అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి ఉపకార వేతనాలు ఫీజు రీ యింబర్స్మెంట్ కోసం ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి తెలిపారు.
కడప కోటిరెడ్డి సర్కిల్:
అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 2016–17 సంవత్సరానికి ఉపకార వేతనాలు ఫీజు రీ యింబర్స్మెంట్ కోసం ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు సరస్వతి తెలిపారు. ఇప్పటి వరకు ఈ పాస్ వెబ్సైట్లో 2539 మంది రెన్యువల్ విద్యార్థులు, తాజాగా 23 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని ఆమె తెలిపారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు నెల 15వ తేదీ అన్నారు.