ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు వినతి
Published Tue, Aug 30 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
అలంపూర్: కేజీ టు పీజీ గురుకుల పాఠశాలను నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అలంపూర్ నాయకులు సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. కేజీటూ పీజీ పాఠశాల ఏర్పాటుకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 5 ఎకరాల రెండు కుంటల స్థలం ఉందని తెలిపారు. అందుకు సంబంధించిన భూమి పత్రాలను అందజేశారు. అలంపూర్ విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలను అందించాలని కోరారు. అలంపూర్కు మంజూరైన పాఠశాలను ఇక్కడికే తీసుకొచ్చి ఏర్పాటు చేయాలని విన్నవించారు. స్పందించిన ఆయన సెప్టెంబర్ 5వ తేదిన కేజీటూ పీజీ గురుకుల పాఠశాలను అలంపూర్లో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రSమంలో సర్పంచ్ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్, సీపీఎం నాయకులు రేపల్లె దేవదాసు, టీఆర్ఎస్ నాయకులు జాన్, పోలీస్ చెన్నయ్య, గురుదేవ్ పాఠశాల ప్రిన్సిపాల్ నంద కుమార్, మైనార్టీ నాయకులు షేక్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement