రేషన్ బియ్యం పట్టివేత
వెలుగోడు: పట్టణంలోని జగదాంబ రైస్ మిల్లులో రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం విజిలెన్స్ ఎస్ఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో రైస్ మిల్లులో 495 ప్యాకెట్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని బియ్యాన్ని స్టాక్ పాయింట్కు తరలించారు. దాడుల్లో విజిలెన్స్ సిబ్బంది నాగభూషణం, ఈశ్వర్రెడ్డి, మునిస్వామి తదితరులు పాల్గొన్నారు.