person
-
అమ్మాయే కదా అని వీడియో కాల్ లిఫ్ట్ చేస్తే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలో పలువురు హనీ ట్రాప్(వలపు వల)లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఏటా వందల మంది హనీ ట్రాప్ బారిన పడుతున్నారు. బ్లాక్మెయిలింగ్తో డబ్బుల వసూళ్లకు అలవాటుపడిన సైబర్ మోసగాళ్లు అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయిస్తూ బాధితులను బెదిరిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. వీడియో కాల్ రాగానే అనుకోకుండా లిఫ్ట్ చేస్తే, స్క్రీన్ షాట్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మంగళవారం రాత్రి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్గా ఉన్న అమ్మాయితో వీడియో కాల్ చేయించి నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. ఆయన వెంటనే ఆ వీడియో కాల్ కట్ చేయడంతో అప్పటికే నేరగాళ్లు తీసిన స్క్రీన్షాట్ను ఎమ్మెల్యేకే పంపించి బెదిరింపులకు దిగారు. డబ్బులు ఇవ్వకపోతే పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆ వీడియో పంపిస్తామని బెదిరించారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.పరువు పోతుందనే భయంతో..తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అనుకోకుండా లిఫ్ట్ చేసి అనేక మంది తంటాలు పడుతున్నారు. నేరగాళ్లు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, బంధువులు, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ఈ సంఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం లేదు. ఫిర్యాదు చేస్తే తమ పేరు బయటికి వస్తుందేమోనని, పరువుపోతుందని భయపడి ఫిర్యాదుకు వెనుకాడుతున్నారు. అడిగిన మేరకు డబ్బులు ఇచ్చి మోసపోతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఇలాంటి సంఘటనలు 100 వరకు తమ దృష్టికి వచ్చాయని, అయితే ఫిర్యాదు చేసేందుకు మాత్రం వెనుకాడుతున్నారని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. వీడియో ఫోన్ కాల్ రావడంతో అనుకోకుండా లిఫ్ట్ చేసి, అడిగినంత నేరగాళ్లకు ముట్టజెప్పి ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారని వెల్లడించారు.అనేక రకాలుగా దోపిడీ..తక్కువ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని ఓవైపు దోచుకుంటున్న సంఘటనలు అనేకం రిపోర్టు అవుతున్నాయి. వాటిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఏపీకే ఫైల్స్ పంపించి వాటిని క్లిక్ చేయగానే ఫోన్ను హ్యాక్ చేసి, ఖాతాల్లోని డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. వీటికి తోడుగా న్యూడ్గా ఉండి వీడియో కాల్స్ చేసి, స్క్రీన్ షాట్లు తీసి, వాటినే బాధితులకు పంపించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరిగిపోయాయి.ప్రజల్లో అవగాహన పెరగాలనే ఫిర్యాదు..సైబర్ నేరాలు, హనీ ట్రాప్, వీడియో కాల్స్ విషయంలో అమాయక ప్రజలు ఇబ్బందుల పాలు కావద్దనే తాను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నేరస్తుల బెదిరింపులకు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అప్పుడే ఇలాంటి సమస్యలు దూరమవుతాయి.– ఎమ్మెల్యే వీరేశం అప్రమత్తంగా ఉండాలివీడియో కాల్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ లిఫ్ట్ చేయవద్దు. సోషల్ మీడియా అకౌంట్లకు టూ స్టెప్ సెక్యూరిటీ, ప్రొపైల్, అకౌంట్ లాక్ వంటివి పెట్టుకోవాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ లిస్ట్ నేరగాళ్లకు వెళ్లకుండా అడ్డుకోవచ్చు.–సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ -
అప్పు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని...
తలమడుగు/తాంసి ఆదిలాబాద్ జిల్లా: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఆ డబ్బు ఇవ్వకపోవడం, తాను అప్పు తీసుకున్న వారికి సమాధానం చెప్పలేక ఓ వ్యక్తి మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించి . అందులో ఇద్దరు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యులు, డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, తలమడుగు ఎస్సై అంజమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం ఉండం గ్రామానికి చెందిన ఆకుల రాకేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో రాకేశ్ తాంసి మండలం కప్పర్ల గ్రామానికి చెందిన తన మేనమామ వద్ద పెరిగాడు. రాకేశ్కు ఆదిలాబాద్కు చెందిన లావణ్యతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల కూతురు ప్రశస్త్య ఉంది. మొదట్లో ఆటో నడిపేవాడు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏడాది క్రితం ఫర్టిలైజర్ దుకాణాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో మృతుడి మేనమామ–అత్త కొన్నేళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సాయి, స్పందన ఉన్నారు. వారు రాకేశ్ సంరక్షణలోనే ఉన్నారు. ఇద్దరూ ఉన్నతవిద్య అభ్యసించగా, సాయి బెంగ ళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. స్పందన ఇటీవల నర్సింగ్ కోర్సు పూర్తి చేసింది. రాకేందర్కు రూ.60 లక్షలు అప్పుగా..ఆదిలాబాద్లోని విద్యానగర్ కాలనీలో 21 మంది సభ్యులతో కలిసి రాకేందర్ ఆర్కే సొసైటీని ప్రారంభించాడు. లావణ్య సైతం ఆ సొసైటీలో సభ్యురాలిగా ఉంది. అందులో కొంత పెట్టుబడి కూడా పెట్టారు. అయితే ఆ సొసైటీ దివాలా తీసింది. అదే విధంగా రాకేందర్కు రూ.60లక్షలు అప్పుగా ఇచ్చినట్లు రాకేశ్–లావణ్య దంపతులు సూసైడ్ నోట్ రాశారు. బాకీ ఉన్న డబ్బుల వివరాలు కూడా అందులో పేర్కొన్నారు. రాకేందర్ తీసుకున్న ఆ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వివరించారు. దీంతో ఇచ్చిన అప్పు తిరిగి రాకపోవడం, బయట తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించకపోవడంతో కొద్ది రోజులుగా రాకేశ్ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.సొంత చేనుకు వచ్చిన... శనివారం ఉదయం తలమడుగు మండలం ఉండం శివారులో ఉన్న తన సొంత చేనులో రాకేశ్(35), ఆయన భార్య లావణ్య, మరదలు స్పందన(19) పురుగు మందు తాగారు. ఆ తర్వాత లావణ్య జిల్లా కేంద్రంలో ఉండే తన బాబాయికి ఫోన్ ద్వారా సమాచారం ఇచి్చంది. దీంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నాడు. అప్పటికే రాకేశ్, స్పందన చనిపోయారు. కొనఊపిరితో ఉన్న లావణ్యను చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉంది. కూతురుకు తాగించేందుకు మందు లేకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. -
‘సైఫ్’ కేసులో అరెస్టుతో జీవితం నాశనమైంది: ఆకాశ్
ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వేస్టేషన్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్ కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు. సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ పేర్కొన్నాడు. డ్రైవర్గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు. ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్కు గురైంది.నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్పూర్కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు. ఇటీవల సైఫ్అలీఖాన్పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్ను ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు. -
TG: మళ్లీ పులి దాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు
సాక్షి,కొమరంభీంజిల్లా: జిల్లాలో పులి మళ్లీ పంజా విసిరింది. తాజాగా మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ (టీ) మండలం దుబ్బగూడకు చెందిన రైతు సురేష్పై శనివారం(నవంబర్30) పులి దాడి చేసి గాయపరిచింది. సురేష్ పొలంలో పనిచేస్తుండగా పులి ఒక్కసారిగా దాడి చేసింది.పులి గాట్లతో సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. సురేష్ను చికిత్స కోసం సిర్పూర్(టీ) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో శుక్రవారమే ఒక మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. పులి కోసం కాగజ్నగర్ కారిడార్లో ఫారెస్ట్ అధికారులు ఆపరేషన్ మ్యాన్ఈటర్ నిర్వహస్తున్నారు.మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం వేట కొనసాగుతోంది.ఇదీ చదవండి: పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్నగర్లో హై అలర్ట్ -
Hyderabad: పోలీసులను ప్రశ్నించినందుకు చేయి విరగ్గొట్టారు!
ముషీరాబాద్: రోడ్డుపై నిలుచున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు అకారణంగా దాడి చేశారు. పోలీసుల దెబ్బలకు బాధితుని చేయి విరగడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆదివారం బాధితుడు ముషీరాబాద్ బీఆర్ఎస్ మీడియా సెల్ ఇన్చార్జి సత్యనారాయణబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... శనివారం రాత్రి తన ద్విచక్ర వాహనాన్ని స్నేహితుడు తీసుకెళ్లడంతో వాహనం కోసం వినోభానగర్లోని తన ఇంటి సమీపంలో రోడ్డుపై నిలుచోని ఉన్నానని తెలిపారు. స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే... పార్సిగుట్ట నుంచి వినోభానగర్ వైపు వెళ్తున్న పోలీసులు ఇక్కడ నిలబడొద్దని సూచించారు. తన స్నేహితుడి కోసం నిల్చున్నానని చెబితే అయినా వెళ్లిపోవాలని దురుసుగా మాట్లాడారని అన్నారు. పక్కనున్న బార్ను మూయించరు కానీ తనను దబాయిస్తారేందని ప్రశ్నించినందుకు తనపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టారన్నారు. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి వెళ్లానని తెలిపారు. వైద్యులు పరీక్షలు చేసి చేయి విరిగిందని చెప్పారన్నారు. ఏఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలి... ఆదివారం ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నవీన్రాజ్ బాధితుడు సత్యనారాయణ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాధితుడిని ముషీరాబాద్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ఇన్స్పెక్టర్ రాంబాబుకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణ బాబుపై దాడి చేసిన ఏఎస్ఐ మోహన్రావు, ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలన్నారు. వారిని సస్పెండ్ చేయని పక్షంలో స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు. -
ఆశలు సమాధి చేసి..
అజిత్సింగ్నగర్(విజయవాడసెంట్రల్): ఎక్కడో ఒకచోట బతికే ఉంటాడు.. క్షేమంగా తిరిగొస్తాడు.. అని ఎదురు చూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. 15 రోజుల కిందట వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి విగత జీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్ఆర్పేటకు చెందిన పోలినాయుడు ముఠా కూలీ. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం పది గంటల సమయంలో తన పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా సింగ్నగర్, న్యూఆర్ఆర్పేట పరిసర ప్రాంతాలన్నీ బుడమేరు వరద ముంపునకు గురవుతున్నాయని తెలుసుకున్నాడు.ఇంట్లో వారికి ఫోను చేసి మరో పది నిమిషాల్లో సింగ్నగర్ దాటి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పాడు. ఈ క్రమంలో తన స్నేహితుడితో కలిసి న్యూ ఆర్ఆర్పేటలోని బుడమేరుపై ఉన్న వంతెన దాటుతుండగా ఒక్కసారిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతని స్నేహితుడు అతి కష్టం మీద బయటపడి విషయాన్ని పోలినాయుడు కుటుంబ సభ్యులకు, పోలీసులకు, అధికారులకు తెలియజేశాడు. అధికారులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. వరద ప్రవాహానికి ఎక్కడైనా వెళ్లి బయటపడి ఉంటాడని, క్షేమంగా తిరిగొస్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు.అయితే ఆదివారం ఉదయం పోలినాయుడు గల్లంతైన ప్రదేశంలోని దేవినేని వెంకటరమణ మున్సిపల్ హైస్కూల్ వద్ద ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలినాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా ముళ్ల చెట్ల మధ్యలో ఆయన ఒక చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకుని నీటిలో పడి ఉన్నాడు. చేతికి ఉన్న ఉంగరం, దుస్తులను బట్టి కుటుంబ సభ్యులు పోలినాయుడేనని నిర్ధారించుకున్నారు. విషయాన్ని సింగ్నగర్ పోలీసులకు తెలియజేయగా వారు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ నేత కాళ్ల ఆదినారాయణ వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి అంత్యక్రియలు జరిపించారు. వరద వదిలినా.. ఆ తల్లీ కొడుకుల్ని మృత్యువు వదల్లేదురామవరప్పాడు (విజయవాడ రూరల్): విజయవాడ పాత రాజీవ్నగర్కు చెందిన ఓ కుటుంబాన్ని బుడమేరు వరద ముంచేసింది. ఆ ముంపునుంచి తప్పించుకున్నా.. చివరకు లారీ రూపంలో దూసుకొచి్చన మృత్యువు తల్లీ కొడుకుల్ని మింగేసింది. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో ఆదివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో స్కూటర్పై వెళ్తున్న పాతరాజీవ్నగర్ వాసులు లింగమనేని కృష్ణకుమారి (63), ఆమె కుమారుడు ప్రభుకుమార్ మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బుడమేరు వరద కారణంగా పాత రాజీవ్నగర్లోని కృష్ణకుమారి ఇల్లు నీట మునిగింది.దీంతో ఆ కుటుంబం గుణదలలో ఉంటున్న కృష్ణకుమారి సోదరుడి ఇంటి వద్ద ఆశ్రయం పొందుతోంది. ప్రభుకుమార్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వరద ముంపు తగ్గడంతో తమ ఇంటిని రెండు రోజుల నుంచి శుభ్రం చేసుకుంటున్నారు. ఆదివారం కూడా ఇంటిని శుభ్రం చేసుకున్న అనంతరం తల్లీకుమారులు స్కూటర్పై గుణదల బయలుదేరారు. రామవరప్పాడు రింగ్ సమీపంలో లారీని గమనించక వారు కుడి వైపునకు మళ్లారు. లారీ ఆ స్కూటర్ను ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన తల్లీకుమారులు ఘటనాస్థలంలోనే మృతిచెందారు. -
నామినేషన్కు ‘మృతుడు’.. కలెక్టరేట్లో కలకలం!
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో యూపీలోని వీవీఐపీ సీటు అయిన వారణాసిలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఇది హాట్ సీటుగా మారింది. తాజాగా వారణాసిలో ‘నేను బతికే ఉన్నాను’ అనే ప్లకార్డు పట్టుకుని ఓ వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు కలెక్టరేట్కు చేరుకున్నాడు. అతనిని చూసిన అక్కడున్నవారంతా ఆశ్యర్యపోయారు.సంతోష్ మురత్ సింగ్ అనే వ్యక్తి రూ. 25 వేల రూపాయలతోపాటు నామినేషన్ ఫారం పట్టుకుని కలెక్టరేట్కు వచ్చాడు. అయితే కలెక్టరేట్ గేటు వద్దనే అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన సంతోష్ మురత్ సింగ్ గేటు బయట ఆందోళనకు దిగాడు.సంతోష్ మురత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాను చనిపోయినట్లు రెవెన్యూ రికార్డుల్లో అబద్దపు రాతలు రాయించి, కొందరు మోసపూరితంగా తన భూమిని స్వాధీనం చేసుకున్నారని వాపోయాడు. ఇప్పుడు తాను జీవించే ఉన్నానని నిరూపించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు.ఇలా ఎన్నికల్లో పోటీకి దిగడం సంతోష్కి కొత్తేమీ కాదు. 20 ఏళ్లుగా పలు ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నాడు. 2012లో రాష్ట్రపతి పదవికి జరిగిన ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. 2014, 2019లలో వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేసేందుకు సంతోష్ నామినేషన్ దాఖలు చేశాడు. అయితే అతని దరఖాస్తు తిరస్కరణకు గురైంది.రెవెన్యూ రికార్డుల ప్రకారం వారణాసిలోని చితౌని నివాసి సంతోష్ మురత్ సింగ్ 2003లో ముంబైలో రైలులో బాంబు పేలుళ్లు సంభవించినప్పుడు మృతి చెందాడు. నకిలీ మరణ ధృవీకరణ పత్రం ఆధారంగా, అతని 1.5 ఎకరాల భూమిని అతని బంధువులు స్వాధీనం చేసుకుని, దానిని విక్రయించారు. సంతోష్ తాను సజీవంగానే ఉన్నానని, తన భూమిని దక్కించుకునేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అందరితో చెబుతుంటాడు. -
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు! ఆమె ఆరోగ్య రహస్యం ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా అమెరికాలో జన్మించిన స్పానిష్ మహిళ బ్రన్యాస్ మోరారే నిలిచింది. ఆమె ఇటీవలే తన 117వ పుట్టిన రోజుని జరుపుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ప్రకారం..ఫ్రాన్స్కు చెందిన 118 ఏళ్ల లూసిల్ రాండన్ మరణం తర్వాత మోరారేనే 117 ఏళ్లు సుదీర్థకాలం జీవించిన మహిళగా రికార్డు సృష్టించింది. ఇక మోరారే తల్లిదండ్రులు యూఎస్కు వలస వచ్చిన ఒక ఏడాది తర్వాత మార్చి 04, 1907న కాలిఫోర్నియాలో శాన్ఫ్రాన్సిస్కోలో జన్మించారు. మళ్లీ ఎనిమిదేళ్లకు స్పెయిన్ తిరిగి వచ్చి అక్కడ కాటలోనియాలో స్థిరపడింది. గత 22 ఏళ్లుగా మోరారే ఆ ప్రాంతంలోనే ఒక నర్సింగ్ హోమ్ రెసిడ్ఎన్సియా శాంటా మారియా డెల్ తురాలో కాలం వెళ్లదీస్తోంది. ఈ వృద్ధురాలు ప్రపంచ యుద్ధాలు, స్పానిస్ అంతర్యుద్ధం, స్పానిష్ ఫ్లూ వంటి మహమ్మారీలన్నింటిని తట్టుకుంది. చివరిగా 2020లో కోవిడ్ -19తో పోరాడారు. ఆమె ఈ వైరస్ బారిన తన 113వ పుట్టిన రోజు జరుపుకున్న కొద్ది వారాలకే పడింది. అయినప్పటికి త్వరగా కోలుకోవడం విశేషం. ఇన్స్టాగ్రామ వేదికగా గిన్నస్ వరల్డ్ రికార్డ్స్ ఆ వృద్ధరాలికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడమే గాక గత ఏడాది జనవరి 2023న ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ధృవీకరించిన విషయాన్ని పేర్కొంది. చింతించొద్దు, విచారించొద్దు.. మోరేరా తన ఆరోగ్య రహస్యంగా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రశాంతంగా ఉండటం, కుటుంబం, స్నేహితులతో మంచి అనుబంధం, భావోద్వేగ స్థిరత్వం తదితర వాటివల్లే ఇంతలా ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించగలిగానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఎక్కువగా చింతించడం, విచారించడం మానేయాలని, విషపూరితమైన వ్యక్తులకు దూరంగా ఉండటం వంటివి చేస్తే ఆయురారోగ్యాలతో ఉండగలరని చెప్పుకొచ్చింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితం దగ్గరకు వచ్చేసరికి మోరారే 1931లో కాటలాన్ వైద్యుడు జోన్ మోరెట్ను వివాహం చేసుకుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమె తన పెళ్లి రోజు చాలా సంఘటనలతో ముడిపడి ఉందని చెప్పింది. ఇక ఆమె భర్త 72 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు, 11 మంది మనవళ్లు, 13 మంది మనవరాళ్లు ఉన్నారు. సైంటిస్టులు ఏం అన్నారంటే.. మోరారేతో మాట్లాడిన సైంటిస్ట్ మానెల్ ఎస్టేల్లర్ మాట్లాడుతూ.."ఆమెను పరీక్షించగా పూర్తిగా స్పష్టమైన తల ఉంది. కేవలం నాలుగేళ్ల వయసులో జరిగిన సంఘటనలను సైతం గుర్తించుకుంటుంది. అలాగే వృద్ధులకు ఉండే సాధారణ హృదయ సంబంధ వ్యాధులు ఏమీ లేవు. ఆమె కుటుంబంలో 90 ఏళ్లు పైబడిన వాళ్లు చాలామంది ఉండటం విశేషం. ఇక్కడ జన్యుసంబంధ కారణమే అయ్యి ఉండొచ్చు. ఇక మోరారే మూత్రం, లాలాజలం, రక్తనమునాలు ఆమె 80 ఏళ్ల కుమార్తెతో సరిపోలుతాయి. ఆమె డీఎన్ఏ వయసు సంబంధిత వ్యాధులతో పోరాడగల ఔషధ సృష్టికి దోహదపడొచ్చు" అని ఎస్టేల్లర్ అన్నారు. (చదవండి: ప్రాణాంతక కేన్సర్తో పోరాడుతూ భావోద్వేగ పోస్ట్..'భర్తకు ప్రేమతో'..) -
ఎవరెస్టు ఎక్కిన రెండేళ్ల బుడ్డోడు
మాటలు నేర్చుకునే వయసులో బ్రిటీష్కు చెందిన రెండేళ్ల బుడ్డోడు టాట్ కార్టర్ అందరినీ ఆశ్చర్యపరిచే పనిచేశాడు. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పర్వతారోహకునిగా టైటిల్ను దక్కించుకుని అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కునిగా టాట్ కార్టర్ నిలిచాడు. గతంలో చెక్ రిపబ్లిక్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా టాట్ కార్టర్ సాధించిన విజయంపై అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఈ ఘనత సాధించేందుకు టాట్ కార్టర్కు శ్వాస సంబంధిత శిక్షణ అందించామన్నారు. దీనికితోడు టాట్ కార్టర్కు ఎవరెస్టు అధిరోహణ సమయంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు అందించామన్నారు. టాట్ కార్టర్ తన తల్లిదండ్రులతో పాటు ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా టాట్ కార్టర్ తండ్రి ఒక ప్రకటనలో తమ కుటుంబం ఏడాదిగా ఆసియా పర్యటనలో ఉన్నదని, తన కుమారుడు టాట్ కార్టర్ 2023, అక్టోబర్ 25న తమతోపాటు ఎవరెస్టును అధిరోహించాడని తెలిపారు. తాను స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో నివాసముంటున్నానని, ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నానని ఆయన తెలిపాడు. తాము శ్రీలంక, నేపాల్, మాల్దీవులతో సహా అనేక దేశాలను సందర్శించామని, ఎప్పటికప్పుడు వైద్య నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. -
అమెరికాలో హైదరాబాదీ అనుమానాస్పద మృతి
హైదరాబాద్, సాక్షి: అమెరికాలో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడ్ని వనస్థలిపురానికి చెందిన కరుణాకర్రెడ్డిగా గుర్తించారు. స్విమ్మింగ్ పూల్లో మృతదేహంగా కనిపించాడాయన. కరుణాకర్ స్థానికంగా ఓ ఆయిల్ ఫిల్లింగ్ స్టేషన్లో పని చేస్తున్నట్లు సమాచారం. కరుణాకర్ మృతిపై ఆస్టిన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
అణకువ
‘‘ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలుకవలెనోయ్’’ అంటారు గురజాడ. తన ఘనతని తాను ప్రకటించుకోవటం కాక, ప్రతిభని అవతలి వారు గుర్తించాలి. కోకిల కనపడ నవసరం లేదు. దాని గుర్తింపు మధురమైన కంఠస్వరం మాత్రమే. కావాల్సిన వారు దానిని వెతుక్కోవాలి. ఎందుకంటే – రత్నాన్ని అన్వేషించాలే కాని, అది తనని తాను ప్రకటించుకోదు. ‘‘అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది.’’ అనే సామెత తెలుసు కదా! నిండు కుండ లాగా తొణకకుండా బెణకకుండా ఉండటం సమృద్ధికి, సంపదకి సంకేతం. అది ఉత్తమ వ్యక్తిత్వ లక్షణం. ఎగిరెగిరి పడకుండా, తన గొప్పని, లేదా తానే గొప్ప అని ప్రకటించుకుంటూ, ప్రదర్శించుకుంటూ ఉండక పోవటమే అణకువ. ఎందుకంటే ఎవరైనా ఒక రంగంలో గొప్ప అనుకుంటే, అదే రంగంలో అంతకన్న ఘనులు అప్పుడే కాని, తరువాత కాని ఉండచ్చు. కనక అహంకరించకూడదు. తన స్థాయి ఏమిటో తెలుసుకుని ఉండాలి. నీలో గొప్పతనం ఉంటే అది నువ్వు ప్రకటించుకోకూడదు. ఇతరులు గుర్తించాలి. ఎట్లా? ప్రవర్తన ద్వారా, మాట ద్వారా. తన గొప్పతనం తానే చెప్పుకున్న వాడు హాస్యాస్పదుడు అవుతాడు. అంతకన్న ముందు ఆయుః క్షీణం అని పెద్దలు చెప్పిన మాట. పైగా తనని తాను పొగడుకోవటం ఆత్మహత్యా సదృశం. మహాపాతకం. అంటే నివృత్తి లేని పరిహారం, ప్రాయశ్చిత్తం లేని పెద్ద పాపం. నోటితో చెప్పక పోయినా తమ ప్రవర్తన ద్వారా తామే చాలా ఘనులు, ఇతరులు పనికిరానివారు అనే అభిప్రాయం కలిగేట్టు ప్రవర్తిస్తారు కొందరు. అది వారి విద్యావిహీనత ను సూచిస్తుంది. విద్య వల్ల మొదట వచ్చేది వినయం. (విద్య యొసగును వినయంబు, వినయంబు వలన పాత్రత, పాత్రత వలన ధనం, ధనం వల్ల ఐహికాముష్మిక సంపదలు బడయు నరుడు) అంటే వినయం అన్నది విద్యావంతుల లక్షణం. వినయ విధేయతలు లేని వారు డిగ్రీలు ఉన్నా విద్యావంతులుగా పరిగణింపబడరు. చదువు ‘‘కొన్నవారు’’ మాత్రమే అవుతారు. ‘‘వస్త్రేణ, వపుషా, వాచా, విద్యయా, వినయేన చ నరో యాతి గౌరవం’’ గౌరవార్హతలలో ప్రధానమైన ఐదింటిలో వినయం కూడా ఒకటి. అలా ఒదిగి ఉండటం మనిషి గొప్పతనాన్ని ఏ మాత్రం తగ్గించదు. ‘‘అనువు గాని చోట అధికుల మనరాదు/ కొంచెముండు / టన్న కొదువ గాదు / కొండ అద్దమందు కొంచెమై ఉండదా? విశ్వదాభిరామ వినుర వేమ.’’ పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడు కొంచెం తగ్గి ఉండటం శ్రేయస్కరం. ఎవరో నన్ను గుర్తించి గౌరవించలేదు అనుకుని కుంగిపోవటం, గుర్తింపు కోసం పాకులాడటం దుఃఖానికి అవమానాలకి హేతువు లవుతాయి. కాస్త తల ఒగ్గి అనుకూల పరిస్థితులు వచ్చాక మళ్ళీ తల ఎత్తవచ్చు. సముద్రంలో అలలు ఎగసి ‘పడుతూ’ ఉంటాయి. ఎగిరితే ఆకాశంలో ఉండలేము కదా! కింద పడక తప్పదు. పడకుండా ఉండాలంటే ఎగరకూడదు. ఎదగాలి. ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే పైకి క్రమం గా ఎక్కాలి. పైగా ఎత్తుకి వెళ్ళిన కొద్ది మరింత జాగ్రత్తగా ఉండాలి. నేల మీద ఉన్నప్పుడు పడితే చిన్న దెబ్బ. ఎంత ఎత్తునుండి పడితే అంత పెద్ద దెబ్బ. అణకువ తో ఉన్న వారి మీద పెద్దలకి వాత్సల్యం ఉంటుంది. వారి ఆశీస్సులు, సహాయ సహకారాలు ఉంటాయి. ఎంత ఒదిగితే అంత ఎదుగుతారు. – డా‘‘ ఎన్.అనంతలక్ష్మి -
ప్రేమ పెళ్లిళ్లను పెద్దలు కాదనలేరు: ఢిల్లీ హైకోర్టు
ఇకపై మేజర్లయిన పిల్లల పెళ్లిళ్లను పెద్దలు అడ్డుకోలేరు. వివాహానికి తగిన వయసు కలిగిన యువతీయువకులు తమకు ఇష్టమైన భాగస్వామిని వివాహం చేసుకోవచ్చని, ఇటువంటి సందర్భంలో ఆ జంటల వివాహానికి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పలేరని, రాజ్యాంగం ఆ జంటకు రక్షణ కల్పిస్తుందని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పిస్తారని, అవసరమైన పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు రక్షణ అందిస్తారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్యాభర్తల వివాహ హక్కును ఏ విధంగానూ తక్కువ చేయకూడదని, ఇలాంటి జంటలకు రక్షణ కల్పించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత ఆ రాష్ట్రంపై ఉందని జస్టిస్ తుషార్ రావు గేదెల అభిప్రాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో.. తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న ఒక జంటకు పోలీసు రక్షణ కల్పిస్తూ, మేజర్లయిన యువతీయువకులు తమకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించిందని కోర్టు పేర్కొంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఒక జంట న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వీరిలో భర్తపై నమోదైన తప్పుడు ఎఫ్ఐఆర్ను గత ఆగస్టులో కోఆర్డినేట్ బెంచ్ రద్దు చేసిందని జస్టిస్ గేదెలకు చెప్పారు. కాగా ఎఫ్ఐఆర్ పెండింగ్లో ఉన్న సమయంలోనే వారు వివాహం చేసుకుని, ఆనందంగా జీవిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ దంపతులకు హాని జరగకుండా చూసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇది కూడా చదవండి: ‘రెడ్ లైట్ ఆన్- వెహికిల్ ఆఫ్’ అంటే ఏమిటి? ఢిల్లీలో ఎందుకు అమలు చేస్తున్నారు? Right To Marry Person Of Choice Protected Under Constitution, Not Even Family Members Can Object: Delhi High Court @nupur_0111 https://t.co/JEDBQuyQI8 — Live Law (@LiveLawIndia) October 26, 2023 -
యూదుల పవిత్ర గ్రంథం ‘తొరా’లో ఏముంది? బైబిల్తో సంబంధం ఏమిటి?
ఏ మతంలోనైనా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. జుడాయిజంలో కూడా అదే ఉంది. ఆధునిక విద్యతో పాటు యూదులు తమ పిల్లలకు తమ మత విలువలను కూడా బోధిస్తారు. ప్రతి యూదు కుటుంబంలో ఇది కనిపిస్తుంది. పిల్లలకు చదువుకునే వయసు రాగానే ఇంటి పెద్దలు జుడాయిజానికి సంబంధించిన విషయాల గురించి చెబుతారు. తమ పవిత్ర గ్రంథమైన ‘తోరా’ను వారిచేత చదివిస్తారు. ప్రతి యూదు ‘తోరా’ను తప్పక చదివి అర్థం చేసుకుంటారు. ఇది చదివిన వారే నిజమైన యూదునిగా ఆ మత పెద్దలు గుర్తిస్తారు. ‘తోరా’ యూదుల ఆరాధనా గ్రంథం. తోరా అనే పదం తోహ్-రా అంటే నేర్చుకోవడం అనే పదం నుండి రూపొందింది. మనం ఉపయోగిస్తున్న తోహ్-రా అనే పదం బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలను సూచిస్తుంది. వీటిని పంచగ్రంథం అంటారు. ఇవి జెనెసిస్, ఎక్సోడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరోనమీ. ‘తోరా’ను మోషే రాశాడని చెబుతారు. అందుకే దీనిని మోషే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూదులు ఈ పుస్తకం ద్వారానే తమ దేవుణ్ణి స్మరించుకుంటారు. భారతదేశంలోని యూదులు కూడా ఈ గ్రంథాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. వారు నిర్వహించే పవిత్రమైన కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ గ్రంథాన్ని ఉంచుతారు. సృష్టి ప్రారంభం నుంచి మోషే మరణం వరకు దేవుడు ప్రజలతో ఎలా వ్యవహరించాడో ఈ పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారని చెబుతారు. దీనితో పాటు ప్రతి యూదు విశ్వసించాల్సిన మోషే చట్టాలు, నియమాలు దీనిలో ఉన్నాయని చెబుతారు. యూదుల ప్రత్యేక ప్రార్థన ఈ గ్రంథంలో కనిపిస్తుంది. యూదుల దేవుడైన యెహోవా పేరు ఈ పుస్తకంలో 1800 సార్లు కనిపిస్తుంది. ఇది కూడా చదవండి: యూదులు ఇతరుల రక్తాన్ని ఎందుకు ఎక్కించుకోరు? వారు చెప్పే కారణం ఏమిటి? -
చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్
సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు. No more StayBN ….#SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterChandrababu pic.twitter.com/1maEQJi1ho — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 9, 2023 'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు. బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది: 'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: '2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు. 'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
అలిపిరిలో బాంబు బ్లాస్ట్ బెదిరింపు ఫోన్ కాల్స్.. వ్యక్తి అరెస్టు..
తిరుమల: అలిపిరి వద్ద బాంబు బ్లాస్ట్ చేస్తానంటూ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. నిందితున్ని తమిళనాడు రాష్ట్రం, సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. అతన్ని ఈ రోజు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 15వ తారీఖున అలిపిరి చెక్ పాయింట్ ల్యాండ్ ఫోన్ కి కాల్ చేసాడో వ్యక్తి. మధ్యాహ్నం 3గంటలకు 100 మందిని బాంబ్ బ్లాస్ట్ తో చంపేస్తానని చెప్పడంతో వెంటనే అప్రమత్తం అయ్యారు పోలీసులు. టీటీడీ పోలీసు, విజిలెన్స్ అధికారుల సమన్వయంతో అలిపిరి చెక్ పాయింట్ తనిఖీ చేసారు. అయినప్పటికీ ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. బాంబు పేలుడుకు సంబంధించి ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఆకతాయి, దుష్ట చేష్టలకి పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల డీఎస్పీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా -
పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
భారత్తో విడిపోయాక పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. అయితే నాటి నుంచి పాక్ ఆర్థిక పరిస్థితి ఏనాడూ సుస్థిరంగా ఉన్న దాఖలాలు లేవు. కరోనా కాలం అనంతరం పాక్ పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. అనంతరం వచ్చిన వరదలు పాకిస్తాన్ను అతలాకుతలం చేశాయి. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో పాక్ అధిక ధరలతో అట్టుడికిపోతోంది. నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం పాకిస్తాన్ను కబ్జా చేశాయి. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య ‘పాకిస్తాన్ రిచెస్ట్ మ్యాన్’ కథ అందరికీ స్ఫూర్తినిస్తుంది. ఇంజినీరుగా కెరియర్ ప్రారంభం పాకిస్తాన్కు చెందిన షాహిద్ ఖాన్ 1950, జూలై 18న లాహోర్లో జన్మించారు. కొంతకాలం పాక్లోనే ఉండిన ఆయన అనంతదం అమెరికాకు వెళ్లారు. తిరిగి ఇప్పుడు పాకిస్తాన్కు వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఇంజినీరుగా ఆయన తన కెరియర్ ప్రారంభించారు. షాహిద్ ఖాన్ 1980లో తన మాజీ యజమాని నుండి ఆటో విడిభాగాల సరఫరా సంస్థ ‘ఫ్లెక్స్ ఎన్ గేట్’ను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి నిరంతర ప్రగతి బాటలో ముందుకు సాగుతున్నారు. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో స్థానం మీడియా దగ్గరున్న సమాచారం ప్రకారం షాహిద్ ఖాన్ విజయంలో వన్ పీస్ ట్రక్ బంపర్కు సంబంధించిన డిజైన్ కీలకంగా మారింది. ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో చేరిన షాహిద్ ఖాన్కు చెందిన కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 69 ప్లాంట్స్ ఉన్నాయి. వీటిలో 26 వేలకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. షాహిద్ ఖాన్ ఎన్ఎఫ్ఎల్కు చెందిన జాక్సన్విల్లే జాగ్వార్కు కూడా యజమాని. 2012లో ఆయన దీనిని కొనుగోలు చేశారు. దీనితో పాటు అతనికి యూకేలో ఒక ఫుట్బాల్ కంపెనీ కూడా ఉంది. ఆటోపార్ట్స్ తయారీ కంపెనీతో.. షాహిద్ ఖాన్కు చెందిన కంపెనీ ఆటోపార్ట్స్ను తయారు చేసి, విక్రయిస్తుంటుంది. ఇదే అతనికి వచ్చే ఆదాయంలో అత్యంత కీలకమైనది. ఫోర్బ్స్ అందించిన రియల్ టైమ్ బిలియనీర్స్ రిపోర్టును అనుసరించి షాహిద్ ఖాన్ మొత్తం ఆస్తి 12.1 బిలియన్ డాలర్లు. షాహిద్ ఖాన్ పాకిస్తాన్లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తన 16 ఏళ్ల వయసులో కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకున్నారు. అక్కడ తన వ్యాపార విజయంతో వేల కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. చదువుకునే సమయంలో కష్టాలు షాహిద్ఖాన్ అమెరికాలోని ఇలినాయిస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. గతంలో షాహిద్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అమెరికాలో చదువుకునే సమయంలో డిష్వాషర్ పని కూడా చేశానని తెలిపారు. 1971లో షాహిద్ ఖాన్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 1999లో మెకానికల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం షాహిద్ ఖాన్ను విశిష్ట పూర్వ విద్యార్థిగా గుర్తించి, ఘనంగా సన్మానించింది. ఇది కూడా చదవండి: భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. ఘోరానికి పరాకాష్ట! -
విద్యుత్ స్తంభం ఎక్కి యువకుడి హల్చల్!
ఆదిలాబాద్: మావల పోలీసుస్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో ఓ యువకుడు మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ప్రవీణ్ ఇంటి గొడవల కారణంగా సోమవారం స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. విద్యుత్ తీగలను పట్టుకుంటానని అనడంతో స్థానికులు సరఫరా నిలిపివేయించారు. ఎంత నచ్చజెప్పినా దిగిరాక తీగలు పట్టుకుని వేలాడారు. ఆ తర్వాత స్తంభం నుంచి జారి కిందపడగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు సదరు యువకుడిని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
చిక్కడపల్లి టు చైనా!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి రూ.28 లక్షలు మోసపోయిన ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ కేసు తీగలాగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దుబాయ్ మీదుగా చైనాలో ఉన్న డొంక కదిపారు. ఈ కేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నలుగురు హైదరాబాదీయులు సైబర్ నేరాల్లో కొత్త కోణాన్ని బయటపెట్టారు. ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం మాట్లాడిన కొత్వాల్ సీవీ ఆనంద్ ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన అధికారులకు రివార్డులు అందించారు. చిక్కడపల్లి వాసి శివకుమార్ ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్లో రూ.28 లక్షలు కోల్పోయి మార్చిలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ గంగాధర్ బాధితుడి నగదు ఆరు బ్యాంకు ఖాతాల్లోకి, వాటి నుంచి మరో 48 అకౌంట్లలోకి వెళ్లినట్లు గుర్తించారు. వీటి విషయం జాతీయ స్థాయిలోని సైబర్ కో–ఆర్డినేషన్ సెంటర్కు అందించగా...వాటిలో దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ.584 కోట్ల లావాదేవీలు జరిగినట్లు సమాధానం వచ్చింది. ఆ బ్యాంకు ఖాతాల్లో రాధిక మర్చంట్స్ పేరుతో ఉన్న షెల్ కంపెనీది కూడా ఉంది. ఈ అకౌంట్తో లింకై ఉన్న సెల్ నెంబర్ నగరానికి చెందిన మునావర్ వాడుతున్నట్లు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనతో పాటు నగర వాసులైన ఆరుల్ దాస్, సమీర్ ఖాన్, ఎస్.సుమేర్లను వికాస్, మనీష్, రాజేష్లు లక్నో పిలింపించారని బయటపెట్టాడు. వీరి ముంబై హవాలా నెట్వర్క్లో భాగమైన నయీమ్... సమీర్కు బంధువు కావడంతో పరిచయాలు ఏర్పడ్డాయి. మూడు నెలలు లక్నోలో ఉన్న నలుగురు నగర వాసులూ నకిలీ గుర్తింపు కార్డులతో 33 షెల్ కంపెనీలు, 65 బ్యాంకు ఖాతాలు తెరిచి వారికి అప్పగించి వచ్చారని తేలింది. వీళ్ళకు ఒక్కో ఖాతాకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ముట్టిందని బయటపెట్టారు. వీరందించిన ఖాతాల్లో మరో రూ.128 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తం రూ.713 కోట్లు ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్లో దేశం దాటేశాయని అధికారులు తేల్చారు. నగరం, ముంబైల్లో ఉన్న వారిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులకు అహ్మదాబాద్కు చెందిన ప్రకాష్, కుమార్ వ్యవహారాలు తెలిశాయి. కీలకమైన ప్రకాష్ అనునిత్యం దుబాయ్, చైనాలకు వెళ్లి వస్తున్నాడని గుర్తించారు. జూన్ 30న చైనా నుంచి వచ్చిన ఇతగాడు తన నెట్వర్క్లోని ఓ వ్యక్తితో వాట్సాప్ ద్వారా మాట్లాడుతున్నాడు. ఇతడి నెంబర్ తెలుసుకున్న అధికారులు వాట్సాప్ యాక్టివేట్ అయిన నెట్వర్క్ గుర్తించారు. దీనికి లింకైన నెంబర్ లోకేషన్ ఆధారంగా ప్రకాష్ ముంబైలో ఉన్నట్లు పసిగట్టారు. హాలిడే కోసం అక్కడకు వెళ్ళిన ఇతడితో పాటు కుమార్ను పట్టుకుని సిటీకి తీసుకువచ్చారు. వీరి నుంచి భారీగా ల్యాప్టాప్స్, ఫోన్లు, షెల్ కంపెనీల లెటర్ హెడ్స్ కూడా స్వాదీనం చేసుకున్నారు. కాగా ఇలాంటి నేరగాళ్లు, నేరాలపై రిజర్వుబ్యాంకు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం ఇస్తామని సీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మెట్రోలో మద్యం అనుమతి.. ఎన్ని బాటిళ్ల వరకు తెలుసా..?
ఢిల్లీ: మెట్రో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భద్రతపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులకు మెట్రో నగరాల్లో సేవలు అందిస్తున్నాయి. అయితే.. మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఓ వ్యక్తి ట్విట్టర్ వేదికగా అడిగిన ఈ ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(డీఎమ్ఆర్సీ ) సమాధానం తెలిపింది. రెండు మద్యం బాటిళ్ల వరకు తీసుకురావడానికి మెట్రోలో అవకాశం ఉంటుందని డీఎమ్ఆర్సీ స్పష్టం చేసింది. మెట్రోలో మద్యం సేవించడం మాత్రం నిషేధించింది. అయితే.. ఢిల్లీలో ఎయిర్పోర్టు లైన్లో తప్పా మిగిలిన రూట్లలో మద్యం తీసుకురావడానికి ఇప్పటివరకు అనుమతి ఉండేది కాదు. కానీ ఇటీవల ఢిల్లీ మెట్రో నిబంధనలను సడలించింది. Hi. Yes 2 sealed bottles of alcohol is allowed in Delhi Metro. — Delhi Metro Rail Corporation I कृपया मास्क पहनें😷 (@OfficialDMRC) June 30, 2023 ఈ అంశంలో యాజమాన్యం సీఐఎస్ఎఫ్, డీఎమ్ఆర్సీ సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ నివేదిక ప్రకారం మెట్రో ఏ రూట్లోనైనా ఒక వ్యక్తి రెండు బాటిళ్ల మద్యం వరకు తీసుకురావచ్చని తెలిపింది. ఇదీ చదవండి: దేన్నీ వదలకుండా మాట్లాడారు.. మెట్రో రైలులో అనుభవంపై ప్రధాని మోదీ -
వివాహేతర సంబంధం.. నిర్జన ప్రదేశానికి పిలిచి.. కత్తితో..
కర్ణాటకాలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. వివాహేతర సంబంధంపై వచ్చిన కలహాలతో ఓ వ్యక్తి మరో వ్యక్తి గొంతును కోసేశాడు. అనంతరం బాధితుని గొంతు నుంచి రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితున్ని విజయ్గా గుర్తించారు. నిందితుడు మరేశ్ అనే వ్యక్తి భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య పలుమార్లు తగాదా కూడా జరిగింది. ఆ అంశంపై చర్చించడానికి బాధితున్ని విజయ్ నిర్జన ప్రదేశానికి పిలిచాడు. వాగ్వాదంలో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. మరేశ్ గొంతును కత్తిరించాడు. అనంతరం పక్కనే కూర్చుని రక్తాన్ని తాగే ప్రయత్నం చేశాడు. ఓ బాటసారి వీడియో తీసి పోస్టు చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: కారు పార్క్ చేసిన మహిళ.. ఒక్కసారిగా వరద రావడంతో.. -
ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా?
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్ కలర్(ఊదారంగు) టాప్ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్, లైక్లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్గా కనిపించే ఇమేజ్లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది. (చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..) -
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్ఫామ్పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్ఫామ్పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
ఇక్కడ ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి: ఇమ్రాన్ ఖాన్
పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ చీఫే అత్యంత శక్తిమంతమైన వ్యక్తి అని, అతని నిర్ణయాలే అందరూ అనుసరిస్తారని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను మళ్లీ అధికారంలోకి రాకుండా బహిష్కరించేందుకు అవినీతి మాఫియాకు మద్దతిస్తోందంటూ సైనిక వ్యవస్థపై మండిపడ్డారు. ఈ మేరకు ఖాన్ జమాన్ పార్క్ వద్ద ఉన్న తన నివాసం నుంచి తన మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని దించడం కోసం ప్రజలు సుప్రీం కోర్టుకి అండగా నిలబడాలని కోరారు. తాను అధికారంలోకి రాకూడదనే ఉద్దేశ్యంతోనే సైనిక వ్యవస్థ అవినీతి మాఫియా అయిన షరీఫ్లు, జర్దారీలకు అండగా ఉందని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విభజనపై ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దేశానికి పెను విషాదంగా అభివర్ణించారు. ఈ దిగుమతి చేసుకున్న ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తోందని, ఈ తరుణంలో సుప్రీం కోర్టుకు అండగా నిలవాలని దేశానికి విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు. ప్రస్తుతం పాక్లో ప్రజాస్వామ్యం సుప్రీం కోర్టు అనే దారంతో వేలాడుతోందని, అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరూ దానికి అండగా నిలబడాలని చెప్పారు. ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడం మానేయాలని అన్నారు. మే 14న పంజాబ్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని దిక్కరిస్తూ ఉంటే ఈద్ తర్వాత వీధుల్లోకి రావడానికి సిద్ధంగా ఉండాలని ఖాన్ పిలుపునిచ్చారు. ముందు నుంచి తాను దీనికి నాయకత్వం వహిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అవినీతి పాలకులను అంగీకరించమని ప్రజలను బలవంతం చేయలేమనే విషయాన్ని సైనిక వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలన్నారు. అలాగే ఒక దేశం పురోగమిస్తున్నప్పుడూ హింసాత్మక వ్యూహాలు పనిచేయవనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. ఇంతకుముందు తన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతదారులను సైలంట్ చేసేలా హింసాత్మక కార్యకలాపాలకు దిగారని, ఐతే అవి పనిచేయలేదన్నారు. ఇక మీదట కూడా అవి పనిచేయవని నొక్కి చెప్పారు ఖాన్. తనను చంపడానికి కుట్ర జరుగుతోందని కూడా ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ ముస్లీం లీగ్ నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను ఏ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసారం చేయకూడదని అప్రకటిత నిషేధం విధించడం గమనార్హం. (చదవండి: నల్లులు కారణంగా చనిపోయిన ఖైదీ..దర్యాప్తు చేస్తున్న అధికారులు) -
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్కు సబ్ఇంజనీర్గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
Viral Video: ఉన్నపలంగా లారీ డోర్ తీసాడు.. తర్వాత ఏమైందంటే..!
-
పశువుల కాపరి పై దాడి చేసిన పులి..
-
కోర్ట్ లో టిప్పులు.. యూనిఫామ్ పై QR కోడ్..
-
Viral Video: గుజరాత్ లో కేజ్రీవాల్ కోసం వికలాంగుడి ప్రచారం..
-
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక అరెస్ట్
-
వైరల్ వీడియో: మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తి.. కిందకు తోసేసిన బస్సు కండక్టర్
-
వైరల్ వీడియో: అధికారి ముందు కుక్కలా అరుస్తూ నిరసన తెలిపిన వ్యక్తి..
-
డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్
-
దారుణం: దుష్ట శక్తుల పేరుతో త్రిశూలంతో వాతలు...వ్యక్తి మృతి
దుష్ట శక్తులను తొలగిస్తానంటూ ఒక వ్యక్తి మాయమాటలు చెప్పి ఒక మానసిక వికలాంగుడుని పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన చత్తీస్గఢ్ బిలాస్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...రతన్పూర్ పోలీస్టేషన్ పరిధిలోని పోడి గ్రామంలో ఫేకురామ్ నిర్మల్కర్ అనే 35 ఏళ్ల మానసిక వికలాంగడు ఉన్నాడు. అతని భార్య ఒక రషక్ అనే తాంత్రికుడిన సంప్రదించింది. అతన్ని దుష్ట ఆత్మల ప్రభావానికి లోనయ్యాడని వాటిని తొలగించాలని చెప్పాడు. దీంతో అతని వద్దకు తన భర్త ఫేకురామ్ని తీసుకువెళ్లింది. ఆ తాంత్రికుడు వద్దే నాలుగు రోజుల వచ్చింది. ఆ తాంత్రికుడు దుష్టశక్తులను తొలగించే పేరుతో త్రిశూలంతో వాతలు పెట్టి హింసించడం మొదలు పెట్టాడు. ఐతే ఫేకురామ్కి వాతలు కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చి పరిస్థితి విషమించడంతో అతని బార్య ఫేకురామ్ ఇంటికి తీసుకువెళ్లిపోయింది. ఆ తర్వాత అతను చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని హత్యనేరం కింద కేసు నమోదు చేసుకుని తాంత్రికుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఈవీఎం పాడవ్వడంతో తలెత్తిన ఘర్షణ...పలువురికి గాయాలు) -
ఎలబ్రస్ పర్వతంపై ఏపీ యువకుడు
పాలకొల్లు అర్బన్: రష్యాలోని మౌంట్ ఎలబ్రస్ పర్వతాన్ని రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల యువకుడు అధిరోహించాడు. సముద్ర మట్టానికి 18,500 ఫీట్ల ఎత్తులో ఉన్న ఎలబ్రస్ పర్వతాన్ని అధిరోహించడానికి ఏడుగురు సభ్యుల బృందం రష్యా లోని బేస్ క్యాంప్ నుంచి ఈ నెల 12న బయలుదేరింది. మౌంట్ ఎలబ్రస్ పర్వతంపై సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రంగనాథరాజుల ఫొటోలను దాసు ప్రదర్శించారు. క్లిక్: ఎంఎల్హెచ్పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
చిత్రమైన కేసు... ఏనుగుని వ్యక్తిగా పరిగణించాలంటూ పిటిషన్
The elephant is being imprisoned against her will: న్యూయార్క్ అత్యున్నత న్యాయస్థానం ఓ చిత్రమైన కేసుని విచారిస్తోంది. 51 ఏళ్ల హ్యపీ అనే ఆసియా ఏనుగుని బ్రోంక్స్ జూలో చట్టవిరుద్ధంగా నిర్బంధించారంటూ జంతుహక్కుల సంస్థ నాన్హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేసింది. నిజానికి హెబియస్ కార్పస్ అనేది ఒక వ్యక్తిని నిర్బంధించడం చట్టబద్ధమైనదో కాదో నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. అయితే ఏనుగు తరుపు న్యాయవాది స్టీవెన్ వైస్.. ఏనుగు ఇష్టానికి వ్యతిరేకంగా జూలో ఖైదీగా నిర్బంధించబడిందని, ఏనుగు జ్ఞానపరంగా తెలివైన జంతువు కాబట్టి మనుషులకు ఉండే అన్ని రకాలు హక్కులు దీనికి ఉండాలని చెబుతున్నారు. అంతేగాదు ఈ ఏనుగు 1977 నుంచి జూ లోనే నిర్బంధించి ఉంటుందని అందువల్ల దీనిని ఇప్పుడైనా ఏనుగుల అభయారణ్యంలోకి తరలించాలని అభ్యర్థించారు. కానీ బ్రోంక్స్ జూ మాత్రం ఏనుగుని బాగా చూసుకుంటున్నామని, ఏనుగు నిర్బంధం చట్టవిరుద్ధం కాదని వాదిస్తోంది. 2018 నుంచి దాఖలైన ఈ విచిత్రమైన కేసులో జంతు హక్కుల సంస్థ అనేక దిగువ కోర్టుల్లో ఓడిపోతూ వస్తోంది. అయితే ధర్మాసనం ఈ విచిత్రమైన కేసులో ఏనుగుని వ్యక్తిగా పరిగణిస్తుందా లేదా అనే దాని పైనే తీర్పు ఆధారపడి ఉందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పర్కొంది. అంతేగాదు ఈ న్యూయార్క్ అప్పీల్ కోర్టు తీర్పు ఇచ్చేవరకు కూడా హ్యాపీ జూలోనే ఉండాల్సిందేనని తెలిపింది. Happy has spent 16 yrs in isolation at the Bronx Zoo: 2x longer than Kaavan, the “world’s loneliest elephant” before a Pakistan judge freed him from a zoo to a sanctuary. In his decision, he rightly called Happy an inmate. #FreeHappy https://t.co/YX9Mv22CHS pic.twitter.com/eHXZ5K0z4r — Nonhuman Rights (@NonhumanRights) May 17, 2022 -
ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..
చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? చింతూరు మండలంలో ఛత్తీస్గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్లీవ్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
మనుషులుండే ఊరు.. మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది
మనుషులుండే ఊళ్లు చాలా ఉన్నాయి.. మరి మనిషిలా ఉండే ఊరు.. ఇదిగో ఇదొక్కటే ఉంది.. సెంటూరిపే.. ఇటలీలోని ఈ చిన్న పట్టణం.. పై నుంచి చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. స్థానిక ఫొటోగ్రాఫర్ పియో ఆండ్రియా పెరి గూగుల్ ఎర్త్లో తమ పట్టణం మ్యాప్ను చూసి.. చూస్తా ఉంటే మనిషి బొమ్మలా ఉందే అని డౌట్ పడ్డారు.. దాన్ని తీర్చేసుకుందామని.. డ్రోన్ సాయంతో పలు చిత్రాలను తీశారు.. కట్చేస్తే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే.. చాలామంది దీన్ని నమ్మలేదు. మార్ఫింగ్ చేశారని.. ఫొటోగ్రాఫర్ను విమర్శించారు. అయితే.. తర్వాత గూగుల్లో మ్యాప్లో చెక్ చేసుకుని.. తనకు వ్యక్తిగతంగా వారు క్షమాపణలు చెప్పారని పియో ఆండ్రియా చెప్పారు. 5 వేల జనాభా కలిగిన సెంటూరిపే సముద్రమట్టానికి 2,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. (చదవండి: ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) -
మంచిమాట..నీ నిశ్చలమైన మనసే నీవు
అన్ని భావాలలోకి అతి ముఖ్యమైనది ‘నేను’ అనే భావం. వ్యక్తిత్వమనే భావం కూడా అన్ని భావాలకీ మూలమే. ఏ భావమైనా దేనినో ఒకదానిని ఆశ్రయించే ఉదయిస్తుంది. అహంకారమే భావాలకి నిలయం. అంటే, భావాల వ్యాపకం అహంకారానికి సంబంధించినదే. నువ్వు, అతడు, అది అంటూ మధ్యమ ప్రథమ పురుషలకి సంబంధించినవి ‘నేను’ అనే ఉత్తమ పురుషలకి తప్ప ఇంకెవరికీ గోచరించవు. అందువల్ల ఉత్తమ పురుష ఉదయించిన తరువాతనే అవీ ఉదయిస్తాయి. అంటే కలిసే వస్తాయి. కలిసే అణగిపోతాయి. .ఈ ‘నేను’ అనేది ఎక్కడినుండి ఉదయిస్తున్నది? దాని కోసం లోపల వెతకాలి. అప్పుడు అది మాయమవుతుంది. మనస్సంటే ఆలోచనల సమూహమే. అన్ని ఆలోచనలకు మూలం ‘నేను’ అనే భావం. కాబట్టి మనస్సు అంటే ‘నేను’ అనే ఆలోచనే. ‘నేను’ అనే ఆలోచన పుట్టుకే వ్యక్తి జననం కూడ. దాని మరణమంటే వ్యక్తి మరణమే. ఈ ‘నేను’ అనే భావాన్ని వదిలించుకోవాలి. అది సజీవంగా ఉన్నంతకాలమూ బాధ తప్పదు. ‘నేను’ పోతే, బాధా పోతుంది. నేను ఫలానా వ్యక్తినని, అంతటి వాడిని, ఇంతటి వాడిని, అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అనే విజ్ఞానాన్ని పక్కన పెట్టి, నీవు నువ్వుగా ఉండటం ‘నీ నిజస్వరూపం’. ఆత్మయే చైతన్యంగా మారి ’నేను ఫలానా’ అని గిరిగీసుకోవటమే ’అహం’. అంతకు మించి ‘అహం’ అంటూ ప్రత్యేకంగా లేదు. విషయాలతో మమేకం చెందకుండా మనసును గమనిస్తే దైవమే మన మనసు, తనువు, ఇంద్రియాలు, ప్రపంచంగా మారిందని అర్ధం అవుతుంది. దీనికి కారణం నువ్వు కాదని తెలుసుకుంటే, కర్తృత్వంపోయి శాంతి వస్తుంది. మనకి మనసు స్వరూపమే కాదు, దాని క్రియలు కూడా పూర్తిగా తెలియవు. కేవలం ఆలోచనల ద్వారా ఈ శరీర బాహ్యక్రియలు చేయించేది మాత్రమే మనసని అనుకుంటున్నాం. మనస్సుతో కుస్తీ పడకండి. మీ మనస్సు ఎక్కడికీ వెళ్ళదు. అది ఇక్కడే ఉండి దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. మీరు కేవలం మీ ఆలోచనల వల్ల అలా మోసగింపబడుతున్నారు. అది ఇక్కడే ఉంది. దేని గురించో ఊహించుకుంటోంది. అది ఎక్కడికీ వెళ్ళడం లేదు. మీరు దానితో ఎంతగా మమేకం అయిపోయా రంటే మీరు మీ మనస్సు మరెక్కడో ఉంది అని అనుకుంటున్నారు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. మీరు కాని విషయాలతో మిమ్మల్ని మీరు, గుర్తించుకుంటున్నారు. మీ మనస్సు అన్నది నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకుని మీ మనస్సుని ఆపాలని చూస్తున్నారు. మీరు ఒక లక్ష సంవత్సరాలు తీసుకున్నా సరే.. ఇది జరగదు... మీ మనస్సు ఒక పెద్ద గందరగోళం. ఎందుకంటే.. మీరు ఎన్నో విషయాలతో మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీరు మీ శరీరంతో.. మీరు వేసుకొన్న దుస్తులతో.. మీ జుట్టుతో.. ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇప్పుడు మీ మనస్సు అంతు లేనట్లుగా, అలా వెళ్లిపోతూనే ఉంటుంది. మీరు దానిని ఆపలేరు. మీరు ఇక్కడ కూర్చొని, ధ్యానం చెయ్యాలనుకుంటూ ఉన్నారు. మీరు ఏ బయటికి వెళ్ళడం గురించో, సినిమా గురించో, స్నేహితుడి గురించో, మరో దాని గురించో ఆలోచిస్తారు. మీకు అందరూ ఏమి చెప్పారంటే భగవంతుడి గురించి ఆలోచించండి, అన్నీ సరిగ్గానే ఉంటాయి అని. మీరు ఆ భగవంతుని గురించి ఆలోచించినప్పుడు మీమనస్సు ఎక్కడెక్కడికో వెళుతుంది. మనస్సు తత్త్వం అలాంటిది. దీనిని మీరు ఆపలేరు. ఎందుకంటే, మీరు ఏవైతే కాదో అటువంటి విషయాలతో, మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. ఇక్కడ మనం మీ మనస్సుని నియంత్రించడం గురించి మాట్లాడడం లేదు. మీరు ఏది కాదో, అన్న దాని పట్ల అవగాహన పెంచుకోవాలి. మీ మొట్టమొదటి గుర్తింపు మీ శరీరం. మీరు మీ శరీరంతో, మీరు వేసుకొన్న దుస్తులతో, మీ జుట్టుతో, ఎన్నో విషయాలతో.. మిమ్మల్ని మీరు గుర్తించుకున్నారు. మీ భార్యా, మీ పిల్లలూ, మీ కుటుంబం, మీ విద్యా, మీ మతమూ ఇవన్నీ అంతులేనన్ని గుర్తింపులు.. ఇన్ని గుర్తింపులతో మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అది అలా కుదరదు. అందుకనే, నేను శూన్యం అని ఒక చిన్న, సరళమైన సాధన చేయాలి. దీని ద్వారా మీరు మీకూ, మీ మనస్సుకీ కొంత దూరం ఏర్పరచుకోవచ్చు. ఈ దూరం ఏర్పడిన తరువాత, అది గోల చేసే మనసైనా సరే.. పర్వాలేదు. మీరు, దాని నుంచి విడవగలరు. ఒకసారి మీరు, మీ మనసు నుంచి విడిపడిపోయిన తరువాత మీరు, మీ గుర్తింపులన్నింటి నుంచీ విడవగలరు. ఎందుకంటే, ఈ మనస్సే మీలో ఈ గుర్తింపులని తయారు చేస్తూ ఉంది. అందుకని అన్ని రకాల విషయాలనూ ఆలోచించకండి. ప్రతి రోజూ రెండుసార్లు, పదిహేను నిమిషాల పాటూ, మీ గందరగోళాన్నంతా పక్కన పెట్టి కూర్చోండి. మీరు ధ్యానం కూడా చెయ్యనక్కర్లేదు. కేవలం కూర్చోండి. జరగాల్సినవి అవే జరుగుతాయి. – భువనగిరి కిషన్ యోగి ► మీ పొరపాటు ఆలోచనలన్నిటినీ విడిచి పెట్టిన క్షణాన మీ మనస్సు ఒక అద్దంలా మారిపోతుంది. అప్పుడది ఏమీ చేయదు. అన్నిటినీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ► మీ మనస్సు ఒక యంత్రాంగం. దానిలో స్పష్టత ఉన్నప్పుడే అది బాగా పని చేస్తుంది. ► నిశ్చలంగా ఉన్నప్పుడు ఉండే నీ ఉనికే ‘నీ నిజస్వరూపం’ -
తోటలో పనిలో ఉండగా.. విమానంలోంచి, యాక్!!
మానవ వ్యర్థాలు ఈ మాట వింటేనే జనం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. మరి అలాంటిది ఆకాశం నుంచి కుప్పలు, కుప్పలుగా వచ్చి మీద పడితే .. భయంకరంగా ఉంటుంది కదా. బ్రిటన్లో ఒక వ్యక్తికి ఇలాంటి ఘోరమైన అనుభవం ఎదురైంది. గార్డెన్లో పనిచేసుకుంటున్న మనిషి అటుగా వెళ్తున విమానం నుంచి మానవ వ్యర్థాలు గుమ్మరించిన వ్యవహారం కలకలం రేపింది. (TV Channel : షాకింగ్ వెదర్ రిపోర్ట్లో.. ఆ క్లిప్పింగ్) తోటలో హాయిగా పనిచేసుకుంటున్న తరుణంలో విమానంలో నుంచి జారవిడిచిన వ్యర్థాలు ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. అలాగే అతని గార్డెన్లో ఉన్న పలు మొక్కలు, పైకప్పులపై కూడా పడ్డాయి. దీంతో వ్యర్థాలు పడిన వెంటనే అతడు గార్డెన్ నుంచి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. 2021 ఏడాది జూలైలో ఇంగ్లండ్లోని విండ్సర్ సమీపంలో హీత్రూ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. కారెన్ డావిస్ జోక్యం ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రూట్ ట్రాకింగ్ యాప్ ద్వారా ఆ విమానం ఎటు వెళ్లిందో బాధితుడు కనిపెట్టడం విశేషం. మరోవైపు ఆ విమానం పేరును బయటపెట్టడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా బాధితుడు విముఖత వ్యక్తం చేయడం గమనార్హం. (kidney transplantation: సంచలనం) విండ్సర్ అండ్ మేడెన్ హెడ్కి చెందిన ది రాయల్ బోరో ఏవియేషన్ ఫోరమ్తో కారెన్ డావిస్ ఈ భయంకరమైన అనుభవాలను షేర్ చేశారు. విమానంలో నుంచి పడిన వ్యర్థాలు మొత్తం తోటంతా చాలా అసహ్యకరమైన రీతిలో పడ్డాయని వివరించారు. ఇలాంటి అనుభవం మరెవ్వరికీ రాకూడదని ఆమె వ్యాఖ్యానించారు. అయితే విమానంలోంచి జారవిడిచే మానవ వ్యర్థాలకు సంబంధించి ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు నమోదవుతూ ఉంటాయన్నారు. సాధారణంగా విమానాల నుంచి వదిలినపుడు ఎత్తైన ప్రదేశాల్లోని ఉష్ణోగ్రతకు తక్షణమే గట్ట కట్టి, కింత పడతాయని డావిస్ చెప్పారు. కానీ తాజా ఘటనలో మాత్రం దీనికి భిన్నంగా జరగడం అరుదైనదని చెప్పారు. కాగా సాధారణంగా విమానాల్లో టాయిలెట్స్ వ్యర్థాలను ప్రత్యేక ట్యాంకుల్లో స్టోర్ చేసి విమానం ల్యాండ్ అయిన తర్వాత వాటిని తొలగిస్తారు. ఆధునిక విమానాలలో వాక్యూమ్ టాయిలెట్లు సాధారణంగా విమానాలతో పోలిస్తే చాలా సురక్షితమైనవి భావిస్తారు. -
తోడు కావాలని కాల్ చేస్తే.. పని పూర్తి చేసి ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి,హిమాయత్నగర్(హైదరాబాద్): ‘మీరు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? మీకు తోడు కావాలా? ఇదిగో ఈ మెసేజ్లో ఉన్న నంబర్కు ఫోన్ చేయండి స్నేహితులతో గంటల తరబడి మాట్లాడుకోండి’ అంటూ సికింద్రాబాద్కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడికి ఓ మెసేజ్ వచ్చింది. కుమారులు, కుమార్తెలు అంతా దుబాయిలో ఉంటున్నారు. ఆయనను పలకరించే వారెవరూ లేకపోవడంతో తోడు కోసం ఆశపడి సైబర్ నేరగాడు చెప్పినట్లు చేశాడు. అంతే.. పలు దఫాలుగా రూ.7.8 లక్షలు లూటీ అయ్యాయి. తన డబ్బులు తిరిగి రావాలంటే మరో రూ.3 లక్షలు ఇస్తేనే రూ.7.8 లక్షలు ఇస్తామన్నారు. దీంతో ఆయన మరో రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. తను మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. ప్రాఫిట్ వస్తుందని నమ్మించి.. మొగల్పురాకు చెందిన సయ్యద్ సోహేల్ మొయినుద్దీన్కు కొద్దిరోజుల క్రితం ఫేస్బుక్లో ఓ వ్యక్తి పరిచయమయ్యా డు. తాను ‘డబ్ల్యూపీఇన్వెస్ 66.కామ్’లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాన్నాడు. దీంతో మొయినుద్దీన్ కూడా ఆ యాప్లో తొలుత రూ.10 వేలతో రిజిస్టర్ అయ్యా డు. లాభం రూ.10వేలు కనిపించింది. దీంతో ఆ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తే రావట్లేదు. నా డబ్బులు నాకు కావాలని తన స్నేహితుడికి చెప్పడంతో అవి రావాలంటే ఇంకా వ్యాపారం చేస్తున్నట్లుగా ఆ యాప్లో చూపించుకోవాలన్నాడు. ఇలా పలు దఫాలుగా రూ.2.40 లక్షలను కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రెడిట్ కార్డు గిఫ్ట్ పేరుతో.. కాచిగూడకు చెందిన దేవకీనందన్కు క్రెడిట్ కార్డు నుంచి మాట్లాడుతున్నామంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీ కార్డుపై మీకు రూ.5వేల బహుమతి వచ్చింది. మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పమన్నారు. ఆమె ఓటీపీ నంబర్ చెప్పడంతో ఆ కార్డులో ఉన్న రూ.లక్ష లిమిట్ను క్షణాల్లో స్వైప్ చేశాడు. దీంతో బాధితుడు మంగళవారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఫిర్యాదు తీసుకోవడం లేటైందని బ్లేడుతో కోసుకున్నాడు
సాక్షి, విజయనగర్కాలనీ(హైదరాబాద్): ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్లో వ్యక్తి గొంతుకోసుకున్న సంఘటన శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మెహిదీపట్నం భోజగుట్టలో నివసించే హరి (33) పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతుంటాడు. అతనికి ముగ్గురు భార్యలు. అతని రెండో భార్య సెల్ఫోన్ లాక్కోవడంతో గొడవ జరిగింది. ఫిర్యాదు చేయడానికి ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్కు ఇతని మరో భార్యతో వచ్చాడు. ఫిర్యాదు తీసుకోవడం లేటవుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మద్యం మత్తులో ఉన్న హరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో గొంతు దగ్గర కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో పోలీసులు అతనిని వైద్యసేవల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇతను గతంలో పలుమార్లు ఇదే విధంగా బ్లేడుతో శరీరం కోసుకోవడంతో శరీరమంతా కత్తిగాట్లు ఉన్నాయన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పిశాచి పిడుగు : షాకింగ్ వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: గుర్గావ్లో విషాదం చోటు చేసుకుంది. వర్షం నుంచి రక్షించుకునేందుకు చెట్టు కిందకు చేరిన వ్యక్తులు అనూహ్య ప్రమాదంలో ఇరుక్కున్నారు. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి అక్కడిక్కడే కుప్పకూలి చనిపోగా మరో ముగ్గురు గాయపడ్డారు. దిగ్భ్రాంతికరమైన ఈ విజువల్స్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గుర్గావ్ సెక్టార్ 82 లోని సిగ్నేచర్ విల్లాస్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు ఈ నలుగురు చెట్టుకింద నిలబడ్డారు. అకస్మాత్తుగా పిడుగువారిపై పడింది. అంతే క్షణాల్లో వారంతా కుప్పకూలిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రమైన కాలిన గాయాలతో ఇంటెన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. బాధితులంతా రెసిడెన్షియల్ సొసైటీలోని హార్టికల్చర్ సిబ్బందికి చెందిన వారుగా తెలుస్తోంది. కాగా సాధారణంగా పిడుగులు పడేటప్పుడు అందరూ చెట్లకిందకు, భవనాలు కిందకు వెళుతుంటారు. వాస్తవానికి ఇది ఇంకా ప్రమాదకరం. ఈ సమయంలో చెట్లకింద నిలబడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిడుగులు ఎత్తైన వాటిని ఆకర్షిస్తాయి. దీంతో చెట్లపైనా, ఎత్తైన భవనాలపైనే పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. -
గుర్గావ్లో పిశాచి పిడుగు
-
‘డబ్బు ఇవ్వకుంటే పురుగుల మందు తాగుతాం’
నగరం(రేపల్లె): ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించిన అక్కల వీరారెడ్డి ఇంటి ఎదుట బాధితుడి కుటుంబం బైఠాయించిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బాధితుడు విజయవాడకు చెందిన వెంకటేశ్వర్లు కథనం మేరకు.. మండలంలోని పూడివాడ గ్రామానికి చెందిన అక్కల వీరారెడ్డి, సీబీసీఐడీలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.22 లక్షలు డబ్బు తీసుకున్నాడు. అప్పటి నుంచి అదుగో రేపు మాపు అంటూ వీరారెడ్డి కాలం నెట్టుకొచ్చాడు. దీంతో పోలీసులను ఆశ్రయిస్తే కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు చెప్పారు. డబ్బులు ఇచ్చే వరకు తిరిగి వెళ్లేది లేదని ఇంటి ఎదుట భార్యతో సహా కూర్చున్నారు. మాకు డబ్బులు ఇవ్వని పక్షంలో కుటుంబం మొత్తం పురుగు మందు తాగి ఆత్మహత్యకు సిద్ధంగా ఉన్నామని ఆవేదన భరితంగా చెప్పారు. అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని.. విజయవాడకు చెందిన తలగడదీవి రత్నకుమారి నుంచి అపార్టుమెంట్లో ప్లాట్ ఇప్పిస్తానని మార్చి 2020లో రూ.4లక్షలు తీసుకుని మోసగించాడని వాపోయారు. పేదలమైన మావద్ద నుంచి లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని, డబ్బులు ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేసింది. అదే విధంగా వీరారెడ్డి పలు చోట్ల ఛీటింగ్కు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నగరం మండలం ఎస్ఐ వాసును వివరణ కోరగా తమకు ఎటుంటి ఫిర్యాదు అందలేని తెలిపారు. చదవండి: ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడని చంపేశారు.. డెత్నోట్ రాసి.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య -
ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి గౌతమి ఇంట్లో దుండగుడు చొరబడటం కలకలం రేపింది. చెన్నైలోని కొట్టివక్కమ్లో గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా పాండియన్ (28) అనే వ్యక్తి ప్రవేశించి గలాటా సృష్టించాడు. ఇంట్లోని ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న విషయాన్ని గౌతమి ఇంట్లో పనిచేసే సతీష్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌతమి ఇంటికి చేరుకున్న నీలంకరై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడినికొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్గా పోలీసులు గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు ఆందోళన కలిగించినందుకుగాను అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్పై విడుదల చేశారు. అయితే గౌతమి ఇంట్లో పనిచేస్తున్న తన సోదరుడిని కలవడానికే పాండియన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
పెళ్లయిన ఐదు రోజలకే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రైలు పట్టాలపై పడి నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. వల్లూరు మండలం తప్పెట్ల బ్రిడ్జి వద్ద రైలు పట్టాలపై పడి మోపూరి శంకర్ రెడ్డి (26) అనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా శంకర్ రెడ్డికి ఐదు రోజుల క్రితమే కమలాపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నవవరుడు ఆత్మహత్యతో కొప్పోలు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
చనిపోయాడనుకున్నారు.. కానీ బతికే ఉన్నాడు
సిడ్నీ : ఒక వ్యక్తి మూడు వారాల పాటు ఎవరికి కనిపించకుండాపోవడంతో అందరూ అతను చనిపోయాడనే భావించారు. కానీ హఠాత్తుగా ఆ వ్యక్తి బతికేఉన్నాడన్న వార్త విని చాలా సంతోషించారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆస్ట్రేలియాకి చెందిన లెమిక్ అనే వ్యక్తి క్వీన్స్లాండ్లోని డైంట్రీ అటవీప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు డిసెంబర్ 22న అతని వాహనం బోల్తా పడింది. అప్పటినుంచి లెమిక్ అదృశ్యమయ్యాడు.లెమిక్ అదృశ్యమైన అటవీ ప్రాంతానికి సముద్రం దగ్గరగా ఉండడంతో కొన్ని వేళ మొసళ్లు అక్కడ జీవిస్తున్నాయి. దీంతో లెమిక్ వాటికి ఆహారం అయ్యుంటాడని భావించారు. అటవీ అధికారులు అతని కోసం రెండు వారాలు గాలించినా ఫలితం లేకపోవడంతో తమ ప్రయత్నాన్ని మానుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం లెమిక్ వాహనం బోల్తా పడిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో అతను బతికే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా మూడు వారాల పాటు అడవిలోనే చిక్కుకున్న లెమిక్ ఆరోగ్యం, మానసిక పరిస్థితి బాగానే ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మూడు వారాల పాటు అడవిలో ఉన్నలెమిక్ బెర్రీ, ఇతర పండ్లు తిని జీవించాడని తెలిపారు. -
వివాహితను వేధిస్తున్న మాజీ ఎపీఎస్పీ కానిస్టేబుల్
సాక్షి, సూర్యాపేట క్రైం: పచ్చని కాపురంలో నిప్పులు పోశాడు.. ఓ మాజీ ఏపీఎస్పీ కానిస్టేబుల్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ పేరుమాళ్ల అశోక్రావు ముందుగా ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఆత్మకూర్.ఎస్ మండలంలోని పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఓ యువతి రెండున్నర సంవత్సరాల క్రితం కొత్త బస్టాండ్ వద్ద స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తుంది. అటుగా వెళ్తున్న అశోక్రావును లిఫ్టు అడగగా ఇచ్చాడు. అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. వివాహం కాలేదనుకుని.. అశోక్రావుకు పెళ్లి కాలేదని చెప్పడంతో ఆ మహిళ అశోక్రావుతో పరిచయం పెంచుకుంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇరువురి మధ్య కొంతకాలం వరకు పరిచయం కొనసాగింది. అయితే కొద్దికాలం తర్వాత మహిళకు అశోక్రావుకు పెళ్లి అయిన విషయం తెలుసుకుంది. వెంటనే మహిళ టెన్త్ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న సమయంలో ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకుని హైదరాబాద్లో స్థిరపడిపోయింది. సంవత్సర కాలం క్రితం.. భార్య భర్తల కేసులో సర్వీస్ రిమూవల్ అశోక్రావుకు ఉద్యోగం వచ్చిన సమయంలోనే ప్రొబిషనరీ పీరియడ్ పూర్తి కాకముందే సస్పెండయ్యాడు. అదే సమయంలో అశోక్రావు, ఆయన భార్య మధ్యలో కోర్టులో పంచాయితీలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన కొద్ది కాలానికే ఆయనలో మార్పు రాకపోవడంతో సర్వీస్ రిమూవల్ చేశారు. యువతి భర్తను కలిసి ఫొటోలు మొహంపై వేసిన వైనం.. బాధిత మహిళకు ఫోన్లో వేధిస్తూనే అశోక్రావు నేరుగా హైదరాబాద్లో నివాసముంటున్న స్థలాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. మహిళ ఆయన మాట వినడం లేదనుకుని.. నేరుగా ఆమె భర్త వాహనాన్ని వెంబడించి ఇరువురు కలిసి దిగిన అప్పటి ఫొటోలను ఆయన మొహంపై విసిరేశాడు.దీంతో చేసేదేమి లేక మహిళ భర్త నేరుగా భార్య వద్దకు చేరుకుని జరిగిన విషయాన్ని వివరించాడు. దీంతో ఆ మహిళ సూర్యాపేట డీఎస్పీని ఆశ్రయించింది. జరిగిన విషయాన్ని ఆయనకు వివరించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకోమని సిబ్బందిని ఆదేశించాడు. కౌన్సిలింగ్ చేసినా మారని తీరు.. రెండు వారాల క్రితం బాధిత మహిళ సూర్యాపేట డీఎస్పీని ఆశ్రయించింది. వెంటనే స్పందించిన డీఎస్పీ నాగేశ్వరరావు అశోక్రావును కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించారు. అయినా కూడా అశోక్రావు తీరులో మార్పు రాలేదు. శనివారం డీఎస్పీ కార్యాలయానికి అశోక్రావును మరోమారు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో బాధిత మహిళ అశోక్రావు వేధింపులు తాళలేక పక్కనే ఉన్న అశోక్రావు చెంప చెల్లుమనిపించింది. ఈ విషయమై డీఎస్పీ నాగేశ్వరరావును వివరణ కోరగా.. అశోక్రావుకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా ..తండ్రీకొడుకుల దుర్మరణం
సాక్షి, రాజాపేట(ఆలేరు): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో తండ్రీ కుమారుడు దుర్మరణం చెందారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కుర్రారం శివారులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కుర్రారం గ్రామానికి ముక్కెర రవీందర్రెడ్డి తన కుటుంబ సభ్యులు భార్య విజయ, ఇద్దరు కుమారులు జీవన్రెడ్డి, క్రాంతికుమార్ రెడ్డిలతో కలిసి కొంత కాలంగా ఉప్పల్లోని బీరప్పగడ్డకు నివాసం ఉంటున్నాడు. ఆర్ఎంపీగా వృత్తి నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. పెద్ద కుమారుడు జీవన్ రెడ్డి మెహందీపట్నంలోని గురునాణక్ కలాశాలలో బీటెక్ ఫైనలియర్ చేస్తున్నాడు. చిన్నకుమారుడు క్రాంతికుమార్ రెడ్డి ఇంటర్ పూర్తిచేశాడు. కాగా స్వగ్రామంలోని తనకున్న భూమిలో వ్యవసాయం సేద్యం చేయడానికి అప్పుడప్పుడు రవీందర్రెడ్డి వస్తూంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం హైదరాబాద్ నుంచి రవిందర్రెడ్డి (48), పెద్ద కుమారుడు జీవన్రెడ్డి (21)తో కలిసి సాయంత్రం 5 గంటలకు కుర్రారం గ్రామానికి వచ్చాడు. కాగా గ్రామం శివారులోని తన వ్యవసాయ పొలంలో ఉన్న ట్రాక్టర్ను కొడుకు జీవన్రెడ్డి డ్రైవింగ్ చేస్తుండగా తండ్రి పక్కనే ఇంజన్పై కుర్చున్నాడు. పొలం నుంచి రోడ్డు పైకి ఎక్కే క్రమంలో రోడ్డుపైనుంచి వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో ట్రాక్టర్ బోల్తాపడింది. ట్రాక్టర్పై ఉన్న రవీందర్రెడ్డి, జీవన్రెడ్డిలు కిందపడటంతో వీరిపై ట్రాక్టర్ ఇంజన్ పడింది. ఈ దుర్ఘటనలో తండ్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాటసారులు గమనించి కొన ఊపిరితో ఉన్న జీవన్రెడ్డిని చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తండ్రీ కొడుకులు ఒకేసారి మృతి చెందడంతో కుర్రారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుంటుంబసభ్యులు, బంధువుల రోదనలు గ్రామస్తులను కంటతడిపెట్టించాయి.మృతులను చూడటానికి పరిసర గ్రామస్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. -
జీవితంపై విరక్తి చెంది యువకుడి బలవన్మరణం
సాక్షి, బాన్సువాడ: మండలంలోని సోమేశ్వర్ గ్రామానికి చెందిన ఒడ్డెర శ్రీకాంత్(24) అనే యువకుడు జీవతంపై విరక్తి చెంది ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు బాన్సువాడ సీఐ మహేష్గౌడ్ తెలిపారు. గతేడాది శ్రీకాంత్కు వివాహం జరిగిందని సరిగ్గా చూసుకోవడం లేదని భార్య కేసు పెట్టిందన్నారు. బాన్సువాడ కోర్టులో కేసు కొనసాగుతుండగా పలుమార్లు కాపురానికి రావాలని కోరినా భార్య రాకపోడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడి తండ్రి రామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
చనిపోతూ ఇతరులకు ‘వెలుగు’
సాక్షి, భూదాన్పోచంపల్లి: మెయిన్ రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో బైక్పై నుంచి కింద పడిన సంఘటనలో తలకు గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోచంపల్లికి చెందిన యువకుడు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని భావనారుషిపేటకు చెందిన చొల్లోజు భిక్షపతి, అమృత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన శివకృష్ణ (22) (అలియాస్ నాని) గ్రామంలోనే కార్పెంటర్ పని చేస్తున్నాడు. కాగా మున్సిపాలిటీ కేంద్రంలోని సాయిరామ్ థియేటర్ సమీపంలో మెయిన్రోడ్డుపై తరుచుగా వర్షపునీరు నిలవడంతో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. శివకృష్ణ ఈనెల 26న బైక్పై వెళ్తూ గుంతలను తప్పించే క్రమంలో కింద పడడంతో తలలోపల గాయమై రక్తం గడ్డకట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు అదే రోజు రాత్రి స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో డాక్టర్ సలహా మేరకు హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ గురువారం డాక్టర్లు శివకృష్ణ తలకు శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. అనంతరం పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. కాగా కుటుంబ సభ్యులు జీవన్ధాన్ సంస్థకు శివకృష్ణ కళ్లను దానం చేశారు. పోస్ట్మార్టమ్ అనంతరం సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రిజిస్ట్రేషన్ కోసం వెళ్లి.. అనంత లోకాలకు
సాక్షి,జనగామ: ఆటో రిజిస్ట్రేషన్ కోసం వరంగల్ వెళ్లి తిరిగి వస్తుండగా జనగామ జిల్లా యశ్వంతాపూర్ శివారు వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చిలకనగర్లో నివాసముంటున్న కె.హేమంత్హరిశ్రీకాంత్(23) ఆటో నడుపుతూ కటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న స్నేహితుడు రమేష్ వద్ద ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటో రిజిష్ట్రేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉంది. దానిని తన పేర మార్పిడి చేసుకునేందుకు హేమంత్హరిశ్రీకాంత్ తన స్నేహితులు రమేష్, దాస్లతో కలిసి ఆటోలోనే ఉదయం వరంగల్కు బయలుదేరారు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి హైదరాబాద్కు తిరిగి వెళ్తున్నారు. యశ్వంతాపూర్ శివారు నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటో ఎగిరి పల్టీలు కొట్టింది. ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న శ్రీకాంత్ అక్కడిక్కడే మృతి చెందాడు. రమేష్, దాస్లకు తీవ్ర గాయాలయాయ్యయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. క్షతగాత్రులను జిల్లా ప్రధాన ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్లారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు.విషయం తెలుసుకున్న హేమంత్హరిశ్రీకాంత్ భార్య దివ్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తండ్రి కోసం ఏడాది కూతురు ఎదురు చూపు.. తండ్రి కనిపించపోవడంతో హేమంత్హరిశ్రీకాంత్ ఏడాది కూతురు బిక్కు బిక్కుమంటూ ఉండి పోయింది. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో తల్లి దివ్య రోదిస్తుంటే.. ఏం జరిగిందో తెలియని ఆ పసిపాప దీనంగా చూసింది. నాన్న ప్రేమకు దూరమైన చిన్నారిని చూసిన వారు కంటతడి పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. -
నగదు విత్డ్రా కోసం వచ్చి, ఏకంగా ఏటీఎంనే..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సోమాజీగూడ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో విచిత్ర సంఘటన జరిగింది. నగదు విత్డ్రా కోసం వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు అనుకొని ఏకంగా ఏటీఎం చోరీ చేయడానికి యత్నించాడు. అయితే సెక్యూరిటీ అలారం మోగడంతో దుండగుడు వెనక్కి తగ్గాడు. నగదు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. ఈ దృష్యాలన్నీ సీసీ కెమరాలో నమోదయ్యాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
మందు కోసం ఓ యువకుడి దుశ్యర్య..
సాక్షి, అన్నానగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు. -
పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య
-
తిరుమలలో మందుబాబు హల్చల్
సాక్షి, తిరుమల: నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయ మాడ వీధుల్లో మంగళవారం అపవిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరమాడ వీధిలోని ఆదివరాహస్వామి ఆలయం సమీపంలో తమిళనాడుకు చెందిన మణి (35) అనే వ్యక్తి మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. విజిలెన్స్ సిబ్బంది అక్కడే ఉన్నా వారించ కుండా చోద్యం చూడటం గమనార్హం. ఈ మేరకు అందిన సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లగా, వారు చూస్తుండగానే ఆయన దర్జాగా మద్యం సీసా పక్కనే పెట్టుకుని భోజనం చేశాడు. అయినా అతన్ని సిబ్బంది వారించలేదు. ఇంతలో భక్తులందరూ చూస్తుండగానే మణి సీసాæమూత తీసి క్షణాల్లోనే మద్యం సేవించాడు. ఆ తర్వాత నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తు ఎక్కువ అవడంతో మణి స్పృహకోల్పోయాడు. నిందితుడిని రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశామని తిరుమల ఎక్సైజ్ సీఐ మురళీమోహన్ తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే టీటీడీ విజిలెన్స్తో పాటు స్థానిక పోలీసుల వైఫల్యం బహిర్గతమైంది. -
రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేయండి..!
భువనేశ్వర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కు ఒడిశాకు చెందిన ఒకవ్యక్తి రాసిన బహిరంగ లేఖ కలకలం రేపుతోంది. ముఖ్యంగా దేశ ఆర్థిక పరిస్థితులు, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఎకానమీ తదితర అంశాలను ప్రస్తావిస్తూ సంజయ్ కుమార్ పట్నాయక్ ఈ లేఖ రాశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.అవినీతిని అంతంచేయడానికి పెద్దనోట్లను రద్దు చేస్తే.. రద్దైన వెయ్యి రూపాయల నోట్ల కంటే రూ.2వేల నోట్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సాహించాల్సిన అవసరం లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో , పెద్ద నగరాల్లోని ప్రజలకు వివిధ రకాలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించగలరు. వారికి కరెన్సీ అవసరం. కానీ చిన్న పట్టణాల్లో లేదా గ్రామాలలోని నిరక్షరాస్యులైన ప్రజలకు కరెన్సీ మాత్రం అవసరమవుతుంది. దయచేసి రూ.500, రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేయండి. రాబోయే రెండు సంవత్సరాల్లో పెద్ద కరెన్సీల ఉపసంహరణకు ప్లాన్ చేయమని కోరుతున్నానని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. భారతదేశ పేద పౌరుల ఆర్థిక పరిస్థితుల గురించి మీకు తెలియదా? దేశంలో ప్రతి ఒక్కరూ మినిమం బ్యాలెన్స్ కొనసాగించేంత ధనికమైందా భారతదేశం? మినిమం బ్యాలెన్స్ నిర్ణయంపై నేను చాలా ఆశ్చర్యపోతున్నాను? దీనిపై విచారణ జరగాలని కోరుకుంటున్నాను. కనీసం జాతీయీకరించిన బ్యాంకుల్లోనైనా జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉండాలని మీరు భావించడంలేదా? లాంటి ప్రశ్నలను సంజయ్ కుమార్ సంధించారు. పబ్లిక్ / కంపెనీలు / పరిశ్రమలకు ఇచ్చే రుణాలు చాలా అరుదుగా బ్యాంకులు రికవరీ చేస్తాయి. కానీ పేదల రుణాలను రాబట్టడంలో మాత్రం ఎందుకు ధైర్యం చేస్తాయని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. మోదీజీ మీరు మీ స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర పార్టీలపై ఆధిపత్యంకోసం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే ఈ మెయిల్ మిమ్మల్ని లేదా బీజీపీకి బాధించదు కనుక లేఖను రద్దు చేయండి. ఇప్పటికీ దేశాన్ని మార్చడానికి చాలా అవకాశం ఉంది. నా లేఖను పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారని ఎదురు చూస్తున్నాను. సంబంధిత చర్య తీసుకుంటారని భావిస్తున్నానంటూ ఆయన లేఖను ముగించారు. -
ఏఎస్పీ కార్యాలయంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఒంగోలు: ఒంగోలు ఏఎస్పీ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన జరిగింది. జిల్లాలోని పామూరుకు చెందిన చెన్నారపు వెంకటేశ్వర్లుకు చీమకుర్తి మండలం పెద్దచంద్రపాడులో భూమి ఉంది. ఆ విషయమై కొద్ది రోజులుగా బంధువులతో వివాదం నడుస్తున్నది. తన భూమి కబ్జా చేశారని చీమకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో జిల్లా ఎస్పీని కలవడానికి ప్రయత్నించినా కలవనివ్వలేదని వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురయ్యాడు. ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి మంగళవారం వెళ్లిన వెంకటేశ్వర్లుకు ఎస్పీ అపాయింట్మెంట్ దొరకలేదు. దీంతో ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వెంకటేశ్వర్లు అక్కడ పురుగుల మందు తాగాడు. వెంటనే పోలీసులు గమనించి అతడిని అస్పత్రికి తరలించారు. -
గ్యాస్ సిలిండర్లలో గంజాయి
బనశంకరి : గ్యాస్ సిలిండర్లో అక్రమంగా గంజాయి నింపి సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ వ్యక్తిని బెంగళూరు నగరంలోని రామమూర్తినగర పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ వివరాలను వెల్లడించారు. రామమూర్తినగర విజినాపుర గులాబ్జాన్ అలియాస్ గులాబి అనే వ్యక్తి గ్యాస్ సిలిండర్ల కింది భాగాన్ని వృత్తాకారంలో కత్తిరించి దానికి తాళం వేసే రీతిలో మార్పులు చేశాడు. అందులో చిన్నచిన్న గంజాయి ప్యాకెట్లు నింపి బైకుపై వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ విక్రయిస్తున్నాడు. విజినాపుర ప్లాట్ఫారం రోడ్డులో ఆటోలో గంజాయి నింపిన గ్యాస్ సిలిండరును రవాణా చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా మంగళవారం రామమూర్తినగర పోలీసులు ఆ ప్రాంతంలో కాపుకాసి ఆటోపై దాడి చేసి గులాబ్జాన్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి గంజాయి, ఓ ఆటో, సెల్ఫోన్ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే గంజాయి సరఫరా చేస్తున్న మరో వ్యక్తి సమాచారం కూడా తెలిసిందని, అతడి కోసం తీవ్రంగా గాలిస్తుమని కమిషనర్ తెలిపారు. అంతేగాక గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసి వాటికి తాళం వేసే రీతిలో తయారు చేసిన వ్యక్తుల కోసం కూడా గాలిస్తున్నామన్నారు. -
కరెంట్ షాక్! క్షణాల్లో వ్యక్తి సజీవ దహనం
-
లిఫ్ట్ అడిగాడు.. తనువు చాలించాడు
తొర్రూరు రూరల్ (మహబూబాబాద్) : మరో ప్రాంతానికి వెళ్లేందుకు అటుగా వస్తున్న వాహనదారుడిని లిఫ్ట్ అడిగి వెళ్తున్న ఓ బాటసారి ఆ వాహనం బోల్తాపడటంతో దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామశివారులో సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన కాళిదాస శ్రీను (46) లారీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లారీ భాగాలు తెచ్చేందుకు కరీంనగర్కు వెళ్లాడు. అక్కడ లారీ విడి భాగాలు అందుబాటులో లేకపోవడంతో విజయవాడ వెళ్లేందుకు ఉపక్రమించాడు. కరీంనగర్ నుంచి ఇనుప లోడుతో విజయవాడు వెళుతున్న బొలెరో వాహనదారుడిని లిఫ్ట్ అడిగి ఎక్కాడు. కృష్ణా జిల్లా చెవుటూరుకు చెందిన బొలెరో డ్రైవర్ చింతకింది రామకృష్ణ నిద్రమత్తులోకి వెళ్లడంతో వాహనం అదుపుతప్పి బండకు ఢీకొనడంతో వాహనం బోల్తా పడింది. వాహనం కింద పడిన శ్రీను ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడి అక్కడి నుంచి పరారయ్యాడు. అదే వాహనంలో వెనుక భాగంలో కూర్చున్న మరో ప్రయాణికుడు శ్రీనివాసరావుకు గాయాలవగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని తొర్రూరు ఏఎస్సై సుదర్శన్ పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్కు తరలించారు. మృతుడి కుమారుడు కాళిదాస లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నడ్డి రోడ్డుపై దారుణహత్య
► దారికాచి తరిమితరిమి కత్తులతో నరికిన దుండగులు ► పాత కక్షల నేపథ్యంగా అనుమానం తడ (సూళ్లూరుపేట) : జాతీయ రహదారిపై ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు గ్రామం పన్నంగాడులో దుండగులు పట్టపగలు దారికాచి ఓ వ్యక్తిని కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తమిళనాడు సరిహద్దుల్లోని ఎళాఊరు పరిధి తురాపాళెం గ్రామానికి చెందిన జీ పన్నీర్ సెల్వం (32) గుమ్మిడిపూండి ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ప్రతి శనివారం అతను పన్నంగాడు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలో శనివారం తన భార్య రాజితో కలసి ఉదయం 9.30 గంటల సమయంలో బైక్పై పన్నంగాడు ఆంజనేయస్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తున్నాడు. తమిళనాడు పరిధిలో నిర్మిస్తున్న మోడల్ చెక్పోస్టుకు 30 మీటర్ల దూరంలో జాతీయ రహదారిపై రెండు పల్సర్ బైక్లపై ఆరుగురు దుండగులు కాపు కాచి ఉన్నారు. పన్నీర్ సెల్వం బైక్కి తమ బైక్లు అడ్డు పెట్టి బైక్ను కాలితో తన్నడంతో భార్యాభర్తలు బైక్తో పాటు కింద పడిపోయారు. ప్రమాదాన్ని గ్రహిం చిన పన్నీర్ సెల్వం కింద పడిన భార్యను పైకిలేపి పారిపోవాల్సిందిగా చెబుతూ తను రోడ్డు దాటి పడమర వైపున ఉన్న చెరియన్ ఆసుపత్రి వైపు పరిగెత్తాడు. దుండగులు అతన్ని వెంబడించి వెనుక నుంచి మెడపై కత్తులతో నరికారు. తల వెనుక భాగంలో కసిదీరా నరకడంతో పన్నీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిర్ధారించుకున్న దుండగులు వెనుకనే కేకలు వేస్తూ వస్తున్న భార్యను వదిలి తమ బైక్లపై పరారీ అయ్యారు. పాత కక్షలే కారణమా? హతుడి భార్య దుండగులకు సంబం ధించిన సమాచారాన్ని పోలీసులకు అందించింది. 2015లో స్థల వివాదంలో నెలకొన్న కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చునని హతుడి బంధువులు చెబుతున్నారు. ఈ నెల 21న గుమ్మిడిపూండిలో దినకుమార్ అనే ఎర్రచందనం స్మగ్లర్ హత్య జరిగింది. దినకుమార్ గతంలో ఆంధ్రా సరిహద్దుల్లో కార్లు చోరీ చేసే కేసులో జైలుకెళ్లి బెయిలుపై తిరుగుతున్నాడు. ఇతని హత్య వెనుక పన్నీర్ హస్తం ఉండొచ్చునన్న అనుమానంతో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మరో కోణంలో విచారిస్తున్నారు. రెండు రాష్ట్రాల పోలీస్ అధికారుల పరిశీలన హత్యోదంతంపై ఆరంబాకం పోలీసులకు సమాచారం అందించింది. పది రోజుల వ్యవధిలో గుమ్మిడిపూండి ప్రాంతంలో ఇది మూడో హత్య కావడంతో తిరువళ్లూరు ఎస్పీ శాంతన్తో హుటావుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న గుమ్మిపూండి డీఎస్పీ, సీఐలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సమాచారం అందుకున్న సూళ్లూరుపేట సీఐ విజయకృష్ణ, తడ ఎస్ఐ సురేష్బాబు సంఘటనా స్థలానికి చేరుకుని తడ తహసీల్దార్కి సమాచారం అందించారు. ఆయన వచ్చి ఇది ఆంధ్రా హద్దుగా తేల్చడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పురుగు మందుతాగి వ్యక్తి ఆత్మహత్య
గుంటూరు రూరల్ : పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అడవితక్కెళ్ళపాడుకులోగల రాజీవ్ గృహకల్పలో నివశించే షేక్ నాగుల్మీరా(26)కు గత నాలుగేళ్ల కిందట స్థానికంగా నివశించే షబానాతో వివాహమైంది. నాగూల్మీరా ఆటో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చి రాత్రి సమయంలో అందరూ నిద్రిస్తుండగా పురుగు మందుతాగాడు. దీంతో వాంతులు చేసుకుంటున్న అతనిని బంధవులు గుర్తించి చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియవని ఇంట్లో, బయట అందరితో బాగానే ఉంటాడని భార్య తెలిపిందని పోలీసులు తెలిపారు. -
పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి దారుణ హత్య
దైద (గురజాల రూరల్) : పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన మండలంలోని దైద గ్రామ ఎస్సీ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...జయబాబు ఎస్సీ కాలనీలో నివాసముంటూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం గ్రామంలోని లూథరన్ చర్చికి ప్రార్థనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గాడిదల వాగు వద్ద ఆర్అండ్బీ రహదారిపై మాటు వేసిన దుండగులు దారుణంగా గొడ్డళ్లతో తలపై నరికి, కత్తులతో గొంతు కోయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురజాల ఇన్చార్జీ సీఐ ఆళహరి శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
కృష్ణానదిలో పడి యువకుడు మృతి
చామర్రు (అచ్చంపేట ) : మండలంలోని చామర్రు కృష్ణానదిలో పడి మరో వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా, చందర్లపాడు మండలం, కుందుర్తి గ్రామానికి చెందిన కె.ఏడుకొండలు (27) ఏడాదిన్నరకాలంగా చామర్రులోని అత్తగారింట్లో ఉంటున్నాడు. ఈ నెల 18వ తేదీన భార్య రామాంజమ్మ ముగ్గురు పిల్లలతో స్వగ్రామమైన కుందుర్తి వెళ్లి తిరిగి వస్తూ, తాను నదిలో లోతు తక్కువగానే ఉంది ఈదుకుంటూ వస్తానని చెప్పి భార్య పిల్లలను పడవ ఎక్కించాడు. ఏడుకొండలు తిరిగి రాకపోవడంతో రెండు రోజులుగా బంధువులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం ఒక మృతదేహం చామర్రు నది ఒడ్డుకు కొట్టుకొని రాగా గ్రామస్తులు చూసి బంధువులకు చెప్పడంతో ఆ మృతదేహం ఏడుకొండలుదిగా గుర్తించారు. కోనూరులో కృష్ణానదిలో తీసిన ఇసుక గుంతలలో పడి ముగ్గురు మృతిచెంది వారం కూడా గడవక ముందే మరో వ్యక్తి నదిలో మృతి చెందడం పట్ల మండలంలో తీవ్ర చర్చనీయంశమైంది. ఈ సంఘటన కూడా ఇసుక గుంతలలో పడటం వల్లనే జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పోలీసులకు ఎటువంటి సమాచారం లేదు. -
చేయని నేరాన్ని చితక్కొట్టి ఒప్పించారు
-
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
నరసరావుపేటటౌన్ : రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. రైల్వేపోలీసుల కథనం ప్రకారం రైల్వేఫ్లాట్ఫాం–1 మరుగుదొడ్ల వద్ద గల రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సమాచారం అందుకున్న ౖరైల్వే ఎస్ఐ సత్యన్నారాయణ, హెడ్కానిస్టేబుల్ పీరాలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. తెల్లవారుజామున రైలుకింద పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగి ఉండి 5.2అడుగుల ఎత్తు ఉన్నాడు. ఒంటిపై పాచిరంగు మోకాళ్ళవరకు చినిగిన జీన్స్పాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియావైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్ళు తెలిసినవారు రైల్వే పోలీస్స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి
పిడుగురాళ్ళ/మాచవరం : ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఆవుల సాయికుమార్ (21) ఇంజిన్ ఫుట్భాల్ పైకి తీసే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.సాయికుమార్తోపాటు వెళ్ళిన వ్యక్తి కేకలు వేసినప్పటికీ చుట్టుపక్కల పొలాల రైతులు సంఘటనా స్థలానికి వచ్చి బావిలో ఉన్న సాయికుమార్ను పైకి తీసి పిడుగురాళ్ళ పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పటల్కు తీసుకొచ్చారు. ఇక్కడ వైద్యులు పరీశీలించి సాయికుమార్ మృతి చెందినట్లు నిర్ధారించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ రూరల్ : మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ లారీ వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై మరణించిన సంఘటన పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డులో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణంలోని రైలుపేటకు చెందిన నంబూరి జీవానందం(75) రైల్వే గ్యాంగ్మెన్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏనుగుపాలెం రోడ్డులోని కీర్తిహాలు వద్ద ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం రోడ్డుపై నడిచి వెళుతుండగా సుబాబుల్ లోడుతో వస్తున్న లారీ జీవానందంను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని హుటాహుటినా వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతిచెందాడు. -
చోరీకి యత్నించిన వ్యక్తికి దేహశుద్ధి
