
ఏపీ ఎమ్మెల్యేలకు రాందేవ్ పాఠాలు
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యోగా పాఠాలు నేర్చుకోనున్నారు. వారికి ఒకరోజు యోగా పాఠాలు, ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి చెప్పేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా రానున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 20న జరగనుంది.
హైదరాబాద్: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యోగా పాఠాలు నేర్చుకోనున్నారు. వారికి ఒకరోజు యోగా పాఠాలు, ప్రాముఖ్యత, ఉపయోగాల గురించి చెప్పేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా రానున్నారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 20న జరగనుంది.
అసెంబ్లీ సమావేశాల కాలంలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. మరోపక్క, ఆంధ్రప్రదేవ్ అసెంబ్లీ సమావేశాలు కూడా వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 17 నుంచి 22 వరకు ఏపీ శాసన సభా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సమావేశాల కాలంలోనే ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకోసం ఒకరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని పెడుతున్నారు.