భార్య సౌదీ వెళ్తానని అనడంతో... | man suicide attempt in ysr district | Sakshi
Sakshi News home page

భార్య సౌదీ వెళ్తానని అనడంతో...

Published Wed, Jul 13 2016 3:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో బాబాసాబ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

కడప : వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో బాబాసాబ్ అనే వ్యక్తి బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన మాట వినకుండా భార్య సౌదీకి వెళ్తానంటూ మొండిపట్టు పట్టడంతో బాబాసాబ్ తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. దీంతో బుధవారం ఉదయం ఆయన రైలు పట్టాలపై పొడుకున్నాడు.

స్థానికులు ఆ విషయాన్ని గమనించి... బాబాసాబ్ను రైలు పట్టాలపై నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన పట్టినపట్టు వీడలేదు. ఇంతలో అదే ట్రాక్పైకి వచ్చిన రైలును స్థానికులు ఆపివేశారు. దీంతో బాబాసాబ్కు తృటిలో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement