ఎడ్లబండిపై నుంచి కిందపడ్డ మంత్రి
విశాఖపట్టణం: జిల్లాలోని అనకాపల్లి మండలం తుంపాల గ్రామం జనచైతన్య యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో భాగంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లు అకస్మాత్తుగా జారీ కిందపడిపోయారు. బండిని లాగుతున్న ఎడ్లు బెదిరిపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.
వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, కార్యకర్తలు మంత్రి అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే పీలా గోవింద్ లను లేపారు. ఈ ఘటనలో మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం.