చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(38) గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గొర్రెలను మేపుతున్న సమయంలో భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
Published Fri, Jun 24 2016 12:46 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Related news by tags
-
మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్పై ఆర్బీఐ కీలక ప్రకటన
మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడిన సాంకేతిక లోపం ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం చూపెట్టింది. భారత్లోని విమానయాన, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. భారత్లోని 10 బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై అది స్వల్ప ప్రభావం చూపినట్లు భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. అయితే, ఇది స్వల్ప అంతరాయమేనని, వాటిలో కొన్ని ఇప్పటికే పరిష్కరించినట్లు స్పష్టం చేసింది. చాలా బ్యాంకుల కీలక వ్యవస్థలు క్లౌడ్లో లేవని, కొన్ని బ్యాంకులు మాత్రమే క్రౌడ్ స్ట్రైక్ వినియోగిస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. -
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్న్యూస్.. మరిన్ని బ్యాంకుల్లో బీబీపీఎస్
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త. థర్డ్-పార్టీ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించడం ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి ప్రధాన క్రెడిట్ కార్డ్ ప్రొవైడర్లు ఈ యాప్ల ద్వారా చెల్లింపులను సులభతరం చేయడానికి తమ సిస్టమ్లను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS)కి లింక్ చేశారు.జూలై 1 నుంచి అన్ని క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బీబీపీఎస్ ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయాలని ఆర్బీఐ గతంలో ఆదేశించింది. అయితే, అనేక బ్యాంకులు ఇప్పటికీ థర్డ్ పార్టీ యాప్ల ద్వారా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపుల కోసం బీబీపీఎస్ని ప్రారంభించలేదు.ఇప్పటివరకు, 15 బ్యాంకులు బీబీపీఎస్లో బిల్లు చెల్లింపును యాక్టివేట్ చేశాయి. వీటిలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. మొత్తం 34 బ్యాంకులకు క్రెడిట్ కార్డ్లను జారీ చేయడానికి అనుమతి ఉండగా వీటిలో జూలై 15 వరకు బీబీపీఎస్లో 15 బ్యాంకులు చేరాయి.బీబీపీఎస్కి లింక్ అయిన బ్యాంకులు ఇవే..» ఐసీఐసీఐ బ్యాంక్» ఏయూ బ్యాంక్» బ్యాంక్ ఆఫ్ బరోడా» కెనరా బ్యాంక్» ఫెడరల్ బ్యాంక్» హెచ్డీఎఫ్సీ బ్యాంక్» ఐడీబీఐ బ్యాంక్» ఐడీఎఫ్సీ బ్యాంక్» ఇండియన్ బ్యాంక్» ఇండస్ఇండ్ క్రెడిట్ కార్డ్» కోటక్ మహీంద్రా బ్యాంక్» పంజాబ్ నేషనల్ బ్యాంక్» సరస్వత్ సహకరి బ్యాంక్» ఎస్బీఐ కార్డ్» యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఏంటీ బీబీపీఎస్?భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) అనేది బిల్లు చెల్లింపుల సమగ్ర వ్యవస్థ. ఇది వినియోగదారులకు ఆన్లైన్ బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహిస్తుంది. ఇది అన్ని బిల్లు చెల్లింపుల కోసం ఒక-స్టాప్ సొల్యూషన్. ఇది దేశం అంతటా వినియోగదారులందరికీ భద్రతతో కూడిన ఇంటర్ఆపరబుల్, సులభతరమైన, ఎప్పుడైనా, ఎక్కడైనా బిల్లు చెల్లింపు సేవను అందిస్తుంది. -
ఫిన్టెక్ కంపెనీలకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిన్టెక్ స్టార్టప్లు కస్టమర్ వెరిఫికేషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. ఇటీవల కేవైసీ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ అధికారులు ఫిన్టెక్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. చర్చల అనంతరం ఆర్బీఐ గతంలో వెల్లడించిన నిబంధనల్లో ఎలాంటి మార్పలు లేవని స్పష్టం చేశారు.ఆఫ్లైన్ ఆధార్ ధ్రువీకరణ, సెంట్రలైజ్డ్ కేవైసీ, డిజిలాకర్ వంటి అన్ని డాక్యుమెంట్ సేకరణ ప్రక్రియలతో పాటు ఫిన్టెక్ కంపెనీలు డిజిటల్ కస్టమర్ ఆన్బోర్డింగ్లో భాగంగా వీడియో కేవైసీని పాటించాలని ఆర్బీఐ తెలిపింది. గతంలో వీడియో కేవైసీ తప్పనిసరనే నిబంధనేదీ లేదు. కానీ ఇటీవల ఆర్బీఐ ఫిన్టెక్ కంపెనీల కస్టమర్ కేవైసీ విధానంలో మార్పులు తీసుకొచ్చింది. అందులో భాగంగా కస్టమర్ ఆన్బోర్డింగ్లో తప్పకుండా వీడియో కేవైసీ నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే దీన్ని సడలించాలని కంపెనీ ప్రతినిధులు ఆర్బీఐతో చర్చలు జరిపారు. కానీ నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవని ఆర్బీఐ స్పష్టం చేసింది. కచ్చితంగా అన్ని ఫిన్టెక్ కంపెనీలు, స్టార్టప్లు నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఇదీ చదవండి: తయారీ రంగానికి నిధులు పెంచుతారా..?పీర్-టు-పీర్(ఆన్లైన్లో నేరుగా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి అప్పు తీసుకోవడం) రుణాలపై సమావేశంలో చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉందని తెలిసింది. అయితే పీర్ టు పీర్(పీ2పీ) లెండింగ్ కంపెనీలు కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండాలనే వాదనలున్నాయి. ఈ స్టార్టప్లపై ఆర్బీఐ మరిన్ని నిబంధనలు విధించే వీలుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలాఉండగా, పీ2పీలో అప్పు తీసుకుని చెల్లించకుండా డీఫాల్ట్ అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
లక్షలాది అకౌంట్లు.. ఆర్బీఐ ఆశ్చర్యం!!
మోసపూరిత లావాదేవీలు, ఎవర్గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది అకౌంట్లను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.బిజినెస్ స్టాండర్ట్ కథనం ప్రకారం.. “గత రెండు సంవత్సరాల్లో మరింత దృష్టి కేంద్రీకరించిన అంశం.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణ. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉన్నాయని మేము గుర్తించాం” అని మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్.జె పేర్కొన్నారు.ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు , రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని, వీలైనంత తగ్గించాలని సీఎఫ్లకు స్వామినాథన్ సూచించారు. గత వారం బ్యాంక్ చీఫ్లతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. మ్యూల్ ఖాతాలను (చట్టవిరుద్ధమైన ఖాతాలు), డిజిటల్ మోసాలను అరికట్టాలని కోరారు. -
మరో ఐదు బ్యాంకులకు 'ఆర్బీఐ' జరిమానా!.. కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)తో సహా మొత్తం ఐదు బ్యాంకులకు జరిమానా విధించింది. ఆర్బీఐ నియమాలను ఉల్లంఘించిన కారణంగా ఈ జరిమానాలు విధించడం జరిగిందని సమాచారం.ఆర్బీఐ జరిమానా విధించిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రమే కాకుండా.. గుజరాత్ రాజ్య కర్మచారి కోఆపరేటివ్ బ్యాంక్, రోహికా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (బిహార్), నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ (మహారాష్ట్ర), బ్యాంక్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ బ్యాంక్ (పశ్చిమ బెంగాల్) ఉన్నాయి. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు ఆర్బీఐ ఏకంగా రూ. 1.31 కోట్ల జరిమానా విధించింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్.. లోన్స్ అండ్ అడ్వాన్సులు వంటి వాటికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాలను ఉల్లంఘించిన కారణంగా 2024 జులై 4న రూ. 1,31,80,000 జరిమానా విధించినట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్లోని పలు నిబంధనలను పీఎన్బీ బ్యాంక్ ఉల్లంఘించినట్లు ఆర్బీఐ పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్ని రోజులుగా నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికి పలు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది, మరికొన్ని బ్యాంకులకు భారీ జరిమానా విధించడం జరిగింది. కాగా ఇప్పుడు భారీ జరిమానా చెల్లించాల్సిన బ్యాంకుల జాబితాలో తాజాగా మరో ఐదు బ్యాంకులు చేరాయి.
Related News by category
Advertisement