా 100 పర్సంటైల్లో సాధించిన వారు దేశవ్యాప్తంగా 15 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఆ ఫలితాలను ఎన్టీఏ ఎలా వెల్లడించిందన్న విషయం లో అనుమానాలు నెలకొన్నాయి. ప్రాథమిక ‘కీ’పై ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఫైనల్ ‘కీ’ని సిద్ధం చేసి ఫలి తాలను ప్రకటించిందా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాలను ప్రకటించిందా? అనే గందరగోళం నెలకొంది. ఒకవేళ వాటిని పరిగణనలోకి తీసుకోకపోతే ఫైనల్ ‘కీ’ ప్రకారం 100 పర్సంటైల్లోకి వచ్చే తెలుగు విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రకటించిన 100 పర్సంటైల్ విద్యార్థుల్లో తెలుగువారు ఐదుగురు ఉండగా ఆ ఫలితాల్లో ఫైనల్ ‘కీ’ని పరిగణనలోకి తీసుకోకపోతే జరిగిన మార్పు లు, ఫైనల్ ‘కీ’మేరకు చూస్తే మరో 10 మంది వరకు తెలు గు విద్యార్థులు 100 పర్సంటైల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇవీ వివిధ షిఫ్ట్లలో జవాబుల మార్పు, ప్రశ్నల తొలగింపు.. ఈ నెల 9న జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్లో ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నకు జవాబును మార్చింది. అలాగే మ్యాథ్స్లో ఒక ప్రశ్న కు జవాబును మార్పు చేసింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్లో ఫిజిక్స్లో రెండు ప్రశ్నల జవాబులను మార్చింది.10వ తేదీన జరిగిన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా, మ్యాథ్స్ లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయడంతోపాటు ఒక ప్రశ్నను తొలగించింది. అదే రోజు జరిగిన రెండో షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. 11వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో ఫిజిక్స్లో రెండు ప్రశ్నలకు జవాబులను మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. మ్యాథ్స్లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేసింది. అదేరోజు మధ్యాహ్నం జరిగిన రెండో షిప్ట్ పరీక్షలో ఫిజిక్స్లో ఒక ప్రశ్నకు జవాబును మార్పు చేయగా ఒక ప్రశ్నను తొలగించింది. అలాగే మ్యాథ్స్లో ఒక ప్రశ్నను తొలగించింది.12వ తేదీన మొదటి షిఫ్ట్ పరీక్షలో కెమిస్ట్రీలో ఒక ప్రశ్నను తొలగించగా రెండో షిఫ్ట్లో ఫిజిక్స్లో రెండు ప్రశ్నలను తొలగించింది. -
జనవరి 8 నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్పులు చేసింది. జనవరి 6 నుంచి 20 వరకు నిర్వహించాల్సిన పరీక్షలను జనవరి 8 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు తక్కువగా ఉండటంతో ఈ మేరకు మార్పులు చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 273 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా ఇదివరకే షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. కచ్చితంగా గంట ముందుగా విద్యార్థులు కేంద్రంలోకి వెళ్లాల్సిందేనని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక హాల్టికెట్ల డౌన్లోడ్లో ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించాలని పేర్కొంది. ఇందుకోసం jeemain@inta@nic.in ఈ మెయిల్ను అందుబాటులోకి తెచ్చింది. హాల్టికెట్ లేకుండా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. -
ఎన్ఐటీలో ఫుడ్పాయిజన్
సాక్షి, నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎన్ఐటీలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు బైఠాయించారు. క్యాంపస్ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు రెండురోజుల క్రితం ఫుడ్పాయిజన్ కావడంతో దాదాపు వంద మందిపైగా ఆస్పత్రిపాలయ్యారు. వీరంతా ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. అయితే ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించకపోవడం, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బయట తినొచ్చిన వారే ఫుడ్పాయిజన్ బారిన పడ్డారని కళాశాల సిబ్బంది ఆరోపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మిగతా ఎన్ఐటీలతో పోల్చుకుంటే ఫీజులు కూడా ఎక్కువగానే ఉన్నాయని, హాస్టల్ వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఎన్ఐటీ యాజమాన్యం దిగొచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు హామినిచ్చారు. తమ సమస్యల పరిష్కారానికై యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. మరోవైపు తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో నాగ్పూర్ ఎన్ఐటీలో విద్యనభ్యసిస్తున్నారు. -
జేఈఈ మెయిన్స్ అంతా ఆన్లైన్
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ ఈసారి పూర్తిగా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్లోని పేపర్–1 కంప్యూటరాధారిత పరీక్షగా మాత్రమే ఉంటుంది. మాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నలుంటాయి. 3 సబ్జెక్టులకు సమాన వెయిటేజీలో ప్రశ్నలు ఇస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పేపర్2లో పార్టు 1 మేథమెటిక్స్, పేపర్2 యాప్టిట్యూడ్లు రెండు కంప్యూటరాధారిత పరీక్షలుగానే ఉంటాయి. డ్రాయింగ్ యాప్టిట్యూడ్ టెస్టు మాత్రం పెన్, పేపర్ ఆధారంగా ఆఫ్లైన్లో ఉంటుంది. జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణను కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే. జనవరి, ఏప్రిల్లో ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జనవరిలో జరిగే పరీక్షకు సంబంధించి ఈనెల 1వ తేదీనుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అక్టోబర్ 1 వరకు అవకాశముంది. పరీక్షలు రోజుకు రెండు షిఫ్టులలో ఉదయం 9.30 నుంచి 12.30వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఇంతకు ముందు జేఈఈ మెయిన్స్ను ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లోనూ నిర్వహించేవారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 12నుంచి 14 లక్షల మంది హాజరవుతుండగా అందులో 12 లక్షలకు పైగా అభ్యర్ధులు ఆఫ్లైన్ పరీక్షలకే హాజరయ్యేవారు. అయితే ఈసారి పరీక్షలు కంప్యూటరాధారితంగానే జరగనుండడంతో అభ్యర్ధులు అందుకు వీలుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అడ్మిట్కార్డులను డిసెంబర్ 17నుంచి ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తుల సమర్పణలో అభ్యర్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జేఈఈ మెయిన్స్ బులిటెన్లో సూచించారు. నిర్దేశిత సమాచారాన్ని పొందుపర్చడంతో పాటు అభ్యర్ధులు తమ ధ్రువపత్రాలు, ఫొటోలను నిర్ణీత సైజుల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే దరఖాస్తులు తిరస్కరణ అవుతాయి. ఏపీ పరీక్ష కేంద్రాలు ఇవే ఈ పరీక్షలకు సంబంధించి ఏపీలో 19 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలంగాణలో 7నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ పరీక్షలకు దరఖాస్తు సమర్పణతో పాటు ఇతర అంశాల్లో సందేహాల నివృత్తికోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షల కామన్ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి పరీక్షలు పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుండడంతో అభ్యర్ధులు తగిన తర్ఫీదు పొందేందుకు జేఈఈ వెబ్సైట్లో ఆన్లైన్ టెస్టు ప్రాక్టీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 2 నుంచి సాయంత్రం 4 వరకు అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 10 నుంచి 4 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. -
తులసితో కేన్సర్కు చెక్
కాజీపేట అర్బన్: నిట్.. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది పరిశోధనలకు కేంద్రబిందువు అని. ఎన్నో ఆలోచనలు, ఆశలతో కళాశాలలో విద్యార్థులు అడుగు మోపుతారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి నిట్ ఒక చక్కటి వేదిక. దీనిలో భాగంగానే ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధికి తలసి ఆకులతో మందును కనుగొన్నారు. కేన్సర్ వ్యాధి నివారణకు బాధితులు అనేక కంపెనీలకు చెందిన మందులను వాడుతున్నారు. అయితే చాలా మంది కేన్సర్ వ్యాధిగ్రస్తులు సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా మరణిస్తున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, తక్కువ ధరలో సహజ సిద్ధంగా యాంటీకేన్సర్ మందును తయారు చేశారు నిట్ విద్యార్థులు. డ్రగ్తో పాటు ఆహారంతో వచ్చే కేన్సర్ను రూపుమాపడానికి జౌషధాన్ని కనుగొన్నారు.సర్వ రోగ నివారిణి..తులసిని శాస్త్రీయంగా ఆసీమం టెన్యూఫ్లోరం అని పిలుస్తారు. తులసికి అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు నిర్ధారించి వివిధ రకాల మందుల తయారీలో వాడుతున్నారు. జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, శ్వాస, జీర్ణ సంబంధిత వ్యాధులను తులసితో నివారించవచ్చు. ప్రతి రోజు ఉదయం స్నానం చేయగానే తులసి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందనే నానుడి ఉంది. కాగా మనిషి పుట్టుక మొదలుకుని చివరి శ్వాస విడిచే సమయంలో సైతం తులసి నీరు అందించడం భారతీయుల అనవాయితీ. తులసి ఆకుల రసంతో.. తులసి ఆకుల రసంతో యాంటీ కేన్సర్ డ్రగ్కు రూపకల్పన చేశారు. నిట్ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్ సతీష్బాబు పర్యవేక్షణలో పీహెచ్డీ స్కాలర్స్ చంద్రసాయి, మాధురి పరిశోధన చేపట్టారు. విభిన్న ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు లక్షలాది సూక్ష్మజీవులకు నిలయంగా ఉండగా 40రకాల సూక్ష్మజీవు(బ్యాక్టీరియా)లపై 2014లో పరిశోధనలు ప్రారంభించారు. తొలుత తులసి ఆకురసంతో బ్యాసిల్లస్ స్టాటోస్పెరికస్ ఔషధ గుణాన్ని కనుగొన్నారు. సూక్ష్మజీవులకు న్యూట్రియెంట్ అగార్ అనే మిడియా(ఫుడ్)ను అందించి వివిధ రకాల ప్రయోగాల అనంతరం ఎల్-ఆస్పిరెన్, ఎల్-గ్లుటామిజెన్ అనే ఎంజైమ్లను కనుగొన్నారు. వివిధ దశల్లో ఎంజైమ్లను అభివృద్ధి చేసి అక్యూట్ లింపోసిటిక్ లుకేమియా అనే కేన్సర్ను(బ్లడ్ కేన్సర్) నివారించే ఔషధం(యాంటీ కేన్సర్ డ్రగ్)ను ఆవిష్కరించారు. నాలుగు సంవత్సరాల పరిశోధనల అనంతరం వారి కల ఫలించింది. త్వరలో వివిధ ప్రాణుల మీద ప్రయోగం చేసి మానవాళిని కేన్సర్ వ్యాధి బారినుంచి కాపాడే ఔషధాన్ని అందించనున్నారు. నిట్ ఖాతాలో మరో పేటెంట్... నిట్ ఖాతాలో మరో పేటెంట్ చేరే అవకాశం ఉంది. ఇటీవల మెకానికల్ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ రాపూర్ వెంకటాచలం రూపొందించిన పర్ఫెక్ట్ స్టీరింగ్ మెకానిజం పేటెంట్ సాధించింది. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సతీష్బాబు, పీహెచ్డీ స్కాలర్లు తులసి ఆకుల రసంతో రూపొందించిన యాంటీ కేన్సర్ మందునుసైతం పేటెంట్ అనుమతులకు పంపించారు. -
ఐఐటీ, ఎన్ఐటీల్లోని సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీ ఐల్లోని సీట్లు అన్నింటికి జాయింట్ సీట్ అలకేషన్ అథా రిటీ (జోసా) విద్యార్థులకు కేటాయించింది. ఉమ్మడి ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 25 వరకు ఆప్షన్లకు అవకాశం కల్పించిన జోసా బుధవారం సీట్ల కేటాయింపును ప్రకటించింది. ఇందులో వరంగల్లోని ఎన్ఐటీ, హైదరాబాద్లోని ఐఐటీల్లో ఉన్న సీట్లతోపాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లోని 37 వేల సీట్ల ను విద్యార్థులకు కేటాయించింది. సీట్లు పొందిన వారు ఈ నెల 28 నుంచి జూలై 2 లోగా రిపోర్టింగ్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకొని యాక్సెప్టెన్సీ ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, వరంగల్ ఎన్ఐటీలో రిపోర్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూలై 3న ఉదయం భర్తీ అయిన సీట్లను, ఖాళీగా ఉన్న సీట్లను ప్రకటించనుంది. అదే రోజు సాయంత్రం రెండో దశ సీట్లను కేటాయించనుంది. ఈసారి కౌన్సెలింగ్ను 7 దశల్లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. మొదటి దశలో వచ్చిన సీటు వద్దనుకుంటే సంబంధిత రిపోర్టింగ్ కేంద్రంలో తెలియజేయాలని అధికారులు వెల్లడించారు. ఆయా విద్యార్థులు మళ్లీ ఆప్షన్లు ఇచ్చుకునే వీలు లేదని, మొదట ఇచ్చిన ఆప్షన్లనే పరిగణనలోకి తీసుకొని ఆ తరువాతి దశల్లో సీట్లు కేటాయిస్తారన్నారు. -
బాలికలకు ప్రత్యేకంగా 1,473 సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐల్లో 1,473 సీట్లను ప్రత్యేకంగా బాలికలకే కేటాయించేలా జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ చేపట్టిన నేపథ్యంలో సీట్ల వివరాలను జోసా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఐఐటీల్లో 800 సీట్లు, ఎన్ఐటీ, జీఎఫ్టీఐల్లో మిగతా సీట్లను కేటాయించనున్నట్లు తెలిపింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో 39,425 సీట్లను జోసా ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. సాధారణ పద్ధతిలో 37,952 సీట్లను భర్తీ చేయ నుండగా, ప్రత్యేకంగా బాలికలకే 1,473 సీట్లను కేటాయించనున్నట్లు వివరించింది. జోసా రిజిస్ట్రేషన్ సమయంలో వ్యక్తిగత వివరాలను మార్చుకోవడానికి వీలు లేదని తెలిపింది. వరంగల్ ఎన్ఐటీలో హోంస్టేట్ (తెలంగాణ)తోపాటు ఏపీ కోటా ఉంటుందని, అదర్ స్టేట్ కోటా కింద కూడా (ఏపీ కలుపుకొని) సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది. ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు టాప్–20 పర్సంటైల్, ఇంటర్మీడియేట్లో 75, ఎస్సీ, ఎస్టీ వికలాంగులైతే 65 మార్కులు సాధించి ఉండాలని వివరించింది. -
రాతి శిథిలం..అద్భుత తోరణం
సాక్షి, హైదరాబాద్ : రెండేళ్ల క్రితం.. ముళ్ల పొదలు.. మట్టి దిబ్బలు.. వాటిలోంచి కొద్దిగా బయటకు కనిపిస్తున్న రాళ్లు.. తరచి చూస్తే రాతి శిల్పాలు.. మరికాస్త శోధిస్తే పురాతన తోరణం ఆనవాళ్లు. ఇప్పుడు.. ఠీవిగా, గంభీరంగా నిలుచున్న భారీ తోరణం. ఇంజనీరింగ్ నైపుణ్యంతో తిరిగి ప్రాణ ప్రతిష్ట పొందిన పురాతన సంపద. కాకతీయుల కంటే ముందునాటి ఈ తోరణం.. వరంగల్ సమీపంలోని చారిత్రక ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం ముందు ఉంది. పురావస్తుశాఖ అధికారులు, వరంగల్ నిట్ ఇంజనీరింగ్ నిపుణులు ఈ తోరణాన్ని తిరిగి నిర్మించారు. ఇనుప కడ్డీలతో.. తోరణం రెండు స్తంభాలు విరిగి ఉండటంతో ఇనుప కడ్డీలతో జోడించారు. రాతి ముక్కల్లో రంధ్రాలు చేసి.. వాటిలోకి ఇనుపకడ్డీలను దూర్చారు. రంధ్రాలను ఎరల్డైట్ మిశ్రమంతో నింపి.. రాతి ముక్కలను జోడించారు. కొన్ని రాతి ముక్కలు లభించకపోవడంతో.. అలాంటివి తెప్పించి కలిపారు. మొత్తంగా ఎక్కడా సిమెంటు వాడకుండా తోరణాన్ని పునరుద్ధరించడం గమనార్హం. ఓరుగల్లు తోరణాల కంటే కొంత చిన్నగా.. ఓరుగల్లు తోరణాలు 40 అడుగుల కంటే ఎత్తు ఉండగా.. ఐనవోలు తోరణాలు 30 అడుగుల ఎత్తు ఉన్నాయి. ఓరుగల్లు తోరణాల పైభాగంలో రెండు చివరల్లో హంస ఆకృతి ఉండగా.. వీటిలో లేదు. వేలాడుతున్న కలశాల ఆకృతులు మాత్రం ఉన్నాయి. ఇక శిల్ప నైపుణ్యం, నగిషీలు కొంత తక్కువగా ఉన్నాయి. పురాతన ఆలయమిది ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయ ప్రస్తావన క్రీస్తుశకం 1007 నాటి నుంచే ఉంది. పున్నాల శాసనంలో దీని ప్రస్తావన కనిపించింది. క్రీస్తుశకం 1118 నాటి విక్రమాదిత్య శాసనం, 1163 నాటి రుద్రదేవుడి శాసనం, 1369 నాటి రేచర్ల వెలమరాజు అనపోతనాయకుడి శాసనాల్లోనూ ఈ ఆలయ ప్రస్తావన ఉంది. అంటే ఆలయ నిర్మాణ సమయానికి కాస్త అటూఇటుగా ఈ తోరణాలు ఏర్పాటు చేసి ఉంటారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఓరుగల్లు తోరణాల కంటే ముందే.. వరంగల్ కోటలో ఆనాటి వైభవానికి సాక్ష్యంగా భాసిల్లుతున్న కాకతీయ తోరణాలు అందరికీ తెలిసినవే. అప్పట్లో అక్కడ పెద్ద శివాలయం ఉండేదని, దానికి నాలుగువైపులా ద్వారాలుగా తోరణాలు ఏర్పాటు చేశారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. అదే తరహాలో అంతకన్నా వందేళ్ల ముందు అంటే క్రీస్తుశకం 1000వ సంవత్సరం సమయంలో.. ఐనవోలులో మల్లికార్జునస్వామి దేవాలయాన్ని నిర్మించినట్లు అంచనా. ఈ దేవాలయానికి తూర్పు, దక్షిణ, ఉత్తర దిశల్లో మూడు ద్వారాలున్నాయి. వాటికి ఎదురుగా తూర్పు, దక్షిణ దిశల్లో రెండు తోరణాలు ఉన్నాయి. ఉత్తర ద్వారంవైపు మాత్రం తోరణం లేదు. కానీ 2016లో స్థానికులు మట్టిదిబ్బలు, ముళ్ల పొదల్లో ఆ తోరణానికి సంబంధించిన శిథిలాలను గుర్తించారు. దానికి పునర్వైభవం తేవాలని నిర్ణయించిన పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి.. వరంగల్ నిట్ మాజీ ప్రొఫెసర్ పాండురంగారావు, ప్రస్తుత ప్రొఫెసర్ల సహాయంతో తోరణాన్ని తిరిగి నిర్మించారు. -
ఫుల్ జోష్
-
బాలికలకు 14 శాతం సీట్లు!
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల్లోనూ బాలికలకు 14% సీట్లు కేటాయించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(ఎంహెచ్ ఆర్డీ) నిర్ణయించింది. 20 శాతం కంటే తక్కువ మంది బాలికలు ఉన్న ఎన్ఐటీల్లో ఈ సీట్లు సృష్టించి భర్తీ చేయా లని పేర్కొంది. బాలుర కోటాకు భంగం వాటిల్లకుండా బాలికల కోసం సూపర్ న్యూమరరీ కింద సీట్లు సృష్టించి భర్తీ చేయాలని సూచించింది. బాలికల నమోదును పెంచేందుకు ఐఐటీల్లో చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఎన్ఐటీల్లోనూ సీట్లు పెంచేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని ఎన్ఐటీలకు లేఖలు రాసినట్లు తెలిసింది. 2018–19 విద్యాసంవత్సరంలో 14 శాతం, 2019–20లో 17 శాతం, 2020–21లో 20 శాతం సీట్లు కేటాయించాలని, బాలికల నమోదును 20 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఐఐటీలతోపాటు ఎన్ఐటీల్లోనూ సీట్లు పెరగనున్నాయి. తగ్గిన నమోదు శాతం 2016–17 విద్యా సంవత్సరం వరకు ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ మెయిన్ స్కోర్తోపాటు ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును ఖరారు చేసే వారు. దీంతో 2016లో ఎన్ఐటీల్లో 20 శాతం బాలికలు చేరారు. 2017–18 నుంచి ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీని తొలగించి కేవలం జేఈఈ స్కోర్ ఆధారంగానే సీట్లను కేటాయిస్తున్నారు. దీంతో 2017–18లో చాలా ఎన్ఐటీల్లో బాలికల నమోదు 15 శాతానికి పడిపోయింది. దీంతో ఎన్ఐటీల్లోనూ సూపర్ న్యూమరరీ సీట్లను సృష్టించి బాలికల నమోదును పెంచాలని కేంద్రం నిర్ణయించింది. బాలికల నమోదు 20 శాతం కంటే తక్కువ ఉన్న ఎన్ఐటీల్లో సీట్లను పెంచనుంది. -
నిట్లో ర్యాగింగ్ కలకలం
సాక్షి, తాడేపల్లిగూడెం: పశ్చిమ గోదావరి జిల్లాల తాడేపల్లిగూడెం నిట్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. బిహార్కు చెందిన ఫస్ట్ ఇయర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్కు పాల్పడ్డారు. దీంతో జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య శుక్రవారం రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు. ఈ ఘటనపై జూనియర్లు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేసిన కళాశాల అధికారులు ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేశారు. మరో 15 మంది విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగడంతో ఎలాంటి ఘటనలు జరగకుండా తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
పారిశ్రామిక నైపుణ్యతకు నిట్తో సీఐఐ ఎంఓయు
కాజీపేట అర్బన్ : కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)తో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండ్రస్ట్రీ(సీఐఐ) ఎంఓయూ కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ ఎన్.వి.రమణారావు, సీఐఐ తెలంగాణ చైర్మన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు వి.రాజన్లు మంగళవారం ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ సమావేశ మందిరంలో రమణారావు మాట్లాడుతూ పారిశ్రామిక నైపుణ్యతను అందించేందుకు, నూతన పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తున్న నిట్లోని విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం తోడ్పడనున్నట్లు తెలిపారు. సీఐఐ ద్వారా ఫ్యాకల్టీ, విద్యార్థులకు పారిశ్రామిక నైపుణ్యతను అందించడం ద్వారా నూతన పరిశ్రమల ఏర్పాటుకు నాంది పలకవచ్చన్నారు. నగరాన్ని ఇండస్ట్రియల్ హబ్గా తీర్చిదిద్దేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని రాజన్న అన్నారు. పరిశ్రమల ఏర్పాటులో నైపుణ్యత, వర్క్షాపులు, పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ నిట్ అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్ధులకు బోధించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రిజస్ట్రార్ లక్ష్మారెడ్డి, డీన్లు రాంగోపాల్రెడ్డి, జయకుమార్, రామచంద్రయ్య, పీఆర్ఓ రవీందర్రెడ్డి, సీఐఐ బాధ్యులు పాల్గొన్నారు. -
నిట్లో అంబరాన్నంటిన సాంకేతిక సంబురాలు
-
సమస్యల స్వాగతం..
కాజీపేట అర్బన్: జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)ఏడాదిన్నరగా ఇన్చార్జి డైరెక్టర్ పాలనలో కొనసాగుతోంది. దీంతో కళాశాలలో సమస్యలు పేరుకుపోయి పాలన గాడితప్పింది. ఈ నేపథ్యంలో సోమవారం రానున్న కొత్త శాశ్వత డైరెక్టర్కు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని ఈనెల 13న విద్యార్థులు నిట్ ప్రధాన గేటు ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. మౌలిక సౌకర్యాల కొరత.. వరంగల్ నిట్లో బీటెక్, ఎంటెక్, పీజీ, పీహెచ్డీ విభాగాల్లో సుమారు 6వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడి విద్యార్థులు తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్నారు. బయట నుంచి మినరల్ వాటర్ను కొని విద్యార్థులకు సరఫరా చేస్తున్నారు. కళాశాల ఆవరణ, వసతి గృహ ఆవరణల్లో పారశుధ్యం లోపించింది. ఫలితంగా ప్రాంగణమంతా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి కళాశాలలో ఉచిత వైఫై సౌకర్యం కల్పించాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నాణ్యమైన భోజనం లభించకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పదోన్నతులపై డీపీసీలో చర్చించాలి .. నిట్లో నాన్ టీచింగ్ ఉద్యోగ భర్తీకి సన్నాహాలు చేస్తున్న క్రమంలో డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీతో చర్చించి పదోన్నతులు కల్పించాలని నాన్టిచింగ్ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఇరవై ఎళ్లుగా పదోన్నతులు లేకుండా నాన్టిచింగ్ సిబ్బంది కొనసాగుతున్నారు. సుమారు 230 మంది నాన్ టీచింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా వారిలో కనీసం వంద మందికైనా ప్రమోషన్లు కల్పించాల్సి ఉంది. వంద కోట్లు వెనక్కి వచ్చేనా... బాలికల వసతి నిట్కు పెద్ద సమస్య అవుతోంది. మూడు వందల మందికి ఉండాల్సిన హాస్టళ్లో సుమారు వెయ్యి మంది బస చేస్తున్నారు. వీరిలో కొంత మందిని గెస్ట్ హౌస్లో ఉంచుతున్నారు. సమస్యను పరిష్కరించేందుకు కేంద్రమానవ వనరుల మంత్రిత్వ శాఖ బాలికల వసతి గృహ నిర్మాణానికి రూ. వంద కోట్లు మంజూరు చేసింది. శాశ్వత చైర్మన్, డైరెక్టర్, బోర్డు సభ్యులు లేకపోవడంతో నిధులు వెనక్కి వెల్లిపోయాయి. కొత్త డైరెక్టర్ నిధులు వెనక్కి తెప్పించి బాలికల వసతి గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. అందుబాటులో లేని పీఆర్వో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (పీఆర్వో) నిట్లో అందుబాటులో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. పనిఒత్తిడి కారణంగా గతంలో పనిచేసిన పీఆర్వో స్వయంగా విధుల నుంచి తప్పుకోగా ప్రస్తుతం ఎంబీఏ హెచ్ఓడీ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు. పీఆర్వో విద్యార్థులకు, తల్లిదండ్రులు, ఇతర సిబ్బందికి అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించనున్న డైరెక్టర్ ఈ సమస్యలు పరిష్కరిస్తారనే ఆశతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. -
ఆ నగరంలో కూడా మత్తు మహమ్మారి..!
► చాప కింద నీరులా విస్తరిస్తున్న కల్చర్ ►ఆరు దాటితే ఆరుబయటే పలువురు విద్యార్థులు ►తతంగం అంతా ఆన్లైన్లోనే.. ►‘దాసా’ విధానంతో మహమ్మారి బారిన..! ►ల్యాప్టాప్లో వినియోగదారులు, విక్రయదారుల చిట్టా.. ►పరారీలో ఉన్న ఆ ఐదుగురు ఎవరో.. ►కూపీ లాగుతున్న టాస్క్ఫోర్స్ పోలీసులు కాజీపేట అర్బన్: కాజీపేటలోని జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)లో డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. పాశ్చాత్య పోకడలకు అలవాటు పడిన విద్యార్థులు సిగరెట్ నుంచి డ్రగ్స్కు వాడే స్థాయికి ఎదిగారు. హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చెందుతున్న నగరాన్ని అంతే స్పీడ్గా మత్తు మహమ్మారి ముంచెత్తుతోంది. ప్రధానంగా దేశంలోనే ప్రతిష్టాత్మక కళాశాలగా పేరుగాంచిన నిట్లో డ్రగ్స్ రాకెట్ పంజా విసురుతోంది. కళాశాలకు చెందిన 2012 బ్యాచ్ విద్యార్థులు గుర్రం ద్వీజి, ఎడ్ల రమేష్ డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు హైదరాబాద్ టాస్క్ఫోర్స్ దాడిలో వెలుగులోకి రావడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో విద్యార్థులను కళాశాలకు పంపేందు కు వారి తల్లిదండ్రులు జంకుతున్నారు. శీలావతి టు ఎల్ ఏ డీఎల్ డ్రగ్స్.. నిట్ విద్యార్థులు ఫ్యాషన్ అంటూ అలవాటు చేసుకున్న సిగరెట్ నుంచి క్రమక్రమంగా డ్రగ్స్కు బానిసవుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు సాయంత్రం ఆరు దాటిందంటే ఆరు బయటే ప్రత్యక్షమవుతున్నారు. కాజీ పేట దర్గా వంద ఫీట్ల రోడ్డులోని పాన్షాప్లలో గంజాయి సిగరెట్లతో గుప్పుగుప్పు మంటూ అర్ధరాత్రి వరకూ ఎంజాయ్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోలీసులకు నైట్ పెట్రోలింగ్లో పలువురు చిక్కిన సంఘటనలు ఉన్నట్లు వినికిడి. నిట్ విద్యార్థుల్లో కొందరు ఏకంగా రిజ్లా పేపర్ను కొనుగోలు చేసి.. శీలావతి అనే గంజాయి వేసి సిగరెట్ రూపంలోకి మార్చి వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో గంజాయి మత్తుతో సరిపెట్టుకోలేని విద్యార్థులు డ్రగ్స్ వైపునకు అడుగులు వేస్తున్నారు. ల్యాప్టాప్లో దాగి ఉన్న చిట్టా.. నిట్లో లై యాసిడ్ డీ తైలమైడ్ డ్రగ్స్తో పట్టుబడ్డ గుర్రం ద్వీజి, ఎడ్ల రమేష్ నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులు ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్నా రు. డార్క్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో గోవా నుంచి నగరానికి తెప్పిం చికుంటున్నారని.. నిట్లో కోడ్ భాషల్లో వాటి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన టాస్క్ఫోర్స్ అధికారులు ల్యాప్టాప్లో దాగి ఉన్న చిట్టాను అన్వేషిస్తున్నారు. నగరంలో ఎంత మందికి విక్రయాలు కొనసాగిస్తున్నారనే సమాచారంపై ఆరాతీస్తున్నారు. దీంతోపాటు డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్న వారిలో పరారీలో ఉన్న ఆ ఐదుగురు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాసాతో గోస.. నిట్ కళాశాలలో సుమారు 6,700 మంది విద్యార్థులు వివిధ ఇంజనీరింగ్, ఎంబీఏ, పీహెచ్డీ స్కాలర్స్ ఉన్నారు. వీరితోపాటు డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్ అబ్రాడ్ (దాసా) పేరిట ప్రతి ఏడాది విదేశాలకు చెందిన 120 మంది విద్యార్థులకు నిట్లో అవకాశం కల్పిస్తున్నారు. వీరిలో చా లా శాతం మంది విద్యార్థులు మత్తుమందులకు అలవాటు పడి ఇతరుల కు అలవాటు చేస్తున్నట్లు సమాచా రం. దాసా విద్యార్థుల హాస్టల్ రూం లలో మద్యం బాటిళ్లు ఉన్నా.. కళా శాల అధికారులు, సిబ్బంది పట్టించుకున్న దాఖలాలు లేవని పలువురు చెబుతుండడం గమనార్హం. కొరవడిన నిఘా.. నిట్లో భద్రతా సిబ్బంది కేవలం ప్రధాన గేట్ వద్దే హల్చల్ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేనిదే ఇతరులను లోనికి రానివ్వకుండా మాత్రమే భద్రత చేపడుతున్నారు. హాస్టళ్లలో గానీ.. విద్యార్థుల క్లాస్రూంలలో గానీ ఎటువంటి నిఘా ఏర్పాటు చేయకపోవడంతో డ్రగ్స్ కల్చర్ విస్తరిస్తోంది. -
నిట్కు నూతన బ్యాచ్
నేడు ఓరియంటేషన్ నాలుగు కొత్త లోగోలు తయారీ ఈ ఏడాది 480కు 438 సీట్లు భర్తీ మొత్తం విద్యార్థులు 1,224 తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలోని ఆంధ్రప్రదేశ్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్)లో కొత్తబ్యాచ్ బుధవారం రానుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు రానున్నారు. ఏపీ నిట్ ఇక్కడ ఏర్పాటుచేసిన తర్వాత అధిక శాతంలో విద్యార్థులు ఈ ఏడాది చేరారు. మొత్తం సీట్లు 480కు 438 సీట్లు భర్తీకాగా 42 మిగిలాయి. హోం స్టేట్ కోటా కింద 240 సీట్లు, ఇతర కోటా కింద 240 సీట్లు నిట్లో ఉన్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు సీటు పొందే విషయంలో ప్రాధాన్యతను ఏపీ నిట్కు ఇచ్చారు. నిట్ ఏర్పాటుచేసిన మొదటి రెండేళ్లలో 960 (480+480) సీట్లకు 786 మంది విద్యార్థులు చేరారు. అయితే ఈఏడాది 480 సీట్లకు అత్యధికంగా భర్తీ అయ్యాయి. ఈసారి సీట్ల భర్తీకి సీశాబ్ పేరిట ప్రత్యేక రౌండ్ కేటాయించడంతో నిట్లో చేరాలనుకున్న విద్యార్థుల ఆశలు నెరవేరాయి. దీంతో మరికొందరు ఇక్కడ చేరడానికి మార్గం సుగమమయ్యింది. మొత్తంగా కొత్త బ్యాచ్తో కలుపుకుని నిట్లో విద్యార్థుల సంఖ్య 1,224 (786+438)కు చేరింది. బాలికలకు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో, బాలురకు పెదతాడేపల్లి, నల్లజర్ల, వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న డీఎడ్ కళాశాలలో వసతి ఏర్పాటుచేశారు. కొత్త విద్యార్థుల కోసం వారం రోజుల్లో పూర్తి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. బుధవారం ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతి«థిగా మెంటర్ డైరెక్టర్ జీఆర్పీ రెడ్డి పాల్గొంటారు. నిట్లో కోర్సులు, వాటి ప్రాధాన్యతలను వివరించనున్నారు. ఏర్పాట్లు పూర్తి బాలారిష్టాలను అధిగమిస్తూ ఏపీ నిట్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన తాత్కాలిక వసతిలోనే పరిశోధనశాలల, వసతి, తరగతి గదులు అవసరాలను తీర్చుకుంటోంది. కేంద్ర మానవవనరుల శాఖ ఏపీ నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తూ అంగీకారం తెలిపింది. ఈ నిధుల ద్వారా వచ్చే విద్యాసంవత్సరానికి వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. నిట్కు ఇంతవరకు ఎలాంటి లోగో లేదు. నిట్ను అధికారికంగా గుర్తిస్తూ ఇటీవల గెజిట్ విడుదలైంది. దీంతో పాటు నిట్కు నాలుగు రకాల లోగోలను ఏపీ నిట్ అధికారులు రూపొందించారు. గోదావరి జిల్లాల ప్రాశస్త్యం, పచ్చని పొలాలు, గోదావరి వంతెన, పూర్ణకలశం వంటివి లోగోలో వచ్చేలా నాలుగు రకాల లోగోలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి , దేవాదాయశాఖ మంత్రికి, జిల్లా కలెక్టర్కు పంపించారు. వీటిలో ఏదో ఒకదానికి అధికారిక ముద్ర పడాల్సి ఉంది. నిట్లో డే స్కాలర్ పద్ధతిని ప్రవేశపెట్టడానికి గతంలో అధికారులు ప్రతిపాదించారు. అయితే విద్యార్థులకు ఆటపాటలతో వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విద్య అందించాలన్నది నిట్ ఉద్దేశం కావడంతో ఈ ప్రతిపాదనను విరమించుకుని రెసిడెన్షియల్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. కొత్త విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని నిట్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఎస్.శ్రీనివాసు తెలిపారు. -
ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు
ఈసారి మిగిలిన 121 సీట్లు సీట్లు పెంచడం వల్లే అంటున్న ఐఐటీ వర్గాలు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) మిగిలిపోతున్న సీట్ల సంఖ్య ఏటేటా పెరుగు తోంది. 5 దశల ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించాక గతేడాది 96 సీట్లు మిగిలి పోగా, ఈసారి 7 దశల కౌన్సెలింగ్ నిర్వహిం చినా 121 సీట్లు మిగిలిపోయాయి. 23 ఐఐటీల్లోని 10,962 సీట్ల భర్తీకి, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రం ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లోని (జీఎఫ్టీఐ) 19 వేల సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఈనెల 22 వరకు 7 దశల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ను నిర్వ హించింది. ఈసారి ఐఐటీల్లో 121 సీట్లు మిగిలిపోగా, ఎన్ఐటీల్లో 461 సీట్లు సహా ట్రిపుల్ ఐటీ, జీఎఫ్టీఐల్లో మొత్తం 6,510 సీట్లు మిగిలిపోయా యి. వాటి భర్తీకి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహ ణకు సెంట్రల్ సీట్ అలకే షన్ బోర్డు (సీఎస్ఏబీ) చర్యలు చేపట్టింది. విద్యార్థులు నేడు ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జోసా పేర్కొంది. ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు సీట్లు కేటాయించ నుంది. ఐఐటీల్లో ఇక అంతే.. ఐఐటీల్లో మిగిలిన సీట్ల భర్తీకి మరో కౌన్సెలింగ్ నిర్వహించట్లేదు. దీంతో 121 సీట్లు ఈ ఏడాది ఖాళీగానే ఉండనున్నాయి. అత్యధికంగా బనారస్ హిందూ యూనివర్సి టీలో 32 సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీ దన్బాద్లో (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) 23, ఐఐటీ–జమ్మూలో 12, ఐఐటీ ఖరగ్పూర్లో 9 సీట్లు మిగిలిపోయాయి. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాసు, ఐఐటీ రోపర్, ఐఐటీ పాలక్కడ్, ఐఐటీ గోవాలో ఒక్కోటి చొప్పున సీట్లు మిగిలాయి. హైదరాబాద్, కాన్పూర్, జోధ్పూర్ ఐఐటీల్లో మాత్రం 100% సీట్లు భర్తీ అయ్యాయి. ఐఐటీల్లో సీట్ల సంఖ్య పెంచడం వల్లే సీట్లు మిగిలాయని, లేదంటే అన్నీ భర్తీ అయ్యేవని ఐఐటీ వర్గాలు పేర్కొన్నాయి. ఐఐటీల్లో మిగిలిపోతున్న సీట్లు.. సంవత్సరం మిగిలిపోయినవి 2014–15 3 2015–16 50 2016–17 96 2017–18 121 -
జేఈఈ ప్రవేశాల రివైజ్డ్ షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో ప్రవేశాలకు చేపడుతున్న కౌన్సెలింగ్కు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) బుధవారం ప్రకటించింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈ నెల 19 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్ పూర్తి కావాల్సి ఉండగా, కోర్టు కేసు కారణంగా ఆలస్యమైంది. దీంతో ఈ నెల 22 వరకు కౌన్సెలింగ్ నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూల్ను జారీ చేసింది. సోమవారమే మూడో దశ సీట్లను కేటాయించింది. ఇదీ రివైజ్డ్ షెడ్యూలు.. 2017 జూలై 13న మధ్యాహ్నం ఒంటి గంట వరకు సీటు యాక్సె ప్టెన్స్/విత్డ్రా, సాయంత్రం 5 గంటలకు భర్తీ అయిన సీట్లు/ఖాళీల ప్రకటన, రాత్రి 8 గంటలకు నాలుగో దశ సీట్లు కేటాయింపు జూలై 14, 15 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు సీటు యాక్సెప్టెన్స్/విత్డ్రా జూలై 16న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు/ ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఐదో దశ సీట్లు కేటాయింపు. జూలై 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్/విత్డ్రా జూలై 18న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఆరో దశ సీట్లు కేటాయింపు జూలై 19, 20 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ కేంద్రాల్లో విద్యార్థులు రిపోర్టు చేయడం. సీటు విత్డ్రాకు ఇదే చివరి అవకాశం. జూలై 21న ఉదయం 10 గంటలకు భర్తీ అయిన సీట్లు / ఖాళీల ప్రకటన, సాయంత్రం 5 గంటలకు ఏడో దశ సీట్లు కేటాయింపు. జూలై 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిపోర్టింగ్ కేంద్రాలకు వెళ్లి సీటు యాక్సెప్టెన్స్, రిపోర్టింగ్ (విత్డ్రా ఉండదు). -
ఎంసెట్ టాపర్లంతా ఐఐటీ, ఎన్ఐటీలవైపే!
మొదటి 1,000 ర్యాంకర్లలో 253 మందే వెరిఫికేషన్కు హాజరు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ టాపర్లు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరై వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు ఉదాహరణ. ఎంసెట్లో మొదటి 1,000 ర్యాంకులను సాధించిన విద్యార్థుల్లో 75 శాతం మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరవలేదు. కేవలం 25 శాతం (253) మందే వెరిఫికేషన్కు హాజరయ్యారు. వారూ జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్కు హాజరైన విద్యార్థులే. వాటిల్లో టాప్ ర్యాంకులు సాధించిన వారూ ఉన్నారు. వీరంతా ఐఐటీలు, ఎన్ఐటీల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. వెరిఫికేషన్కు హాజరైన 2 వేల ర్యాంకులోపు విద్యార్థుల్లోనూ ఎక్కువ మంది ఎన్ఐటీ, ఐఐటీల్లోనే చేరే అవకాశం ఉంది. -
గోదావరి జలాల వినియోగంపై అధ్యయనం
నిట్ డైరెక్టర్ జి.రామచంద్రారెడ్డి హన్మకొండ: గోదావరి జలాలపై వరంగల్లోని నిట్ అధ్యయనం చేసిందని నిట్ ఇన్ చార్జి డైరెక్టర్ జి.రామ చంద్రారెడ్డి అన్నారు. నిట్ సివిల్ విభాగం ఎంతో సాంకేతిక నైపుణ్యం కలిగి ఉందని, దీనిని ఇప్పటి వరకు ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. కేంద్ర జలవనరుల మం త్రిత్వ శాఖ సలహాదారుడు, తెలంగాణకు చెందిన వెదిరె శ్రీరాం రచించిన ‘గోదావరి జలాల సమగ్ర వినియో గం–జాతీయ, తెలంగాణ రాష్ట్ర దృక్పథాలు’ పుస్తకంపై శనివారం వరంగల్లోని నిట్లో జరిగిన చర్చా కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. భూగర్భ జలాల పెంపున కు, నదుల్లో నీటి నిల్వలకు, నీటి ఎద్దడి నివారణకు వరంగల్ నిట్ విద్యార్థులు, అధ్యాపకులు అనేక పరిశో ధనలు చేశారని తెలిపారు. నీటిసాంద్రత పెంపుదల ప్రాజెక్ట్ రూపకల్పనకు నిట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం ఉపయెగిం చుకోవాలని కోరారు. వెదిరె శ్రీరాం రచించిన పుస్తకంలో పొందుపరిచిన అంశాలతో తెలం గాణ రాష్ట్రానికి నేషనల్ ప్రాజెక్ట్ హోదాను పొందే అవకాశంపై చర్చించారు.