పట్నంబజారు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి యత్నించిన వ్యక్తిని స్థానికులు దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికులు, నగరంపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాసరావుపేట ఐటీసీ కంపెనీ సమీపంలో నివాసం ఉండే కొత్తూరి కృష్ణకుమారి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. గమనించిన స్థానికులు ప్రశ్నించటంతో, పొంతన లేని సమాధానమిచ్చి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. వారిలో హరిబాబు అనే వ్యక్తి పట్టుపడగా, మరొక గుర్తు తెలియని వ్యక్తి ఉడాయించారు. దీంతో స్థానికులు దొరికిన వ్యక్తికి దేహాశుద్ధి చేసి నగరంపాలెం పోలీసులకు అప్పజెప్పారు. రెండు రోజుల కిందట శ్రీనివాసరావుపేట 6వలైనులో జరిగిన చోరీ కేసులో వీరే అనుమానితులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. స్థానికులు అప్పజెప్పిన హరిబాబు జేబులో రెండు ఉంగరాలు, కొద్దిపాటి నగదు, పలు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. రెండు రోజుల కిందట జరిగిన ఫిర్యాదు పేర్కొన్న వస్తువులేనని తెలుస్తోంది. దీనితో హరిబాబు, మరో వ్యక్తి చొరికి వచ్చినట్లు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కృష్ణకుమారి నివాసంలో ఎటువంటి వస్తువులు పోలేదని ఆమె చెబుతున్నారు. పరారీ అయిన రెండో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆత్మకూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన జోగేంద్ర ప్రసాద్(45) కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు పట్టణంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ను సందర్శించేందుకు ఆటోలో బయలుదేరారు. ఆత్మకూరు నుంచి కరివేన వస్తున్న ఒక ద్విచక్రవాహనంపై కోత మిషన్కు సంబంధించిన పరికరాన్ని తీసుకు వస్తుండగా ప్రమాదవశాత్తు ఆటోలో ఉన్న జోగేంద్ర ప్రసాద్ కాలి మడమను తాకడంతో తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
పాముకాటుకు గురై యువకుడి మృతి
సాతులూరు (నాదెండ్ల): పాము కాటుకు గురై చికిత్స పొందుతూ ఓ యువకుడు మతి చెందిన సంఘటన మండలంలోని సాతులూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన పస్తం రెడ్డయ్య (18) గత వారం చందవరం రక్షిత మంచినీటి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టే సమయంలో పాముకాటుకు గురయ్యాడు. రెడ్డయ్యను నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. -
భూ పంపిణీలో వివాదం
పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన గ్రామస్తుడు ఈపూరు: భూములు అప్పగించే విషయంలో మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో శుక్రవారం వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరు పురుగు మంది తాగి ఆత్మహత్యాయత్నాకి ప్రయత్నించారు. మండలంలోని ఇనిమెళ్ళ గ్రామంలో భూములను గత నాలుగు రోజుల నుంచి పేదలకు రెవెన్యూ అధికారులు పంపిణీ చేస్తున్నారు. అధికారులు పంపిణీ చేస్తున్న భూములను గ్రామానికి చెందిన కొందరు బాగు చేసుకొని సాగు చేసుకుంటున్నారు. తాము సాగు చేసుకుంటున్న భూములను పంపిణీ చేయడానికి వీళ్లేదంటూ గ్రామానికి చెందిన బండారు దిబ్బయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. దీంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని అతని వద్ద ఉన్న పురుగు మందు డబ్బాను లాక్కున్నారు. పురుగు మందు తాగిన వెంటనే ఈపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం రూరల్ సీఐ శ్రీనివాసరావు ఆద్వర్యంలో బొల్లాపల్లి ఎస్సై పట్టాభిరామయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సర్వేను అడ్డుకుంటున్న దిబ్బయ్య భార్యతో మాట్లాడి రెవెన్యూ అధికారులు వెనుదిరిగారు. తహశీల్దార్ ప్రశాంతి జరిగిన విషయాన్ని ఆర్డీవో రవీంద్రకు ఫోన్ద్వారా తెలియజేశారు. తాత్కాలికంగా పంపిణీ నిలిపవేసినట్లు తహశీల్దార్ ప్రకటించారు. మొత్తం 84 మందికి గాను 73 మంది లబ్ధిదారులకు భూముల అప్పగించినట్లు తెలిపారు. వీఆర్వో ఉమాశంకర్, సర్వేయర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
కాజీపేట : బంధువని నమ్మి వచ్చిన యువతిపై కన్నేసి అత్యాచారం చేసిన కేసులో మొదటి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ రమేష్కుమార్ తెలిపారు. కాజీపేట పోలీసుస్టేషన్లో ఎస్సై భీమేష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం కాల్వశ్రీరాంపురానికి చెందిన పొన్నం అంజయ్య(30) వరుసకు మరదలైన యువతిని పెళ్లి సంబంధం చూస్తానని నమ్మించి హైదరాబాద్ నుంచి కాజీపేటకు ఈ నెల 1వ తేదీ రాత్రి తీసుకొచ్చాడు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కాజీపేట చౌరస్తాలో టిఫిన్ చేసి మద్యం తాగిన అంజయ్య ప్లాన్ ప్రకారం టౌన్ రైల్వేస్టేషన్ వైపు తీసుకెళ్లి బెదిరించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వారిని పసిగట్టిన మరో ఇద్దరు యువకులు యువతిని బెదిరించి అత్యాచారం చేశారు. ఈ విషయం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పారిపోతున్న అంజయ్యను రైల్వేజంక్షన్ సమీపంలో పట్టుకున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్కు పంపించారని వివరించారు. సమావేశంలో క్రైం ఎస్సై నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
వ్యక్తి మృతిపై ఏజేసీ విచారణ
ఖానాపురం : గూడూరు మండలంలోని బొల్లెపల్లికి చెందిన ఓ వ్యక్తి మృతిపై ఏజేసీ తిరుపతిరావు సోమవారం విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. గూడూరు మండలంలోని బొల్లెపల్లికి చెందిన మెట్టు వీరస్వామి ఖానాపురం మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. గత ఐదేళ్ల క్రితం వీరస్వామి మృతిచెందాడు. అతడి మృతిపై గతం లో విచారణ చేపట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులు వేర్వేరు కారణాలు చూపుతూ ప్రభుత్వానికి నివేదికలు అందించారు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు నివేదించగా, మానుకోటలో జరిగిన దాడిలో రబ్బర్ బుల్లెట్ తగిలి మానసికంగా ఇబ్బందిపడుతూ మృతిచెందినట్లు నివేదికలు అందించారు. వేర్వేరుగా నివేదికలు రావడంతో కలెక్టర్ వాకాటి కరుణ పునర్విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టినట్లు ఏజేసీ తెలిపారు. మృతుడి భార్య జ్యోతితో మాట్లాడగా రబ్బరు బుల్లెట్ తగలక ముందు బాగానే ఉన్నాడని, బుల్లెట్ తగిలి మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురై మృతిచెందినట్లు తెలపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పూల్సింగ్ చౌహాన్, ఏఆర్ఐ గండ్రాతి స్వప్న, వీఆర్వోలు వెంకన్న, వీఆర్ఏ యాకయ్య, ఐలేష్ పాల్గొన్నారు. -
క్వారీ గుంతలో పడి యువకుడి మృతి
రావిపాటివారిపాలెం (ప్రత్తిపాడు): ప్రమాదవశాత్తూ క్వారీలో గుంతలో పడి యువకుడు మృతి చెందిన ఘటన రావిపాటివారిపాలెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం ప్రత్తిపాడు పంచాయతీ పరిధిలోని రావిపాటివారిపాలెంకు చెందిన వాసిమళ్ళ నాగేశ్వరరావు(37) సోమవారం ఉదయం పొలానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు క్వారీ గుంతలో దిగాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి గుంతలో పడ్డాడు. గమనించిన స్థానికులు అతనిని బయటకు తీసి ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి జోసఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.బాలకష్ణ తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య
వెల్దుర్తి (గుంటూరు జిల్లా) బండరాళ్లతో మోది ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. వెల్దుర్తి మండలం దావుపల్లి సమీపంలో శివుని బావి వద్ద గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. హత్యపై శుక్రవారం ఉదయం సమాచారం అందుకున్న మాచర్ల రూరల్ సీఐ ఏ.శివశంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో బండరాళ్లతో మోది హత్య చేశారని గుర్తించారు. మృతుడి వివరాలు తెలియకపోవటంతో డాగ్స్క్వాడ్, క్లూస్టీంలకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్టీం సభ్యుల బృందం మృతదేహాన్ని పరిశీలించి, చొక్కా జేబులో ఉన్న ప్రామిసరీ నోట్ల ఆధారంగా మహంకాళి వెంకట కృష్ణ(42)గా గుర్తించారు. ఇతను ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం తెల్లకట్లకు చెందిన వాడుకాగా, వినుకొండలో నివాసం ఉంటున్నాడు. సంఘటనా స్థలం నుంచి హత్యకు ఉపయోగించిన పరికరాలను క్లూస్టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. డాగ్స్క్వాడ్లో డాగ్ ఘణి మృతదేహం వద్ద నుంచి మాచర్ల–శ్రీశైలం రహదారిలో దావుపల్లి వైపు కొంత దూరం వచ్చి న ల్లమల అటవీ ప్రాంతంలోకి వెళ్లి నీటికుంట వద్ద ఆగింది. వెంకటకృష్ణ హత్యపై అతని అన్న కృష్ణమూర్తికి, బంధువులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ కె.నాగేశ్వరరావు పరిశీలించారు. ఈయన వెంట గురజాల, మాచర్లరూరల్ సీఐలు ఎంవి సుబ్బారావు, ఏ.శివశంకర్, ఎసై ్సలు రవికష్ణ, సుబ్బారావు ఉన్నారు. వీఆర్వో ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి
ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి ఇంజక్షన్ , వ్యక్తి, మృతి injuction, person, died Injection reaction కారంపూడి (గుంటూరు) : ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంపూడిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా వున్నాయి. స్థానిక ఇందిరా నగర్ కాలనీలో ముత్యాలంపాటి సత్యనారాయణ అనే రైతు అప్పుల బాధ తాళలేక మృతి చెందాడు. ఆయనను చూసేందుకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్న బంధువు ముత్యాలంపాటి కృష్ణ తనకు నడుములో నొప్పి వస్తోందని చెప్పాడు. దీంతో బంధువులు దగ్గరల్లోని ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆయన ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కృష్ణ మృతి చెందాడు. దీంతో దగ్గరి బంధువు మృతితో బాధపడుతున్న అక్కడివారికి మరొకరు మృతి చెందాడని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వారు ఎవరినీ నిందించలేదు. తప్పొప్పులు ఎంచలేదు. బాధను పంటి బిగువనే వుంచుకుని మృతదేహాన్ని స్వగ్రామం ప్రకాశం జిల్లా రావిపాడుకు తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట పరిధి యాదగిరిపల్లి శివారులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాజశేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... పట్టణ ంలోని బీసీ కాలనికి చెందిన జగనాథం చిన్న వెంకటయ్య(29) వెంట్రుకల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటయ్య ఆదివారం ఉదయం 11గంటలకు పిట్టల షికారికని వెళ్లాడు. సాయంత్రమైన తన భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన భార్య, కాలనీలో వెతికింది. ఎక్కడ కనిపించకపోవడంతో భార్య బంధువులతో కలిసి స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సోమవారం ఉదయం భార్య, తమ బంధువులతో కలిసి వెతికింది. తరచు షికారికి వెళ్లే యాదగిరిపల్లి శివారులోని ఓ వెంచర్ సమీపంలోకి వెళ్లి చూసింది. అక్కడ ఉన్న ఓ చెట్టు కింద తన భర్త వెంకటయ్య మరణించి కనిపించాడు. దీంతో బంధువులు ఎస్ఐ రాజశేఖర్రెడ్డికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
గుర్తుతెలియని యువకుడి హత్య
– తల, మొండెం వేర్వేరు చోట్ల పడేసిన దుండగులు పీలేరు: గుర్తుతెలియని యువకుడిని గొంతుకోసి హత్య చేసి తల, మొండెం వేర్వేరు చోట్ల పడేసిన సంఘటన పీలేరు–తిరుపతి మార్గంలోని టీఎన్ఆర్ కాంప్లెక్స్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. టీఎన్ఆర్ కాంప్లెక్స్ సమీపంలో ఒక యువకుడు హత్యకు గురైనట్టు వాకింగ్కు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పీలేరు సీఐ డి.నాగరాజు, ఎస్ఐ సుధాకర్రెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించారు. షిరిడీ సాయిబాబా ఆటో కన్సల్టెంట్ కార్యాలయ షెటర్ వద్ద రక్తపు మరకలు ఉండడంతో అక్కడ హత్య చేసి సమీపంలో మొండె పడేసినట్టు గుర్తించారు. దుండగులు తలను వేరుచేసి సమీపంలోని తిరుపతి–పీలేరు రహదారికి పక్కనున్న ముళ్లపొదల్లో పడేశారని పోలీసులు తెలిపారు. అక్కడున్న కత్తి, కర్చీప్లను స్వాధీనం చేసుకున్నారు. హత్యకు గురైన వ్యక్తి స్థానికుడు కాదని, అతను ఎవరనే విషయం విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పాత కక్షలతో చంపారా? లేక వివాహేతర సంబంధంతో హత్య చేశారా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మిర్యాలగూడ రూరల్ : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన మండలంలోని వెంకటాద్రిపాలెం శివారులో శనివారం రాత్రి జరిగింది. రూరల్ ఎస్సై సర్దార్నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన నార్ల శ్రీనియ్య (40) గ్రామం నుంచి బైక్పై మిర్యాలగూడకు బయలు దేరాడు. ఈ క్రమంలో వెంకటాద్రిపాలెం శివారుకు రాగానే అదే మార్గంలో వస్తున్న లారీని క్రాస్ చేయబోయి లారీ ఢీకొట్టాడు. దీంతో త్రీగాయాలై శ్రీనియ్య అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృత దేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
బతికుండగానే శ్మశానంలో వదిలేశారు
-
భార్యల పోరు తట్టుకోలేక..
– మనస్తాపంతో భర్త ఆత్మహత్య – సూర్యాపేట మండల పరిధిలో ఘటన సూర్యాపేటరూరల్ ఇద్దరు భార్యల పోరును తట్టుకోలేక ఓ భర్త ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట మండలం బాలెంల ఆవాసం యర్కలతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. సూర్యాపేటరూరల్ ఎస్ఐ జి.శ్రీనువాస్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యర్కలతండాకు చెందిన భూక్యా లింగయ్య(35) 2003వ సంవత్సరంలో పట్టణ పరిధి బలరాంతండాకు చెందిన మంజులను వివాహం చేసుకున్నాడు. బాబు జన్మించినంత వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం మనస్పర్థలు రావడంతో మంజుల భర్త లింగయ్యతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లింగయ్య ఎనిమిది సంవత్సరాల క్రితం చివ్వెంల మండలం మున్యానాయక్తండాకు చెందిన సునితను రెండో వివాహం చేసుకున్నాడు. కుమారుడు, కుమార్తె జన్మించారు. అయితే లింగయ్య మెుదటి భార్య మంజులకు చెందిన వ్యవసాయభూమి యర్కలతండాలో ఉంది. అప్పుడప్పుడు మంజుల తండాకు వెళ్లిన సమయంలో సునితతో గొడవపడేది. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరికీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. విషయాన్ని సునిత భర్త లింగయ్యతో చెప్పడంతో ఆమెపైనే చేయిచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు భార్యల పోరుతో మనస్తాపం చెందిన లింగయ్య బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేరసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం గమనించిన కుటుంబసభ్యులు గమనించడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. లింగయ్య తండ్రి పంతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
చిట్యాల: మద్యం తాగి వాహనాన్ని నడిపిన డ్రైవర్కు జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ రామన్నపేట మున్సిఫ్ కోర్టు జడ్జి శుక్రవారం తీర్పు చెప్పినట్టు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. వివరాలు.. చిట్యాల పట్టణం జాతీయ రహదారిపై గురువారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను స్థానిక పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నాగపూర్ వైపునకు లారీలో లోడుతో వెళుతున్న డ్రైవర్ అక్బర్ మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు. ఇతని వెంటనే అదుపులోకి తీసుకుని రామన్నపేట మున్సిఫ్ కోర్టులో హాజరుపరిచారు. అక్బర్పై నేరం నిరూపణ కావడంతో రూ. రెండు వేల జరిమానాతో పాటు ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు. -
కాపు కాసి మారణాయుధాలతో..
* కోర్టు వాయిదాకు వెళుతుండగా దాడి * వ్యక్తి మృతి * నలుగురికి తీవ్ర గాయాలు * పరారీలో నిందితులు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్మార్క్స్ ఏనాడో చెప్పాడు. కొందరు మనుషుల మధ్య మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థికపరమైన అంశాలతోనే ముడిపడి ఉంటున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులూ బిడ్డల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కేసులు ఇటీవల ఎక్కువగా బహిర్గతమవుతున్నాయి. రక్తసంబంధీకులు సైతం ఆస్తుల కోసం పంతాలకు పోయి అంతం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం తెనాలిలో జరిగిన హత్య తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెనాలి రూరల్: కోర్టుకు వెళుతున్నవారిపై దుండగులు కాపు కాసి మారణాయుధాలతో దాడిచేసి ఒకరిని హతమార్చిన ఘటన బుధవారం మండలంలోని నేలపాడు సమీపంలో జరిగింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ల సీతమ్మకు 16 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఆరెకరాలు తన ఏకైక కుమారుడు శ్రీకాంత్రెడ్డికి, మిగిలిన తొమ్మిది ఎకరాల్లో మూడెకరాల చొప్పున ముగ్గురు కుమార్తెలకు రాసింది. పెద్ద కుమార్తె శ్రీలక్ష్మిని తన తమ్ముడైన పగడాల బలరామిరెడ్డి(40)కి ఇచ్చి వివాహం చేసింది. నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్రెడ్డి అనుమానాస్పద స్థితిలో రేపల్లె బ్యాంక్ కెనాల్లో పడి వృతి చెందాడు. అతని పేరిట రాసిన ఆరెకరాల పొలానికి సంబంధించి వివాదం జరుగుతోంది. దీనికి సంబంధించి సీతమ్మ, రెండో అల్లుడు, వల్లభాపురంలో నివసించే వంగా సుధాకర్రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారని, దాడి చేశారంటూ 2013లో పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టు వాయిదాకు వెళ్తుండగా.. ఈ కేసులకు సంబంధించి తెనాలి కోర్టులో బుధవారం వాయిదా ఉంది. దీనికి సీతమ్మ, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి, కేసులో సాక్షి అయిన దేవయ్యను తీసుకుని తూములూరుకే చెందిన నాని ఆటోలో కోర్టుకు బయలుదేరారు. కొల్లిపర మండలం చివలూరు, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు వీరి ఆటోను కారుతో అటకాయించారు. దీంతో ఆటో, కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లాయి. ఆటో బోల్తాపడి అందులోని వారు గాయపడ్డారు. కారులో నుంచి దిగిన ఐదుగురు వీరిని బయటకు లాగి ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి కారును వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే వృతి చెందాడు. సీతమ్మ, దేవయ్య, నాని తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఒక వేట కొడవలి, కర్ర, మద్యం సీసా ఉన్నాయి. విషయం తెలుసుకున్న సీఐలు యు.రవిచంద్ర, బి.కళ్యాణ్రాజు, బి.శ్రీనివాసరావు, తెనాలి తాలూకా ఎస్ఐ ప్రభాకరరావు, కొల్లిపర ఎస్ఐ అనిల్కుమార్రెడ్డి, దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి తమ సిబ్బందితో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. దేవయ్య, నాని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. -
మహిళను వేధించిన వ్యక్తిపై కేసు
గీసుకొండ : మండలంలోని మరియపురానికి చెందిన ఓ వివాహితను కొన్ని రోజులుగా వేధిస్తున్న వ్యక్తిపై గీసుకొండ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన మహిళకు వరుసకు బావ అయిన వెంకటయ్య గత కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. దీనిపై సదరు మహిళ తన భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మద్యం తాగి భర్త వీరంగం!
భార్య, కుమారుడిపై దాడి గణపవరం (నాదెండ్ల): మద్యం తాగి ఒక వ్యక్తి వీరంగం వేసిన సంఘటన మండలంలోని మేజర్ పంచాయతీ గణపవరంలోని శాంతి నగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మేరీకి 22 సంవత్సరాల క్రితం సత్తెనపల్లికి చెందిన లారీడ్రై వర్ కాకుమాను కుమార్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్లుగా భర్త మద్యానికి బానిసై ఇంటికి రాకుండా, కుమారుల ఆలనాపాలన చూడకపోవడంతో విసుగుచెందిన భార్య మేరీ పుట్టింటింకి చేరింది. చాలాసార్లు పెద్దలు రాజీ కుదిర్చి చక్కదిద్దినా కుమార్ ప్రవర్తనలో ఏ మార్పు రాకపోగా, మద్యం తాగి భార్యాబిడ్డలపై తరచు దాడికి పాల్పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మేరీ పిల్లలతో కలిసి మళ్లీ పుట్టింటికి వచ్చింది. అన్నదమ్ముల నివాసాల మధ్యలో గహాన్ని అద్దెకు తీసుకుని ఉంటూ కూలి పనులకు వెళుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో పెద్దకుమారుడు మృతి చెందాడు. రెండో కుమారుడిని తనతో పాటు కూలి పనులకు తీసుకువెళుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో భర్త కుమార్ శుక్రవారం రాత్రి మద్యం పూటుగా తాగి గణపవరంలో నివసిస్తున్న భార్య ఇంటికి చేరి భార్య, కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశాడు. కుమారుడు రాజేష్ గొంతు పట్టుకుని నొక్కడంతో అతడు కేకలు వేయడంతో స్ధానికులు వచ్చి కుమార్ను తాళ్లతో బంధించారు. తండ్రిని ప్రతిఘటించే క్రమంలో రాజేష్కు చేతికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్ను స్థానిక వైద్యశాలకు తరలించారు. -
ఏఎమ్మార్పీ కెనాల్లో గల్లంతైన వ్యక్తి మృతి
పెద్దఅడిశర్లపల్లి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన తిప్పని శ్రీనివాస్రెడ్డి (50) మృతిచెందాడు. అతడి మృతదేహం మంగళవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని ఘణపురం స్టేజీ సమీపంలో తన స్నేహితులతో కలిసి స్నానం చేసేందుకు కాల్వలోకి దిగిన శ్రీనివాస్రెడ్డి నీటి ప్రవాహానికి కొట్టుకుని పోయాడు. గమనించిన స్థానికులు, స్నేహితులు నీటిలోకి దిగి గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వెంటనే హుటాహుటీనా గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఏఎమ్మార్పీ గేట్లు తాత్కాలికంగా మూసివేయించారు. అనంతరం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలించగా మృతదేహం లభ్యమైంది. గ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గుడిపల్లి ఎస్ఐ భోజ్యానాయక్ తెలిపారు. కాగా మృతుడు శ్రీనివాస్రెడ్డికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
చెన్నకేశ్వాపురం(నడిగూడెం): నిమ్మతోట ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. మండల పరిధిలోని చెన్నకేశ్వాపురం గ్రామానికి చెందిన తంగెళ్ల వెంకన్న(42) ఈ నెల ఏడో తేదీన తన నిమ్మ తోట వద్ద పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ప్రహారీగా ఉన్న రాతి స్తంభం మీద పడడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. చికిత్స కోసం ఖమ్మంకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
చెరువులో జారిపడి వ్యక్తి మతి
చెరువు, జారిపడి, వ్యక్తి మతి, person, died, pond one person died in pond person, died, pond యలమంచిలి: యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు. పట్నంలోని మధురానగర్కు చెందిన ఈ.శేషగిరిరావు (59) ఏటా శ్రావణమాసంలో కలువ పువ్వులు విక్రయిస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం రాత్రి పది గంటల సమయంలో కలువ పువ్వుల కోసం వెళ్లిన శేషగిరిరావు నీటి మునిగి మతి చెందడం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమాచారం తెలిసిన పట్టణ పోలీసులు మతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
చెరువులో జారిపడి వ్యక్తి మతి
చెరువు, జారిపడి, వ్యక్తి మతి, person, died, pond one person died in pond person, died, pond యలమంచిలి: యలమంచిలి పట్టణ సమీపంలోని పెంజెరువులో తామరపువ్వుల కోసం దిగిన ఓ వ్యక్తి మతి ప్రమాదవశాత్తు మతి చెందాడు. పట్నంలోని మధురానగర్కు చెందిన ఈ.శేషగిరిరావు (59) ఏటా శ్రావణమాసంలో కలువ పువ్వులు విక్రయిస్తుంటాడు. ఎప్పటిలాగానే గురువారం రాత్రి పది గంటల సమయంలో కలువ పువ్వుల కోసం వెళ్లిన శేషగిరిరావు నీటి మునిగి మతి చెందడం అతని కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. సమాచారం తెలిసిన పట్టణ పోలీసులు మతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
గుంటూరు లీగల్: మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు నల్లబోయిన గోపికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ మొబైల్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ పీజే సుధ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గుంటూరు రూరల్ మండలం తోకవారిపాలెం గ్రామానికి చెందిన తెల్లమేకల వీరకుమారి పొలం పనులు చేస్తుంటుంది. సమీప మల్లవరం గ్రామానికి చెందిన నల్లబోయిన గోపికి వీరి పొలం వద్ద పొలాలు ఉన్నాయి. గోపీ తరచుగా వీరకుమారి ¿¶ ర్త గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆమె వెంట పడుతున్నాడు. ఆమె గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు గోపీని మందలించారు. అయినా గోపి తన పద్ధతి మార్చు కోలేదు. 2014 సెప్టెంబర్ 21 మధ్యాహ్నం వీరకుమారి పొలంలో జొన్న గడ్డి కోస్తుండగా గోపీ ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయండంతో చుట్టుపక్కల వారు రాగా పారిపోయాడు. జరిగిన సంఘటనపై వీరకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీసులు గోపిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ నిందితుడిపై నేరం రుజువు చేయడంతో అతనికి జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి సుధ తీర్పు చెప్పారు. -
ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
చౌటుప్పల్ : మండలంలోని పెద్దకొండూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటంబావికి చెందిన పడమటి అశోక్రెడ్డి(37) ఆదివారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన కొంత కాలంగా అప్పుల బాధతో, వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జీవితంపై విరక్తి చెంది, ఆదివారం ఉదయం 7గంటల సమయంలో తన వ్యవసాయ బావి వద్ద గల కోళ్లఫామ్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి భార్య గేదెలను తోలుకొని, బావి వద్దకు రాగా చనిపోయి ఉన్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎస్.నవీన్కుమార్ కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇతడికి కుమారుడు, కుమార్తె ఉంది. కాగా మృతుడు అశోక్రెడ్డి నాలుగేళ్ల క్రితం తన తండ్రిని అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన విషయం విదితమే. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
గంజాయితో వ్యక్తి అరెస్టు గంజాయి, వ్యక్తి, అరెస్టు gangai, person, arrest చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని బొందిలిపాలెంలో నడిచి వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఎకై ్సజ్ అధికారులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ సీఐ బి.లత తెలిపిన వివరాల ప్రకారం వడ్డెరపాలెంలో నివాసం ఉండే తన్నీరు శంకరం వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం అందుకొని దాడిచేశారు. బొందిలిపాలెం వద్ద అతని నుంచి 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ సుమారు రూ.16 వేలు ఉంటుంది. దాడిలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ ఎస్ఐ ఎండీ ఖాసిం షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామన్నపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు తెలిపిన వివరాలప్రకారం.. కాషాయవస్త్రాలు ధరించిన సమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి వలిగొండ వద్ద బస్సు ఎక్కి చిట్యాలవరకు టికెట్ తీసుకున్నాడు. నాగారం వద్దకు రాగానే అతనికి ఫిట్స్ వచ్చాయి. తోటి ప్రయాణికులు అతనికి ప్రథమ చికిత్స అందించారు. బస్సు రామన్నపేటకు చేరుకోగానే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తిమృతి
కొలనుపాక (ఆలేరు) : మండలంలోని కొలనుపాకలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఆలేరు ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలం ములుగు గ్రామానికి చెందిన కాసమైన మల్లేశం(35) కొన్ని సంవత్సరాల క్రితం కొలనుపాక గ్రామానికి ఇల్లరికం వచ్చాడు. ఇతడి భార్య స్వప్న శనివారం సాయంత్రం తన అత్తగారిళ్లు ములుగుకు వెళ్లింది. అదేరోజు రాత్రి మల్లేశం ఇంటి నుంచి బయల్దేరి రాఘవాపురం రోడ్డులోని ఓ వ్యవసాయ బావి వద్ద శవం అయి కనిపించాడు. దీంతో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు 10ఏళ్లలోపు ఇద్దరు అమ్మాయిలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు
కాసనగోడు(కేతేపల్లి): కోతుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన బొజ్జ జానయ్య బుధవారం మధ్యాహ్నం తన ఇంట్లో భోజనం చేస్తుండగా కోతులు గుంపులుగా జొరబడ్డాయి. వాటిని వెళ్లగొట్టేందుకు జానయ్య ప్రయత్నించగా ఒక్కసారిగా ఆయన మీదకు ఎగబడి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన జానయ్యను కుటంబ సభ్యులు చికిత్స నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెద్దవూర విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన కొర్ర లక్పతి–ధరియాయిలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. వీరిలో చిన్న కుమారుడు కొర్ర సక్రు(17) తండాలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి చిరు జల్లులతో కూడిన వర్షం పడింది.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇంట్లో ఉన్న బల్బును బంద్ చేయటానికి కరెంట్ బోర్డు వద్దకు వెళ్లాడు. స్విచ్ బంద్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. ట్రాన్స్కో అధికారులే కారణమంటూ.. తండాలో మూడు నెలల క్రితం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దానికి ఎర్త్ను సక్రమంగా బిగించకపోవడంతో తండాలో ఏది ముట్టుకున్నా విద్యుత్ షాక్ వస్తుందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని గతంలోనూ తండాలో ఐదారుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారని వాపోయారు. అధికారులు స్పందించి ఎర్త్ తీగలను సరిచేసి మరమ్మతులు చేపడితే ఇంత ఘోరం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం కారణంగానే సక్రు మృతి చెందాడని ఆగ్రహించిన మృతుని బందువులు, తండావాసులు ట్రాక్టర్లు, ఆటోలు, ద్వి చక్రవాహనాలపై మృతదేహంతో పెద్దవూర సబ్ స్టేషన్కు తరలివచ్చారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి గంట సేపు రాస్తారోకో చేశారు. దీంతో ఎటూ కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడిని ఫలితం లేకుండా పోయింది. సక్రు మృతికి కారణమైన ట్రాన్స్కో ఏఈని సస్పెండ్ చేయాలని, ఉన్నతాధికారులు వచ్చేదాకా రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. ఎస్ఐ బాడాన ప్రసాదరావు, పీఎస్ఐ కె.శ్రీనివాస్లు మృతుని బందువులతో మాట్లాడి టాన్స్కో ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని సర్ది చెప్పటంతో రాస్తారోకోను విరమించుకున్నారు. డీఐజీ వాహనాన్ని అడ్డుకున్న మృతుడి బంధువులు నాగార్జునసాగర్లో పోలీస్స్టేషన్ నూతన భవన ప్రారంభానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, డీజీపీ అనురాగ్శర్మ వస్తుండటంతో డీఐజీ నాగిరెడ్డి సైతం రోడ్డు మార్గంలో వాహనంలో వెళ్తున్నారు. ఆయన వాహనం రాస్తారోకోలో చిక్కుకుంది. డీఐజీ వాహనాన్ని గమనించిన పోలీసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతుడి బంధువులు, గిరిజనులు అంతా ఒక్కసారిగా వాహనానికి అడ్డు వచ్చి తమకు న్యాయం జరిగేదాకా పోనిచ్చేది లేదని అడ్డుకున్నారు. వారికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో వారిని పక్కకు నెట్టి వాహనాన్ని పంపించారు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పెద్దవూర విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన కొర్ర లక్పతి–ధరియాయిలకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. వీరిలో చిన్న కుమారుడు కొర్ర సక్రు(17) తండాలోనే వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సోమవారం రాత్రి చిరు జల్లులతో కూడిన వర్షం పడింది.రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఇంట్లో ఉన్న బల్బును బంద్ చేయటానికి కరెంట్ బోర్డు వద్దకు వెళ్లాడు. స్విచ్ బంద్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. ట్రాన్స్కో అధికారులే కారణమంటూ.. తండాలో మూడు నెలల క్రితం సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దానికి ఎర్త్ను సక్రమంగా బిగించకపోవడంతో తండాలో ఏది ముట్టుకున్నా విద్యుత్ షాక్ వస్తుందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని గతంలోనూ తండాలో ఐదారుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారని వాపోయారు. అధికారులు స్పందించి ఎర్త్ తీగలను సరిచేసి మరమ్మతులు చేపడితే ఇంత ఘోరం జరిగేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం కారణంగానే సక్రు మృతి చెందాడని ఆగ్రహించిన మృతుని బందువులు, తండావాసులు ట్రాక్టర్లు, ఆటోలు, ద్వి చక్రవాహనాలపై మృతదేహంతో పెద్దవూర సబ్ స్టేషన్కు తరలివచ్చారు. నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి గంట సేపు రాస్తారోకో చేశారు. దీంతో ఎటూ కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతుడి బంధువులతో మాట్లాడిని ఫలితం లేకుండా పోయింది. సక్రు మృతికి కారణమైన ట్రాన్స్కో ఏఈని సస్పెండ్ చేయాలని, ఉన్నతాధికారులు వచ్చేదాకా రాస్తారోకోను విరమించేది లేదని బీష్మించుకు కూర్చున్నారు. ఎస్ఐ బాడాన ప్రసాదరావు, పీఎస్ఐ కె.శ్రీనివాస్లు మృతుని బందువులతో మాట్లాడి టాన్స్కో ఉన్నతాధికారులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని సర్ది చెప్పటంతో రాస్తారోకోను విరమించుకున్నారు. డీఐజీ వాహనాన్ని అడ్డుకున్న మృతుడి బంధువులు నాగార్జునసాగర్లో పోలీస్స్టేషన్ నూతన భవన ప్రారంభానికి రాష్ట్ర హోం శాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, డీజీపీ అనురాగ్శర్మ వస్తుండటంతో డీఐజీ నాగిరెడ్డి సైతం రోడ్డు మార్గంలో వాహనంలో వెళ్తున్నారు. ఆయన వాహనం రాస్తారోకోలో చిక్కుకుంది. డీఐజీ వాహనాన్ని గమనించిన పోలీసులు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో మృతుడి బంధువులు, గిరిజనులు అంతా ఒక్కసారిగా వాహనానికి అడ్డు వచ్చి తమకు న్యాయం జరిగేదాకా పోనిచ్చేది లేదని అడ్డుకున్నారు. వారికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకపోవడంతో వారిని పక్కకు నెట్టి వాహనాన్ని పంపించారు. -
రోగి చికిత్స ఆపినా.. ఇన్సూరెన్స్ క్లెయిమ్!
చంఢీఘర్: వైద్యం పని చేయదనే డాక్టర్ల సలహా మేరకు చికిత్స ఆపేవేసి మరణించే రోగులకు ఇన్సూరెన్స్ ఇవ్వాలని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. రోగి చికిత్స చేయించుకోకుండా మరణిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదంటూ ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం వైద్యం ఆపివేసిన తర్వాత మరణించే రోగులకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దశాబ్దాలుగా ట్రీట్ మెంట్ మానేసిన రోగులకు మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు ఇవ్వకుండా ఉంటున్న కంపెనీల ఆటలు ఇక సాగవని వైద్య రంగ నిపుణులు చెప్తున్నారు. చికిత్స తీసుకోకపోవడం రోగికి ఇష్టం లేక కాదని, శారీరక స్థితి సహకరించకపోవడం వ్యక్తి తప్పుకాదని కోర్టు వ్యాఖ్యనించింది. ఇటువంటి కేసుల్లో కంపెనీలు కచ్చితంగా బాధితునికి ఇన్సూరెన్స్ చెల్లించాలని కోర్టు తేల్చి చెప్పింది. మతపరమైన నమ్మకాలు ఉండటం వల్ల కొంతమంది రోగులు(రక్త మార్పిడి తదితరాలు) చికిత్సకు అంగీకరించటం లేదని దీనిపై ప్రజలు మరోసారి ఆలోచించుకోవాలని జస్టిస్ కన్నన్ అన్నారు. చండీఘర్ కు చెందిన బ్యాంకు ఉద్యోగి మరణానంతరం ఇన్సూరెన్స్ క్లెయిమ్ పై జరిగిన వాదనల్లో బాధిత కుటుంబానికి రూ.35.46లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
హైదరాబాద్సిటీ: జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బీరప్పగడ్డ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన వాటర్ పైప్లైన్ కోసం తీసిన గుంతలో పడి ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎవరైనా హత్య చేసి గుంతలో పడేశారా లేక ప్రమాదవశాత్తూ పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అత్యాచారం కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు
న్యూఢిల్లీ: మహిళపై దాడి చేసి అత్యాచారం చేయడంతోపాటు ఆమెను హతమార్చడానికి యత్నించిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 జూన్ 24న తన ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన ఓ డ్రైవర్.. తాగడానికి నీరు కావాలని అడిగాడు. ఇంతలోనే ఆమెపై అమాంతం దాడికి పాల్పడి సెల్ఫోన్ చార్జర్ సాయంతో ఆమెను కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతోపాటు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. అతడి చర్యను అత్యంత పాశవిక, ఆటవికమైనదిగా అభివర్ణించింది. నేరస్తుడికి కుటుంబం ఉన్నప్పటికీ బాధిత మహిళ ఆక్రందనను దృష్టిలో ఉంచుకొని అతనికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ గురువారం తీర్పు వెలువరించారు. -
వడదెబ్బకు వ్యక్తి మృతి
టేకులపల్లి: ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం పంచాయతి శాంతినగర్ లో వడదెబ్బకు బలైపోయాడు. గ్రామానికి చెందిన చేతుల రాఘవులు(60) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం వడదెబ్బతో మృతిచెందాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
నల్లగొండ: వడదెబ్బకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నర్సింహ (50) అనే వ్యక్తి బుధవారం కట్టెలు కొట్టడానికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాడు. వడదెబ్బ ప్రభావంతో రాత్రి ప్రాణాలు కోల్పోయాడు. -
ప్రాణం తీసిన తుపాకీతో సెల్ఫీ
శాన్ఫ్రాన్సిస్కో: సెల్ఫీ మోజులో పడి ఓ వ్యక్తి తుపాకీతో ప్రమాదవశాత్తూ తనను తాను కాల్చుకొని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్కు చెందిన ఓ 43 ఏళ్ల వ్యక్తి తన స్నేహితురాలితో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా తుపాకీతో ఫోజు ఇస్తూ ఫోటో తీసుకోబోయి తుపాకీ ట్రిగ్గర్ నొక్కేశాడు. తుపాకీలో బులెట్లు లేవని భావించే ఆయన ఈ సాహసానికి ఒడిగట్టాడని అది అతని ప్రాణాలను హరించిందని అక్కడి పోలీసులు చెప్తున్నారు. -
గాంధీభవన్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
-
బ్రిటన్ బామ్మకు శుభాకాంక్షల వెల్లువ
ఆమె... మొదటి ప్రపంచయుద్ధ సమయంలో టీనేజర్. కూలిపోయిన మొదటి జెపెలియన్ విమానాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. పియానో వాయిద్యంలోనూ ఆరితేరిన అనుభవశాలి. ఎన్నో చారిత్రక విషయాలు, విశేషాలు కళ్ళారా చూసి, మనసునిండా మూటగట్టుకుని 112 ఏళ్ళ సుదీర్ఘ జీవితాన్ని దాటింది. ప్రస్తుతం 113 వ పడిలోకి అడుగిడి.. బ్రిటన్ లోనే అత్యంత వృద్ధురాలుగా రికార్డులకెక్కి ప్రజల సుభాకాంక్షలు అందుకుంటోంది. రైట్ బ్రదర్స్ విజయవంతంగా విమానాన్ని కనుగొన్న సమయంలో పుట్టిన గ్లాడీస్ హూపర్... కేక్ ముక్క తిని, టీ తాగుతూ హాయిగా తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహించుకుంది. ఇంగ్లాండ్ ఇస్లే ద్వీప ప్రాంతం రైడ్ నగరంలోని ఓ నర్సింగ్ హోమ్ లో జరిగిన ఆమె 113 వ పుట్టిన రోజు వేడుకలకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు.. దేశవ్యాప్తంగా ఎంతోమంది అతిథులు హాజరయ్యారు. దేశంలో అత్యంత వయసు కలిగిన మహిళగా గుర్తింపు పొందిన అనంతరం మిసెస్ హూపర్ కు హిప్ రీప్లేస్ మెంట్ అవసరమని వైద్యుల ఆదేశాల మేరకు గత అక్టోబర్ లో నర్సింగ్ హోమ్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చేరే ముందు ఆమె 85 ఏళ్ళ కుమారుడు హర్మిస్టాన్ ఇంట్లోనే ఉండేవారు. బ్రిటన్ దగ్గరలోని రొట్టింగ్ డీన్ లో పెరిగిన ఆమె.. మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి యుక్త వయసులో ఉంది. నాజీలు పోలాండ్ ను ఆక్రిమించుకొని రెండో ప్రపంచ యుద్ధం మొదలైన సమయంలో ఆమెకు 36 ఏళ్ళు. 1916 లో లండన్ పై బాంబు దాడి సందర్భంగా కూలిపోయిన మొదటి జర్మన్ ఎయిర్ షిప్ ను తన తల్లి ప్రత్యక్షంగా చూశారని మిస్టర్ హార్మిస్టాన్ చెప్తున్నారు. అంతేకాక ఆమెకు కాలేజీలో ఎంతోమంది మంచి స్నేహితులు ఉండేవారని, బ్రిటన్ నుంచి ఆస్ట్రేలియా కు సోలోగా విమానాన్ని నడిపిన ఫస్ట్ ఫిమేల్ పైలట్ ఆర్మీ జాన్సన్ తన తల్లికి మంచి ఫ్రెండ్ అని ఆయన చెప్తున్నారు. అప్పట్లో హూపర్ ప్రముఖ పియానో విద్వాంసురాలుగా ఎంతోమంది ప్రముఖులతో కలిసి కచేరీలు ఇచ్చేవారని చాలా కచేరీలకు తాను కూడ వెళ్ళానని అన్నారు. హూపర్ 1922 లో లెస్లీని వివాహం చేసుకున్నారు. 1998 లో ఆయన మరణించారని అప్పటినుంచీ ఆమె తమవద్దే ఉంటున్నారని చెప్పారు. హూపర్ మొదటి లండన్ కార్ హైర్ కంపెనీని పెడదామనుకున్నారని, ఆ తర్వాత... ఇప్పుడు బ్రిటన్ కాలేజ్ గా మారిన కింగ్స్ క్లిఫ్ హౌస్ స్కూల్ ను స్థాపించినట్లు చెప్పారు. నేను ఆమెను చిన్నతనంనుంచే చూస్తున్నానని, ఇప్పటికీ ఆమెను చూస్తే ఎంతో గర్వంగా అనిపిస్తుందని హూపర్ మరో కుమారుడు.. రిటైర్డ్ పైలట్ డెరెక్ అంటున్నారు. అప్పట్లో ఆమె ఎన్నో పార్టీల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారన్నారు. గొప్ప పియానో విద్యాంసురాలైన ఆమె... లండన్ డార్చెస్టర్ హోటల్ లో కచేరీ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు చూశానని చెప్పారు. ఇప్పటికీ ఆమె చేతులు కిందికి పైకీ కదిలించడం చూస్తే.. ఆమె సంగీత జీవితాన్నిగుర్తుచేసుకుంటున్నట్లుగా అనిపిస్తుందని, మ్యూజిక్ ఆమెకు ఎంతో సంతోషమైన, ఆరోగ్యకరమైన జీవితాన్నిచ్చిందని, భవిష్యత్తు కూడ ఆమెకు అంతే ఆనందంగా హాయిగా సాగిపోవాలని కోరుకుంటున్నామని ఆమె కుమారులు చెప్తున్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
లేపాక్షి: వ్యాధి నయం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సోమిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహమూర్తి(38) గత కొన్ని రోజులుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక వ్యాధి నయం కాదని మనస్తాపానికి గురైన నర్సింహమూర్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ ట్రాఫి’కింగ్’నసీర్ !
-
ఇంద్రకీలాద్రిపై వ్యక్తి హల్చల్
-
టవర్ ఎక్కించిన మత్తు
- చడానికి నానా తంటాలు పడ్డ అగ్రిమాపక సిబ్బంది కోలారు : తాగిన మైకంలో ఓ వ్యక్తి ఎయిర్టెల్ సెల్ టవర్ ఎక్కి స్థానికుల్లో ఉత్కంఠ రేపాడు. నగరంలోని గాంధీ నగర్ రెండవ క్రాస్లో ఉన్న శ్రీనివాస్(45) ఉదయం మద్యం సేవించి దగ్గరలోనే ఉన్న ఎయిర్టెల్ టవర్ ఎక్కేశాడు. సుమారు 110 అడుగుల ఎత్తున్న టవర్ దాదాపు సగ ం వరకు వెళ్లి దిగిరావడానికి ససేమిరా అన్నాడు. అంతే కాకుండా కొద్ది సేపయ్యాక మగతలోకి జారుకున్నాడు. దీనిని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎయిర్ టెల్ సిబ్బంది సిగ్నల్ను ఆపు చేయించారు. అగ్ని మాపక సిబ్బంది ముగ్గురు టవర్ పైకి ఎక్కి శ్రీనివాస్ను లేపగా తాను ఇంట్లోనే పడుకుని అన్నానని తాపీగా సమాధానం చెప్పాడు. కిందికి దిగమంటే తాను ఇంట్లోనే ఉన్నానంటూ సమాధానం చెప్పి కిందికి దిగిరావడానికి ఒప్పుకోలేదు. తాగిన మైకంలో ఉన్న శ్రీనివాస్ను కిందికి దించడానికి అగ్నిమాపక సిబ్బందికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది. జిల్లా అగ్నిమాపక దళ అధికారి పి.ఎం.నాగరాజ్, మునిరాజు, విశ్వనాథ్ టవర్ పైకి ఎక్కి శ్రీనివాస్ నడుముకు తాడు కట్టి మునిరాజు భుజంపై కూర్చో బెట్టుకుని నిదానంగా కిందికి దించారు. శ్రీనివాస్ను కిందికి దించగానే స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది చర్యను కొనియాడారు. అనంతరం గల్పేట పోలీసులు శ్రీనివాస్ను స్టేషన్కు తీసుకు వెళ్లారు. ఎవరూ టవర్లు ఎక్కకుండా ఆయా కంపెనీలు తమ టవర్ల వద్ద భద్రతను కల్పించాల్పి ఉందని అగ్నిమాపక అధికారి నాగరాజ్ తెలిపారు. -
సైకియాట్రీ కౌన్సెలింగ్
మా ఊళ్లో మాకు తెలిసిన ఒక వ్యక్తి రోజుల తరబడి ఒకే భంగిమలో స్థాణువులాగా నిలబడిపోయి ఉన్నాడు. అదే భంగిమలో స్థిరంగా, శిలావిగ్రహంలా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాకు దూరపు బంధువు. ఆయనను బాగు చేసే అవకాశం లేదా? - సునీల్, కర్నూలు ఒక వ్యక్తి శిలావిగ్రహంలా అదేపనిగా అలా నిలబడిపోవడాన్ని సైకియాట్రిక్ పరిభాషలో ‘కెటటో నియా’ అంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు కెటటోనిక్ రిజిడిటీ అనే కండిషన్లో వ్యక్తి కండరాలు బిగుసుకుపోయి చాలాసేపు కదలకుండా ఉంటాయి. ఇక పోస్ట్యూరింగ్ అనే స్థితిలో రోగులు అత్యంత కఠినమైన, ఇబ్బందికరమైన భంగిమల్లో గంటలు / రోజుల తరబడి ఉండిపోతారు. ఇలా కెటటోనియా కండిషన్ అనేక రకాలుగా వ్యక్తమవు తుంది. అయితే ఈసీటీ అనే చికిత్సతోనూ, కొన్ని మందులతోనూ వీళ్లను పూర్తిగా బాగు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ -
లైంగిక వేధింపుల కేసులో నిందుతుడు విడుదల
న్యూఢిల్లీ: పన్నెండేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిని ఢిల్లీ అడిషనల్ సెషన్ కోర్టు విడిచిపెట్టింది. నిందితుడు కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అతనికి ఒక అవకాశం ఇస్తూ శిక్ష విధించలేదు.‘ పిల్లలే దేశానికి తరగని సంపద , వారి ఎదుగుదల అభివృద్ధిలపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఎన్నో అంతర్జాతీయ తీర్మానాలు, కోర్టు తీర్పులు ఈ విషయాన్ని నొక్కిచెప్పాయి’ అని జడ్జి వినోద్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయానికి ప్రాసిక్యూషన్ సరైన వాదనలు విన్పించడంలో విఫలం కావడం ఒక కారణం. విచారణ సందర్భంగా చిన్నారి నిందితుడ్ని కోర్టులో గుర్తించింది. కాకపోతే ఆమె తల్లిదండ్రులు ప్రాసిక్యూషన్ వాదనలు కొంత గందరగోళంగా ఉన్నాయని జడ్జి వ్యాఖ్యానించారు. ఢిల్లీకి చెందిన సునీల్పై అత్యాచారం చట్టం సెక్షన్-354, లైంగిక వేధింపులు, ఐపీసీ సెక్షన్8 కింద కేసులు నమోదయ్యాయి. నిందితుడు కుటుంబం అతని సంపాదనపైనే ఆధారపడి ఉంది, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉదారభావంతో ఈ నిర్ణనయం తీసుకుంటున్నట్లు జడ్జి చెప్పారు. ఇలాంటి తప్పుకు పాల్పడటం తొలిసారి కావటం కూడా అతని విడుదలకు ఓ కారణమైంది. వ్యక్తిగత పూచీకత్తు రూ,10,000, ఒకరి హామీగా ఉండాలని ఈ సందర్భంగా కోర్టు షరతు విధించింది. ప్రొబిషనర్ ఆఫీసరు నిందుతుడి కుటుంబ ఆర్థికస్థితిపై ఇచ్చిన నివేదిక ఆధారంగా కోర్టు పరిగణలోకి తీసుకుంది. రాబోయే సంవత్సర కాలంలో నిందితుడి ప్రవర్తన గమనించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆ చిన్నారికి వాయువ్య జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్ఎస్ఎ)ని బాలికకు నష్టపరిహారంగా రూ,50,000 అందించాల్సిందిగా ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే జూన్3, 2013 రాత్రి తన ఇద్దరు చెల్లెళ్లతో మంచంపై నిద్రపోతున్న చిన్నారిపై సునీల్ లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో చిన్నారి గట్టిగా అరవడంతో మేల్కొన్న తల్లిదండ్రులు చుట్టు పక్కల వారు అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
పుట్లూరు : ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చాలవేముల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చాలవేముల గ్రామానికి చెందిన వెంకటరమణారెడ్డి(45) తన ఇంట్లోనే ఉరి వేసుకుని తనువు చాలించాడు. కాగా మృతుడు వెంకట రమణారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కడియం: తూర్పు గోదావరి జిల్లా కగియం మండలం ధామిరెడ్డిపల్లెలో ఉండమట్ల శ్రీనివాస్(32) అనే వ్యక్తి అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఇంటి తలుపు తెరిచి చూసే సరికి శ్రీనివాస్ ఉరేసుకుని కనిపించాడు. ఎవరైనా చంపి ఉరేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
కొడుకు కాదు.. యముడు
ప్రేమకు మారుపేరు అమ్మ.. తన భర్తను చంపినా క్షమించింది..ఓర్పుకు మారు పేరు అమ్మ.. కోడలిని చంపి జైలుకెళ్లిన కొడుకును బెయిలుపై బయటకు తెచ్చేందుకు అహరహం శ్రమించింది..కొడుకే మానవ మృగమై చివరకు కన్నతల్లినీ కడతేర్చాడు. శ్రీరంగరాజపురం మండలం ఎగువముద్దికుప్పం గ్రామంలో వృద్ధురాలు దేశమ్మ ఒంటరిగా ఉంటోంది. డెబ్భైరెండేళ్ల వయసులో రేయింపగలూ కష్టపడుతోంది. ఆమెకు పిల్లలు లేరా అంటే.. లేకేం ఉన్నాడు.. ఒక్కడే కొడుకు. పేరు బాలకృష్ణారెడ్డి. యాభై ఏళ్ల వయసు. అతను జైల్లో ఉన్నాడు. అయ్యో.. అనుకుంటున్నారా.. దేశమ్మ ఒక్కటే తన బిడ్డ కోసం అయ్యో అనుకుంది. ఊరిలో ఎవ్వరూ అతడిని అయ్యో అనుకోలేదు. బాలకృష్ణారెడ్డి మద్యానికి బానిస. రోజూ మందు తాగందే నిద్రపోడు. మందుకు డబ్బు ఇచ్చే వరకూ ఇంట్లో వాళ్లనూ నిద్రపోనివ్వడు. ఆరేళ్ల క్రితం మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి మునిరత్నం రెడ్డినే హత్య చేశాడు. ఈ కేసులో బాలకృష్ణారెడ్డి రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. భర్తను చంపిన కొడుకు శిక్ష అనుభవించి జైలు నుంచి ఇంటికి వచ్చాడు. పోయిన భర్త ఎలానూ పోయాడు, కొడుకైనా ఉన్నాడు చాలనుకుంది దేశమ్మ. ఇకనైనా తన కొడుకులో మార్పు ఉంటుందనుకుంది. అది ఆమె భ్రమే అయింది. రెండేళ్ల క్రితం బాలకృష్ణారెడ్డి భార్య శారదతతో గొడవ పడ్డాడు. ఆవేశం పట్టలేక ఆమెనూ చంపేశాడు. ఆమెది ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నించాడు. ఇది కుదరక పోవడంతో పోలీసులకు చిక్కాడు. అప్పటి నుంచీ జైల్లో ఉన్నాడు. భర్త పోయాడు. కోడలూ పోయింది.. వాళ్లను చంపిన కొడుకు జైళ్లో ఉన్నాడు. అయినా దేశమ్మకు కొడుకుమీద ప్రేమ తగ్గలేదు. ఎలాగైనా సరే తన కొడుకును జైలు నుంచి బయటకు తీసుకురావాలనుకుంది. ఉన్న కాస్త పొలంలో ఏవో సాగు చేసింది. తినీ తినకా డబ్బు కూడబెట్టుకుంది. వాళ్ల కాళ్లూ వీళ్ల కాళ్లూ పట్టుకుని.. ఎలాగైతేనేం, కొడుకును బెయిల్పై ఇంటికి తీసుకొచ్చింది. ఇకనైనా కొడుకు మారతాడని అనుకుంది. ఈ ముసలి వయసులో తనను చూసుకుంటాడనుకుంది. కానీ కొడుకులో మార్పు రాలేదు. అతనిలోని మద్యం మహమ్మారి మరోసారి నిద్రలేచింది. ఉన్న పొలాన్ని అమ్మేశాడు. ఆ డబ్బంతా జల్సా చేసేశాడు. ఏ పనీ చేయడు. వేళకు మాత్రం తిండి కావాలంటాడు. కన్నకొడుకు పస్తుంటే దేశమ్మ చూడలేకపోయింది. ఇంటికి ఆనుకుని ఉన్న కాస్త పొలంలో, ఉడిగిన రెక్కల్లో సత్తువ నింపుకుని కూరగాయలు సాగుచేసింది. ఉన్నంతలో యాభై ఏళ్ల కొడుక్కు లోటు లేకుండా చూసుకుంది. అయినా బాలకృష్ణారెడ్డిలో మార్పు రాలేదు. 72 ఏళ్ల అమ్మను మంగళవారం రాత్రి డబ్బు అడిగాడు. తాను మద్యం తాగాలన్నాడు. ఆమె ఇవ్వలేదు. అసలు ఆమె దగ్గర డబ్బు ఉందో లేదో కూడా తెలీదు. కొడుకులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అప్పటికే అతను మద్యం తాగేసి ఉన్నాడు. డబ్బు ఇవ్వలేదనే కోపంతో కర్రతో తల్లినెత్తిన బాదాడు. డెబ్భైరెండేళ్ల అమ్మ.. యాభై ఏళ్లపాటు బాలకృష్ణారెడ్డిని కంటికి రెప్పలా కాపాడిన అమ్మ.. అచేతనంగా మారింది. ఆమెచుట్టూ రక్తం మడుగు కట్టింది. ఆ కట్టెలో ఇప్పుడూ ఏప్రేమలూ లేవు... ఏ ఆరాటమూ లేదు.. కసాయి కొడుకు, తల్లి చనిపోయిందని ఊర్లో చెప్పి ఇంటిని వదిలి పరారయ్యాడు. దేశమ్మ శవాన్ని చూసి ఎగువముద్దికుప్పం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.. కసాయి కొడుకును కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. అతనో సైకో అని, అతను తమ గ్రామంలోకి రాకుం డా చూడాలని పోలీసులను వేడుకున్నారు. -
నివ్వెరపరిచే వివరాలను చేప్పిన ప్రత్యక్ష సాక్షి