అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య | person suicide with debts | Sakshi
Sakshi News home page

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

Feb 26 2017 12:26 AM | Updated on Nov 6 2018 7:53 PM

కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన బోయ శ్రీరంగం గోవిందు(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్నూలు: కర్నూలు మండలం పంచలింగాల గ్రామానికి చెందిన బోయ శ్రీరంగం గోవిందు(36) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ఫైనాన్స్‌లో ట్రాక్టర్‌ కొనుగోలు చేసి ఇసుక తోలుకుంటూ జీవనం సాగించేవాడు. సకాలంలో కంతులు చెల్లించలేకపోవడంతో 15 రోజుల క్రితం ఫైనాన్స్‌ నిర్వాహకులు ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. దీంతో కుటుంబ పోషణ కష్టమవుతుందని కలత చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు భార్య రాణి, ఇద్దరు సంతానం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement