ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి | person died ina well | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి

Published Thu, Jan 12 2017 10:07 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

person died ina well

 
పిడుగురాళ్ళ/మాచవరం : ​‍​‍ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఆవుల సాయికుమార్‌ (21) ఇంజిన్‌ ఫుట్‌భాల్‌ పైకి తీసే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.సాయికుమార్‌తోపాటు వెళ్ళిన వ్యక్తి కేకలు వేసినప్పటికీ చుట్టుపక్కల పొలాల రైతులు సంఘటనా స్థలానికి వచ్చి బావిలో ఉన్న సాయికుమార్‌ను పైకి తీసి పిడుగురాళ్ళ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు పరీశీలించి సాయికుమార్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement