హైదరాబాద్లో గణేష్ బందోబస్తు కోసం వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు.
వరంగల్: హైదరాబాద్లో గణేష్ బందోబస్తు కోసం వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ అస్వస్థతకు గురై మృతిచెందాడు. జిల్లాలోని ములుగు మండలం సర్వాపురం గ్రామానికి చెందిన ఎ. ముత్తయ్య తాడ్వాయి పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.
గణేష్ బందోబస్తు సందర్భంగా విధులు నిర్వర్తించడానికి హైదరాబాద్కు వెళ్లాడు. ఈ క్రమంలో డ్యూటీలో ఉండగా.. అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని హన్మకొండ జయ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు.