రేపల్లే: కాపులను బీసీల్లో చేర్చుతామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను నమ్మరాదని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కాపునాయకులకు సూచించారు. గురువారం గుంటూరు జిల్లా రేపల్లేలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి మాదిగలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అంటూ మరోసారి మోసం చేయడానికి తయారయ్యారన్నారు. అందుకే చంద్రబాబు మాటలను నమ్మొద్దని మందకృష్ణ తెలిపారు.
చంద్రబాబును నమ్మరాదు: మందకృష్ణ
Published Thu, Feb 4 2016 6:20 PM | Last Updated on Mon, Oct 8 2018 3:00 PM
Advertisement
Advertisement