టాస్క్‌ఫోర్స్‌పై ఎర్ర కూలీల దాడి | Red laborers attack on the task force | Sakshi

టాస్క్‌ఫోర్స్‌పై ఎర్ర కూలీల దాడి

Jun 1 2017 1:09 AM | Updated on Sep 5 2017 12:28 PM

టాస్క్‌ఫోర్స్‌పై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం భాకరాపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది

ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఇద్దరు తమిళ కూలీల అరెస్టు
కొనసాగుతున్న కూంబింగ్‌


భాకరాపేట : టాస్క్‌ఫోర్స్‌పై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం భాకరాపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. రెడ్‌ శాండల్‌ టాస్క్‌ఫోర్స్‌ డీఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తెల్లవారుజామున ఆర్‌ఎస్‌ఐ భాస్కర్‌ నేతృత్వంలో సిబ్బందితో కలసి భాకరాపేట ఘాట్‌ మార్గం నుంచి కూంబింగ్‌ నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలోని గద్దలగూడు బండల సమీపంలో తమిళ కూలీలు తారసపడ్డారు.  ఆర్‌ఎస్‌ఐ భాస్కర్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. దీంతో తమిళ కూలీలు వారిపై రాళ్లదాడికి పాల్పడ్డారు.

12 మంది ఉన్న తమిళ కూలీల బృందంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు; మిగిలిన వారు పారిపోయారు. వీరి నుంచి 11 దుంగలు, వెంట తీసుకొచ్చిన బట్టలు, బ్యాగులు, అన్నం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జువాదిమలైకు చెందిన మనోహర్, రాజేంద్రన్‌ ఉన్నారు. మిగిలిన వారి కోసం మరో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని డీఐజీ పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement