స్వయం ఉపాధి కోర్సలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ | online regestration for selfemployement | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి కోర్సలకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

Sep 1 2016 12:19 AM | Updated on Sep 4 2017 11:44 AM

మండలంలోని జలాల్‌పురం గ్రామంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పలు ఉచిత స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల్లో చేరుటకు గురువారం అన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. కిషోర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

జలాల్‌పురం(భూదాన్‌పోచంపల్లి) :   మండలంలోని జలాల్‌పురం గ్రామంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో పలు ఉచిత స్వయం ఉపాధి శిక్షణా కోర్సుల్లో చేరుటకు గురువారం అన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. కిషోర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాల వ్యవధి గల ఆటోమోబైల్, ఎలక్ట్రానిక్‌ వస్తువుల రిపేర్‌ అండ్‌ మెయింటనెన్స్, ఎలక్ట్రిషియన్‌(డొమెస్టిక్‌), సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టలేషన్‌ అండ్‌ సర్వీస్, వెల్డర్, గార్మెంట్‌ మేకింగ్, జూకీ మెషిన్‌ కోర్సులకు ఎస్సెస్సీ విద్యార్హత ఉండాలన్నారు. అలాగే ఇంటర్‌ విద్యార్హత కలిగిన వారు డీటీపీ అండ్‌ ప్రింట్‌ పబ్లిషింగ్‌ అసిస్టెంట్, ట్యాలీ(కంప్యూటరైజ్డ్‌ అకౌంటింగ్‌) కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కాగా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి గ్రామీణ విద్యార్థులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పించబడుతుందన్నారు. శిక్షణ పూర్తయిన తరువాత హైద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికేట్స్, ఆధార్‌కార్డు, పాత రేషన్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌ ఫోటోలతో పాటు రూ.250ల రిఫండబుల్‌ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం నేడు పై సర్టిఫికేట్లతో సంస్థలో హాజరుకావలన్నారు. ఇతర వివరాలకు 9948466111, 9133908111, 9133908222, 08685–205013 సెల్‌ నంబర్లను సంప్రదించాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement