రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని శుక్రవారం సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
రాజమండ్రి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని శుక్రవారం సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కాల్మనీ వ్యవహారంలో బాధితులైన మహిళలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ వ్యవహారంలో దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంపై అఖిలపక్షంతో చర్చించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు.