Raghavulu
-
బీజేపీపై పోరాడే సమయం లేదా?
సాక్షి, యాదాద్రి: కేరళకు వెళ్లి సీపీఎంను తిట్టేంత సమయం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీపై పోరాడటానికి మాత్రం లేదని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికినట్లు.. కేరళకు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయ్ని రేవంత్ విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన ఓటుకు నోటు సంగతి ఏమైందని ప్రశ్నించారు. భువనగిరి లోక్సభ స్థానం నుంచి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్ నామినేషన్ దాఖలు సందర్భంగా జరిగిన బహిరంగసభలో రాఘవులు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ, నోరు పారేసుకోవద్దని రేవంత్రెడ్డికి సూచించారు. కేసీఆర్ అహంకారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, సీఎం రేవంత్ ఆ బాటలో నడవద్దని అన్నారు. కేరళలో బీజేపీ, కమ్యూనిస్టులు కలసి పనిచేస్తున్నారని రేవంత్ పేర్కొనడం అతని అవివేకం అని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేసిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కవితను బీజేపీ జైల్లో పెట్టిందని, ఇప్పటికైనా బీఆర్ఎస్ ఇండియా కుటమిలోకి రావాలని సూచించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలని ఆయన ప్రజలను కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్తో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాఘవులు అన్నారు. మమ్మల్ని కలుస్తామని కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది : తమ్మినేని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీని ఓడించడానికి అందరితో కలసి వెళ్తామని, ఇండియా కూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదిస్తూ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. ఈ నెల 21న కాంగ్రెస్ నాయకత్వం సీపీఎంను కలవనున్నట్లు సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. అయినప్పటికీ తెలంగాణలో భువనగిరి నుంచి సీపీఎం పోటీచేయడం ఖాయమన్నారు. -
రేవంత్రెడ్డీ... ఇంటగెలిచి రచ్చ గెలువు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు ఫైర్ అయ్యారు. ముందు ఇంటగెలిచి రచ్చ గెలవాలన్నారు. గురువారం హైదరాబాద్లోని ఎంబీభవన్లో ఆయన తెలుగులో అనువదించిన సీపీఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. ఈ సంద ర్భంగా రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ ‘కేరళలో కాంగ్రెస్, సీపీఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నా.. బీజేపీ రాకుండా ఆపగలిగారు. ఈసారి అది జరుగుతుంది. బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టడమే కాదు అధికస్థానాలు గెలవాలని వ్యూహా లు రచిస్తున్నట్టు మీడియాలో వస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రేవంత్రెడ్డి అక్కడకు వెళ్లి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీజేపీకి ఒక్కస్థానం రాకుండా ఆలోచిస్తే బాగుంటుంది. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది. అక్కడకు వెళ్లి ఇండియాకూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలపై నోరుపారేసుకోవడం కన్నా బీజేపీపై నోరుపారేసుకుంటే బాగుంటుంది. మా కర్తవ్యం అదే. దానికి కాంగ్రెస్ తోడుకావాలి. ఇంకా బాగా ఫలితాలు వస్తాయి. ఆ పని మేం ఒక్కరమే చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా రేవంత్రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలి’అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియాకూటమి పార్టీలను కాంగ్రెస్ సంప్రదించడం లేదు: తమ్మినేని ఇండియాకూటమిలోని భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోయే పని ప్రధానపార్టీగా ఉన్న కాంగ్రెస్ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కానీ కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. కలిసొచ్చే పార్టీలతో సంప్రదించే పనిచేయడం లేదన్నారు. ఈసారి భువనగిరిలో సీపీఎం పోటీ చేస్తుందని వివ రించారు. తమ అభ్యర్థి ఎండీ జహంగీర్ బాల్యం నుంచి కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారని, ఆయనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. నేడు జహంగీర్ నామినేషన్: ఎస్ వీరయ్య సీపీఎం భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పారు. అనంతరం ప్రదర్శన, బహిరంగసభ ఉంటుందని, ఈ కార్యక్రమంలో రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొంటారని వివరించారు. -
అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలి: రాఘవులు
సుందరయ్య విజ్ఞానకేంద్రం (హైదరాబాద్): బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వెంటనే రద్దు చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా, సికింద్రాబాద్లో జరిగిన కాల్పులను ఖండిస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ దేశ సేవ, భద్రత కోసం పనిచేసే వారికి భద్రత లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. -
‘రాష్ట్రంలో కుస్తీలు.. ఢిల్లీలో పిల్లికూనలు’.. టీఆర్ఎస్ తీరుపై రాఘవులు ఫైర్
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నిత్యం కుస్తీ పట్టడం.. ఢిల్లీలో మాత్రం టీఆర్ఎస్ పిల్లికూనలా మోదీకి సలామ్ చేయడం సిగ్గుచేటుగా ఉందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ప్రజా సంక్షేమంపై బీజేపీ, టీఆర్ఎస్ దొందూ దొందేనని, రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందని, రాష్ట్ర వాటా లేకుండా పన్నుల రూపేణా ఆదాయాన్ని కేంద్రమే కాజేస్తోందని ఆయన ఆరోపించారు. వరంగల్ శంభునిపేటలో గురువారం జరిగిన సీపీఎం జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగ్గే వరకూ పోరాటాలు చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వ, హిందూత్వానికి పెద్దపీట వేస్తూ.. మతాల మధ్య చిచ్చుపెడుతూ మతమార్పిడిని ప్రోత్సహిస్తోందన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్తో మైనార్టీలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. బీజేపీ అగ్రకులాల వ్యవస్థను పెంచి పోషిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలు పెరిగిపోయాయని, శిక్షించాల్సిన చట్టాలే నిందితులను రక్షిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, మరణాల సంఖ్య భారీగా పెరిగిందని, అదే చైనా, రష్యా వంటి దేశాల్లో కరోనా నియంత్రించడంలో సఫలీకృతమయ్యారన్నారు. గులాబీ, కాషాయం రంగులు మారుస్తుందే తప్ప ఎరుపు రంగు ఎన్నటికి మారదన్నారు. సమాజంలో దోపిడీ, దుర్మార్గులు ఉన్నంత కాలం సీపీఎం బతికే ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఉద్యమాలు, పోరాటాలు మరింత ఉధృతంగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ యువతను మద్యానికి బానిస చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. మహాసభలు పోరాటలకు కేంద్ర బిందువుగా మారాలని, ఉద్యమాలకు పుట్టినిళ్లు వరంగల్ నుంచే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.రాములు, జిల్లా కమిటీ సభ్యులు రత్నమాలు, సీహెచ్ రంగయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు సుకన్న, రంగన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. చదవండి: వైరల్గా మారిన ‘మజ్ను మిస్సింగ్’ యాడ్.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే! -
మా ప్రధాన ఉద్దేశం అదే: రాఘవులు
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఇప్పటికీ ప్రాసంగికత ఉందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, లెఫ్ట్వర్డ్ సంపాదకుడితో కలిసి రాఘవులు శుక్రవారం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ సిద్దాంతాలు యువతలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇక సీపీ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 21ను రెడ్బుక్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష పుస్తకాలు ప్రింట్ చేశామని.. ఆరెస్సెస్కు గట్టి జవాబుగా కమ్యూనిస్టు మేనిఫెస్టో ఉందటుందని పేర్కొన్నారు. ‘‘ప్రజల చేతిలో ఆయుధం ఈ కమ్యూనిస్టు మేనిఫెస్టో. ప్రపంచవ్యాప్తంగా రైట్వింగ్ సిద్ధాంతాలు వస్తున్నాయి. ఇవి చాలా ప్రమాదకరం. ఫ్రీ థింకింగ్, ఫ్రీ థాట్, అసమ్మతి తెలియజేయడం అనేది చాలా ముఖ్యం’అని వ్యాఖ్యానించారు. -
కుట్రతోనే వ్యతిరేకిస్తున్నారు
హైదరాబాద్: భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఉద్దేశంతోనే పలువురు ఎన్ఆర్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తున్నారని వీహెచ్పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు విమర్శించారు. దేశ విభజన నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి శరణార్థులు మనదేశానికి వలస వస్తున్నారని వారందరికీ పౌరసత్వం కల్పించాలని గత పాలకులంతా అనుకున్నారు కానీ దాన్ని అమలు చేయలేకపోయారని ఆయన అన్నారు. ఆదివారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ.. దేశానికి వలస వచ్చిన వారిని అన్ని పార్టీలు ఆదరించాలని వారి పార్టీల ఎన్నికల అజెండాలలో పొందుపరిచారన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల వల్ల ఎన్ఆర్సీ, సీఏఏ బిల్లు అమలుకు నోచుకోలేదన్నారు. గత పాలకుల చేయలేని పనిని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ అమలు చేసి చూపించారన్నారు. ప్రపంచ దేశాలను కబలించిన తరహాలోనే భారత దేశాన్ని ఆక్రమించుకునేందుకుగాను జీహాదీలు కుట్ర పన్నుతున్నారని, ఇందులో భాగంగానే మతమార్పిడులు, చొరబాటు, జమీన్ కబ్జా, కులాలమధ్య చిచ్చు, హత్యలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన ఆరోపించారు. చొరబాటుదారుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అస్సోం, త్రిపుర, బెంగాల్, కశ్మీర్ వంటి దేశాలతో పాటు అనేక ప్రాంతాలు అశాంతికి గురయ్యాయన్నారు. రాబోయే 35 ఏళ్లలో భారత్ను ఇస్లామిక్ దేశంగా మారుస్తామని ప్రకటించడం చూస్తుంటే చొరబాటుదారుల కుట్ర అర్థమవుతోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటో అత్యధికులకు తెలియదని, నేతల తప్పుడు వ్యాఖ్యలకు ప్రభావితమై వారు రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వీహెచ్పీ రాష్ట్ర నేత బండారి రమేష్, భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్చందర్, రాష్ట్ర నేత పగుడాకుల బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో విద్యాసంస్థలు: రాఘవులు
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మతోన్మాదం పెరిగింద ని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ప్రారంభమయ్యాయి, ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, రాజ్యమే మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని, ప్రతీ అంశాన్ని మతానికి జోడించి, ప్రజల మధ్య విభజన తెస్తోందని మండిపడ్డారు. విద్యా, న్యాయ వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఆర్ఎస్ఎస్ చూస్తోందని, దీనికి కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు. మనువాద సిద్ధాంతాన్ని అమలుచేస్తూ, మతాల మధ్య చిచ్చుపెడుతున్నదని విమర్శించారు. దేశంలో సామాజిక తరగతులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదం, నల్లధనం పెట్రేగిపోయాయని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పేదలు, అట్టడుగు, సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే 28 రాజకీయ, సామాజిక, ఉద్యమ శక్తులతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ శిక్షణా తరగతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నర్సింహారావు ప్రిన్సిపల్గా వ్యవహరించగా పార్టీ ముఖ్యులు టి.జ్యోతి, జాన్వెస్లీ పాల్గొన్నారు. -
18 నుంచి సీపీఎం జాతీయ మహాసభలు: రాఘవులు
హైదరాబాద్: భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) 22వ జాతీయ మహాసభలు ఈ నెల 18 నుంచి 22 వరకు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు తెలిపారు. శనివారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ మహాసభల ప్రచార బెలూన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 4 రోజులపాటు జరిగే అఖిల భారత మహాసభలకు సీపీఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్, కేరళ సీఎం పినరై విజయన్, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్, ఇతర వామపక్షాల నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పార్టీ నూతన కమిటీలో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. మహాసభ సందర్భంగా నగరాన్ని ఎరుపురంగు తోరణాలతో అలంకరిస్తున్నట్లు వివరించారు. మహాసభలకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ నెల 22న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో బహిరంగ సభ జరుగుతుందని, సభకు లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, డి.జి.నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సాగర్, ఎస్.రమ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
‘భూకుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే’
విజయవాడ: ఇద్దరు మంత్రుల మధ్య తగాదా పెట్టి భూ కుంభకోణం పై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం నాయకులు రాఘవులు అన్నారు. ఈ అంశంపై సిట్ దర్యాప్తు సరిపోదని సీబీఐ విచారణ చేపడితే అసలు నిజాలు బయటికొస్తాయన్నారు. రాఘువులు సోమవారం ఉదయం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుద్ హుద్ తుఫాన్ పేరుతో రికార్డులు మాయం చేసి వేల కోట్లు విలువ చేసే భూములను దోచుకున్నారన్నారు. భూ కుంభకోణం పై రోజుకో విధంగా ప్రభుత్వం మాట్లడుతోందని విమర్శించారు. బ్యాంక్ల నుంచి లోన్లు తీసుకోవడానికే భూ రికార్డులు ట్యాంపర్ చేశారని డీజీపీ చెబుతున్నారని.. అయితే ఇది నేరం కాదా అని రాఘవులు ప్రశ్నించారు. -
వారు అసమర్థులా.. వీరు సమర్థులా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణపై సీపీఎం నేత బీవీ రాఘవులు స్పందించారు. లోకేష్ కోసమే మంత్రి వర్గ విస్తరణ చేపట్టారని ఆయన విమర్శించారు. 'మంత్రివర్గ విస్తరణ సందర్భంగా మంత్రి పదవి పోయిన వారు అసమర్థులా.. లేక కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వారు సమర్థులా' అని రాఘవులు ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు అన్యాయం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసింది న్యాయమా అని రాఘువులు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు నేతలకు మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు పెద్దపీట వేసిన విషయం తెలిసిందే. -
'అంకెలు, గ్రాఫిక్స్ గారడీలు మానుకో'
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సీపీఎం నేత బీవీ రాఘవులు ఫైర్ అయ్యారు. ఏపీ సర్కారు తీరు ఇంట్లో ఈగల మేత.. బయట పల్ల మేత అనే సామెతను గుర్తు చేస్తోందని అన్నారు. ఆర్థికాభివృద్ధి పేరిట చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని.. అంకెలు, గ్రాఫిక్స్తో ప్రజలను మాయచేయడం మానుకోవాలని హితవుపలికారు. -
ఆ చర్యలతో బాబుకే నష్టం: రాఘవులు
తిరుపతి : ప్రత్యేక హోదా సాధన కోసం విపక్షాలు జరుపుతున్న ఆందోళనలను పోలీసుల నిర్భంధంతో అణచివేయడం వల్ల చంద్రబాబుకే నష్టమని సీపీఎం కేంద్ర పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రమంతా పోలీస్ రాజ్యంగా మారుతోందని, ప్రశ్నించే వారిని అణగదొక్కే క్రమంలో చంద్రబాబు పోలీసుల ద్వారా ఉద్యమకారులను నిర్బంధానికి గురి చేయడం సహేతుకం కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ.4 లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీస్తామన్న ప్రధాని మోదీ సర్కారు ఇప్పటి వరకు ఎంత మేర బయటకు తీసిందో వెల్లడించలేదని ఆయన మండిపడ్డారు. రూ.16 లక్షల కోట్ల విలువ చేసే రూ.500, 1000 నోట్లను కేంద్రం రద్దు చేస్తే, బ్యాంకుల్లోకి రూ.17 లక్షల కోట్లు వచ్చాయని ఆరోపించారు. పార్టిసిపేటరీ కరెన్సీ(విదేశీ ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం విడుదల చేసే కరెన్సీ)ని రద్దు చేస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్లడబ్బు బయటకు వస్తుందని అన్నారు. అసలు నోట్ల రద్దు అనేది నల్లధనాన్ని బయటకు తీయడం కోసం కాదని, వేరే ఉద్దేశంతో చేసిన పనిగా రాఘవులు ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల్లో తప్పని సరిగా లెక్కలు చెప్పాల్సిందేనని, లేదంటే మోదీని మాయల మరాఠీగా భావించాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలు అడ్డమైన సవాళ్లు విసరడం మాని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని రాఘవులు సూచించారు. -
నల్లధనంతో నడుస్తున్న సర్కార్: రాఘవులు
ఖమ్మం: నల్లధనాన్ని రద్దు చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేసినట్లు చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ నల్లధనంతోనే నడుస్తోందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. ఖమ్మంలోని మంచికంటి భవన్లో శుక్రవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. 50 రోజుల్లో అద్భుతం జరుగుతుందని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలపై పెనుభారం మోపారని ఆరోపించారు. -
మోదీ విధానాలతో ఐక్యత ప్రశ్నార్థకం
• సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు సూర్యాపేట: ప్రధాని మోదీ అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో దేశంలో ఐక్యత ప్రశ్నార్థకంగా మారిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ప్రారంభమైన సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉగ్రవాదుల దాడులను వ్యూహాత్మకంగా వ్యవహరించి తిప్పికొట్టాలి.. కానీ, భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉడీలో ఉగ్రవాదులు దాడి చేసి 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంటే ఎన్డీయే ప్రతినిధి ప్రతిపక్షాలపై విరుచుకు పడడంలో అర్థం లేదన్నారు. కాగా, ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేయడం మంచిపనే కానీ శాస్త్రీయ పద్దతిలో వ్యవహరించకుండా సీఎం తన లక్కీ నంబర్ కోసం అవసరమైతే 42 జిల్లాలను కూడా చేసేందుకు ప్రయత్నా లు చేస్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని ఆరోపించారు.జిల్లాల విభజన పూర్తయ్యే వరకు రెండుసార్లు అఖిలపక్షాన్ని పిలుస్తానని చెప్పి ఎందుకు పిలవలేదన్నారు. -
ఏపీకి ప్రత్యేక హోదాకు సీపీఎం మద్దతు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించేందుకు సీపీఎం పూర్తి మద్దతు ఇస్తుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీ గట్టిగా పోరాడటం లేదని విమర్శించారు. ఢిల్లీలో శనివారం సీపీఎం కేంద్ర కార్యాలయంలో పొలిట్బ్యూరో సమావేశమై దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించింది. ఏపీకి ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆందోళనను చూసి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రాఘవులు విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించడానికి సీపీఎం మద్దతు ఇస్తుందని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు గురించి రాఘవులు మాట్లాడుతూ.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్నసాగర్పై ప్రత్యామ్నయాన్ని ఆలోచించాలని సూచించారు. -
సాంకేతిక కారణాలు సరిచేయించాల్సింది..
స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన సీపీఎం నేత బి.వి.రాఘవులు అల్లిపురం (విశాఖపట్నం) : పార్టీ ఫిరాయింపులపై చర్యల పిటిషన్ను సాంకేతిక కారణాలతో తిరస్కరిస్తున్నాం అనే బదులు వాటిని సరిచేసి ఇవ్వాలని పిటిషన్దారులకు స్పీకర్ సూచించి ఉండాల్సిందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. టీడీపీలోకి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ వేసిన పిటిషన్ చెల్లదనడం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు తగదన్నారు. కొవ్వాడ అణువిద్యుత్ ప్లాంట్ పరిశీలనలో భాగంగా విశాఖపట్నం వచ్చిన ఆయన ఆదివారం ఇక్కడి సీపీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పిటిషన్లో లోపాలుంటే చెప్పి సరిచేయించాలని, ఇది కేవలం అధికార పార్టీకి మేలు చేయడమేనని స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. స్పీకర్ వ్యవహార శైలి చట్టానికి విరుద్ధంగా ఉందని భావిస్తే వైఎస్సార్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చన్నారు. -
ఏం ఆశించి వెళ్లారో చెప్పాలి: రాఘవులు
హైదరాబాద్: ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లడం అనైతికమని, నేతలు ఏం ఆశించి అధికార పార్టీలోకి వెళ్లారో చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని అధికార పార్టీ భావిస్తోందని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్న తరువాత ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు తగదని రాఘవులు హితవు పలికారు. ఓటుకు కోట్ల కేసు, కాల్మనీ కేసులు ఎందుకు మూత పడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్మనీ కేసులో టీడీపీ నేతలు దొంగల్లా దొరికారు కాబట్టి ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రంలో కరువు, ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో ఒకే దగ్గర నిధులు కెటాయించడం సరికాదని రాఘవులు తెలిపారు. -
100రోజుల దీక్ష చేస్తాం..
నిజాంషుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిజాం షుగర్ రక్షణ కమిటీడిమాండ్ చేసింది. గురువారం బోదన్ మండల కేంద్రంలో కమిటీ సభ్యులు దీక్ష చేపట్టారు.కమిటీకన్వీనర్ రాఘవులు మాట్లాడుతూ.. 100రోజుల పాటు రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. కార్మికులు, రైతులు, పలు ప్రజా సంఘాలు ఈ దీక్షలో పాల్గొన్నాయి. -
విశ్వనగరం ఎలా సాధ్యం?
♦ సమస్యలను గాలికొదిలేసిన టీఆర్ఎస్ ♦ స్థానిక సంస్థలను అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ♦ వీటిని కాక ప్రత్యామ్నాయాన్ని ప్రజలు ♦ ఎంచుకోవాలి.. ‘వన్హైదరాబాద్’ నేతలు ♦ రాఘవులు, చాడ, జేపీ, తమ్మినేని, గౌస్ పిలుపు సాక్షి, హైదరాబాద్: తాగునీరు, రోడ్లు, ట్రాఫిక్ వంటి ప్రధాన సమస్యలు, నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా విశ్వనగరం ఎలా సాధ్యమని వన్ హైదరాబాద్ కూటమి సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ, లోక్సత్తా నేతలు ప్రశ్నించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి, వాటిని అసమర్థ, అవినీతిమయంగా మార్చిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లను కాకుండా, స్వచ్ఛమైన పాలన అందించే తమ కూటమిని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని మఖ్దూంభవన్లో సోమవారం సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషా, లోక్సత్తా నేతలు జయప్రకాష్నారాయణ, పాండురంగారావు, ఎండీ గౌస్(ఎంసీపీఐ-యూ) విలేకరుల సమావేశంలో మాట్లాడారు.పాత, కొత్త నగరాలు... ముస్లిం, హిందువు... తెలంగాణ, ఆంధ్రా, ఉత్తర భారత్ అనే తేడా లేకుండా ప్రజలంతా ఒకటే అని గర్వంగా ప్రకటించడమే... ‘వన్ హైదరాబాద్’ అని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు నిధులను హరించడం, సమస్యల పరిష్కారంలో చిన్న చూపు తప్ప స్థానిక సంస్థలపై నమ్మకం, గౌరవం లేదని బీవీ రాఘవులు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల హక్కులను హరించి, పరోక్షంగా తామే పాలన సాగిస్తున్నాయని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని, తానే తెలంగాణ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్లు గెలిస్తే ఎలాంటి మార్పు ఉండదని, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తమకు ఎలాంటి ప్రాతినిధ్యం కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని జయప్రకాష్నారాయణ సూచించారు. ప్రజల్లో మార్పు కోసం జీవితాంతం కృషి చేసి, నిజాయితీగా బతుకుతున్న వామపక్ష, లోక్సత్తా కూటమి నేతలు కావాలా?... ఎన్నికలను, పదవులను నిచ్చెనగా చేసుకుని సకల సౌకర్యాలు సొంతం చేసుకోవాలనుకుంటున్న వారు కావాలో?.. ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. గతంలో తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేసిన వారే ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల కోసం రాజకీయ అవకాశవాదంతో ప్రకటనలు చేస్తున్నారని ఎండీ గౌస్ ఎద్దేవా చేశారు. రాజకీయ అనిశ్చితి కోసమే టీఆర్ఎస్ పనిచేస్తోందని, ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రసంగాలకు ఎలాంటి విశ్వసనీయత లేదన్నారు. -
'కాల్మనీపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి'
రాజమండ్రి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంపై ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ జరిపించాలని శుక్రవారం సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. కాల్మనీ వ్యవహారంలో బాధితులైన మహిళలకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ వ్యవహారంలో దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంపై అఖిలపక్షంతో చర్చించాలని రాఘవులు ప్రభుత్వాన్ని కోరారు. -
'ఏక మొత్తంలో చెల్లించాల్సిందే'
నాగార్జున సాగర్: ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని సీపీఎం నేత రాఘవులు అన్నారు. ఏక మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్ లో ఆదివారం రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. -
'కేంద్రం వేసే భిక్షం కోసం చంద్రబాబు పడిగాపులు'
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సమావేశం జరిపింది. ఈ భేటీకి సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు హాజరయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా హామీని విస్మరించాయని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన ప్రత్యేక హోదాను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని వారు మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి కేటాయింపులు ఇవ్వకుండా కేంద్రం భిక్షం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వేసే భిక్షం కోసమే సీఎం చంద్రబాబు పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలపై స్పందించకపోవటం దారుణమని సీపీఎం నేతలు సీతారాం ఏచూరి, రాఘవులు అన్నారు. -
రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి
-
'భూమి పూజను అడ్డుకుంటాం'
గుంటూరు: రైతులకు, రైతు కూలీలకు న్యాయం చేయకుండా జూన్ 6 న భూమి పూజ నిర్వహిస్తే అడ్డుకుంటామని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలో రైతాంగ సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూన్ 2న చంద్రబాబు నాయుడు చేపట్టే నవనిర్మాణ దీక్షను రైతు ద్రోహి దీక్షగా అభివర్ణించారు. -
రగిలిన అంగన్వాడీలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి మాట తప్పిన చంద్రబాబుపై మండిపడ్డ మహిళలు సాక్షి, విజయవాడ బ్యూరో: చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారుపై అంగన్వాడీ మహిళల్లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసి తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఊడబెరుకుతున్నారంటూ మహిళలు మండిపడ్డారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఐకేపీ యానిమేటర్లు, ఆశా వర్కర్లు, గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ఆందోళనల్లో పాల్గొన్నారు. అంగన్వాడీలకు నెలకు రూ.పదివేల వేతనం, అర్హులకు సూపర్వైజర్ పోస్టులను ఇవ్వాలని కోరారు. ఇప్పుడే ప్రకటన చేయాలి: రాఘవులు అంగన్వాడీలకు, కాంట్రాక్టు కార్మికులను న్యాయం జరిగేలా ప్రస్తుత శాసన సభ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ముట్టడి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల హామీకి కట్టుబడి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.బాబు సీఎంగా వ్యవహరించడంలేదన్నారు. సింగపూర్, జపాన్, బడా పెట్టుబడిదారులు, ప్రైవేట్ సంస్థలకు సీఈవోగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మూడు నెలలుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని ధర్నాలో పొల్గొన్న గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మస్తాన్వలి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారులకు తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత.. ప్రకాశం జిల్లాలో కలెక్టరేట్ను ముట్టడించిన అంగన్వాడీలు, సీఐటీయు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని ప్రతిఘటించడంతో తొక్కిసలాట జరిగి ఓ అంగన్వాడీ కార్యకర్త సొమ్మసిల్లి పడిపోయింది. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అంగన్వాడీలు, ఐకేపీ యానిమేటర్లు రాకుండా సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. కర్నూలు జిల్లాలో ఆందోళనకు దిగిన అంగన్వాడీలు తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి సంఘీభావం తెలిపారు. విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోను ఆందోళన చేశారు. -
పోరుబాట
ఉద్యమాలకు సిద్ధమవుతున్న గిరిజనం జర్రెలలో నేడు భారీ సభ 21న పాడేరు రానున్న రాఘవులు బాక్సైట్ తేనెతుట్టె కదులుతోంది. అటవీ సంపద జోలికొస్తే ఖబడ్దార్ అంటూ ఏజెన్సీవ్యాప్తంగా వ్యతిరేక ఉద్యమానికి గిరిజనం సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖనిజం తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమాలు చేయించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏకంగా తవ్వకాలకు నిర్ణయించినట్టు ప్రకటించడాన్ని ఆదివాసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాణాలు ఎక్కుపెడుతున్నారు. సీఎం వైఖరిని నిరసిస్తూ జీకేవీధి మండలం జర్రెలలో ఆదివారం ఆందోళనకు నిర్ణయించారు. పాడేరు: బాక్సైట్ ఖనిజ నిల్వలకు విశాఖ ఏజెన్సీ పెట్టింది పేరు. ఇక్కడున్నంత విలువైన ఖనిజం మరెక్కడా లేదు. అరకులో 54.47మిలియన్ టన్నులు, సప్పర్లలో 210.25మిలియన్టన్నులు, జీకేవీధిలో 38.42, జెర్రెలలో 224.60 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలు ఉన్నట్లు గతంలో నిపుణులు వెల్లడించారు. లక్షల కోట్ల విలువైన ఈ సంపదను వెలికితీస్తే ప్రభుత్వానికి కోట్ల ఆదాయం వస్తుందని తేల్చారు. వాస్తవాని కి వీటి తవ్వకాలతో జలాశయాలు దెబ్బతిని మైదానంలోని నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోతుంది. ప ర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. ఐటీడీఏలకు తవ్వకాల బాధ్యత అప్పగిస్తామని చెబుతున్న సీఎం అసలు దానికి తవ్వకాల నైపుణ్యమే లేనప్పుడు ఇదెలా సాధ్యమనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరోపక్క చంద్రబాబు ప్రకటనపై గిరిజన సంఘాలు,పర్యావరణ సంస్థలు మళ్లీ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. బాక్సైట్ జోలికి వస్తే ప్రాణాలైనా ఒడ్డి గిరిజనుల సంపదను కాపాడుతామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు హెచ్చరించారు. బాక్సైట్కు వ్యతిరేకంగా ఆదివారం జర్రెలలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు జర్రెల సర్పంచ్ అడపా విజయకుమారి, ఎంపీటీసీ సభ్యురాాలు ఉగ్రంగి జగ్గమ్మ తెలిపారు. పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘా లు, గిరిజనులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సీపీఎం, గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనూ బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాలు ఇటీవల సాగాయి. ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఇప్పటికే పిలుపునిచ్చాయి. సీపీఎం కూడా ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఆపార్టీ రాష్ట్ర నేత బివి రాఘవులు ఈ నెల 21న పాడేరు వస్తున్నారు. ఉద్యమానికి ఆరోజు ప్రణాళికను రూపొందిస్తారు. బీజేపీ నాయకులు కురసా బొజ్జయ్య, కురసా రాజారావు తదితరులు బాక్సైట్కు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. -
చర్చించుకుంటేనే పరిష్కారం
ఇద్దరు సీఎంలకు రాఘవులు సూచన న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలను పక్కనపెట్టి పరస్పరం సహకరించుకుంటేనే సమస్యల పరిష్కారం సాధ్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. ఆదివారం ఢిల్లీలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ముగిసిన అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వ అనుసరిస్తున్న విధానాలతోపాటు వచ్చే ఏడాది నిర్వహించనున్న సీపీఎం మహాసభల ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మతకలహాలను సృష్టించి బీజేపీని బలోపేతం చేసుకోవాలని చూస్తే దేశం బలహీనపడుతుందని హెచ్చరిం చారు. హైదరాబాద్లో శాంతిభద్రతలను గవర్నర్కి అప్పగించడంపై స్పంది స్తూ.. పదేళ్ల ఉమ్మడి రాజధానిపై ఇద్దరు సీఎంలు గవర్నర్తో సమన్వయంగా వ్యవహరించాలని సూ చించారు. తెలంగాణలో 19న నిర్వహించనున్న సర్వే వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్టు అనుమానాలు కల్గుతున్నాయన్నారు. ఏపీలో బాబు పాలన నిరాశ కలిగిస్తోందని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు విమర్శించారు. -
రుణమాఫీలు ఓట్ల కోసమే : రాఘవులు
-
చంద్రబాబు మోసం చేస్తున్నారు: రాఘవులు
-
ఓట్ల కోసమే రుణ మాఫీ
సాక్షి, న్యూఢిల్లీ: రుణాలు మాఫీ చేస్తామన్న హామీ ఓట్ల కోసమే తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తారు. రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న సీపీఎం పొలిట్బ్యూరో సమావేశాలు ఆదివారం ముగిశాయి. అనంతరం రాఘవులు విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రుణ మాఫీ హామీ ఇచ్చింది ఎవరైనా ఇందుకోసమే. ఓట్లు సంపాదించుకుని అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నారు. ఈరోజు రుణాలు రీషెడ్యూల్ చేయడమే గొప్ప విషయమనిచంద్రబాబు చెబుతున్నారు, అది రైతులను అపహాస్యం చేయడమే. వాగ్దానం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రుణ మాఫీ హామీని నిలబెట్టుకుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల విధానాల సమాచారాన్ని పొలిట్బ్యూరోకు అందజేసినట్టు చెప్పారు. ‘‘రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కృష్ణా జలాల విడుదల వంటి అంశాలు చాలా వివాదాస్పదంగా మారాయి. తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు రాకుండా బహిరంగ విమర్శలు మానుకుని ఇద్దరు ముఖ్యమంత్రులూ చర్చించుకోవాలి. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్లో శాశ్వతంగా స్థిరపడిన వారిని తెలంగాణ వారిగానే గుర్తించాలి. కాబట్టి 1956 ముందు ఉన్న వారికే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందనడం సరికాదు. అర్హతను నిర్ధారించుకునేందుకు రెండు ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి’’ అని సూచించారు. ‘‘కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో ఆశలుపెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు పాశ్చాత్య శక్తులకు, విదేశీ పెట్టుబడి సంస్థలకు నమ్మినబంటుగా పనిచేస్తోందని పొలిట్బ్యూరో అభిప్రాయపడింది. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులతో దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలుగుతుంది. బీజేపీకి చెందిన సంఘ్పరివార్ సైతం దీనిపై ప్రకటన ఇచ్చే స్థితి ఉందంటే బీజేపీ ప్రభుత్వ పోకడలు ఎమిటో అర్థమవుతోంది. కార్మిక చట్టాలను సవరించాలని బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది. భూసేకరణ చట్టాన్ని సైతం సవరించి రైతులకు అన్యాయం చేయాలని చూస్తోంది. చివరకు నచ్చిన వారికే సుప్రీంకోర్టు జడ్జిల పదవులివ్వడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. వీటన్నింటిపై ఆందోళన కార్యక్రమాలపై వచ్చే నెల 9, 10 తే దీలో జరిగే కేంద్ర కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని పొలిట్బ్యూరో నిర్ణయించింది. వామపక్షాల కూటమితో సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాం’’ అని రాఘవులు తెలిపారు. -
నిరూపించు లేదా క్షమాపణ చెప్పు!: రాఘవులు
న్యూఢిల్లీ: సీపీఐ నేత నారాయణ తనపై చేసిన ఆరోపణలను నిరూపించకపోతే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు డిమాండ్ చేశా రు. ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశానికి రాఘవులు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు మీడియాకు తెలిపారు. దే శవ్యాప్తంగా బీజేపీ విజయం సాధించడం, సీపీఎం ఓటమి తదితర అంశాలు చర్చకు వచ్చాయన్నారు. పదేళ్ల కాంగ్రెస్ దుష్టపాలనతో ప్రజలు విసిగిపోవడం వల్లే బీజేపీ విజయం సాధించగలిగినట్టు పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్కరణలు త్వరగా అమలు చేసేందుకు బీజేపీతో సులువని నమ్మే కార్పొరేట్ శక్తులతోపాటు కార్పొరేట్ మీడియా ఏకమై బీజేపీని గెలిపించాయని విమర్శించారు. మత శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు వైఎస్సార్సీపీ సహా తమతోకలిసి వచ్చే పార్టీలతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
ఆరోపణలను రుజువు చేయండి: రాఘవులు
-
'ఆ విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయి'
హైదరాబాద్ : సీపీఐ నారాయణ ఆరోపణలను సీపీఎం నేత రాఘవులు తీవ్రంగా ఖండించారు. నారాయణ విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనపై చేసిన ఆరోపణలను నారాయణ రుజువు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. నారాయణ ఆరోపణలకు తాను ప్రతి ఆరోపణలు చేయనని అన్నారు. జాతీయ విధానాలకు అనుకూలంగా పొత్తులు పెట్టుకుంటామని రాఘవులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లేవారితో పొత్తు ఉండదని ముందే చెప్పామన్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన తనను ఓడించడానికి సీపీఎం రూ. 15 కోట్లకు అమ్ముడుపోయిందంటూ నారాయణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
''టీడీపీ, బిజెపిలది చారిత్రిక ద్రోహం''
-
టీడీపీ, బిజెపిలది చారిత్రిక ద్రోహం: రాఘవులు
టీడీపీ, బీజేపీ పొత్తు చారిత్రక అవసరం కాదు, చారిత్రక ద్రోహమని అన్నారు సీపీఎం రాష్ట్ర నాయకులు రాఘవులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కడపలో పర్యటించారు. తెలుగుదేశం అని పేరు పెట్టుకొని తెలుగుజాతినే టీడీపీ అవమానించిందని చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. ఓట్ల కోసం వస్తున్న ఈ ఇద్దరు నేతలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానన్న బాబు.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో ఎలా చేతులు కలిపారని ప్రశ్నించారు. ఈ జోడీ మాటలు ఎవరూ నమ్మొద్దని రాఘవులు ప్రజలకు చెప్పారు. -
ప్రధాని అవుతానన్నవారంతా ఓడిపోయారు: ఏచూరి
హైదరాబాద్: కాబోయే ప్రధానిని తానేనని ప్రచారం చేసుకున్న వారంతా ఎన్నికల్లో ఓడిపోయారని సీపీఎం పోలిట్బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమన్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఏచూరి.. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ‘‘1977లో ఇందిరాగాంధీ ఎన్నికలకు ముందే తానే కాబోయే ప్రధానినంటూ గంభీరాలు పలికితే, ఫలితాల్లో పరాభవం తప్పలేదు. 2004లో భారత్ వెలిగిపోతుందంటూ ముందుస్తు ఎన్నికలకు వెళ్లిన ఎన్డీయే కూటమి పరిస్థితి కూడా అంతే. 2004లో ఎన్డీయేకు 370 స్థానాలు వస్తాయంటూ మీడియా కోడై కూసినా ప్రజల తీర్పు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చింది. ఇప్పుడు కూడా తానే కాబోయే ప్రధాని అంటూ కార్పొరేట్ మీడియా చేత ప్రచారం చేయించుకుంటున్న నరేంద్రమోడీకి అదే భంగపాటు తప్పదు’’ అని పేర్కొన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కాబోయే ప్రధాని ఎవరనేది ముందే చెప్పలేమన్నారు. దేశంలో మోడీ హవా లేదని, అదంతా కేవలం కార్పొరేట్ మీడియా సృష్టించిన కల్పితమని ఏచూరి వ్యాఖ్యానించారు. ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు తేడా లేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగే: రాఘవులు రాబోయే కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు కావడం ఖాయమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. టీడీపీ-బీజేపీ జోడీ చారిత్రక అపచారమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో చక్రం తిప్పానంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ఇక కేంద్రంలో చెంచాగిరి చేయాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. -
'పార్టీలు అంబేద్కర్ జయంతిని విస్మరించాయి'
హైదరాబాద్ : రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో పడి అంబేద్కర్ జయంతిని విస్మరించాయని సీపీఎం నేత బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ 124వ జయంతి సందర్భంగా ఆయన సోమవారం ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేసిననాడే దళితుల అభివృధ్ది జరుగుతుందన్నారు. దళితుల అభివృద్ధికి అంబేద్కర్ కృసి మరవలేనిదన్నారు. -
జనంలో చైతన్యం కోసమే జనసేన: పవన్
శంషాబాద్, న్యూస్లైన్: జనంలో చైతన్యం కోసమే జనసేన పార్టీని స్థాపించినట్లు సినీనటుడు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖపట్నం నుంచి శుక్రవారం ఉదయం హైదరాబాద్కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో తమ పార్టీ బరిలో ఉండడం లేదన్నారు. ఏ పార్టీకి ఓటు వేయాలని మీరు కోరుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. పవన్ ఓట్లు వేయమన్నది నాకే: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని జనసేన పార్టీ నేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ విశాఖపట్నం సభలో చెప్పారని టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు చెప్పుకొన్నారు. సినీనటి సన, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీరంగనాథరాజు, మోషెన్ రాజు తదితరులు టీడీపీలో చేరిన సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడారు. పవన్ వ్యాఖ్యల్ని పలుమార్లు ఉటంకిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు. ఈసారి ఓట్లు చీలకూడదనే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని పవన్ చెప్పారన్నారు. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నామని, ఇది ప్రయోగాలకు సమయం కాదని అంతకు ముందే తాను పవన్ ఎన్నికల్లో పోటీని ఉద్దేశించి వ్యాఖ్యానించానన్నారు. పవన్కల్యాణ్ది మోడీయిజం: రాఘవులు సాక్షి, విజయవాడ: ‘‘పవన్ కల్యాణ్ కొత్తగా పార్టీ పెడితే ఏదో చేస్తారనుకున్నాం. తీరా పవన్ చెప్పిన ఇజం మోడీయిజమని ఆయన ప్రకటనతో తేలిపోయింది’’ అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ శుక్రవారం విజయవాడలో రాఘవులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ చెబుతున్న ఇజాలు ప్రజలకు అవసరం లేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశించేవారు కొత్తగా చేయగలిగే మార్పు ఏమీ ఉండదన్నారు. ప్రస్తుతం కొన్ని పార్టీలు ఫిరాయింపుదార్లను ప్రోత్సహించడం ద్వారా బలపడే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇది రాజకీయాల్లో దిగజారుడు వ్యవహారమని విమర్శించారు. -
సంతానంలేదని దంపతుల ఆత్మహత్యాయత్నం
మచిలీపట్నం క్రైం, న్యూస్లైన్ : వివాహమై ఏళ్లు గడుస్తున్నా... సంతానం కలగకపోవటంతో మనస్థాపానికి గురైన దంపతులు ఆత్మహత్నాయత్నం చేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు హుటాహుటిన జిల్లా ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. చిలకలపూడి సీఐ టి. సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం రాయవరం గ్రామానికి చెందిన పోతర్లంక రాఘవులు, పద్మ భార్యాభర్తలు. ఇస్త్రీ పనులు చేసుకుంటూ జీవించే వీరికి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు కలగలేదు. దీంతో నిత్యం మనస్థాపంతో గడుపుతుండేవారు. పిల్లలు లేని జీవితం వృథా అనుకున్న వారిద్దరూ శుక్రవారం మధ్యాహ్నం మంగినపూడి బీచ్కి వచ్చారు. కాసేపు సరాదాగా గడిపారు. అనంతరం వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. చాలాసేపటి వరకు వీరిలో ఎలాంటి మార్పు జరగకపోవడంతో ఆటో ఎక్కి చిలకలపూడి రైల్వేస్టేషన్కు వచ్చారు. అలా వచ్చిన వీరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాన్ని పసిగట్టిన స్థానికులు వారివురిని బలవంతంగా ఫ్లాట్ఫాంపైకి లాగేశారు. అనంతరం వారి పరిస్థితిని గమనించి 108కు సమాచారం అందించగా, వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా పద్మ పరిస్థితి విషమంగా ఉండగా రాఘవులు పరిస్థితి బాగానే ఉంది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న చిలకలపూడి సీఐ సత్యనారాయణ, ఎస్సై లోవరాజు ఆసుపత్రికి చేరుకుని పద్మ నుంచి వివరాలు సేకరించి బాధితుల బంధువులకు సమాచారం అందించారు. అనంతరం సీఐ సంబంధిత రూరల్ పోలీసులకు విషయాన్ని తె లియజేశారు. -
'కాంగ్రెస్, బీజేపీలు బలపడడం ప్రమాదకరం'
-
'ఆ రెండు కాంగ్రెస్లో కలిసే పార్టీలే'
తిరుపతి : కొత్తగా వచ్చిన, రాబోతున్న రాజకీయ పార్టీలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కల్యాణ్ పార్టీలు రెండూ చివరికి కాంగ్రెస్లో కలిసే పార్టీలేనని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసమే కొత్త పార్టీలు పెడుతున్నారని రాఘవులు అన్నారు. రాష్ట్ర విభజనకు సీపీఎం వ్యతిరేకమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. సీమాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించాలని రాఘవులు డిమాండ్ చేశారు. -
సీపీఐ, సీపీఎం కీలక నేతల భేటీ
-
'మున్సిపల్లో పొత్తు కుదిరింది'
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో కొంతకాలంగా ఎడమొహం, పెడమొహంగా ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలు ఎట్టకేలకు భేటీ అయ్యాయి. రాష్ట్రంలో సిపిఎంతో కలిసి పనిచేసే పరిస్థితి లేదని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి న్యూఢిల్లీలో ప్రకటించి 48 గంటలు కూడా కాకముందే ఉభయ పార్టీల నేతలు గురువారమిక్కడ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో అవగాహనతో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరోసారి సమావేశం కావాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అవగాహనతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోసారి భేటీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. సీసీఐ, సీపీఎం పొత్తుల మధ్య సాంకేతిక ఇబ్బందులు లేవని నారాయణ తెలిపారు. -
రెండుగా చీలిన సీపీఎం రాష్ట్ర శాఖ
-
గిరిజనులకు ప్రత్యేక ప్రతిపత్తి: రాఘవులు
సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకూ ఉన్న గిరిజనులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారమిక్కడ ఇందిరాపార్కు ధర్నాచౌక్లో బహిరంగసభ జరిగింది. గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములన్నింటికీ హక్కు పత్రాలివ్వాలని, గిరిజన సాగుదార్లపై ఫారెస్టు అధికారుల దౌర్జన్యాలు అరికట్టాలని, అటవీ హక్కు చట్టం అమలుకోసం జీవో నంబర్ 355ను అమలు చేయాలని.. తదితర డిమాండ్లతో ఈ సభను నిర్వహించారు. రాఘవులు మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు కావడం వల్ల గిరిజనులకు ఎలాంటి లాభం జరగబోదన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను ఏ రాష్ట్రప్రభుత్వం పట్టించుకుంటుందని ప్రశ్నించారు. గిరిజనులవైన ఖనిజాలు, అటవీ వనరులపై బహుళజాతి సంస్థల కన్నుపడిందని, వారికి ప్రభుత్వాలు వంత పలుకుతున్నాయని ధ్వజమెత్తారు. అందుకే గిరిజనుల్ని ఆయా ప్రాంతాలనుంచి వెళ్లగొడుతున్నారని తెలిపారు. చట్టవిరుద్ధంగా వన సంరక్షణ సమితులకు రాష్ట్రప్రభుత్వం కేటాయించిన 10 లక్షల ఎకరాల అటవీ భూముల్ని రద్దు చేసి వాటిని గిరిజనులకే చెందేలా చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీలు మధు, మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, కొలక లక్ష్మణమూర్తి, గిరిజన సంఘం అధ్యక్షుడు గుగులోతు ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పిచ్చోడు.....
కడప : రాష్ట్ర విభజన బిల్లుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాఘవులు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని సమస్యలపై సీఎం చర్చించటం లేదని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన కడపలో విలేకర్లతో మాట్లాడుతూ బ్రహ్మణీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తాము మాత్రమే ఉద్యమిస్తే సరిపోదని అన్ని పార్టీలు కలిసి రావాలని రాఘవులు పిలుపునిచ్చారు. రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, పారిశ్రామికీరణతోనే ఏ ప్రాంతం అయినా అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
'ఆ రెండు పార్టీలు కులాలు, మతాలను రెచ్చగొడుతున్నాయి'
కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కులాలు, మతాలను రెచ్చగొడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు ఆరోపించారు. ఆ రెండు పార్టీలను ఓడించడమే తమ ముందున్న లక్ష్యమన్ని తెలిపారు. తెలంగాణ బిల్లు తెలుగు ప్రజల మనోభావాలను అవమానించేలా ఉందని ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ భావాలు తమ పార్టీకి పూర్తి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సంబంధాలు అందరికి తెలుసని రాఘవులు పేర్కొన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసి విలేకర్ల సమావేశంలో ఆయనపై విధంగా మాట్లాడారు. -
మంత్రులకు నివేదిక ఇవ్వం-రాఘవులు
-
జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని ఆ లేఖలో తెలిపారు. రాష్ట్ర విభజనను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి, ఎంఐఎం, సిపిఎం మూడు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయి. -
'ఆరోపణలు పచ్చి అబద్ధాలు...రుజువు చేయండి'
హైదరాబాద్ : రాష్ట్రంలో వామపక్ష పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు...సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు లేఖ రాశారు. నారాయణ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమపై చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని...వాటిని బహిరంగంగా రుజువు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్షాల ఐక్యత గురించి చెబితే... ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కావటం లేదని రాఘవులు వ్యాఖ్యానించారు. -
వైఎస్ఆర్ సీపీ సభకు అనుమతి ఇవ్వాలి: రాఘవులు
-
వైఎస్ఆర్ సీపీ సభకు అనుమతి ఇవ్వాలి: రాఘవులు
హైదరాబాద్ : ఈనెల 19న హైదరాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని గుర్తు చేశారు. గతంలో సమైక్యవాదుల సభలకు, తెలంగాణవాదుల సభలకు అనుమతిచ్చారు కదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ సమైక్య సభకు అనుమతిపై పోలీసులు నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని రాఘవులు సూచించారు. ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవరకీ లేదన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న తమకు మద్దతు ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు సీపీఎం నేతలను కోరారు. తాము మొదట్నించీ సమైక్యవాదులమేనని, తమ పూర్తి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులకు హామీ ఇచ్చారు. -
బీజేపీతో పొత్తుపై బాబు స్పష్టత ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని ఉహాగానాలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీలో రాజ్నాథ్సింగ్ను కలిసిన నేపథ్యంలో అసలు ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందో, లేదో స్పష్టం చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. సిరియాకు సంఘీభావ సదస్సు సందర్భంగా రాఘవులు ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై చంద్రబాబు దేశ రాజధానిలో వివిధ రాజకీయ పార్టీల నేతల్ని కలవడంలో తప్పేమీ లేదన్నారు. అయితే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో శనివారం ఢిల్లీలో చర్చలు జరిపినందున పొత్తుపై వస్తున్న ఉహాగానాలు వాస్తవమో కాదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ బీజేపీతో టీడీపీ పొత్తు లేకపోతే కమ్యూనిస్టులు జత కట్టేందుకు సిద్ధమా, కాదా? అనేది అప్రస్తుతమని, పొత్తులకు, సయోధ్యలకు ఇంకా చాలా సమయం ఉందన్నారు. హైదరాబాద్ను ఐటీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ చేస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటనపై స్పందిస్తూ, దీనిపై మీడియా ప్రచారం తప్ప ఒరిగేదేమీ ఉండదని అన్నారు. ఎస్ఈజెడ్లను తీసుకున్న రహేజాలాంటి కంపెనీలే తిరిగి భూముల్ని ఇచ్చేస్తుంటే కొత్తగా వచ్చేదెవరని ప్రశ్నించారు. అమెరికాది అధర్మ యుద్ధం ధర్మ సంరక్షణ పేరిట అమెరికా అధర్మయుద్ధానికి కాలుదువ్వుతోందని వామపక్షాలు మండిపడ్డాయి. సిరియాలో జీవ రసాయన ఆయుధాల్ని వినియోగించిందెవరో తెలుసుకోకుండానే యుద్ధానికి సిద్ధమైందని ధ్వజమెత్తాయి. సిరియాలో యుద్ధమంటే భారత్ సహా వర్ధమాన దేశాలన్నీ ఇక్కట్లు పాలు కావడమేనని ఆందోళన వ్యక్తం చేశాయి. అఖిలభారత శాంతి సంఘం (అయిప్సో) ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ సిరియా సంఘీభావ సదస్సు ఏర్పాటు చేశారు. అయిప్సో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ సుధాకర్, బీవీ రాఘవులు (సీపీఎం), కె.నారాయణ (సీపీఐ), పీఎల్ శ్రీనివాస్ (టీడీపీ), అజీజ్పాషా (అయిప్సో), డాక్టర్ జస్వంత్ (సీపీఐ ఎంఎల్), ఎండీ గౌస్ (ఎంసీపీఐ-యు), జానకీరామ్ (ఆర్ఎస్పీ), వినోద్ (కాంగ్రెస్) తదితరులు ప్రసంగించారు. -
గవర్నర్ను కలిసిన సీపీఎం రాఘవులు
హైదరాబాదద్ : ఉద్యమాల కారణంగా పేద విద్యార్థులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆయన మంగళవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. భేటీ అనంతరం రాఘవులు మాట్లాడుతూ నిరసనలతో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి.. పేద విద్యార్థులకు విద్య అందడం లేదన్నారు. బంద్ల వల్ల ఆర్టీసీ బస్సులు కూడా తిరగడం లేదని ఆయన తెలిపారు. -
రాష్ట్రంలో జగన్ ప్రభంజనం ఉంది: రాఘవులు
రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రభంజనం కొనసాగుతోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అని అన్నారు. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేకనే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజిస్తున్నది అని విమర్శలు చేశారు. గతంలో వచ్చిన 33 సీట్లు రాకపోయిన 15 సీట్లైన సంపాదించుకున్నామని కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుంది అని రాఘవులు అన్నారు. అంతేకాక సీమాంధ్ర రాజకీయ నేతలతీరుపై రాఘవులు మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర రాజకీయ పార్టీల నేతలు ద్వంద్వ వైఖరి మానుకోవాలి అని ఆయన సూచించారు. సీమాంధ్ర నేతలు వారి పార్టీ నేతలనైనా ఒప్పించాలి లేదంటే పార్టీలకు రాజీనామాలైనా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపచేశామంటున్నారని.. అయితే వారి ఆందోళన విభజన కోసమా.. సమైక్యం కోసమో స్పష్టం చేయాలి అని రాఘవులు అన్నారు. విభజనతో సీమాంధ్రలో ఏర్పడే నదీజలాల సమస్యను పరిష్కరించాలి అని రాఘవులు తెలిపారు. -
'వామపక్షాలు తెలంగాణకు మద్దతు ఇవ్వడం దారుణం'
హైదరాబాద్: వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ మద్దతివ్వడం దారుణమని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి రాఘవులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజనపై స్పందించిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని విడగొట్టడం దారుణమని ఆయన విమర్శించారు. హిందుత్వ సిద్ధాంతాల కోసం తెలంగాణకు బీజేపీ మద్దతిస్తోందన్నారు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెలుగు దేశం పార్టీ ఎందుకు సమైక్యం అనడం లేదని ఆయన ప్రశ్నించారు. సమైక్యాంధ్ర అంటున్న నేతలు ఎందుకు వారి పార్టీలకు రాజీనామాలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల ప్రజలో ఆటలాడుతుందని రాఘవులు మండిపడ్డారు. -
టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారు:రాఘువులు