Task force
-
నకిలీ విత్తనాలు.. దాడులు..
సాక్షి నెట్వర్క్: పత్తి విత్తనాల కోసం రైతుల ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలుచోట్ల అధికార యంత్రాంగం దాడులు, తనిఖీలు చేపట్టింది. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో ఓ దుకాణంలో టాస్క్ ఫోర్స్ అధికారులు నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. లూజ్ విత్తనాలను వివిధ కంపెనీల పేరిట ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. దాని యజమాని రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ⇒ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు విత్తన గోదాముల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. మరోవైపు ఇక్కడి తాంసి బస్టాండ్ సమీపంలోని నిఖిల్ ఫర్టీలైజర్ షాపులో స్టాక్ ఉన్నా డీలర్ నోస్టాక్ బోర్డు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై అధికారులు చర్యలు చేపట్టారు. నిఖిల్ ఫర్టీలైజర్ షాపు వద్ద ఇన్చార్జ్గా ఉన్న ఏఈఓ శివచరణ్ను సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ అర్బన్ ఏఓ భగత్ రమేశ్ను బదిలీ చేశారు. ఇక విత్తనాలు గోదాంలో అందుబాటులో ఉన్నా, డీలర్లకు పంపిణీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాశీ–659 డిస్ట్రిబ్యూటర్ వామన్రావుపై కేసు నమోదు చేశారు. ⇒ ఖమ్మంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశా రు. ఆ సమయంలో దుకాణాల వద్దకు వచ్చిన రైతు లతో మాట్లాడారు. అన్ని రకాల పత్తి విత్తనాలు ఒకటేనని, ఏవైనా దిగుబడి బాగానే వస్తాయని చెప్పారు. ⇒ మరోవైపు జనుము, జీలుగ విత్తనాల కోసం కూడా రైతులు ఇబ్బందిపడుతున్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో జీలుగ విత్తనాల కోసం బారులుతీరారు. -
ట్యాపింగ్ కేసులో రిమాండ్ రిపోర్టు.. అది ‘కారు’చిచ్చే!
సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇటీవల అరెస్టైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు దీనితోపాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిపోర్టులోని వివరాల మేరకు.. ‘‘రాష్ట్ర అవతరణ తర్వాత బీఆర్ఎస్ నాయకత్వం కుల సమీకరణాల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్రావును 2016లో ఎస్ఐబీ చీఫ్గా నియమించింది. తమ కులంతోపాటు ఇతర కులాలకు చెందిన నమ్మకస్తులైన అధికారులను నేతలు ఎంపిక చేసున్నారు. వివిధ విభాగాలు, జిల్లాల్లో పనిచేస్తున్న వీరందరినీ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్ విభాగంలోకి డిప్యూటేషన్పై తెచ్చుకున్నారు. అందులో నల్లగొండ నుంచి ప్రణీత్రావు, రాచకొండ నుంచి భుజంగరావు, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్రావు, హైదరాబాద్ నుంచి తిరుపతన్న ఉన్నారు. ప్రభాకర్రావు సూచనల మేరకే 2017లో రాధాకిషన్రావును బీఆర్ఎస్ నాయకత్వం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించింది. దీని వెనుక రాజకీయ, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ప్రభాకర్రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్రావు, భుజంగరావు తరచుగా కలు స్తూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కొనసాగడం కోసం చేయాల్సిన పనులపై చర్చించేవారు. గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ.. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో వెస్ట్జోన్కు 2021 వరకు ఇన్స్పెక్టర్గా పనిచేసిన గట్టుమల్లును రాధాకిషన్రావు సూచనల మేరకు ప్రభాకర్రావు ఎస్ఐబీలోకి తీసుకున్నారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి చేసే కుట్రలను అమలు చేయడానికి గట్టుమల్లును వినియోగించుకున్నారు. ఇంటెలిజెన్స్, టాస్క్ఫోర్స్ల్లోని మానవ వనరులతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి.. వీరి అక్రమాలు ఎవరికీ తెలియకుండా ఉండేలా ప్రభాకర్రావు బృందం అనేక జాగ్రత్తలు తీసుకుంది. వారంతా కేవలం వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారు. ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు తన నమ్మినబంటు ప్రణీత్రావును స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) నిర్వహణ కోసమే తీసుకువచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడం, ప్రతిపక్షాలను ముప్పతిప్పలు పెట్టడానికి నేతలతోపాటు వారి అనుచరులనూ టార్గెట్ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశమున్న ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లో చేరేలా చేయడం వంటివే వారి టార్గెట్. నగదు రవాణాను గుర్తించి.. ప్రభాకర్రావు, ఆయన బృందం ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణాపై దృష్టి పెట్టింది. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున భవ్య సిమెంట్ కంపెనీకి చెందిన ఆనంద్ ప్రసాద్ పోటీచేశారు. ఆ సమయంలో ఎస్ఐబీ చీఫ్ టి.ప్రభాకర్రావు ఆదేశాల మేరకు డీఎస్పీ దుగ్యాల ప్రణీత్రావు రంగంలోకి దిగి.. ఆనంద్ ప్రసాద్ సంబందీకుల నగదు రవాణాపై నిఘాపెట్టారు. ఆ వివరాలను టాస్క్ఫోర్స్ డీసీపీగా ఉన్న రాధాకిషన్రావుకు అందించారు. ఈయన ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. రాంగోపాల్పేట పోలీసుస్టేషన్ పరిధిలోని ప్యారడైజ్ వద్ద రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రణీత్రావు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు సంబందీకులపై నిఘా పెట్టి వివరాలను రాధాకిషన్రావుకు చేరవేశారు. ఫలితంగానే సిద్దిపేటలో చిట్ఫండ్ కంపెనీ నిర్వహించే రఘునందన్రావు బంధువు నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.కోటి స్వాధీనం చేసుకున్నారు. 2022 అక్టోబర్ రెండోవారంలో మునుగోడు ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో ప్రభాకర్రావు ఆదేశాల మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధీకులపై ప్రణీత్రావు సాంకేతిక నిఘా ఉంచారు. నగదు రవాణా అంశాన్ని గుర్తించి రాధాకిషన్రావుకు తెలిపారు. ఈయన ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ టి.శ్రీనాథ్రెడ్డి నేతృత్వంలోని బృందం తనిఖీలు చేసి.. కోమటిరెడ్డి అనుచరులైన జి.సాయికుమార్రెడ్డి, ఎం.మహేందర్, ఎ.అనూ‹Ùరెడ్డి, వి.భరత్ల నుంచి రూ.3.5 కోట్లు స్వా«దీనం చేసుకుంది’’ అని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. రాధాకిషన్రావు నుంచి మరిన్ని కీలక విషయాలు రాబట్టడం కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ప్రతిపక్షాలతోపాటు విమర్శించే వారిపైనా.. ప్రతిపక్షాలపై నిఘా ఉంచడం, అడ్డుకోవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ను మూడోసారి గెలిపించడమే తమ లక్ష్యమంటూ ప్రభాకర్రావు తన బృందమైన రాధాకిషన్రావు, ప్రణీత్రావు, భుజంగరావు, వేణుగోపాల్రావు, తిరుపతన్నలకు స్పష్టంచేశారు. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబీకులు, సంబం«దీకులు, మద్దతిచ్చే వ్యాపారులతోపాటు బీఆర్ఎస్ను విమర్శించే వారిపైనా ప్రభాకర్రావు బృందం నిఘా ఉంచింది. బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు.. ఆ పార్టీ నాయకులు కొందరిపైనా నిఘా వేశారు. రాధాకిషన్రావు 2020 ఆగస్టులోనే పదవీ విరమణ చేసినా.. కుల ప్రాతిపదికన ఆయనకు ఓఎస్డీగా రెండుసార్లు అవకాశమిచ్చారు. హైదరాబాద్ నగరంపై పట్టు కొనసాగడానికే ఇలా చేశారు. -
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
9 మంది ఐపీఎస్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఐపీఎస్లు, పోలీసు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం తొమ్మిది మంది ఐపీఎస్లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. ఐపీఎస్ల బదిలీకి సంబంధించి ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, నాన్ కేడర్ ఎస్పీల బదిలీలపై హోంశాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్ వేర్వేరుగా జీఓలు జారీ చేశారు. ► హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ సీపీ పి.విశ్వప్రసాద్ను హైదరాబాద్ నగర ట్రాఫిక్ సీపీగా బదిలీ చేశారు. ► ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసిన వరంగల్ మాజీ సీపీ రంగనాథ్ను హైదరాబాద్ సిటీ జాయింట్ సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా నియమించారు. ► ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఎస్ఎం విజయ్కుమార్ను హైదరాబాద్ వెస్ట్జోన్ డీసీపీగా.. ఇప్పటివరకు వెస్ట్జోన్ డీసీపీగా ఉన్న జోయల్ డేవిస్ను హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా బదిలీ చేశారు. ► మెదక్ ఎస్పీగా ఉన్న రోహిణి ప్రియదర్శినిని హైదరాబాద్ సిటీ నార్త్జోన్ డీసీపీగా నియమించారు. ► సిద్దిపేట సీపీ ఎన్.శ్వేతను హైదరాబాద్ సిటీ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీగా బదిలీ చేశారు. ► పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న ఎల్.సుబ్బారాయుడును హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–1 డీసీపీగా నియమించారు. ► టాస్క్ ఫోర్స్ డీసీపీ నితిక పంత్, గజరావు భూపాల్, చందనాదీప్తి తదితర అధికారులను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఐదుగురు నాన్కేడర్ ఎస్పీలు బదిలీ.. ► వెయిటింగ్లో ఉన్న అధికారి ఎన్.వెంకటేశ్వర్లుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్–3 డీసీపీగా పనిచేస్తున్న డి.శ్రీనివాస్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ► రాచకొండ కమిషనరేట్లో రోడ్డు భద్రత విభాగం డీసీపీగా ఉన్న శ్రీబాలదేవి హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమితులయ్యారు. ► మాదాపూర్ డీసీపీగా ఉన్న జి.సందీప్ను రైల్వేస్ ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. రైల్వేస్ ఎస్పీ(అడ్మిన్)గా ఉన్న జె.రాఘవేందర్రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం బదిలీ చేసింది. నాలుగేళ్లుగా టాస్క్ఫోర్స్ ఓఎస్డీగా రాధాకృష్ణ కొనసాగుతున్నారు. పదవీ విరమణ తర్వాత ఓఓస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ►టీఎస్పీఎస్ఏ జాయింట్ డైరెక్టర్గా రంగనాథ్ ►టీఎస్పీఎస్ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్ ►సీఐడీ ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి ►గ్రే హౌoడ్స్ ఎస్పీగా వెంకటేశ్వర్లు ►సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా నితికా పంత్ ►సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా రోహిత్ రాజ్ ►ట్రాఫిక్ డీసీపీగా ఆర్. వెంకటేశ్వర్లు ►పెద్దపల్లి డీసీపీగా సునీతా మోహన్ -
నోటీసులిచ్చారు.. చర్యలు మరిచారు!
● చండూరు పట్టణంలో కేంద్రంలో అనుమతి లేకుండా ఓ భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై మున్సిపల్ అధికారులకు ఓ నాయకుడు ఫిర్యాదు చేశాడు. అధికారులు నిర్మాణదారుడికి ముందుగా నోటీసులు ఇచ్చారు. చర్యలు తీసుకుంటామని చెప్పే లోపే (ఏడాది సమయంలో) ఆ భవన నిర్మాణం పూర్తయింది. ● పట్టణంలో ఓ వ్యక్తి అనుమతి లేకుండా మూడు ప్లోర్ల ఇంటి నిర్మాణం చేపట్టాడు. అక్రమ నిర్మాణం చేపడుతున్నారని కౌన్సిలర్లు అధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ● ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరి గోడ ముందు అనుమతి లేకుండా రెండు విగ్రహాలు ఏ్పాటు చేస్తున్నారని పట్టణ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారికి అధికారులు నోటీసులు ఇచ్చి వదిలేశారు. చండూరు : చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. పట్టణంలోని సెంటర్ నుంచి రోడ్డుకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు మొదలుకుని పెద్ద భవనాలు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు ఇలా చాలా వరకు అనుమతి లేని నిర్మాణాలే. అక్రమ నిర్మాణం చేసుకునే వారికి నోటీలిస్తున్న అధికారులు వారిపై చర్యలకు మాత్రం వెనుకాడుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పలుకుబడి ఉన్న వారు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే.. పేదలకు మాత్రం అనుమతులు అడుగుతూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 100 వరకు అక్రమ నిర్మాణాలు.. చండూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 ఇళ్ల వరకు అనుమతిలేనివిగా అధికారులు గుర్తించా రు. వీరికి గతంలో నోటీసులు సైతం అందజేసి.. చ ర్యలు తీసుకోవడం మరిచారు. అధికారులు గుర్తించనవి మరో వంద వరకు ఉంటాయని కౌన్సిలర్లే చెప్తున్నారు. అధికారులు నోటీసులు ఇవ్వడం తప్ప చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని పట్టణవాసులు అంటున్నారు. టాస్క్ఫోర్స్కు ఫిర్యాదు చేస్తున్నాం చండూరు మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు అందించాం. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తదుపరి చర్యలకు జిల్లా టాస్క్ఫోర్స్కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – మొయిజుద్దీన్, కమిషనర్, చండూరు మున్సిపాలిటీ నిబంధనలు ఇలా.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా, సులభంగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం కోసం బీఎస్ బీపాస్ను ప్రవేశపెట్టింది. ఇందులో ముందుగా అనుమతి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. ఆ తర్వాత రెవెన్యూ ఆర్ఐ లాగిన్ వెళ్తే ఆర్ఐ క్షేత్రస్థాయిలో విచారణ చేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ (టీపీఎస్)కు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే టీపీఎస్ నుంచి నేరుగా అనుమతులు ఇస్తారు. అనుమతుల కోసం ఇంటి గజాలను బట్టి ఆన్లైన్లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇలా అనుమతుల ప్రక్రియ పట్టణంలో సాగడం లేదు. -
మూడొంతులు గల్లంతు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దులో సయ్యద్ శారాజ్ ఖత్తాల్ హుస్సేన్ దర్గాకు సుమారు 500 ఎకరాల భూమి ఉంది. చాలావరకు భూమి సాగులో ఉంది. 2008లో వక్ఫ్బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో కొందరు రైతులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఇలావుండగా సర్వే నంబర్ 82/అ/1/1లోని ఆరు ఎకరాలకు సంబంధించి ఒక రైతు పేరిట 2018లో పట్టాదారు పాస్బుక్ జారీ అయింది. తర్వాత తప్పిదాన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు 2021లో పాస్బుక్ను రద్దు చేశారు. అయితే అప్పటికే సదరు రైతు నుంచి భూమిని కొనుగోలు చేసిన రియల్టర్లు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నించగా నిషేధిత జాబితా కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు హెచ్ఎండీఏఅధికారులు అవగాహన రాహిత్యంతో భూమికి లే అవుట్ పర్మిషన్స్ (ఎల్పీ) నంబర్ జారీ చేయడంతో, ఫైనల్ లే అవుట్ అప్రూవల్ కోసం సదరు రియల్టర్లు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వక్ఫ్ భూములు యథేచ్చగా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాలు కబ్జాలో ఉన్నాయి. వక్ఫ్బోర్డు సిబ్బందే స్థిరాస్తి వ్యాపా రులతో కుమ్మక్కై రికార్డులు తారు మారు చేస్తున్నారనే ఆరోపణలు ఉండగా, ప్రభుత్వం కూడా వీటిని రెవెన్యూ భూములుగా పేర్కొంటూ అడ్డగోలుగా ధారాదత్తం చేస్తోందనే విమర్శలున్నాయి. మరోవైపు లీజులకు ఇచ్చిన భూములు సైతం క్రమంగా చేజారిపోతున్నాయి. నిజాం కాలం నుంచి వక్ఫ్ ఆస్తుల రికార్డులు ఉర్దూ, పార్సీ భాషల్లో ఉండగా, భద్రపరచాల్సిన వారే చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. రిటైరైన పర్మినెంట్ సిబ్బంది స్థానంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండటం అక్రమార్కులకు కలిసి వస్తోంది. నామమాత్రపు చర్యలే.. వక్ఫ్బోర్డు రికార్డుల ప్రకారం రాష్ట్రంలోని దర్గాలు, మసీదులు, ఆషూర్ ఖానాలు, చిల్లాలతో పాటు స్మశానవాటికలు తదితరాల (మొత్తం 33,929) కింద సుమారు 77,588.07 ఎకరాల భూమి ఉంది. అందులో మూడొంతులు అంటే.. ఏకంగా 57,423.91 ఎకరాలు (74 శాతం) ఆక్రమణలో ఉండటం విస్మయం కలిగించే అంశం. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో అధిక శాతం భూములు కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. మెదక్లో దాదాపు పూర్తిగా పరాధీనమయ్యాయి. బోర్డు సుమారు 2,186 మంది ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసినా తదుపరి చర్యలు ముందుకు సాగలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో కబ్జాలపై ఉక్కుపాదం కోసం రెవెన్యూ, పోలీసు, వక్ఫ్ బోర్డు అధికారులతో కూడిన ఒక టాస్్కఫోర్స్ ఏర్పాటైనా చలనం మాత్రం లేదు. మరోవైపు రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని రికార్డుల గదికి ఐదేళ్లుగా తాళం చిప్ప వేలాడుతోంది. అవినీతి ఆరోపణలు దష్ట్యా సీఎం ఆదేశాలతో రెవెన్యూ అధికారులు కీలక రికార్డులను స్వా«దీనం చేసుకొని రికార్డు రూమ్ను సీజ్ చేశారు. అది ఇప్పటివరకు తెరుచుకోక పోవడంతో సుమారు 3,400 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు కేసులు సరైన ఆధారాలు లేక వీగిపోయాయి. కబ్జాల పర్వం.. ♦ నల్లగొండ జిల్లా దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూమిలో సుమారు 83 ఎకరాలు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ♦ మల్కాజిగిరిలో హజరత్ మీర్ మెహమూద్ సాహబ్ పహాడి దర్గాకు సర్వే నంబర్ 659, 660లో సుమారు మూడు ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. తాజాగా ఒక వ్యక్తి ఈ భూమిపై తిష్ట వేశాడు. ఫెన్సింగ్ వేసి ప్లాటింగ్కు సిద్ధమవుతున్నాడు. ♦ చిల్లా కోహ్–ఎ–మౌలా–అలీకి మల్లాపూర్, కీసర రాంపల్లిలో సుమారు 232 ఎకరాల భూమి ఉండగా సగానికి పైగా భూబకాసురుల ఆక్రమణలో ఉంది. ♦ మణికొండ దర్గాకు 1,654 ఎకరాల భూమి ఉన్నట్టు రికార్డులుండగా ప్రస్తుతం ఎకరం భూమి కూడా కన్పించడం లేదు. ♦ హకీముల్ మునవీ అల్ మారూఫ్ హకీం బాబా దర్గాకు కుతుబ్షాహీల కాలంలో దర్గా నిర్మాణం కోసం 4,448 గజాలు, దర్గా నిర్వహణ కోసం 323 ఎకరాల 18 గుంటల భూమిని వక్ఫ్ చేయగా, ప్రస్తుతం దర్గా మినహా మిగతా భూమి ఉనికి లేకుండా పోయింది. ధారాదత్తం ఇలా.. ♦ ఐదో నిజాం రాజు అఫ్జల్ దౌలా మణికొండ గ్రామ పరిధిలో హుస్సే¯న్ షావలి దర్గాకు 1,898 ఎకరాలు రాసిచ్చారు. 1959లో గెజిట్ కూడా విడుదల అయ్యింది. అయితే రికార్డుల్లో సర్కారీ పేరుతో ఉన్న వక్ఫ్ భూముల్ని రెవెన్యూగా పేర్కొంటూ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టింది. ♦ పహడీషరీఫ్లో బాబా షర్ఫొద్దీన్ దర్గాకు మామిడిపల్లిలో 2,131 ఎకరాల భూమి ఉండగా, దీంట్లోంచి 1,051 ఎకరాల భూమిని వక్ఫ్బోర్డు అనుమతి లేకుండానే ప్రభుత్వం విమానాశ్రయానికి, మరో 91 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ♦ సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెంలో ఈద్గాకు చెందిన సర్వే నంబర్ 290లోని 9.20 ఎకరాల భూమిని ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు అప్పగించింది. న్యాయాధికారాలు ఉండాలి వక్ఫ్ బోర్డుకు ప్రత్యేక న్యాయాధికారాలు ఉండాలి. వక్ఫ్, రెవెన్యూ భూములపై స్పష్టత రావాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులను నియమించాలి. రికార్డులు గల్లంతు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. అక్రమణలను తొలగించేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సహకరించాలి. – అబుల్ పత్హే బందగి బద్షా రియాజ్ ఖాద్రీ, పాలక మండలి సభ్యుడు, వక్ఫ్బోర్డు. హైదరాబాద్ రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి వక్ఫ్ భూముల రికార్డుల గదిని తక్షణమే తెరిపించాలి. కోర్టు వివాదాల్లోని భూములపై సమగ్ర ఆధారాలు సమర్పించే విధంగా చర్యలు అవసరం. అప్పుడే వక్ఫ్ భూముల పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకోవాలి. – సయ్యద్ ఇఫ్తేకర్ హుస్సేనీ, వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ గద్వాలలోని హజరత్ సయ్యద్ షా మరూఫ్ పీర్ ఖాద్రీ దర్గాకు 39.8 ఎకరాల భూమి ఉంది. సంగాలలోని సర్వే నంబర్ 95, 96, 97, 98లోని 27.9 ఎకరాల భూమిని దర్గా ముతవల్లి ద్వారా స్థానిక రైతు ఒకరు సాగు కోసం లీజుపై తీసుకున్నారు. తర్వాత ఆ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడటంతో అతని సోదరుడు రెవెన్యూ శాఖ ద్వారా యాజమాన్య హక్కు సర్టిఫికెట్ (ఓఆర్సీ) పొందాడు. తర్వాత తన పేరిట మారి్పడి చేసుకొని ప్లాటింగ్కు ప్రయత్నించాడు. దర్గాకు చెందినవారి ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ కోర్టు ఓఆర్సీపై స్టే ఇవ్వగా దానిపై హైకోర్టు స్టే విధించింది. -
ఒక్క గింజా వదలం.. నయా పైసా పోనియ్యం
సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు కేటాయించిన ధాన్యంలో ఒక్క గింజను వదులుకోబోమని, ఒక్క రూపాయిని కూడా ఊరికే పోనివ్వ మని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ధాన్యం అమ్ముకునే మిల్లర్లను, రేషన్ బియ్యం పక్కదారి పట్టడాన్ని గుర్తించి సమాచారం అందించిన పౌరులకు సైతం రివార్డులు అందజేయడంతోపాటు వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామన్నారు. శుక్రవారం పౌర సరఫరాల శాఖ, సంస్థల అధికారులతో హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ సూర్యాపేట, నల్గగొండ, వనపర్తి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోనే అధికంగా మిల్లర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, సీఎంఆర్ అప్పగింతలో కూడా ఈ జిల్లాల్లో డిఫాల్టర్లు అధికంగా ఉన్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో పటిష్టమైన టాస్క్ఫోర్స్ను తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ రిటైర్డ్ పోలీస్, రెవెన్యూ ఉన్నతాధికారులతో కట్టుదిట్టమైన టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆరు రెట్లు ధాన్యం దిగుబడి.. రెండు రెట్లు మాత్రమే పెరిగిన మిల్లింగ్ కెపాసిటీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి చేసిన కృషితో 24 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 141 లక్షల మెట్రిక్ టన్నులకు ధాన్యం సేకరణ పెరిగిందని మంత్రి కమలాకర్ తెలిపారు. ఆరింతలుగా పెరిగిన ఈ ధాన్యం సేకరణకు అనుగుణంగా మిల్లింగ్ కెపాసిటీ పెరగలేదని, కేవలం గతానికి ఇప్పటికి 2 రెట్లు మాత్రమే పెరిగిందన్నారు. అందువల్ల మిల్లర్లకు అదనంగా ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని, ఇదే అదనుగా కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులతోపాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించి 125 శాతం నగదు రికవరీ చేస్తా మని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల నుంచి 90 శాతం రికవరీ చేశామని, మిగతా పది శాతం సైతం రికవరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రెండు లారీ ల బియ్యం మిల్లుకు అక్రమంగా తరలిస్తుండగా, విజిలెన్స్ బృందాలు పసిగట్టి పట్టుకున్నాయని చెప్పారు. పెద్దపల్లితో పాటు సూర్యాపేట, ఇతర జిల్లాల్లో జరిగిన బియ్యం అక్రమాలపై కూడా కేసులు బుక్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ధాన్యం నిల్వ కోసం ఇంటర్మీడియట్ గోదాంలు ఈ యాసంగిలో ఇంటరీ్మడియట్ గోదాములను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి గంగుల తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో ఖాళీగా ఉన్న మిల్లింగ్ కెపాసిటీని వాడుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సీఎంఆర్ డిఫాల్టర్లకు, అక్రమ మిల్లర్లకు ఈసారి ఒక్క గింజను కూడా కేటాయించబోమని చెప్పారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి గంగులను కలిసిన గెల్లు శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమితులైన హుజూరాబాద్ నియో జకవర్గం బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 15న ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఆయన్ను కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను అభినంస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, సీఎం కేసీఆర్ అప్పగించిన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని గంగుల సూచించారు. -
‘హనీట్రాప్’తో లీక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పరీక్ష పేపర్ లీకేజీ వెనుక హనీట్రాప్ ఉన్నట్టు బయటపడింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్కుమార్ తనకు సన్నిహితంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో ప్రశ్నపత్రాన్ని బయటికి తెచ్చినట్టు తేలింది. ఆ టీచర్ కోరిక మేరకే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని తీసుకురాగా.. సదరు టీచర్ మాత్రం ఓ దళారీ సాయంతో ముగ్గురు అభ్యర్థులకు పేపర్ను విక్రయించినట్టు వెల్లడైంది. ఈ క్రమంలోనే పేపర్ లీకేజ్ విషయం బహిర్గతమైంది. దీనిపై టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ ఫిర్యాదు మేరకు బేగంబజార్ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని ‘టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్’ పోస్టులకు ఆదివారం పరీక్ష జరగాల్సి ఉండగా.. దీనిని టీఎస్పీఎస్సీ వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోదరుడి కోసమంటూ అడిగి హైదరాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రేణుకకు కొన్నాళ్లుగా ప్రవీణ్కుమార్తో పరిచయం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న టీఎస్పీఎస్సీ పరీక్షలకు రేణుక సోదరుడు కూడా దరఖాస్తు చేసుకున్నాడు. ఆదివారం టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష రాయాల్సి ఉంది. పోటీ ఎక్కువగా ఉండటంతో తన సోదరుడిని ఎలాగైనా గట్టెక్కించాలని భావించిన రేణుక తన భర్తతో కలిసి ప్రవీణ్ను సంప్రదించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కావాలని కోరింది. అప్పటికే ఆమెతో సన్నిహితంగా ఉంటున్న ప్రవీణ్ వెంటనే అంగీకరించాడు. టీఎస్పీఎస్సీలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్న రాజశేఖర్తో కలిసి పేపర్ తస్కరణకు పథకం వేశాడు. ఈ పేపర్లు కమిషన్కు చెందిన సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ ఆధీనంలో, ఆమె కంప్యూటర్లోనే ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రవీణ్, రాజశేఖర్ ఆ కంప్యూటర్పై నిఘా పెట్టారు. 28న తస్కరణ.. 2న కాల్చివేత.. ప్రవీణ్, రాజశేఖర్ పలుమార్లు శంకరమ్మకు చెందిన కంప్యూటర్ను పరిశీలించారు. సరైన లాక్, ఫైర్వాల్స్ లేవని నిర్థారించుకుని.. గత నెల 28న రంగంలోకి దిగారు. కార్యాలయం నుంచి అంతా వెళ్లిపోయేదాకా వేచిచూసిన ఈ ఇద్దరూ.. మెల్లగా ఆ పేపర్ను ఓ పెన్డ్రైవ్లోకి కాపీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాజశేఖర్ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఔట్ తీసుకున్నారు. ప్రవీణ్ ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకువెళ్లి రేణుక, ఆమె భర్తకు అప్పగించాడు. కేవలం రేణుక సోదరుడు చదువుకోవడానికే వినియోగించాలని, మరునాడే తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. దీనికి అంగీకరించిన రేణుక, ఆమె భర్త ఆ పేపర్ తీసుకువెళ్లారు. అయితే రేణుక పేపర్ను సోదరుడికి ఇవ్వడంతోపాటు జిరాక్సు తీసి పెట్టుకుంది. తమ స్వగ్రామం సర్పంచ్ కుమారుడితో తన వద్ద టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉంటే విక్రయిస్తానని చెప్పింది. సర్పంచ్ కుమారుడు తనకు తెలిసిన ముగ్గురు అభ్యర్థులను ఏర్పాటు చేశాడు. వారికి రూ.14 లక్షలకు పేపర్ను విక్రయించిన రేణుక రూ.4 లక్షలు తాను తీసుకుని, రూ.10 లక్షలను ప్రవీణ్కు ఇచ్చింది. అతడు ఇచ్చిన పేపర్ను ఈ నెల 2న తిరిగి ఇచ్చేసింది. ఓ అభ్యర్థి రూమ్మేట్కు తెలియడంతో.. రేణుక పరీక్ష ప్రశ్నపత్రాన్ని విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్.. తనకు తిరిగిచ్చిన పేపర్ను సైదాబాద్లోని తన ఇంటికి తీసుకువెళ్లి కాల్చేశాడు. అయితే ప్రశ్నపత్రం కొన్న అభ్యర్థుల్లో ఒకరు హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటున్నాడు. అతడి రూమ్మేట్ సైతం కొన్నాళ్లుగా టీఎస్పీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం రాత్రి మాటల సందర్భంలో సదరు అభ్యర్థి పేపర్ లీకేజీని రూమ్మేట్కు చెప్పాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకవడంపై కంగుతిన్న రూమ్మేట్ ఇతర స్నేహితులతో కలిసి శనివారం టీఎస్పీఎస్సీ వద్దకు వెళ్లి ఆరా తీశాడు. అక్కడి నుంచే ‘డయల్–100’కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసులు.. ఈ విషయం ఆరా తీసి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ దృష్టికి విషయం తీసుకువెళ్లడంతోపాటు పరిశీలన జరపగా పేపర్ లీకేజీపై ప్రాథమిక ఆధారాలు లభించాయి. ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పేపర్ సైతం లీక్? టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజీపై బేగంబజార్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి.. ప్రవీణ్, రాజశేఖర్లను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రేణుకతోపాటు ఇతరుల పాత్ర బయటికి వచ్చింది. పోలీసులు మొత్తం 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ప్రతులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో చేతులు మారిన రూ.14 లక్షలను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితులను బేగంబజార్ పోలీసులకు అప్పగించారు. వీరిని విచారిస్తున్న నేపథ్యంలోనే.. గత వారం టీఎస్పీఎస్సీ నిర్వహించిన ‘అసిస్టెంట్ ఇంజనీర్’ పరీక్ష పేపర్లు కూడా లీక్ అయ్యాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టినట్టు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న నిందితులను సోమవారం అరెస్టు ప్రకటించే అవకాశం ఉంది. పేపర్ లీకేజీ అంశంపై టీఎస్పీఎస్సీ అధికారులు కూడా అంతర్గత విచారణ ప్రారంభించారు. -
మహానది– గోదావరి అనుసంధానానికి చిక్కులు
సాక్షి, అమరావతి: మహానది–గోదావరి అనుసంధానానికి ప్రతిపాదన దశలోనే న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల మధ్య మహానది జలాల వినియోగంలో వివాదాన్ని పరిష్కరించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇప్పటిదాకా తుది నివేదిక ఇవ్వలేదు. మహానది జలాల వినియోగం వివాదంపై ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాకే మహానది–గోదావరి అనుసంధానంపై ముందుకెళ్లాలని సోమవారం నిర్వహించిన 17వ సమావేశంలో టాస్క్ఫోర్స్ నిర్ణయం తీసుకుంది. ఇదీ ప్రతిపాదన ఒడిశాలో బర్మూర్ నుంచి 408 టీఎంసీల మహానది జలాలను గోదావరికి మళ్లించేలా జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) ప్రతిపాదించింది. ఇందులో 178 టీఎంసీలను ఒడిశా చేపట్టిన ఐదు ప్రాజెక్టులకు కేటాయించింది. మిగతా 230 టీఎంసీలను ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలోకి తరలించి, వాటిని గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సరఫరా చేయాలని పేర్కొంది. తెగని మహానది జలాల వివాదం ఒడిశా, ఛత్తీస్గఢ్ల మధ్య మహానది జలాలపై తలెత్తిన వివాదం పరిష్కారానికి 2018లో కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. విచారణ జరిపి, నివేదిక ఇవ్వడానికి మూడేళ్ల గడువిచ్చింది. గడువులోగా విచారణ పూర్తి చేయలేదు. దాంతో 2021 మార్చి 11న గడువును మరో రెండేళ్లు పెంచింది. ఈ గడువు కూడా శుక్రవారంతో ముగిసింది. ఇప్పటికీ ట్రిబ్యునల్ కేంద్రానికి తుది నివేదిక ఇవ్వలేదు. మహానది టు కావేరి వయా గోదావరి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా (సోమశిల), కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించడం ద్వారా గోదావరి–కావేరిలను అనుసంధానించేలా ఎన్డబ్ల్యూడీఏ 2021 ఏప్రిల్లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) తయారు చేసింది. గోదావరి నికర జలాల్లో మిగులే లేదని, శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మిగులు తేల్చాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని ఏపీ, తెలంగాణ ఆదిలోనే స్పష్టం చేశాయి. దాంతో ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించేలా డీపీఆర్ను ఎన్డబ్ల్యూడీఏ మార్పులు చేసింది. ఇటీవల జరిగిన టాస్క్ఫోర్స్ సమావేశంలో దీనిపై చర్చించారు. ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకోని గోదావరి జలాలకు.. 230 టీఎంసీల మహానది జలాలను జత చేయడం ద్వారా మహానది – గోదావరి – కావేరిలను అనుసంధానిస్తే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలలో దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు, తాగు నీటి ఇబ్బందులను అధిగమించవచ్చునని ఎన్డబ్ల్యూడీఏ ప్రతిపాదిస్తోంది. -
హైదరాబాద్లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు
-
చంటి లోకల్! అనే సినీ డైలాగ్తో వసూళ్లు..నివ్వెరపోయిన పోలీసులు
సాక్షి, వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపేది టాస్క్ఫోర్స్.. కానీ ఆ విభాగంలోని అధికారుల్లో కొందరు అవే అక్రమాలకు పాల్పడడం... విచారణలో తెలిసిన విషయాలు చూసి నివ్వెరపోయిన పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం కమిషరేట్లో కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వి.నరేష్కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు పి.శ్యాంసుందర్, కె.సోమలింగం, కానిస్టేబుల్ బి.సృజన్లు బియ్యం దందాతోపాటు మ రికొన్నింట్లో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్ చేస్తూ సీపీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 3న పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వసూళ్లకు వారే సూత్రధారులు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ ఏర్పడినప్పటినుంచి కొంతమంది సిబ్బందికి ఎలాంటి బదిలీలు లేవు. దీంతో శాఖలోని లొసుగులను ఆసరా చేసుకుని వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి టాస్క్ ఫోర్స్ను అడ్డుపెట్టుకుని సస్పెన్షన్కు గురైన ఓ హెడ్ కానిస్టేబుల్ ఏకంగా లక్షల రూపాయల వసూళ్లకు పా ల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ కానిస్టేబుల్కు రూ.10వేల కంటే తక్కువ ఇస్తే వాటిని ముఖంపై విసిరికొట్టేవాడని చెబుతుండేవారు. కొంతకాలంగా వీరిపై వస్తున్న వసూళ్ల ఆరోపణలపై దృష్టి సారించిన సీపీ రంగనాథ్ ఆ దిశగా విచారణ జరిపారు. కొందరు అధికారుల అవినీతి బయటపడుతుందని ఆశించిన వారికి టాస్క్ఫోర్స్లో అది వెలుగుచూడడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. రెండు బృందాల్లోని టాస్క్ఫోర్స్లో కీలకంగా పనిచేసిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఒకేసారి సస్పెండ్ కావడం చూస్తుంటే ఏ స్థాయిలో వసూళ్లు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల విచారణ...నలుగురిపై వేటు పీడీఎస్ బియ్యం దందాపై జరిగిన విచారణలో భా గంగా హసన్పర్తికి చెందిన ఓ బియ్యం వ్యాపారి, మిల్స్కాలనీ పీఎస్ పరిధిలో ఉండే మరో వ్యాపారి, ఓ రిపోర్టర్ను వారం రోజులపాటు విచారించడంతో నిజాలు వెలుగుచూసినట్లు తెలిసింది. మామూ ళ్ల వసూళ్లలో కమిషనరేట్కు చెందిన అధికారులు పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం. వరుస సస్పెన్షన్ వేట్లతో ఉరికిస్తున్న సీపీ.. రానున్న రోజుల్లో ఎవరిపై చర్యలు హాట్టాపిక్గా మారింది. చంటి లోకల్.. వసూళ్ల సూత్రధారి ఓ రిపోర్టర్ వేటుపడిన టాస్క్ఫోర్స్ అధికారి ఉన్నతాధికారుల ముందు ‘చంటి లోకల్...అధికారులు వస్తారు...పోతారు’ అనే సినిమా డైలాగ్ను పదేపదే చెప్పడంతోపాటు తనకు ఓ ఎమ్మెల్యే అండ ఉందని, తనను ఎవరు ఏమీ చేయరనే ధైర్యంతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతినెలా లక్షల రూపాయల వరకు వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. వరంగల్ ప్రాంతంలో ఓ యూ ట్యూబ్ రిపోర్టర్ను మధ్యవర్తిగా పెట్టుకుని పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. (చదవండి: మానవత్వంలో ‘రాజా’రాం... ) -
‘టాస్క్ఫోర్స్’ తీసేసినా.. నియంత్రణ ఫోర్స్ అంతే!
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక అభ్యసన సామర్థ్యాల సాధన (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమం కోసం విద్యాశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని తాత్కాలికంగా నిలిపివేసినా... మరో రూపంలో తెచ్చే యోచనలోనే అధికారులున్నారు. కాకపోతే ‘టాస్క్ఫోర్స్’అన్న ఘాటైన పదాన్ని మాత్రమే మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకతమైనా అత్యంత వివాదాస్పదమైన ఈ నిర్ణయంపై కొంతమంది అధికారులు ఏమాత్రం వెనక్కు తగ్గొద్దన్న ధోరణిలో ఉన్నారు. ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా వందకు వంద శాతం విద్యార్థుల్లో అభ్యసన మెరుగుపర్చడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖ కార్యక్రమాలను ఉపాధ్యాయులు తేలికగా తీసుకుంటున్నారని, అందుకే గట్టి పర్యవేక్షణ అవసరమని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ భావిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులపై వేటు పడితేనే ఎఫ్ఎల్ఎన్పై శ్రద్ధ పెరుగుతుందని ఆమె అన్నట్టు ఓ సీనియర్ అధికారి ఉపాధ్యాయ సంఘాలతో చెప్పారు. అయితే, టాస్క్ఫోర్స్ పేరుపై మంత్రి కూడా కొంతమేర అభ్యంతరాలు తెలిపినట్టు తెలిసింది. ఈ కారణంగా దీని పేరు మార్చినా విధివిధానాల్లో మార్పు ఉండే అవకాశం లేదని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. మరింత కఠిన నిబంధనలు టాస్క్ఫోర్స్ కమిటీలో స్థానిక ఎన్జీవో సంస్థల భాగస్వామ్యంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్థానిక రాజకీయాలు ఇందులో ప్రభావం చూపే అవకాశముందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1–5వ తరగతి ఉండే పాఠశాలల్లో స్థానిక నేతల పెత్తనం ఉంటుందని, వారి కనుసన్నల్లోనే ఎన్జీవోలు ఉంటాయని, దీనివల్ల తాము నష్టపోయే ప్రమాదం ఉందని టీచర్లు చెబుతున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదని తెలిసింది. ఎన్జీవోల స్థానంలో స్థానిక సంస్థలు ప్రతిపాదించిన ఓ వ్యక్తిని కమిటీలో నియమించేందుకు సిద్ధపడుతున్నారు. అంతేకాకుండా పంచాయతీ, మున్సిపల్ పరిధిలో ఎఫ్ఎల్ఎన్ నిర్వహణపై నివేదికలు ఇచ్చేలా చర్యలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు. వాస్తవానికి టాస్క్ఫోర్స్లో జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వంలో ఎంఈవో, డైట్ లెక్చరర్, మండల, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, ఎన్జీవో లను సభ్యులుగా చేర్చారు. విద్యార్థులకు టీచర్లు ప్రతీ వారం పరీక్షలు నిర్వహించాలి. 15 రోజులకోసారి అధికారులకు నివేదికలు పంపాలి. ప్రతీనెల ఉన్నతాధికారులు వీటిని సమీక్షిస్తారు. ఇదే క్రమంలో టాస్క్ఫోర్స్ కమిటీ స్కూళ్లకు వెళ్లి విద్యార్థి సామర్థ్యాన్ని, ఉపాధ్యాయుల బోధనను పరిశీలిస్తుంది. సరిగా బోధించని ఉపాధ్యాయులపై, ఫలితాలు సాధించని స్కూళ్లపై టాస్క్ఫోర్స్ నివేదిక ఇస్తుంది. దీని ఆధారంగా ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే వీ లుంది. టాస్క్ఫోర్స్ను నిలిపివేయడంతో కొత్తగా ఏర్పాటు చేసే వ్యవస్థలోనూ విద్యాశాఖ అధికారుల ప్రమేయం కన్నా, స్థానిక సంస్థలకే ఎక్కువ అధికారాలు ఇచ్చే యోచనలో అధికారులున్నారు. ఇది మరో వివాదానికి తెరతీసే ఆస్కారం ఉందని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. -
NEC Meet 2022: ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెరగాలి
గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న విస్తృత అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో త్వరలో టూరిజం టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేయనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. గువాహటిలో శనివారం ప్రారంభమైన రెండు రోజుల 70వ ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్ఈసీ) ప్లీనరీ సమావేశాల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణ కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈశాన్య రాష్ట్రాలతో కలిపి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు(గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్)ను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడిదారులకు అనువైన విధానపర నిర్ణయాలు, భూ బ్యాంకు డిజిటలీకరణ( అందుబాటులో ఎక్కడ ఎంత భూమి ఉంది), పెట్టుబడుల నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో నిబంధనల ద్వారా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాలి. ప్రతి రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టాలి’ అని కిషన్ రెడ్డి సూచించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో జాతీయ రహదారుల అభివృద్ధికి మరో రూ.80వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. 19 కొత్త రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి లేకుండా దేశాభివృద్ధి సంపూర్ణం కాదు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ‘ ఈ రాష్ట్రాల్లో శాంతి స్థాపన కోసం, రాజకీయ స్థిరత్వం కోసం కేంద్రం ప్రయత్నిస్తోంది’ అని ఆయన అన్నారు. -
చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో అంతర్జాతీయ పార్కులో వదిలిన చీతాల పర్యవేక్షణకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఓ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. పార్క్తోపాటు సమీప ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాల్లో చీతాలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. మధ్యప్రదేశ్ అటవీ, పర్యాటక శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఈ తొమ్మిది మంది సభ్యుల బృందానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సహకరిస్తుంది. కొత్త ప్రాంతాన్ని చీతాలు ఏ మేరకు సొంతస్థలంగా భావిస్తాయి, చీతా ఆరోగ్య స్థితి సమీక్షించడం, వేట నైపుణ్యాలను పరీక్షించడమే లక్ష్యంగా ఈ టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. బృందం చేపట్టాల్సిన ఇతరత్రా పనులను మంత్రిత్వశాఖ నిర్ధేశించింది. రెండేళ్లపాటు టాస్క్ఫోర్స్ ఈ ప్రత్యేక విధుల్లో నిమగ్నమై ఉంటుంది. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్ -
వెయ్యి క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి రూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది. టాస్క్ఫోర్స్ అధికారుల ఎంట్రీతో..: టాస్క్ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్వని, లారీల్లో ఉన్నవి రేషన్ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్ చేశారు. -
పరిశ్రమల్లో తనిఖీలకు మూడు టాస్క్ఫోర్స్లు
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్ఫోర్స్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు. -
తీరు మారలేదు... చోరీలు మానలేదు
చిలకలగూడ : పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. పీడీయాక్టుపై శిక్ష అనుభవించాడు. నెల రోజుల క్రితమే బెయిల్పై విడుదలై తన స్నేహితుడితో కలిసి ఆరుచోట్ల పంజా విసిరాడు. చివరకు పోలీసులకు చిక్కి మరోమారు కటకటాల పాలయ్యాడు. ఇరువురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి రూ. లక్షల నగదు, నగలు స్వాదీనం చేసుకున్నట్లు సౌత్జోన్ టాస్క్ఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా తెలిపారు. సంతోష్నగర్కు చెందిన మెహబూబ్ఆలీ అలియాస్ కుస్రూ హోటల్ కుక్గా పని చేసేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన అతను తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు. 1996 నుంచి హైదరాబాద్, సైబరాబాద్, నల్గొండ కమిషనరేట్ల పరిధిలో 20 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్పై బయటికి వచ్చిన వెంటనే చోరీలకు పాల్పడటం పోలీసులకు పట్టుబడడం పరిపాటిగా మారింది. సంతోష్నగర్ ఠాణా పోలీసులు 2020లో అతడిపై పీడీయాక్టు ప్రయోగించారు. ఈ ఏడాది జూలై నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు. భవానీనగర్ తలాబ్కట్ట రాజాగల్లీకి చెందిన స్నేహితుడైన పాత నేరస్తుడు మహ్మద్ ఫిరోజ్తో కలిసి చిలకలగూడ, నల్లకుంట, నల్గొండ ఠాణాల పరిధిలో ఆరుచోట్ల ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితులు మెహబూబ్అలీ, మహ్మద్ ఫిరోజ్లను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించారు. వీరి నుంచి 130 గ్రాముల బంగారు నగలు, 500 గ్రాముల వెండి, రూ.37 వేల నగదు స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని చాకచక్యంగా పట్టుకున్న టాస్క్ఫోర్స్ సీఐ రాఘవేంద్ర, ఎస్ఐలు శ్రీశైలం, నరేందర్, షేక్బురాన్, నర్సింహులు, చిలకలగూడ సీఐ నరేష్లతోపాటు సిబ్బందిని సౌత్జోన్ టాస్్కఫోర్స్ డీసీపీ స్నేహమెహ్రా అభినందించి రివార్డులు ప్రకటించారు. (చదవండి: ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు: కేటీఆర్) -
ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం దొరికింది. గంటలకొద్దీ ట్రాఫిక్జాంలో ఇరుక్కుపోకుండా సులువుగా ప్రయాణం చేసేందుకు వీలుగా ప్రత్యేక ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ సేవలు మొదలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారిగా ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ సేవలను సైబరాబాద్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావుతో కలిసి సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, విజిబుల్ పోలీసింగ్లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగేన్వర్, బాలానగర్ డీసీపీ సందీప్, సీఏఆర్ హెడ్క్వార్టర్స్ అడిషినల్ డీసీపీ రియాజ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ మట్టయ్య, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ అడ్మిన్ బీఎన్ఎస్ రెడ్డి, ఐటీ ఇన్స్పెక్టర్ రమేశ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నవీన్ కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: అడుగడుగునా కెమెరాలు .. బయోమెట్రిక్ అటెండెన్స్ బైక్స్ ప్రత్యేకతలివే: ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ కోసం ఆరు మోటార్ సైకిళ్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఒక్కో బైక్పై ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది కానిస్టేబుళ్లు ఈ టాస్క్ఫోర్స్ విధుల్లో ఉంటారు. వీరికి ఒక ఎస్ఐ ర్యాంక్ అధికారి ఇన్చార్జిగా ఉంటారు. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ పని చేస్తుంది. ట్రాఫిక్ టాస్క్ఫోర్స్కు అందించిన బైక్లలో ప్రథమ చికిత్స కిట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ కిట్, హెల్మెట్, బాడీ వోర్న్ కెమెరా, షోల్డర్ లైట్, మాన్ ప్యాక్, కెమెరా, రిఫ్లెక్టివ్ జాకెట్, కళ్లద్దాలు, ఎల్ఈబా బాటన్ తదితర వస్తువులు ఉంటాయి. టాస్క్ఫోర్స్ ప్యాట్రోలింగ్ ఇక్కడే.. ►మాదాపూర్ నుంచి ఐకియా రౌటరీ– లెమన్ ట్రీ– మైండ్ స్పేస్ ►కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్–45 – ఐటీసీ కోహినూర్ టాస్క్ఫోర్స్ విధులు ఏంటంటే.. ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి బైక్లకు ఉన్న ద్విచక్ర వాహనానికి ఉన్న పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ (పీఏఎస్) ద్వారా ట్రాఫిక్ సంబంధించిన అంశాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పీక్ అవర్స్లో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ టాస్క్ఫోర్స్ బృందాలు పెట్రోలింగ్ తిరుగుతుంటాయి. ట్రాఫిక్ జాంలను నివారించడంతో పాటు రోడ్లపై అడ్డుగా నిలిచే వాహనాలను క్లియర్ చేయడం, నో పార్కింగ్ ప్లేస్లో ఉన్న వాహనాలను తొలగించడం వంటివి చేస్తాయి. లా అండ్ ఆర్డర్ పోలీసుల సమన్వయంతో పనిచేస్తుంటారు. ఏదైనా చైన్ స్నాచింగ్లు జరిగినప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ రాగానే వెంటనే అప్రమత్తమై స్నాచర్స్ను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు రోడ్డు దాటే విషయంలోనూ సహాయం చేస్తారు. ప్యాట్రోలింగ్ చేసే సమయంలో ప్రజలకు వారి వాహనాలకు ఏదేని సమస్య వస్తే మీరు దగ్గరుండి సాయం చేస్తారు. -
మంకీపాక్స్తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరిస్థితిని పర్యవేక్షించడమే గాక, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్క్ఫోర్స్ ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయనుంది. అలాగే దేశవ్యాప్తంగా మంకీపాక్స్ పరీక్షా కేంద్రాలను విస్తరించడం, వ్యాక్సినేషన్ వంటి విషయాలపై సూచనలు ఇవ్వనుంది. యూఏఈ నుంచి కేరళ వచ్చిన 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో శనివారం మృతి చెందాడు. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. వారిలో ఒకరు ఇప్పటికే కోలుకున్నారు. అయితే ఈ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జులై 26న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ఆ భేటీలోనే మంకీపాక్స్పై టాస్క్ఫోర్స్ను నియమించినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ దీనికి నేతృత్వం వహించనున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 15 ఐసీఎంఆర్ ల్యాబుల్లో మంకీపాక్స్ పరీక్షలు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందినట్లు సమాచారం. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచాన్ని మంకీపాక్స్ కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటికే 75 దేశాలకు విస్తరించిన ఈ వ్యాధి.. 16వేల మందికి సోకింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
రూ 3.14 కోట్ల మద్యం ధ్వంసం
నెల్లూరు (క్రైమ్): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్ఈబీ, ఐదు సివిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సీజ్ చేసిన రూ 3.14 కోట్ల విలువైన మద్యాన్ని మంగళవారం ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఎస్ఈబీ జేడీ కె.శ్రీలక్ష్మి తన సిబ్బందితో ధ్వంసం చేయించారు. కొత్తూరు సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో రోడ్డు రోలర్ ద్వారా సీసాలను తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గడిచిన మూడేళ్లుగా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై ఎస్ఈబీ, పోలీసులు దాడులు ముమ్మరం చేశారన్నారు. 2,774 కేసుల్లో పట్టు బడిన రూ.3,14,37,980 విలువజేసే 74,574 మద్యం బాటిళ్లను (15,719 లీటర్లు) ధ్వంసం చేశామన్నారు. జిల్లాలో నాటుసారా తయారీ, విక్రయాలు, మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు ఇన్చార్జి ఏసీ రవికుమార్, ఏఈఎస్ కృష్ణకిశోర్రెడ్డి,పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
టార్గెట్ @ 2024.. సోనియా మరో సంచలన నిర్ణయం
సంస్థాగత మార్పులే లక్ష్యంగా ఇటీవలే రాజస్థాన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024లో రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల కోసం టాస్క్ఫోర్స్ 2024 ను సోనియా గాంధీ మంగళవారం వెల్లడించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించగా.. అత్యంత కీలకమైన టాస్క్ఫోర్స్ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి స్థానం దక్కింది. కాగా, చింతన్ శిబిర్లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలు చేయాలని ఒక్కసారిగా డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ కమిటీలో ప్రియాంకకు స్థానం దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కమిటీల్లో అసమ్మతి నేతల(జీ-23)కు సైతం చోటుదక్కడం విశేషం. మరోవైపు.. కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర(భారత్ జోడే యాత్ర) చేయాలని కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ సమస్యను హైలెట్ చేయాలని నిర్ణయించింది. భారత్ జోడే యాత్రకు సంబంధించి కూడా సోనియా ఓ కమిటీని ప్రకటించారు. కమిటీల్లో సభ్యులు వీరే.. పొలిటికల్ అఫైర్స్ కమిటీ.. - రాహుల్ గాంధీ - గులాంనబీ ఆజాద్ - దిగ్విజయ్ సింగ్ - మల్లికార్జున ఖర్గే - కేసీ వేణుగోపాల్ - అంబికా సోనీ - ఆనంద్ శర్మ - జితేంద్ర సింగ్. టాస్క్ఫోర్స్ 2024 కమిటీ.. - ప్రియాంక గాంధీ - కేసీ వేణుగోపాల్ - రణదీప్ సూర్జేవాలా - చిదంబరం - ముకుల్ వాస్నిక్ - జయరాం రమేశ్ - అజయ్ మాకెన్ - సునీల్ కనుగోలు భారత్ జోడే పాదయాత్ర కమిటీ - శశి థరూర్ - సచిన్ పైలట్ - దిగ్విజయ్ సింగ్ - కేజే జార్జ్ - రంవీత్ సింగ్ బిట్టూ - ప్రద్యుత్ బోల్దోలోయీ - జీతూ పట్దారి - సలీమ్ అహ్మద్ ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. ఎస్పీజీ కంట్రోల్లో ఐఎస్బీ! సోషల్ మీడియా జల్లెడ -
పత్తి టాస్క్ఫోర్స్పై దళారుల ఒత్తిడి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు మళ్లీ ముంచెత్తుతున్నాయి. వ్యవసాయశాఖ స్తబ్దుగా ఉండటం, ఇప్పటివరకు ఎలాంటి టాస్క్ఫోర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడంతో దళారులు ఇష్టారాజ్యంగా నకిలీ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులకు ఈ విత్తనాలు చేరినట్టు సమాచారం. నిజానికి గత ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో విస్తృతంగా టాస్క్ఫోర్స్ దాడులు నిర్వహించి, దాదాపు 200 మంది విత్తన దళారులపై కేసులు పెట్టారు. నకిలీ విత్తనాలను కొంతవరకు అరికట్టగలిగారు. కానీ ఈసారి దళారులు, కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో.. నకిలీ విత్తనాలపై వ్యవసాయ శాఖ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుజరాత్, మహారాష్ట్రల నుంచి రాక.. రాష్ట్రంలో పత్తిసాగు విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం ప్రచారం చేసినా.. గతేడాది సాధారణం కంటే తక్కువగా 46.25 లక్షల ఎకరాల్లోనే సాగైంది. ఈసారి 75 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మంచి ధర పలుకుతుండటంతో రైతులు కూడా ఈసారి పత్తిసాగుకు మొగ్గుచూపుతున్నారు. వానాకాలం సీజన్లో తొలి వర్షం పడగానే పత్తి నాట్లు మొదలవుతాయి. ఈ క్రమంలో 75 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటిన్నర పత్తి విత్తన ప్యాకెట్లను సరఫరా చేసేందుకు కంపెనీలు సన్నాహాలు చేసుకున్నాయి. విత్తన దళారులు ఇదే అదనుగా భావించి నకిలీ పత్తి విత్తనాలను రంగంలోకి తెచ్చారు. కొన్ని సంస్థలు నిషేధిత హెచ్టీ కాటన్ (బీజీ–3) విత్తనాలను గుజరాత్, మహారాష్ట్రల నుంచి తెలంగాణకు తరలించి జిల్లాల్లో తమ దళారులకు అప్పగించినట్టు తెలిసింది. పలుచోట్ల ఇప్పటికే ఈ విత్తనాలను రైతులకు అంటగట్టారు. టాస్క్ఫోర్స్ ఏదీ? గత ఏడాది నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఆ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లోనే విస్తృతంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను, దళారులను పట్టుకుంది. ఇంతచేసినా ఆరేడు లక్షల ఎకరాల్లో నకిలీ విత్తనాలు, హెచ్టీ పత్తి సాగయింది. రైతులు భారీగా నష్టపోయారు. అయితే టాస్క్ఫోర్స్ దాడుల వల్ల నష్టపోయిన నకిలీ విత్తన మాఫియా ఈసారి ముందుగానే వ్యవసాయశాఖలోని కొందరు అధికారులను కలిసి ఒత్తిడి తెచ్చిందని.. భారీగా ముడుపులు సమర్పించుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ విత్తనాలకు సంబంధించి ఇప్పటివరకు టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయకపోవడం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోందని అంటున్నారు. భారీగా వెనకేసుకునేందుకు.. విత్తన డీలర్లకు ఒక పత్తి విత్తన ప్యాకెట్ అమ్మితే రూ.25–30 వరకే లాభం వస్తుంది. అదే బీజీ–3 విత్తన ప్యాకెట్ను రైతుకు విక్రయిస్తే రూ.500 దాకా.. అదే లూజ్గా విక్రయిస్తే కిలోకు రూ.1,200 దాకా మిగులుతుంది. ఈ క్రమంలోనే డీలర్లు, విత్తన వ్యాపారులకు నకిలీ విత్తన మాఫియా ఎర వేసి.. వారి ద్వారా రైతులకు నకిలీ విత్తనాలను అంటగడుతున్నాయి. సాధారణంగా చాలా మంది రైతులు పెట్టుబడికి డబ్బులు లేక.. డీలర్ల వద్ద అప్పుగా విత్తనాలు తీసుకుంటారు. ఇలాంటప్పుడు సదరు వ్యాపారి ఇచ్చిన నకిలీ విత్తనాలు తీసుకోవాల్సి వస్తోంది. -
పుష్పరాజ్లపై ‘సెబ్’ నిఘా
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏర్పాటైన టాస్క్ఫోర్స్ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తెస్తూ రూపొందించిన వ్యూహం విజయవంతమవుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణిస్తూ డీఐజీ పర్యవేక్షణలో ‘సెబ్’ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేస్తోంది. పటిష్ట నిఘా.. ముమ్మర కూంబింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించేందుకు ‘సెబ్’ బహుళ అంచెల వ్యవస్థను నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారంతో పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లను గుర్తించి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. మన రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల నరికి వేతలో పాల్గొంటున్న కూలీలు, రవాణా వాహనా లను సమకూర్చే వారిని గుర్తించింది. స్మగ్లర్లపై హిస్టరీ షీట్స్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసింది. కనీసం రెండు పార్టీలు నిరంతరం కూంబింగ్ చేసేలా షెడ్యూల్ రూపొందించింది. అటవీ, రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ శాఖల సహకారంతో దాడులు తీవ్రతరం చేస్తోంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దశాబ్దం తరువాత తొలిసారిగా.. రెండేళ్లుగా సెబ్ బృందాలు పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నాయి. 520 కేసులు నమోదు చేసి 2,546 మందిని అరెస్టు చేశారు. 18,033 ఎర్రచందనం దుంగలు, 345 వాహనాలను జప్తు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టడం దశాబ్దం తరువాత ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తండ్రి ఎస్సై..కొడుకు 18 కేసుల్లో నిందితుడు
సాక్షి, రాంగోపాల్పేట్: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్ఘన్పూర్కు సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్రోడ్లోని బతుకమ్మ ఘాట్వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్కుమార్ తాను టాస్క్ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్–1 లోని కమల్ వాచ్ షోరూమ్కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని నేరుగా నెక్లెస్రోడ్కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై బాధితులు రాంగోపాల్పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, బీఫిట్ లింక్ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో బెదిరింపులు.. నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై నాన్బెయిల్ వారెంట్ పెండింగ్లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్కుమార్ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్పై పోలీస్ స్టిక్కర్తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
డ్రగ్స్ను అరికట్టడంలో ప్లాప్.. కొరవడిన నిఘా!
సాక్షి, హైదరాబాద్: ఆక్టోపస్లా విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ విఫలమవుతోంది. స్టార్ హోటళ్లు, పబ్లలో డ్రగ్స్ సరఫరా వ్యవస్తీకృతంగా కొనసాగుతున్నప్పటికీ అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సూపరింటెండెంట్ స్థాయి ఎక్సైజ్ అధికారులు, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, సీఐలు, ఎస్సైలు తదితర అధికారగణంతో బలమైన నెట్వర్క్ను కలిగి ఉన్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ఫోర్స్ బలగాలు బెల్టు షాపులు, మద్యం విడి విక్రయాల నియంత్రణ వంటి సాధారణ ఉల్లంఘనలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. కీలకమైన నార్కోటిక్స్ నేరాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. దీంతో స్కూళ్లు, కాలేజీలు, పబ్లు, హోటళ్లు లక్ష్యంగా చేసుకొని నేరగాళ్లు గంజాయి, కొకైన్, హాష్ ఆయిల్ వంటి వివిధ రకాల మత్తు పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయలోపం కూడా నేర నియంత్రణలో ఆ శాఖ వైఫల్యానికి కారణమవుతోంది. ప్రధానంగా రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ బృందాలకు, జిల్లాస్థాయి నిఘా విభాగాలకు, మొబైల్ టాస్క్ఫోర్సు బృందాలకు మధ్య సరైన సహకారం, సమన్వయం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులు అంకితభావంతో పని చేసినా వారికి సరైన ప్రోత్సాహం, ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించడం లేదు. దీంతో నగరం నలుమూలలా డ్రగ్స్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్లో పోలీసుల తనిఖీల్లో కొకైన్ లభించడం ఎక్సైజ్ శాఖ వైఫల్యానికి నిదర్శనమని ఆ శాఖకు చెందిన ఒకరిద్దరు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మొక్కుబడి తనిఖీలు.. ప్రతి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహించే మొక్కుబడి తనిఖీలు నెలవారీ మామూళ్ల కోసమే కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని అనేక చోట్ల పబ్లు, హోటళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు తెలిసినా చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. మరోవైపు రాత్రింబవళ్లు తెరిచి ఉంచినా, మైనర్లను అనుమతించినా పట్టించుకోవడం లేదు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అమీర్పేట్, సికింద్రాబాద్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నా అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ‘తమ వల్లనే మద్యం అమ్మకాలు పెరిగి భారీ ఆదాయం వచ్చినట్లు కొందరు అధికారులు తమ పనితనానికి నిదర్శనంగా చెబుతారు. కానీ వాళ్ల ప్రమేయం లేకుండానే అమ్మకాలు జరుగుతాయి. ఆదాయం వస్తుంది’ అని ఓ అధికారి చెప్పారు. అక్రమార్జనపై ఉన్న ధ్యాస నేరనియంత్రణలో లేకపోవడంతో మాఫియా జడలు విప్పుతోందనే విమర్శలున్నాయి. సీఎం ఆదేశించినా అంతే సంగతులు.. డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిన హైదరాబాద్లో మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా అరికట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృత స్థాయిలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆదేశించినా ఆచరణలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. గతంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో కీలక విధులు నిర్వహించిన కొందరు అధికారులను బదిలీ చేయడంతో చాలా నష్టం వాటిల్లింది. తాజాగా జరిగిన పదోన్నతులు, బదిలీలతో రాష్ట్ర టాస్క్ఫోర్స్ వ్యవస్థ తిరిగి బలోపేతమయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు భావిస్తున్నాయి. (చదవండి: ఆ మూడు టేబుళ్లే కీలకం!) -
ఉక్రెయిన్: ఏపీ విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్లో ఉన్న రాష్ట్ర విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, ఎవరైనా1902 నంబర్కు కాల్ చేసి వివరాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్నవారి కోసం వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని విధాలుగా వివరాలను తెలుసుకుని మాస్టర్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. 212 మంది విద్యార్థుల డేటాను విదేశీ వ్యవహారాల శాఖకు పంపామని అన్నారు. ముంబై, ఢిల్లీకి రెండు విమానాలు వస్తున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీలో ఏపీ వాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎంత మంది వస్తారన్న దానిపై స్పష్టత రాలేదన్నారు. లిస్ట్లో ఉన్నా లేకున్నా అక్కడ రిసీవ్ చేసుకుంటామని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో తీసుకోస్తామని, ముంబై వచ్చేవారిని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా తీసుకోస్తామని చెప్పారు. బోర్డర్లకు రావొద్దని ఇప్పుడు చెప్తున్నారని, ఎక్కడ వాళ్లని అక్కడే ఉండాలని సూచిస్తున్నారని తెలిపారు. 300 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని చెప్పారు. వారికి నిరంతరం సూచనలు చేస్తున్నామని, విద్యార్థులు ఎవరు బోర్డర్కు రావొద్దని సూచిస్తున్నామని తెలిపారు. ఏడు యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, రుమేనియాకు దగ్గరలో వాళ్లు ఉన్నారని, ఎంబసీ ద్వారా వచ్చే మెసేజ్ల ద్వారానే విద్యార్థులు స్పందించాలన్నారు. ఎంత ఖర్చుకైనా వెనకడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని ఎం.టీ కృష్ణాబాబు తెలిపారు. -
ఆ విద్యార్థులకు విమాన టికెట్లు ఏర్పాటు చేయండి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్ నుండి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులకు విమాన టికెట్లు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్లైట్ టికెట్లు తీసుకోలేని విద్యార్థులకు ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి చేరుకునే విద్యార్థులకు అక్కడి నుంచి సొంత ప్రాంతాలకు చేర్పించేలా ఏర్పాట్లు చేయాలని సీంఎ జగన్ అధికారులను ఆదేశించారు. అందుకు తగినట్లు ఏపీ భవన్ నుంచి విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ఫోర్స్.. ఉక్రెయిన్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ సమన్వయంతో అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. ఆర్టీజీఎస్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, నిత్యం పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. విద్యార్థులను ప్రభుత్వం సంప్రదిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో ఫోన్లో చర్చించారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జయశంకర్ సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ఉక్రెయిన్ పక్కనున్న దేశాలకు వారిని తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్కు తీసుకు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎలాంటి ముప్పు లేకుండా వారిని భద్రంగా తీసుకురావాలని సీఎం జగన్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. చదవండి: (ఎయిర్పోర్ట్ల వృద్ధి కోసం కేంద్రానికి సీఎం జగన్ లేఖలు) -
'ఎర్ర'స్మగ్లింగ్పై ఎల్లలు లేని నిఘా!
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఎర్ర స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు దశాబ్దాలుగా చేస్తున్న యత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం లేదు. చాలా ఏళ్ల కిందటే ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కానీ జిల్లా ఎస్పీల బాధ్యత ఆయా జిల్లాలకే పరిమితమవుతుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్ర చందనం ఆయా జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడులో ఉంటూ ఏపీలో కూలీలు, ఏజంట్ల ద్వారా యథేచ్చగా దందా సాగిస్తున్నారు. దీంతో ఈ స్మగ్లింగ్ను అరికట్టాలంటే పొరుగు రాష్ట్రాలతో మరింత కేంద్రీకృత సమన్వయం అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో సెబ్ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ను తీసుకొచ్చారు. గంజాయి సాగు, రవాణాను రూపుమాపడంలో సెబ్ విజయవంతం అక్రమ ఇసుక, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి దందాలను అరికట్టడంతో సెబ్ ఇప్పటికే విజయవంతమైంది. తాజాగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాను విజయవంతంగా రూపుమాపడం సెబ్ సమర్థతకు నిదర్శనం. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్ను నిరోధించే బాధ్యతను సెబ్కు అప్పగించింది. డీజీపీ నియంత్రణలో సెబ్ కమిషనర్ ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ను పర్యవేక్షిస్తారు. ఆయనకు సెబ్ డైరెక్టర్ సహకరిస్తారు. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పాలనపరమైన అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణలు చేసింది. రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తున్నందున జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులుండవు. సెబ్కు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్లున్నాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పరిధిలోని పోర్టు అధికార వర్గాలతో సంప్రదింపులు, సహకారం వంటివి సెబ్కు మరింత సులభతరమవుతాయి. అవసరమైనప్పుడు పొరుగు రాష్ట్రాల పోలీసులతో కలసి జాయింట్ ఆపరేషన్లు కూడా నిర్వహించేందుకు అవకాశముంటుంది. ఏవోబీలో గంజాయి దందాను అరికట్టేందుకు ఒడిశా పోలీసులతో సమన్వయంతో పనిచేయడం తాజా తార్కాణం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ఫోర్స్ను సెబ్ పరిధిలోకి తీసుకురావడం సానుకూల నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా దశాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్ను తుద ముట్టించవచ్చని భావిస్తున్నారు. -
అబార్షన్లను నియంత్రిస్తేనే ఆడ పుట్టుక
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో బర్త్ రేషియో (జననాల రేటు) చూస్తే అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉంది. కొన్ని జిల్లాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య రేషియో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గడిచిన ఏడాది డిసెంబర్ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో శుభపరిణామం.. మొత్తం 13 జిల్లాల్లో గతేడాది సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలున్నది ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే. ఈ జిల్లాలో గడచిన రెండేళ్లలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. అన్నిజిల్లాల కంటే అనంతపురం జిల్లాలో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉన్నట్టు వెల్లడైంది. అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. రమారమి ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు లెక్క. కర్నూలు జిల్లాలోనూ కేవలం 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అమ్మాయి అనగానే అబార్షన్ చేయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పకడ్బందీగా లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలు రాష్ట్రంలో పీసీ పీ అండ్ డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ వైద్యులు (రేడియాలజిస్ట్/సోనాలజిస్ట్) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని చెప్పారు. కొంతమంది గైనకాలజిస్ట్లు, రేడియాలజిస్ట్లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి. అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అండ్ టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. -
దమ్కీ కహానీ.. రూ.కోటి ఇవ్వకుంటే నీకు, నీ భార్యకు మరణమే!
సాక్షి, సిటీబ్యూరో: బోయిన్పల్లికి చెందిన బల్క్ డ్రగ్ వ్యాపారి మనోజ్ సలేచా జైన్ను టార్గెట్ చేసి, అతడి కుమార్తె కిడ్నాప్ కుదరక వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కాల్స్తో బెదిరింపులకు దిగిన జవారీలాల్ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. దీనికి సంబంధించిన కాల్ రికార్డింగ్స్ను బోయిన్పల్లి పోలీసులు సేకరించారు. ఇతడిని పట్టుకోవడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సాంకేతికంగా దర్యాప్తు చేశారు. కొన్నాళ్ల క్రితం మానుకోటలో జరిగిన బాలుడి కిడ్నాప్, హత్య కేసు దర్యాప్తును తలదన్నే చర్యలు తీసుకున్నారు. ♦ ఈ నెల 10న జవారీ ఇద్దరు అనుచరులతో కలిసి మనోజ్ కుమార్తెను ఈ నెల 10న కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. అది విఫలం కావడంతో బెదిరింపులకు దిగి డబ్బు గుంజాలని పథకం వేశాడు. దీనికోసం తన స్పాట్ ఫోన్లో ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ♦ ఆ యాప్ వినియోగిస్తూ మనోజ్కు వీఓఐపీ కాల్స్ చేశాడు. 10, 11 తేదీల్లో 12 కాల్స్ చేసిన ఇతగాడు తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. తన అనుచరుల ద్వారా మనోజ్ ఇంటిపై నిఘా వేసి ఉంచడంతో పోలీసుల కదలికల్నీ గుర్తించాడు. ♦ దీంతో ‘ఓ కాల్లో పోలీసులకు చెప్పొద్దంటే చెప్పావు కదా... ఇక నాకు డబ్బు వద్దు నీ ప్రాణమే కావాలి’ అంటూ హెచ్చరించాడు. ఆపై మళ్లీ రూ.కోటి (ఏక్ కోకా) ఇవ్వకపోతే మనోజ్తో పాటు అతడి భార్యనూ అంతం చేస్తానన్నాడు. ♦ ఇంటి చుట్టూ పోలీసులకు ఉంచుకున్నా దేవుడి దయ ఉన్న తాను చిక్కననీ, డబ్బు ఇవ్వకుంటే మూడునాలుగు నెలలకైనా కాల్చి చంపేస్తానన్నాడు. తన వద్ద రూ.కోటి లేదని, అంత ఇచ్చుకోలేనని మనోజ్ అతగాడిని బతిమలాడాడు. ♦ తొలుత తగ్గింపు కుదరదని చెప్పిన జవారీలాల్ చివరకు రూ.5 లక్షలు తగ్గించి రూ.95 లక్షలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా నిందితులను పట్టుకోవడానికి నార్త్జోన్ టాస్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ♦ యాప్ ద్వారా వీఓఐపీ కాల్స్ చేస్తే వాటిని అందుకునే వారికి రకరకాల నంబర్లు కనిపిస్తుంటాయి. సాధారణ కాల్స్ మాదిరిగా వీటితో దాన్ని వినియోగిస్తున్న వారిని పట్టుకోవడం సాధ్యం కాదు. దీంతో టాస్క్ఫోర్స్ సాంకేతికంగా ముందుకు వెళ్లింది. ♦ ఎదుటి వ్యక్తి ఏ యాప్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నా డో కూడా తెలియదు. దీంతో పోలీసులు వీఓఐపీ సేవలు అందిస్తున్న 20 టాప్ యాప్స్ను ఎంచుకున్నారు. వాటి నిర్వాహకులకు ఈ–మెయిల్ పంపిస్తూ అందులో మనోజ్ నెంబర్ పొందుపరిచారు. ♦ ఈ నెంబర్కు ఫలానా తేదీ, సమయంలో మీ యాప్ నుంచి వచ్చిన కాల్ ఎవరు చేశారో చెప్పగలరా? అంటూ కోరారు. దీనిపై స్పందించిన ఓ యాప్ నిర్వాహకుడు చేసిన వ్యక్తి నెంబర్ చెప్పలేమంటూ అయితే అతడు రిజిస్టర్ చేసుకోవడానికి వాడిని ఈ–మెయిల్ ఐడీ అందించారు. ♦ దీంతో పాటు సదరు కాల్స్ చేయడానికి ఆ వ్యక్తి యాప్లోకి లాగిన్ అయిన ఐపీ అడ్రస్లు అందించారు. ఈ అడ్రస్లను సర్వీస్ ప్రొవైడర్లకు పంపిన పోలీసులు ఏ సెల్ఫోన్ నెంబర్తో ఈ ఐపీ అడ్రస్లు యాక్టివ్ అయ్యాయో చెప్పమని కోరారు. ♦ ఈ నేపథ్యంలో ఓ సర్వీస్ ప్రొవైడర్ 300 ఫోన్ నంబర్లను పోలీసులకు అందించారు. వీటిని విశ్లేషిస్తూనే అధికారులు మరికొన్ని వివరాలు ఇవ్వాలంటూ యాప్ను సంప్రదించారు. ♦ ఈసారి స్పందించిన యాప్ నిర్వాహకుడు తమ యాప్ వినియోగానికి నిర్ణీత మొత్తం చెల్లించాలని, సదరు వ్యక్తి రాజస్తాన్ ఖాతా నుంచి చెల్లింపులు చేసినట్లు చెప్పారు. ఆ 300 నంబర్లలో రాజస్తాన్తో సంబంధం ఉన్న వాటిని గుర్తించడానికి ప్రయత్నించారు. ♦ ఫలితంగా జవారీలాల్ నంబర్ తెలియడంతో పాటు అతడు జీడిమెట్లలో ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నేపథ్యంలో మిగిలిన ఇద్దరినీ గుర్తించి పట్టుకున్నారు. ♦ గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ♦ వీరిని లోతుగా విచారించి తుపాకీ, తూటాలు విక్రయించిన మధ్యప్రదేశ్ వ్యక్తిని గుర్తించాలని భావిస్తున్నారు. ఈ కేసులో అతడూ కీలకం కావడంతో అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. -
వేల సంఖ్యలో కేసులు.. భారత్లో మొదలైన కరోనా థర్డ్వేవ్?
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో కోవిడ్ మహమ్మారి మరోసారి గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో థర్డ్ వేవ్ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా పేర్కొన్నారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. అది మాత్రం మరువొద్దు దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. (చదవండి: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా) రెండు వారాల్లోనే భారీ విస్తరణ డిసెంబర్ తొలివారంలో దేశంలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించగా.. రెండు వారాల్లోనే 23రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించింది. ఇప్పటివరకు 1892 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు రికార్డ్ అవ్వగా.. ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కరోనా కేసులు నమోదుకాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నాటి బులెటిన్లో పేర్కొంది. (చదవండి: ఒమిక్రాన్ సాధారణ జ్వరం మాత్రమే: యోగి ) -
కొనసాగుతున్న రెమ్డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్మార్కెట్ దందా
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్డెసివర్ ఇంజక్ష బ్లాక్మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్డెసివర్ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉప్పల్ నర్సింగ్హోమ్లో హెచ్ఆర్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెమ్డెసివర్కు మార్కెట్లో కొరత ఉండడంతో బ్లాక్లో అమ్ముకుంటే డబ్బులు బాగా సంపాదించొచ్చని అనిల్ భావించాడు. ఒక్కో ఇంజక్షన్ను రూ.25 వేలకు కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ అనిల్ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాలుగు రెమ్డెసివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. -
జనం చస్తుంటే.. జాతర చేస్తారా..
డోర్నకల్: కరోనా వైరస్ వ్యాప్తితో ఓవైపు ప్రజలు అల్లాడుతోంటే.. మీరు జాతర ఎలా చేస్తారని టాస్క్ఫోర్స్ పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని లింబ్యాతండాలోని వెంకటేశ్వరస్వామి(పుల్లు బాబోజీ) ఆలయంలో ప్రతీ సంవత్సరం మే నెలలో జాతర నిర్వహిస్తారు. శుక్రవారం జాతరలో పాల్గొనేందుకు భారీగా గిరిజనులు తరలి వచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ అమలును పట్టించుకోకుండా వివిధ ప్రాంతాల నుంచి గిరిజనులు జాతరకు తరలివచ్చారు. ఆలయంలో పూజలు నిర్వహిస్తూ జంతుబలి చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు తహసీల్దార్ జి.వివేక్, మండల ప్రత్యేక అధికారి సయ్యద్ ఖుర్షీద్, సీఐ ఇస్లావత్ శ్రీనివాస్, ఎస్ఐ భద్రునాయక్తో సహా పోలీసులు తండాకు చేరకున్నారు. ఆలయ పరిసరాల్లో గుంపులుగా చేరిన గిరిజనులను అక్కడి నుంచి పంపించారు. ఆలయ పూజారితో పాటు నిర్వాహక కమిటీలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈమేరకు అధికారులు మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలులో ఉన్న సమయంలో నిబంధనలు అతిక్రమించి జాతరకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి వారిని అక్కడి నుంచి పంపించినట్లు తెలిపారు. ఆలయ నిర్వాహక కమిటీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: కరోనా పేరు తెలియని అడవిబిడ్డలు చదవండి: చెరువులో విషప్రయోగం.. -
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించిందని, కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా అభినందించారని వివరించారు. ఎప్పటికప్పుడు కరోనా కట్టడి చర్యలను ముమ్మరం చేస్తున్నామని, మరింత సమగ్ర కార్యాచరణతో ముందుకువెళతామని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమై చర్చించింది. తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కొద్దిరోజుల్లోనే ఫలితాలు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, పంచాయతీ/మున్సిపల్ సిబ్బందితో ఏర్పాటు చేసిన బృందాలతో సర్వే చేపట్టామని.. ఇప్పటివరకు 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయిందని కేటీఆర్ తెలిపారు. 2.1 లక్షల మందుల కిట్లను పంపిణీ చేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల ఓపీలలో అనుమానిత రోగులకు ఇచ్చిన కిట్లు వీటికి అదనమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నంతో వేల మందిని కాపాడుకోగలమన్నారు. కిట్లో ఇచ్చిన మందులను కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వాడితే ఆరోగ్యం విషమించదని, ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుందని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్ ఫలితాలు ఒకట్రెండు రోజుల్లోనే కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్లాక్ ఫంగస్పై అప్రమత్తం కరోనా రోగుల్లో బయటపడుతున్న ప్రమాదకర బ్లాక్ ఫంగస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, దాని చికిత్సకు అవసరమైన మందులను సమీకరించనుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 1.5 లక్షల రెమిడెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ ఉన్నాయని.. రాష్ట్రానికి అధిక సరఫరా కోసం వీటిని ఉత్పత్తి చేసే కంపెనీలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. ఆస్పత్రుల్లో ఈ ఇంజెక్షన్ల వినియోగంపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అరుదుగా వినియోగిస్తున్న టోసిలిజుమాబ్ ఇంజెక్షన్లను సరిపడే సంఖ్యలో సమీకరించాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ డిమాండ్–సప్లై వివరాలను ఈ సమావేశంలో తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఆక్సిజన్ వినియోగంపై ప్రభుత్వం ఆడిట్ నిర్వహిస్తోందని, అవసరమైన మేరకే ఆక్సిజన్ వినియోగించేలా అన్ని ప్రైవేటు ఆస్పత్రులకు సూచించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే కోవిడ్ హెల్ప్లైన్ నంబర్ ఉండాలని ప్రభుత్వానికి సూచిస్తామన్నారు. జిల్లాల్లో కోవిడ్ నియంత్రణ చర్యలను స్థానిక మంత్రులు పర్యవేక్షిస్తున్నారని, వారితో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించామని తెలిపారు. వాక్సిన్ల ఉత్పత్తిదారులతో సమావేశాలు కరోనా వ్యాక్సిన్ను ప్రజలందరికీ అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, కరోనా చికిత్సకు అవసరమైన మందులతోపాటు వాక్సిన్ ఉత్పత్తిదారులతో త్వరలో సమావేశం కానున్నామని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలు ఉండగా.. ఇప్పటికే 38 లక్షల మంది వాక్సిన్ తొలి డోసు తీసుకున్నారని చెప్పారు. వీరిలో 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్తోపాటు 7.15 లక్షల మంది రెండు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. 10 లక్షలకుపైగా జనాభాకు వాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. -
కరోనా కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 మంది సభ్యులతో టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ ఛాన్సలర్ భబతోష్ బిశ్వాస్, గుర్గావ్ మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఛైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డా.నరేష్ ట్రెహన్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. టాస్క్ఫోర్స్లోని 12 మందిలో వైద్య నిపుణులు, డాక్టర్లు ప్రభుత్వం నుంచి ఇద్దరు వ్యక్తులు భాగం కానున్నారు. క్యాబినేట్ సెక్రటరీ టాస్క్ఫోర్స్ కన్వీనర్గా ఉంటారు. ఈ బృందం వ్యాక్సిన్, ఆక్సిజన్ పంపిణీని పర్యవేక్షించనుంది. అంతేకాకుండా కరోనా చికిత్స కోసం అవసరమైన ఔషధాల అందుబాటును, మహమ్మారి కారణంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలను అందిస్తుంది. ఓ వారం రోజుల్లోగా టాస్క్ఫోర్స్ బృందం సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
కరోనా నియంత్రణకు టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశాం: మంత్రి అవంతి
-
వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్ దాడులు
ఆదిలాబాద్/ఎదులాపురం: పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ఫోర్స్ సీఐ ఇ.చంద్రమౌళి ఆధ్వర్యంలో వన్టౌన్ సీఐ రామకృష్ణతో కలిసి సంయుక్తంగా దాడి చేశారు. నలుగురు మహిళలతో పాటు ఏడుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని కైలాస్నగర్ కాలనీకి చెందిన ఓ మహిళతో కలిసి ప్రధాన నిర్వాహకుడు జర్నలిస్టు కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ తెలిపారు. గత కొంత కాలంగా నిఘా పెట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు మాటు వేసి పట్టణ పోలీసులతో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రధాన నిర్వాహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఏడుగురు విటులు ఉన్నట్లు వివరించారు. (పది పెళ్లిళ్లు చేసుకున్నాడు.. ఆస్తి కోసం అతడ్ని..) ఇందులో వడ్డెర కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్, శాంతినగర్కు చెందిన బరిగెళ్ల శ్రీకాంత్, మహారాష్ట్రలోని పిప్పల్కోటికి చెందిన పర్షా అక్షయ్, జైనథ్ మండలం పెండల్వాడకు చెందిన ఠాకూర్ దశరథ్, మహారాష్ట్రలోని పాఠన్బోరికి చెందిన గోదావరి నరేష్, భుక్తాపూర్కు చెందిన కాంబ్లే బాబా సాహెబ్, జైనథ్ మండలం పెడల్వాడకు చెందిన చుక్కలవార్ ఆకాశ్లను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం, 12 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వ్యభిచారానికి పాల్పడిన ఇద్దరు నిర్వాహకులతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో వన్టౌన్ ఎస్సైలు జి.అప్పారావు, జాదవ్ గుణవంత్రావు, టాస్క్ఫోర్స్ పోలీసు అధికారులు షేక్ తాజొద్దీన్, ఎం.రమేష్కుమార్, సయ్యద్ రాహత్, హనుమంత్రావు, ఎంఏ కరీమ్, మంగళ్సింగ్, ఠాకూర్ జగన్సింగ్, ఎన్.నగేష్, మహిళ కానిస్టేబుళ్లు మమత, సోనీ తదితరులు ఉన్నారు. (భార్యకు రెండు పెళ్లిళ్లు.. అనుమానంతో హత్య ) -
ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీలోని ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ చంద్రమౌళి తెలిపిన కథనం ప్రకారం.. మావల పోలీస్స్టేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదిలాబాద్ గ్రామీణ సీఐ పురుషోత్తంతో కలిసి వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి మహిళ, వ్యభిచార గృహ నిర్వాహకుడు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్ఫోన్లు, డైరీలు, రూ.7700 నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నిర్వాహకుడైన ప్రధాన నిందితుడు ఉట్నూర్ మండలం గంగన్నపేటకు చెందిన పిండి మల్లికార్జున్, విటులు కరీంనగర్ పట్టణంలోని రాంనగర్కి చెందిన సిందం కుమార్, తాంసి మండలంలోని గోట్కూరికి చెందిన దర్శనాల సాయికుమార్ ఉన్నారు. అనంతరం ఆదిలాబాద్ గ్రామీణ సీఐ పురుషోత్తం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన ఉట్నూర్ మండలం గంగన్న పేటకు చెందిన పిండి మల్లికార్జున్ కొంతకాలంగా ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు ఎస్కే తాజొదీ్దన్, జగన్సింగ్, రహాత్, మావల ఏఎస్సై గంగాధర్, కానిస్టేబుళ్లు సరిత, మౌనిక, సోనీ, తదితరులు పాల్గొన్నారు. -
కోవిడ్ వ్యాక్సిన్: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: అర్బన్ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపల్శాఖ కమిషనర్ ఛైర్మన్గా 9 మంది సభ్యులతో కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్ఫోర్స్ కమిటీ ఉత్తర్వుల్లో సవరణలు చేసింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్ఫోర్స్లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులుగా 34 మందిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: ‘భారత్లో జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్’) -
రైతుల సమస్యల పరిష్కారం కోసమే టాస్క్ఫోర్స్
సాక్షి, గుంటూరు: మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టాస్క్ ఏర్పాటు చేశామని రాజ్యసభ సభ్యుడు, మిర్చి టాస్క్ ఫోర్స్ చైర్మన్ జీవిఎల్ నరసింహరావు తెలిపారు. గురువారం ఆయన గుంటూరు మిర్చి యార్డులో జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. ఆరు నెలల కార్యచరణలో భాగంగా తొలి సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రైతులు తమ సమస్యలను కమిటీ ముందు ప్రస్తావించవచ్చని తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయాలు, ఏపీలో ముందుగా అమలు చేయాలన్నది తన పక్షపాతంమని పేర్కొన్నారు. ఎందుకంటే తను గుంటూరు జిల్లా వాడినని గుర్తుచేశారు. రూ.7 వేల కోట్లతో పది వేల రైతు సంఘాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర నిర్ణయమని వెల్లడించారు. 500 మంది రైతులు సంఘంగా ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు రైతుల ఖాతాలోకి జమ అవుతాయని ఆయన చెప్పారు. ముందుగా రూ.25 లక్షలు, ఈక్విటీ రూపంలో మరో రూ.15 లక్షలను కేంద్రం ఆర్థిక సహాయం రూపంలో అందజేస్తుందని తెలిపారు. కేంద్రం తీసుకున్న వచ్చిన కొత్త చట్టాల వల్ల రైతులకు ఉపయోగకరమైన వాతావరణం కలిగిస్తుందని తెలిపారు. వాటిపై కొంతమంది తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో కనీసం 400, 500 రైతు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీకి రూ.6,500కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి రూ.10వేల కోట్లపైగా కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. -
అధిక బిల్లులు వాస్తవమే!
సాక్షి, హైదరాబాద్: కరోనా వేళ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కాసులకు కక్కుర్తి పడిన విషయం వాస్తవమేనని టాస్క్ఫోర్స్ నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పేరుతో బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజాయని తేల్చినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజులను ధిక్కరించి, అంటువ్యాధుల చట్టాన్ని అతిక్రమించినట్లు టాస్క్ఫోర్స్ గుర్తించినట్లు సమాచారం. కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్లతో రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ను ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టాస్క్ఫోర్స్లో సీనియర్ ఐఏఎస్లు రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. తాజాగా చేసిన తనిఖీలు, ఆసుపత్రుల్లో జరిగిన అక్రమ వసూళ్లపై ఈ టాస్క్ఫోర్స్ ప్రభుత్వానికి నేడో రేపో నివేదిక ఇస్తుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో టాస్క్ఫోర్స్ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు చేసింది. ఇప్పటివరకు ఆయా ఆసుపత్రులు చేసిన కరోనా చికిత్సలు, వాటికి వేసిన బిల్లులను, రికార్డులను ఈ బృందం క్షుణ్నంగా అధ్యయనం చేసింది. కొందరు సీనియర్ వైద్య నిపుణుల సాంకేతిక సహకారాన్ని కూడా తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉన్న లక్షణాలు, ఆసుపత్రులు నిర్వహించిన చికిత్సను వైద్య నిపుణులు పరిశీలించారు. చికిత్సలో భాగంగా బాధితులకు ఉన్న లక్షణాలు, ఇచ్చిన మందులు, అనవసరంగా ఏమైనా వైద్యం చేశారా?.. వంటి వాటిని బృందం సభ్యులు సరిచూశారు. కరోనాకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లతో పోల్చి ఏ మేరకు అధికంగా వసూలు చేశారన్న దానిపైనా పరిశీలన చేశారు. విచిత్రమేంటంటే.. కొన్ని ఆసుపత్రులైతే సర్కారు రేట్లకు ఏకంగా 15 రెట్లు కూడా అధికంగా వసూలు చేసినట్లు టాస్క్ఫోర్స్ విచారణలో తేలినట్లు సమాచారం. ప్రభుత్వం ప్రకటించిన ధరలను ప్రైవేట్ ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించినా కొన్నిచోట్ల లేకపోవడంపై టాస్క్ఫోర్స్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంటువ్యాధుల నియంత్రణ చట్టం కింద తగు చర్యలు తీసుకునే విషయంలో కూడా టాస్క్ఫోర్స్ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్లను పాటిస్తున్నాయా?.. లేదా?.. కూడా పరిశీలించింది. -
ప్రైవేట్ ఆసుపత్రులపై రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: కరోనా చికిత్సలో ప్రైవేట్ ఆసుపత్రుల పనిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఐఏఎస్లతో రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. టాస్క్ఫోర్స్లో రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, డి.దివ్య ఉన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలోనూ సీఎం కేసీఆర్ ఆసుపత్రుల తీరుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేయడంతో ఆగమేఘాల మీద ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులు అందించే వివిధ సేవలకు వసూలు చేయాల్సిన గరిష్ట రేట్లు పేర్కొంటూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయా రేట్లను ఆస్పత్రులు తమ ప్రాంగణంలో ప్రముఖంగా ప్రదర్శించాలని కూడా ఆదేశించింది. ఫీజులపై రోగి బంధువులకు వివరించాలి. కానీ, ఆస్పత్రులు వీటిని పాటించకపోవడంపై వైద్య,ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం కింద తగు చర్యలు తీసుకునేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రభుత్వం నిర్ధేశించిన గరిష్ట ఫీజులను ఆసుపత్రులు పాటిస్తున్నాయా.. లేదా.. ఈ టాస్క్ఫోర్స్ పర్యవేక్షిస్తుంది. కరోనా చికిత్స, భద్రతా ప్రొటోకాల్లను పరిశీలించి ఎప్పటికప్పుడు తమ నివేదికను ప్రధాన కార్యదర్శికి సమర్పిస్తాయి. అంతేకాదు... ఈ టాస్క్ఫోర్స్ ఆసుపత్రుల్లో తనిఖీలు కూడా నిర్వహిస్తుంది. 10వేల పడకలకు ఆక్సిజన్ : మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 10 వేల బెడ్లను సిద్ధం చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. అసెంబ్లీలో బుధవారం కోవిడ్–19పై స్వల్పకాలిక చర్చను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు పరిస్థితిని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూలంకషంగా వివరించారు. 1,259 వెంటిలేటర్లు, 200 హై ఫ్లో నాసల్ ఎక్విప్ మెంట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం 1,224 పడకల సామర్థ్యం కలిగిన, అన్ని రకాల వైద్య పరికరాలతో తెలంగాణ ఇన్సిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను కొత్తగా ఏర్పాటు చేసిందని చెప్పారు. అందులో కోవిడ్ బాధితులకు చికిత్స అందుతొందన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 10.30 లక్షల పీపీఈ కిట్లను, 18.50 లక్షల ఎన్–95 మాస్కులు, 24 వేలకుపైగా రెమిడిసివిర్ ఇంజక్షన్లను ఆసుపత్రులకు అందించామన్నారు. -
నకిలీ పోలీసుల గుట్టురట్టు
శ్రీకాకుళం రూరల్: వారిని చూస్తే అచ్చం పోలీసులే అని భ్రమపడతాం. ఒకరు టక్..టైతో హుందాగా కారులో కూర్చుంటారు. మిగిలిన వారు పోలీసు గెటప్, సివిల్ డ్రస్సుల్లో ఉంటూ హడావుడి చేస్తుంటారు. రైడ్ పేరుతో లూటీలు చేయడం.. బెదిరింపులకు పాల్పడడం.. అవసరమైతే రెండు లాగి జీపులో ఎక్కించడం చూస్తే వీరు పోలీసులు కాదని ఎవరూ గుర్తించలేరు. అయితే పాపం పండటంతో వీరి గుట్టు రట్టయ్యింది. మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకునే క్రమంలో రోడ్డుపై వీరు వ్యవహరించిన తీరుతో అనుమానం వచ్చిన సింగుపురం గ్రామస్తులు చాకచక్యంగా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ జరిపిన పోలీసులు మొత్తం ఐదుగురు యువకులను రిమాండ్కు తరలించారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగుపురం, కరజాడ, బైరి, బట్టేరు పరిసర ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చామని, ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ పోలీసులుగా తమను నియమించిదంటూ గార మండలం అంబటివానిపేటకు చెందిన ఐదుగురు వ్యక్తులు వారం రోజులుగా ఇన్నోవా కారులో తిరుగుతు హడావుడి చేస్తున్నారు. వీరిలో కుంచాల సంతోష్ 2017లో ఎక్సైజ్ శాఖకు పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసేవాడు. 2018–19 కాలంలో హైదరాబాద్లో సీసీ కెమెరాలు తయారు చేసే కంపెనీలో పనిలో చేరాడు. 2020 ఫిబ్రవరిలో స్వస్థలం వచ్చేసి జల్సాలకు అలవాటుపడ్డాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టాడు. గతంలో ఎక్సైజ్శాఖకు ఇన్ఫార్మర్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఎక్కడెక్కడ మద్యం బెల్టుషాపులు నిర్వహించేవారో, మందు ఎక్కడి నుంచి వస్తుందో తదితర విషయాలు తెలియడంతో నకిలీ పోలీసు అవతారమెత్తాడు. అదే గ్రామానికి చెందిన మర్రి రమణ, కొనుము రమణ, ధనాల జ్ఞానప్రసాద్, నక్క రంగారావు(వప్పంగి) సహాయంతో టాస్క్ఫోర్స్ పోలీసులపేరుతో బెల్టుషాపుల వద్ద దందాలు మొదలుపెట్డాడు. పోలీస్ స్టిక్కరింగ్ వాహనంతో.. రెండు నెలలు క్రితం సంతోష్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. దాని వెనక, ముందు భాగంలో పోలీస్ అని స్టిక్కరింగ్ చేసి టోల్ప్లాజాలు, సంతలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లోనూ దందాలు చేసేవాడు. ఇదే వాహనాన్ని ఉపయోగిస్తూ బైరి, సింగుపురం, కరజాడ పరిసర ప్రాంతాల్లో బెల్టుషాపులు నిర్వహించే వారివద్దకు వెళ్లి మద్యం సీసాలు లాక్కోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని బెదిరించేవారు. భయపడి వారు ఇచ్చిన నగదును తీసుకొని అదే బెల్టుషాపు నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం సేకరించి వేరే ప్రాంతంలో బెల్టుషాపులు నిర్వహించే వారి వద్ద దాడులకు తెగబడేవారు. ఎలా పట్టుబడ్డారంటే... ఈ నెల 25న బుధవారం రాత్రి సింగుపురం, బైరి పరిసర ప్రాంతంలో ఒకే చోట నాలుగు బెల్టు షాపుల వద్ద దందాలకు పాల్పడ్డారు. జితేష్కుమార్ అనే ఓ వ్యాపారి వద్ద మూడు క్వార్టర్ బాటిళ్లు ఉన్నాయని తెలుసుకుని బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో రహదారి మీదుగా వెళ్తున్న సింగుపురం గ్రామస్తులు చూసి పోలీసులైతే ఇలా రోడ్డుపై దాడులకు తెగబడరని సందేహించి ఇద్దరిని అక్కడికక్కడే పట్టుకున్నారు. మిగిలిన ముగ్గురు పరారవ్వడంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంబేడ్కర్, రూరల్ ఎస్ఐ లక్ష్మణరావులు సంఘటనా స్థలానికి చేరుకుని మిగిలిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. 18 మద్యం బాటిళ్లతో పాటు రూ.1500 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి శనివారం రిమాండ్కు తరలించారు. -
విశాఖ జిల్లాలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామారావు హత్యకు కుట్ర
-
టాస్క్ఫోర్స్కు 'తంబీల' టెన్షన్
తిరుపతి అర్బన్: తమిళనాడు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్కు గ్రీన్సిగ్నల్ ఇస్తే తమిళనాడు నుంచి ఎర్ర స్మగ్లర్లు శేషాచలంలోకి చొరబడతారన్న టెన్షన్ టాస్క్ఫోర్స్ అధికారుల్లో మొదలైంది. వివరాల్లోకి వెళితే, లాక్డౌన్ నేపథ్యంలో రెండు నెలలుగా శేషాచలంలో ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. మే 31కి లాక్డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో తమిళనాడులో రవాణా మొదలవనుంది. ఈ నేపథ్యంలో తిరుఅన్నామలై ప్రాంతానికి చెందిన ఎర్రస్మగ్లర్లు జూన్లో జిల్లాలోని ఎర్ర అడవుల్లోకి చొరబడే ప్రమాదం ఉంది. దాంతో ముందస్తుగానే ఎర్రస్మగ్లర్లను జిల్లాలోకి అడుగుపెట్టనీయకుండా టాస్క్ఫోర్స్ ఎస్పీ రవిశంకర్ నేతృత్వంలో పలు బృందాలు సిద్ధం అవుతున్నాయి. అయితే తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్లు పెద్ద ఎత్తున జిల్లాలోని శేషాచలం అడవుల్లోనూ, వైఎస్సార్ కడప జిల్లాలోని పాలకొండల్లో ఎర్రదుంగలను రవాణా కోసం లాక్డౌన్కు ముందే డంపింగ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో టాస్క్ఫోర్స్ గాలింపు చర్యలు చేపట్టింది. ఇదే తరుణంలో పైలట్లుగా (పోలీసుల సమాచారం స్మగ్లర్లకు అందించేవారు) వ్యవహరిస్తున్న పాతస్మగ్లర్ల జాడ కోసం టాస్క్ఫోర్స్ విచారణ చేపడుతోంది. డంపింగ్ల వివరాలు పైలెట్లుగా పనిచేస్తున్న వారి వద్ద ఉన్నాయనే సమాచారంతో పోలీసులు అడుగులు వేస్తున్నారు. ఈ సారి ఎర్రచందనం జోలికివస్తే పీడీ యాక్టులతోపాటు కఠిన మైన కేసులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. నెల్లూరులోనూ తాకిడి చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలో కొంతభాగంలో ఎర్రచందనం ఉండడంతో ఎర్రస్మగ్లర్ల తాకిడి ఈ ప్రాంతంలో ఎక్కువగా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కోట్ల విలువైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణాకు చెక్ పెట్టడం కోసం టాస్క్ఫోర్స్ను వెలుగులోకి తెచ్చారు. ఆ మేరకు అటవీశాఖకు అండగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకైక టాస్క్ఫోర్స్ కార్యాలయాన్ని ప్రభుత్వం 2016లో తిరుపతిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఐదేళ్లలో చూస్తే 580 కేసులను నమోదు చేశారు. 330 మెట్రిక్ టన్నులు (12122 ఎర్రదుంగలు)ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నా రు. 1891 మందిని అదుపులోకి తీసుకున్నారు. 297 వాహనాలను సీజ్ చేశారు. అయినా ఎర్రచందనం అక్రమాలకు అడ్డకట్టపడ్డలేదు. అయి తే కోవిడ్–19తో వారి ఊసేలేకుండా పోయింది. మళ్లీ పూర్వ పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ తలమునకలై పనిచేస్తోంది. స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం తమిళనాడు ప్రభుత్వం వాహనాల రవాణాకు అనుమతి ఇస్తే స్మగ్లర్ల తాకిడి తప్పేలా లేదు. దాంతో బుధవారం నుంచి పలు బృందాలను ఏర్పాటు చేసి.. వారిపై నిఘా పెట్టనున్నాం. లాక్డౌన్కు ముందుగా పలుచోట్ల ఎర్రస్మగ్లర్లు ఎర్రచందనంను డంపింగ్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పాత స్మగ్లర్లు పైలెట్లుగా వ్యవహరిస్తున్నారు. వారి కోసం విచారణ చేస్తున్నాం. వారి వద్ద అదనపు సమాచారం ఉందని భావిస్తున్నాం. పాతస్మగ్లర్లు తమిళనాడు స్మగ్లర్లను ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ సారి చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఎర్రస్మగ్లర్లపై కేసులు కఠినంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.– రవిశంకర్, టాస్క్ఫోర్స్ ఎస్పీ, తిరుపతి -
విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు టాస్క్ఫోర్స్
సాక్షి, అమరావతి: ‘కరోనా వైరస్ వల్ల పలు దేశాలు పెట్టుబడుల విషయంపై పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యంగా తయారీ రంగం చైనాపై పూర్తిగా ఆధారపడటంతో కరోనా గుణపాఠం నేర్పింది. దీంతో ఇప్పుడు పలు దేశాలు చైనా నుంచి తమ తయారీ రంగాన్ని ఇతర దేశాలకు తరలించడంతో పాటు కొత్త పెట్టుబడులకు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది.’ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ► దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాం. ► కరోనా నేపథ్యంలో చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకే టాస్క్ఫోర్స్ ఏర్పాటు. ► పరిశ్రమల శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ఈ కమిటీలో ఐదుగురు సీనియర్ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ► ఈ కమిటీకి అనుబంధంగా మరో ఏడు సబ్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ► రంగాల వారీగా కంపెనీలను గుర్తించడం, ఆయా దేశాలతో సంప్రదించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వచ్చే బాధ్యతను ఈ సబ్ కమిటీలకు అప్పగించాం. 35 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో సంప్రదింపులు: శశిధర్, ఐటీ శాఖ కార్యదర్శి ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ► అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చైనా, తైవాన్, కొరియా వంటి దేశాలకు చెందిన 35 కంపెనీలను ఇప్పటికే గుర్తించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా సంప్రదింపులు జరుపుతున్నాం. ► క్వాలకమ్, ఏఎండీ, సిస్కో, హెచ్కేసీ, స్కైవర్త్, బీవైడీ వంటి కంపెనీలకు లేఖలు రాశాం. ► రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలు, పాలసీలను వివరిస్తూ కంపెనీలకు లేఖలు రాశాం. ► వీటిలో కొన్ని కంపెనీలు ఇప్పటికే స్పందించి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చర్చలు జరిపాయి. ► ఐటీ, ఎలక్ట్రానిక్స్ పాలసీ విడుదల కాగానే సానుకూల నిర్ణయాలు వెలువడతాయని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ప్రారంభించుకోవడానికి అనుమతులిచ్చాం. -
కరోనా చర్యలపై కాంగ్రెస్ అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక చర్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిం ది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కరోనా టాస్క్ఫోర్స్ కమిటీ భేటీలో నిర్ణయించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ఈనెల 30 వరకు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. టాస్క్ఫోర్స్ కమిటీ భేటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్రూంలకు వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి పార్టీ పరంగా తీసుకుంటున్న చర్యలు, రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వపరంగా అందుతున్న సాయం గురించి చర్చించారు. రాష్ట్రంలో లాక్డౌన్ ముగిసేంతవరకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సాయం చేయాలని, అవసరమైన చోట్ల ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లి పేదలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో టీపీసీసీ టాస్క్ఫోర్స్ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్, సభ్యులు దామోదర రాజనర్సింహ, సంపత్కుమార్, దాసోజు శ్రవణ్కుమార్, ఆర్.దామోదర్రెడ్డి, వినోద్కుమార్, రాములు నాయక్, అబ్దుల్ సోహైల్, ఇందిరాశోభన్లు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా పలువురు డీసీసీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల్లోని పరిస్థితులను టాస్క్ఫోర్స్ కమిటీకి వివరించారు. -
టాస్క్ ఫోర్స్ డాగ్ మృతి
-
ఆపరేషన్ ‘ఢిల్లీ రిటర్న్’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన తబ్లిగీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొని తిరిగొచ్చిన వారిలో ఆరుగురు మరణించారు. అందులోనూ ఐదుగురు ఒకేరోజు మరణించడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో డీజీపీ మహేందర్రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో చాలామంది కరోనా బాధితులుండే అవకాశాలు ఉండటంతో వారి ఆచూకీ కనిపెట్టేందుకు రాత్రికి రాత్రి స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో అర్ధరాత్రి విధుల్లో ఉన్న పోలీసుల్లో కొందరిని ప్రత్యేక బృందాలుగా విడిదీసి, గాలింపు తీవ్రతరం చేశారు. వైద్యారోగ్య శాఖతో కలిసి పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ను జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయానికే అన్ని జిల్లాల్లోని మతపెద్దలతో పోలీసులు సమావేశమయ్యారు. పరిస్థితి తీవ్రతను తెలిపి, ఎవరెవరు ఢిల్లీ వెళ్లారో తెలుసుకునేందుకు యత్నించారు. వెయ్యి మందికిపైగానే ఉంటారన్న అంచనాకు వచ్చారు. గూగుల్ మ్యాప్ సాయంతో.. ఆచూకీ లభించిన వ్యక్తులతో పాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా మెలిగిన వారినీ క్వారంటైన్కు పంపుతున్నారు. వీరి సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని, గూగుల్ మ్యాప్స్ ద్వారా వారు ఢిల్లీ వెళ్లొచ్చాక ఎక్కడెక్కడ తిరిగారో వెతికే పనిలో పడ్డారు. గూగుల్ మ్యాప్లో ఉన్న ఈ సదుపాయం ఆధారంగా ఒక వ్యక్తి రోజూ ఏం చేశాడు? ఎక్కడెక్కడ తిరిగాడు? తదితర సమాచారమంతా క్లియర్గా మ్యాప్లో కనిపిస్తుంది. దీని ఆధారంగా పోలీసులు మిగిలిన వారిని అప్రమత్తం చేసే పనిలోపడ్డారు. 60% మంది హైదరాబాద్ పరిసరాల్లోనే.. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి సంఖ్యపై మధ్యాహ్నానికి పోలీసు, ఆరోగ్య శాఖలు ఒక నిర్ధారణకు వచ్చాయి. జిల్లాల వారీగా.. వెయ్యిమందికిపైనే ఉండొచ్చని అంచనా. వీరిలో 60 శాతం మంది హైదరాబాద్ పరిసరాలకు చెందిన వారేనని గుర్తించారు. తాజాగా మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రార్థనలకు హాజరై వస్తున్న 32 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్వారంటైన్కు తరలించారని సమాచారం. తెలంగాణ నుంచి ఈ ప్రార్థనలకు హాజరైన వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చనే అనుమానాలున్నాయి. వీరంతా రైలు, రోడ్డు, విమాన సర్వీసుల్లో తిరిగి వచ్చారు. పైగా అందరూ ఒకేరోజు రాలేదు. తిరుగు ప్రయాణంలో వీరి ద్వారా ఎంతమందికి సంక్రమించి ఉంటుందన్నది ఆందోళన కలిగిస్తోంది. లక్షణాలున్న వారు ముందుకురండి.. విదేశాలకు లేదా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, కరోనా లక్షణాలు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని డీజీపీ కార్యాలయం మంగళవారం మరోసారి విజ్ఞప్తి చేసింది. తబ్లిగీ జమాత్ కోసం ఢిల్లీకి వెళ్లొచ్చిన వారి కోసం గాలిస్తున్నామని, అటువంటి వారంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, తద్వారా ఎంతో మేలుచేసిన వారవుతారని తెలిపింది. నేరుగా సమాచారం అందించలేని వారు, హెల్ప్లైన్ నంబరు 104, డయల్ 100 లేదా సోషల్ మీడియా ద్వారానైనా తెలపాలని కోరింది. ‘ఢిల్లీ’అనుమానితులకు గాంధీలో వైద్యపరీక్షలు గాంధీఆస్పత్రి: ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి నగరానికి చేరుకున్న వారికి గాంధీ ఆస్పత్రిలో మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధి, మిగతా జిల్లాల నుంచి 1,030 మంది ప్రార్థనలకు వెళ్లినట్టు గుర్తించిన వారితోపాటు వారి కుటుంబసభ్యులను పోలీసులు, జీహెచ్ఎంసీ యంత్రాంగం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఓపీ విభాగంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి 250 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు గల 117 మందిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మిగిలిన వారి వివరాలు సేకరించి హోం క్వారన్టైన్లో ఉండాలని సూచించారు. బుధవారం మరికొందరికి పరీక్షలు నిర్వహిస్తామని డీఎంఈ రమేష్రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్ తెలిపారు. గాంధీ ప్రధాన ద్వారం వద్ద రహదారులను మూసివేసిన పోలీసులు బాధితులు, అనుమానితులు ఆస్పత్రి బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, గాంధీలో కరోనా ఐసీయూలో 65 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధాన భవనంలోని 7, 8 అంతస్తులు బాధితులు, అనుమానితులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చిన వారికి 6వ అంతస్తు కేటాయించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జీహెచ్ఎంసీ సిబ్బంది టెంట్లను వేసింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు గాంధీకి డెప్యుటేషన్పై వచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి నుంచి తెచ్చిన 20 వెంటిలేటర్లతో గాంధీలో సుమారు 70 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. గాంధీ గైనకాలజీ విభాగాన్ని కోఠిలోని సుల్తాన్బజార్ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. -
మరింత చురుగ్గా టాస్క్ఫోర్స్లు
వివిధ రూపాల్లో సహాయం చేయాలనుకునేవారు జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోని టాస్క్ఫోర్స్ కమిటీలను సంప్రదించాలి. స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని వినియోగించుకోవాలి. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ను పటిష్టంగా అమలయ్యేలా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కట్టడికి జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన టాస్క్ఫోర్సులు మరింత చురుగ్గా పని చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మంత్రులు తప్పనిసరిగా క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని చెప్పారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణ చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటైన టాస్క్ఫోర్సులు మరింత సమర్థవంతంగా పని చేయడానికి మార్కెట్ యార్డుల చైర్మన్లనూ అందులో భాగస్వాములు చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న మిగతా మార్కెట్ యార్డుల చైర్మన్ పోస్టులను భర్తీ చేసి, వారినీ టాస్క్ఫోర్సుల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఇంటింటి సర్వే సాగుతున్న తీరును, వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు, నిత్యావసరాలు, లాక్ డౌన్ కొనసాగుతున్న తీరుపై ఆయన ఆరా తీశారు. అనంతరం పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటి సర్వే రోజూ కొనసాగాలి ► పట్టణ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే ప్రతి రోజూ నిరంతరాయంగా కొనసాగాలి. ఇందుకోసం ఏర్పాటైన బృందాలు రోజూ ప్రతి కుటుంబాన్ని పరిశీలించాలి. కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆరోగ్య వివరాలు అందించాలి. వాళ్ల కోసం, ప్రజల కోసమే సర్వే జరుగుతోందని, అందరూ సహకరించాలని ప్రజలకు అవగాహన కలిగించాలి. చదువుకున్న వారు, అవగాహన ఉన్న వారు నేరుగా వెబ్ ద్వారా సొంతంగా తమ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు చేసే విషయమై అవగాహన కల్పించాలి. లేదా కాల్ సెంటర్ ద్వారా వివరాలు తెలియజేయాలని వివరించాలి. షెల్టర్లలో ఉన్న వారికి వ్యాధి లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే క్వారంటైన్ చేయాలి. ► పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు.. మిగిలిన ప్రాంతాల్లో 6 గంటల నుంచి 1 గంట వరకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ సమయంలో ఎక్కడా నిత్యావసరాల కొనుగోలు కోసం జనం గుమిగూడకుండా చూడాలి. భౌతిక దూరం తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి. డోర్ డెలివరీని ప్రోత్సహించాలి ► పట్టణ ప్రాంతాల్లో రైతు బజార్లు, మార్కెట్ల వికేంద్రీకరణపై మరింతగా దృష్టి పెట్టాలి. సూపర్ మార్కెట్లు, రైతు బజార్ల ద్వారా డోర్ డెలివరీని ప్రోత్సహించాలి. ప్రతి దుకాణం ఎదుట ధరల పట్టికను ప్రదర్శించి, అది అమలయ్యేలా చూడాలి. ఉన్నతాధికారులు దీనిని పర్యవేక్షించాలి. ► తాత్కాలిక పరిష్కారంగా రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. అరటి, టమాటా లాంటి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి. నిల్వ చేయలేని పంటల విషయంలో తలెత్తుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ మేరకు తక్షణమే సంబంధిత అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ► లాక్డౌన్ సమయంలో అన్ని దుకాణాల వద్ద పండ్లు అమ్ముకునే అవకాశం కల్పించాలి. దీనివల్ల రిటైల్ వ్యాపారం పెరిగి, రైతులకు కొంతైనా మేలు జరుగుతుంది. ఇది వెంటనే అమలు కావాలి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారాలపై దృష్టి ► రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జనతా మార్కెట్ల ఏర్పాటు చేయటంపై ఆలోచించాలి. గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డిమాండ్కు తగినట్టుగా ఈ మార్కెట్లు ఏర్పాటు చేసే విషయమై కార్యాచరణ రూపొందించాలి. ► ఆ మేరకు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను నెలకొల్పే దిశగా అడుగులు ముందుకు వేయాలి. గతంలో ఈ తరహా కార్యక్రమాలను పరిశీలించి మంచి విధానం రూపొందించాలి. ఆక్వా రంగంపై సీఎం ఆరా ► ఆక్వా రంగ అనుబంధ పరిశ్రమల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తక్కువ సిబ్బందితో పని చేయించాలి. ( 69 ప్రాసెసింగ్ యూనిట్లలో 41 చోట్ల పని ప్రారంభమైందని, అమెరికా, చైనాలకు ఎగుమతి మొదలైందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విశాఖపట్నం పోర్టు నుంచి 13, కాకినాడ పోర్ట్ నుంచి 4 కంటైనర్ల ఎగుమతి.) ► ప్రాసెసింగ్ కేంద్రాల్లో వర్కర్స్ పాసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. వారి సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలి. ► ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్, తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శ్రీ కింద పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ చెల్లించాం. అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలి. -
అడ్డంగా బుక్కైన నకిలీ ఐఏఎస్
సాక్షి, విశాఖపట్నం : ఐఏఎస్ అధికారినని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన గెదేల అనిల్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్నంటూ ఒక ఫేక్ ప్రొఫైల్ను క్రియేట్ చేసి అమాయకులను టార్గెట్ చేయడం ప్రారంభించాడు. ఇదివరకే భూ సెటిల్మెంట్లు చేస్తానని చెప్పి పలువురి దగ్గర సుమారు రూ. 9 లక్షలు తీసుకున్నట్లుగా తేలింది. ఈ నేపథ్యంలో భూమి సమస్య పరిష్కరిస్తానంటూ అనిల్ నకిలీ ఐఏఎస్గా తనను తాను పరిచయం చేసుకొని ఓ వ్యక్తి వద్ద రూ.2.5 లక్షలు తీసుకున్నాడు. బాధితునికి అనిల్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు అనిల్ కుమార్ను అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. (చదవండి: విశాఖ ‘సిట్’ గడువు పెంపు) ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. ఒకరి అరెస్ట్ ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న శ్రీకాకులపు శ్రీనివాస్ అనే వ్యక్తిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ కంపెనీలో ఏజీఎంగా ఉద్యోగం ఇప్పిస్తానని మభ్యపెట్టి ఓ వ్యక్తి నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు ఫిర్యాదు రావడంతో పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే మల్కాపురంతో పాటు విజయనగరం జిల్లా గరివిడి, విజయవాడ పటమట పోలీస్ స్టేషన్లలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. -
పెళ్లీడు పెరుగుతుందా?
న్యూఢిల్లీ: కేంద్రంలో పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అవుతున్న వేళ నరేంద్రమోదీ ప్రభుత్వం సమాజ సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో పెద్ద పీట వేసింది. ఇందులో భాగంగా స్త్రీ, శిశు సంక్షేమానికి, షెడ్యూల్ తెగలు, కులాలు, మైనార్టీల శాఖలకు నిధుల కేటాయింపులు పెరిగాయి. సామాజిక సంక్షేమాన్ని మూడు విభాగాలుగా విభజిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వివరించారు. స్త్రీ, శిశు సాంఘిక సంక్షేమం, సంస్కృతి మరియు పర్యాటకం, పర్యావరణం మరియు వాతావరణ మార్పు అనే మూడు విభాగాలుగా సమాజ సంక్షేమాన్ని విభాగిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు థీమ్స్కు అనుగుణంగా బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశారు. మహిళల వివాహానికి కనీస వయసును పునఃసమీక్షించేందుకు ఒక టాస్క్ఫోర్స్ను నియమిస్తున్నామని, ఈ టాస్క్ఫోర్స్ ఆరునెలల్లో నివేదిక అందిస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బలహీన వర్గాలు, స్త్రీ, శిశు సంక్షేమంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. సంక్షేమానికి గతంతో పోలిస్తే నిధులు పెంచామని తెలిపారు. స్త్రీ, శిశు.. సాంఘిక సంక్షేమం.. బేటీ బచావో– బేటీ పడావో పథకం బాగా విజయవంతమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల చెప్పారు. ప్రస్తుతం పాఠశాలల్లో స్థూల బాలికల నమోదు గణాంకాలు(94.32 శాతం) బాలుర గణాంకాల(89. 28 శాతం)కన్నా మెరుగయ్యాయని చెప్పారు. పసిపిల్లలు, గర్భిణులు, బాలింతల పౌష్టికత మెరుగుదలకు ప్రారంభించిన పోషన్ అభియాన్ కింద ఆరు లక్షల అంగన్వాడీలకు స్మార్ట్ఫోన్స్ అందించామని, వీటితో దాదాపు 10 కోట్ల కుటుంబాలకు పౌష్టికత అప్డేట్స్ అంది స్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి, మాన్యువల్ స్కావెం జింగ్ అరికట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ విషయంలో సాంకేతికతను వినియోగిస్తామని వివరించారు. బడ్జెట్లో సంక్షేమ కేటాయింపులు.. ►పౌష్టికాహార కార్యక్రమాల కోసం రూ. 35,600 కోట్లు, స్త్రీ సంక్షేమ పథకాలకు రూ. 28,600 కోట్లు కేటాయించారు. ►షెడ్యూల్ కులాల సంక్షే మం, ఓబీసీల సంక్షేమానికి రూ. 85 వేల కోట్లను, షెడ్యూల్ తెగల కోసం రూ. 53700 కోట్లను కేటాయించారు. ►దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి రూ. 9,500 కోట్లు అందించనున్నారు. ►సాంఘిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు రూ. 10,103.57 కోట్లను కేటాయించారు. గత బడ్జెట్లో ఈ మొత్తం రూ. 8,885 కోట్లు. ►మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. ►బాలల కోసం కేటాయింపులు గత బడ్జెట్తో పోలిస్తే 0.13 శాతం తగ్గాయి. -
నూనె+వనస్పతి=నెయ్యి!
సాక్షి, సిటీబ్యూరో: నార్త్జోన్ పరిధి లోని చిలకలగూడ కేంద్రంగా సాగుతున్న కల్తీ నెయ్యి దందా గుట్టును మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల కల్లీ నెయ్యి స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు గురువారం వెల్లడించారు. చిలకలగూడకు చెందిన పీఎన్ఎం నవీన్ నెయ్యి విక్రయం, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం చేసేవాడు. «ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్న అతను ఏడాదిగా తన ఇంట్లోనే కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాడు. మార్కెట్లో లభించే సాధారణ నూనెలో వనస్పతి కలిపి నెయ్యిగా మారుస్తున్నాడు. దీనిని డబ్బాలు, ప్యాకెట్లలో పార్శిల్ చేసి 100 శాతం స్వచ్ఛమైనదంటూ ప్రచారం చేస్తూ...కిరాణాదుకాణాలు, జనరల్ స్టోర్స్కు సరఫరా చేస్తున్నాడు. ఇతడి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై టి.శ్రీధర్ తన బృందంతో రంగంలోకి దిగారు. నవీన్ ఇంటిపై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 24 డబ్బాల్లో పార్శిల్ చేసి 360 కేజీల, ప్యాకెట్ల రూపంలో ఉన్న 40 కేజీల కల్తీ నెయ్యి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్యాకింగ్ మిషన్, సీలింగ్ యంత్రం, ప్లాస్టిక్ కవర్లు ఇతర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును చిలకలగూడ పోలీసులకు అప్పగించారు. -
6.46 కిలోల బంగారం పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు అక్రమ రవాణా కోసం పేదలను ఎంచుకుని నామమాత్రపు చార్జీలతో/ఉచిత ఉమ్రా యాత్ర పేర ఎర వేశారు. అలా వెళ్లిన వారిని భయపెట్టి జిద్దా నుంచి 6.46 కేజీల పసిడిని పంపారు. పక్కా సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులతో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్ చేపట్టగా 14 మంది చిక్కారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న సూత్రధారులు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొందరు ఏజెంట్ల ద్వారా కొత్త పంథాలో పసిడి అక్రమ రవాణాకు ప్రయత్నించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను నియమించుకున్న సూత్రధారులు వీరి సాయంతో నిరుపేదలైన మైనార్టీలను ఆకర్షించారు. ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ఉమ్రా యాత్రకు తీసుకువెళ్తామంటూ వారికి ఎర వేశారు. వీరి వలలో పడిన 14 మంది స్త్రీ, పురుషులు గత నెలలో యాత్రకు వెళ్లారు. క్యారియర్లుగా మారాలని ఒత్తిడి... యాత్ర పూర్తయిన తర్వాత వీరందరిని స్మగ్లర్లు జిద్దా తీసుకువెళ్లారు. అక్కడ ఓ ప్రాంతంలో నిర్భంధించి బంగారం స్మగ్లింగ్కు తమకు సహకరించాలని ఆదేశించారు. ఈ పని చేయడానికి యాత్రికులు విముఖత చూపగా... తమ మాట వినకపోతే జిద్దాలో అరెస్టు చేయిస్తామని, యాత్రకయ్యే మొత్తం ఖర్చులు చెల్లించాలని భయపెట్టారు. చివరకు ఎటూపాలుపోని స్థితిలో యాత్రికులు క్యారియర్లుగా మారడానికి అంగీకరించారు. దీంతో మొత్తం 6.46 కేజీల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు, 24 క్యారెట్ల కడ్డీలు, చైన్ల రూపంలోకి మార్చారు. వీటిని ఆ 14 మందికి అప్పగించి లోదుస్తుల్లో దాచుకునేలా ఆదేశించారు. మంగళవారం జిద్దా నుంచి సౌదీ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో వీరిని హైదరాబాద్కు పంపారు. ఇలా వచ్చే వీరి ఫొటోలు, వివరాలను జిద్దాలో ఉండే ఏజెంట్లు వాట్సాప్ ద్వారా నగరంలోని ఏజెంట్లకు పంపారు. వీరి వివరాలను క్యారియర్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్లు చిక్కినా సూత్రధారులు వ్యవహారం బయటకు రాకూడదనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ వద్ద వీళ్లకు స్థానిక ఏజెంట్లు కలుస్తారు. అక్కడ నుంచి వీరిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం స్వాధీనం చేసుకుంటారు. ఈ పసిడిని చేరాల్సిన వ్యాపారులకు చేర్చి క్యాష్ చేసుకుంటారు. పక్కా సమాచారంతో.. నిరుపేదలకు పవిత్ర యాత్ర పేరుతో ఎర వేసి క్యారియర్లుగా మార్చుకునే ముఠా వ్యవహారంపై సౌత్జోన్ టాస్క్ఫోర్స్కు సమాచారం అందడంతో ఈ స్మగ్లింగ్కు చెక్ పడింది. మరికాస్త లోతుగా ఆరా తీసిన టాస్క్ఫోర్స్ పోలీసులు గ్రూప్ బుకింగ్ ద్వారా వెళ్లిన వీరందరికీ విమానం టికెట్లు ఒకే పీఎన్ఆర్ నంబర్తో బుక్ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో అదనపు డీసీపీ చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ మధుమోహన్రెడ్డి ఆ పీఎన్ఆర్ నంబర్, ఓ ప్రయాణికుడి పేరు సేకరించారు. వీళ్లు విమానం దిగి బయటకొస్తే పట్టుకోవడం కష్టమని, కొందరైనా పారిపోయే ప్రమాదముందని భావించా రు. విమానాశ్రయంలోకి వెళ్లి ఆపరేషన్ చేపట్టే అవకాశం టాస్క్ఫోర్స్కు లేకపోవడంతో విషయాన్ని మంగళవారం రాత్రి డీఆర్ఐకి అందించారు. అప్రమత్తమైన ప్రత్యేక టీమ్స్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాయి. సదరు పీఎన్ఆర్ నంబర్ను తనిఖీ చేయగా మొత్తం 14 మంది యాత్రికుల పేర్లు బయటపడ్డాయి. దీంతో విమానాశ్రయం లోపల డీఆర్ఐ, బయట టాస్క్ఫోర్స్ అధికారులు వలపన్నారు. విమా నం దిగి ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేసిన 14 మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ.. తనిఖీ చేయగా వివిధ రూపా ల్లో ఉన్న 6.46 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్లో రూ.2.17 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీనికి సంబంధించి వీరివద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో అక్రమ రవాణాగా తేల్చారు. -
హవాలా రాకెట్ గుట్టు రట్టు
సాక్షి, సిటీబ్యూరో: హవాలా రాకెట్ గురించి సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం ముగ్గురిని అదుపులోకి తీసుకుని రూ.70.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ పి.రాధాకిషన్రావు కథనం ప్రకారం... ఏపీలోని గుడివాడకు చెందిన కె.నరేష్ కూకట్పల్లిలో ఉంటూ డెయిరీ వ్యాపారం చేస్తున్నారు. నగరంలోని హబ్సిగూడ, యాకత్పురాలకు చెందిన ఖాసిం మహ్మద్ రజా, హైదర్ రజాలు బేగంపేటలోని ఏజీఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో మేనేజర్, ఆఫీస్బాయ్గా పని చేస్తున్నారు. వ్యాపారి అయిన నరేష్కు ఏజీఎస్ సంస్థ యజమాని మూర్తి స్నేహితుడు. నరేష్ సమీప బంధువైన విజయ శంకర్ నగరానికి చెందిన కీర్తి అనే వ్యక్తికి రూ.70.63 లక్షలు పంపాలని భావించాడు. ఈ మొత్తాన్ని నరేష్ సూచనల మేరకు విజయ శంకర్ ఏజీఎస్ సెక్యూరిటీస్ సంస్థ ఖాతాకు పంపారు. డబ్బు డ్రా చేసిన ఆ సంస్థకు చెందిన ఖాసిం, హైదర్లు ఆ మొత్తం డ్రా చేసి తీసుకొచ్చి నరేష్కు ఇవ్వడానికి ప్రయత్నించారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం మాలకుంట వద్ద మాటువేసి ముగ్గురిని పట్టుకుంది. వీరి నుంచి నగదుతో పాటు వాహనాలు స్వాధీనం చేసు కుంది. తదుపరి చర్యల నిమిత్తం కేసును బేగంబజార్ ఠాణాకు అప్పగించారు. -
హవాలా ముఠా గుట్టురట్టు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): అక్రమంగా నగదు మార్పిడి చేస్తున్న (హవాలా వ్యాపారం) ముఠాని టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ద్వారకాజోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకానగర్ ఎస్.ఎస్.ఆర్.రెసిడెన్సీ ఎదురుగా వనిత రెసిడెన్సీ ప్లాట్ నెంబర్ – 403లో మంగళవారం ఉదయం హవాలా వ్యాపారం చేస్తున్నట్లు టాస్క్ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఏసీపీ మహేంద్ర మాతే సిబ్బందితో దాడులు చేశారు. ఈ దాడుల్లో టైకోన్ రోడ్డు బాలాజీనగర్కు చెందిన చలుమూరి రామకృష్ణ, కైలాసాపురం, గాంధీ విగ్రహం కృష్ణానగర్కు చెందిన చల్లా నారాయణను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.38 లక్షల76 వేల 350తో పాటు ఫ్యాక్స్ మిషన్, నగదు లెక్కింపు యంత్రం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ద్వారకా జోన్ పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మహేంద్ర మాట్లాడుతూ ఇన్కంటేక్స్ డిపార్టుమెంట్కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. -
బండకొండ ప్రాంతంలో కాల్పులు
భాకరాపేట : చిన్నగొట్టిగల్లు మండలం బండకొండ ప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు ఆత్మ రక్షణ కోసం గాలిలోకి కాల్పులు జరిపినట్లు టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు తెలిపారు. బుధవారం గాల్లోకి కాల్పులు జరిపిన ప్రాంతాన్ని ఐజీ కాంతారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం రాత్రి అందిన సమాచారం మేరకు చిన్నగొట్టిగల్లు మండలం కటారువాండ్లపల్లె సమీ పంలోని బండకొండ ప్రాంతంలో స్మగ్లర్లు కదలికలను గమనించి కూంబింగ్ నిర్వహించామన్నారు. అక్రమ రవాణాకు అనువైన రోడ్డు మా ర్గానికి దగ్గరగా బండకొండ ప్రాంతం ఉండడంతో అక్కడ ఎర్రచందనం దుంగలను నిల్వ చేసి, వాటిని తరలించేందుకు సిద్ధం అవుతుండగా వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేయగా రాళ్లు విసురుతూ పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. ఒక దశలో వారు ఎదురు తిరిగి దాడికి పాల్పడేందుకు ముందుకు రావడంతో ఆత్మరక్షణ కోసం గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో దుంగలు కింద పడేసి పారిపోతుండగా తమిళనాడు రాష్ట్రం జువాదిమళైకి చెందిన సెల్వరాజ్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో 13 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు గ్రామాల్లో భయం భయం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల సరిహద్దు ప్రాంతమైన బండకొండ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలు తరలించిన దాఖలాలు లేవని స్థానిక గ్రామ ప్రజలు అంటున్నారు. టాస్క్ఫోర్స్, డాగ్ స్క్వా డ్, పోలీసులు గ్రామాల సరిహద్దులోని పొలా ల్లో తిరగడంతో గ్రామాల్లో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కొనసాగుతున్న కూంబింగ్ బండకొండ సమీపంలో పారిపోయిన స్మగ్లర్లు కోసం తలకోన అడవుల్లో కూంబింగ్ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో స్మగ్లర్లు బరితెగిస్తున్నారంటే కచ్చితంగా ఇంటి దొంగలు సహకారం ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశారు. ఆ దిశగా కూడా రహస్యంగా విచారణ చేపడుతున్నట్లు వివరించారు. -
పసిడి దందాకు కొత్త పంథా
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు రోజుకో పంథాలో తమ దందా కొనసాగిస్తున్నారు. పలు రూపాల్లో పసిడిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు వేర్వేరుగా ఒకేరోజు ఛేదించిన రెండు కేసులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇద్దరు హైదరాబాదీయుల్ని అదుపులోకి తీసుకున్న అధికారులు మొత్తం రూ.1.17 కోట్ల విలువైన 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ అధికారులు గుట్టురట్టు చేసిన కేసు వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావుతో కలిసి బుధవారం వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి సయ్యద్ అబ్దుల్ హైతమీన్కు షార్జాలో ఉంటున్న సయ్యద్ అఫ్జల్ హుస్సేన్తో పరిచయం ఏర్పడింది. హుస్సేన్ గతంలో డ్రైవర్గా పని చేసి ప్రస్తుతం బంగారం స్మగ్లర్గా మారిపోయాడు. హైతమీన్ను క్యారియర్గా మార్చి స్మగ్లింగ్కు శ్రీకారం చుట్టాడు. గత నెల్లో షార్జా వెళ్లిన హైతమీన్ అక్కడ అఫ్జల్ సహకారంతో కొన్ని ప్రత్యేక దుకాణాల్లో 550 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చాడు. సీల్డ్ కవర్లో ప్యాక్ చేసి ఉన్న దీన్ని రెండు యాంకిల్ బ్యాండ్స్లో ఏర్పాటు చేయించుకున్నాడు. వీటిని రెండు కాళ్లకు అమర్చుకుని, వాటిపై సాక్సు వేసుకుని షూ ధరించి గత శనివారం సిటీకి వచ్చాడు. గిన్నెలో వేసి వేడి చేస్తే చాలు పసిడి య«థాతథంగా బయటపడుతోంది. కనీసం గ్రాము కూడా తరుగు ఉండదు. బంగారం రూపు మార్చడానికి ఆ దుకాణాలవారు రూ.16 వేలు (భారత కరెన్సీలో) చార్జ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్ఐలు పి.మల్లికార్జున్, ఎల్.భాస్కర్రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ, కానిస్టేబుల్ బి.ప్రవీణ్ బుధవారం హైతమీన్ ఇంటిపై దాడి చేశారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారం, పాస్పోర్ట్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ బంగారం విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అఫ్జల్కు పంపిస్తానని, తనకు ఒక్కో ట్రిక్కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఇస్తుంటాడని హైతమీన్ పేర్కొన్నాడు. కస్టమ్స్కు చిక్కిన మరో క్యారియర్... నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల దుబాయ్ వెళ్లారు. బుధవారం తిరిగి వచ్చిన ఆయన తనతోపాటు నాలుగు ట్రాలీ బ్యాగ్స్ తీసుకువచ్చారు. అతడి వ్యవహారశైలితోపాటు బ్యాగులపై అనుమానం వచ్చిన కస్టమ్స్ ఆధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) ఆపి తనిఖీలు చేసింది. అతడి వద్ద, బ్యాగుల్లోనూ అనుమానిత వస్తువులు లభించలేదు. అయితే అతడు నాలుగు బ్యాగుల్ని పట్టుకు రావడంపై కస్టమ్స్ అధికారులు దృష్టి పెట్టారు. దీంతో వాటిని అణువణువూ తనిఖీ చేశారు. ఆ ట్రాలీ బ్యాగ్స్కు ఉన్న ఫ్రేమ్లు, హ్యాండిల్, చక్రాలు తదితరాలన్నీ బంగారంతోనే తయారైనట్లు గుర్తించారు. దుబాయ్లో మూడు కిలోల బంగారం ఖరీదు చేసిన సూత్రధారులు దాన్ని కొందరి సాయంతో ఇలాంటి వస్తువులుగా మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై స్టీలు, ప్లాస్టిక్, అల్యూమినియం కోటింగ్స్ వేశారు. వీటిని ఆయా ట్రాలీ బ్యాగ్స్కు ఉన్న వాటితో రీప్లేస్ చేశారు. ఈ బ్యాగుల్ని తీసుకువస్తూ నగరవాసి కస్టమ్స్కు చిక్కాడు. ఫ్రేమ్లు, హ్యాండిల్, చక్రాలను వేరు చేసి తూకం వేయగా మూడు కేజీల బంగారం ఉన్నట్లు తేలింది. దీని ధర లోకల్ మార్కెట్లో రూ.కోటి ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. ఇతడు ఎవరి కోసం ఈ బంగారం తీసుకువచ్చాడు? దీని వెనుక ఎవరు ఉన్నారు? తదితర అంశాలను కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కాకానినగర్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార గృహంపై టాస్క్ఫోర్స్, ఎయిర్పోర్ట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మహిళలతో పాటు ఇద్దరు విటుల్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకానినగర్ బస్టాప్ వెనకనున్న ఇంట్లో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడుగా వ్యభిచారం సాగిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఎస్ఐ వాసునాయుడు, ఎయిర్పోర్ట్ సీఐ జెర్రిపోతుల శ్రీనివాసరావు సంయుక్తంగా దాడి చేశారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.9100 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
డేంజర్ మాంజాపై టాస్క్ఫోర్స్ పంజా
సాక్షి, సిటీబ్యూరో: పతంగుల పండుగగా పిలిచే సంక్రాంతి నేపథ్యంలో నగరంలో మాంజా విక్రయాలు జోరందుకుంటాయి. నిషేధం ఉన్నప్పటికీ లాభార్జనే ధ్యేయంగా పలువురు వ్యాపారులు గాజు రజను పూతతో కూడిన సింథటిక్ మాంజా అమ్ముతుంటారు. దీని ప్రభావాన్ని వివరిస్తూ ‘సాక్షి’ శుక్రవారం ‘డేంజర్ మాంజా’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో నగర టాస్క్ఫోర్స్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా మాంజా విక్రయాలపై నిఘా వేయాల్సిందిగా డీసీపీ పి.రాధాకిషన్రావు ఆదేశాలు జారీ చేశారు. రసూల్పుర ప్రాంతంలో దాడులు చేపట్టిన వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిషేధిత మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని భారీగా సరుకు స్వాధీనం చేసుకున్నారు. రసూల్పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్బర్ అలీ స్థానికంగా ఏకే ట్రేడర్స్ పేరుతో డిస్పోజబుల్ సామాన్లు విక్రయిస్తుంటాడు. ఇతడితో పాటు అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ముజఫర్ అలీ సైతం సంక్రాంతి నేపథ్యంలో పతంగుల విక్రయ దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ఇటీవలే వేర్వేరుగా దుకాణాలు తెరిచిన ఈ ద్వయం వివిధ రకాలైన గాలిపటాలతో పాటు మాంజాలు అమ్మడం మొదలెట్టారు. చైనా మాంజా, సింథటిక్–గాజు మిశ్రమాలతో కూడిన మాంజాలు అత్యంత ప్రమాదకరమని, వీటిపై నిషేధం ఉందని తెలిసినప్పటికీ వీరిద్దరూ ఎక్కువ లాభాలు ఉన్నాయనే ఉద్దేశంతో వాటినే అమ్ముతున్నారు. దీనిని గుర్తించిన ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్రెడ్డి, ఎల్.భాస్కర్రెడ్డి, బి.దుర్గారావు, మహ్మద్ ముజఫర్ అలీ దాడి చేసి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1.6 లక్షల విలువైన నిషేధిత మాంజా స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులకు అప్పగించారు. ఇలాంటి మాంజాలతో పతంగులు ఎగురవేస్తే అవి తెగినప్పుడు తీవ్ర పరిణామాలు ఉంటాయని టాస్క్ఫోర్స్ పోలీసులు పేర్కొన్నారు. చెట్లు తదితరాలకు వేలాడుతున్న, ఎక్కడైనా పట్టుకున్న వీటిలో పక్షులు చిక్కుకుని చనిపోతాయి. అనేక సందర్భాల్లో ప్రజలూ తీవ్రంగా గాయపడిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఇలాంటి విక్రయాలపై డేగకన్ను వేసి ఉంచుతామని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఎవరైనా విక్రయిస్తుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నేరాలకు వీసా!
దేశంలోని మెట్రో నగరాలపై ఇరానియన్లు కన్నేశారు. ఓ కుటుంబంగా విజిట్ వీసాపై వస్తున్నారు. ఢిల్లీలోని లాడ్జిలు, హోటళ్లలో బస చేస్తున్నారు. అక్కడే ఓ వాహనం అద్దెకు తీసుకుని ప్రధాన మెట్రో నగరాల్లో సంచరిస్తున్నారు. ఓ సిటీకి చేరిన తర్వాత రాత్రికి బస చేయడం, ఉదయం దృష్టి మళ్లించి డబ్బు కాజేసే నేరం చేయడం పనిగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సహా ఐదు నగరాల్లోని మనీ ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్ సంస్థల్ని ప్రధానంగా టార్గెట్ చేశారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఇటీవల ఓ ముఠాను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో రెండింటి కోసం గాలిస్తున్న పోలీసులు ఆ అరెస్టు వివరాలను గోప్యంగా ఉంచారు. –సాక్షి, హైదరాబాద్ ‘స్థానిక ముఠాలు’ ఇచ్చిన సమాచారంతో... కొన్నేళ్ల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో స్థిరపడిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరిలో కొందరు నేరగాళ్లుగానూ మారారు. ప్రధానంగా కర్ణాటకలోని బీదర్, ధర్వాడ, మహారాష్ట్రలోని థానే సమీపంలో ఉన్న అంబివలీ, మధ్యప్రదేశ్తో పాటు రాష్ట్రంలోని గుంతకల్, మదనపల్లిలో ఉంటూ నేరాలు చేస్తున్నాయి. పోలీసుల అవతారం ఎత్తి తనిఖీల పేరుతో మహిళల నుంచి నగలు తదితరాలు కాజేసేవాళ్లు. ఆ తర్వాతి కాలంలో ఈ ముఠాలు అటెన్షన్ డైవర్షన్స్గా పిలిచే దృష్టి మళ్లించి సొత్తు కాజేయడంపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. నాలుగేళ్ల క్రితం వరకు హైదరాబాద్పైనా వరుసపెట్టి పంజా విసిరారు. అటెన్షన్ డైవర్షన్ నేరాల గురించి తెలుసుకున్న ఇరాన్లోని వీరి బంధువులు టూరిస్ట్ వీసాపై వస్తున్నారు. విమాన టికెట్లు, ఇతర ఖర్చులు కలిపి రూ.1.5 లక్షలకు మించి కాకపోవడంతో అనేక ముఠాలు వచ్చి పంజా విసరడం మొదలెట్టాయి. ఒంటరిగా విజయవంతం కావడంతో ముఠా... ఇరాన్కు చెందిన బర్జిగరేసికా బెటేకల్మార్జీ అహ్మద్ కొన్నాళ్ల క్రితం విజిట్ వీసాపై వచ్చి అటెన్షన్ డైవర్షన్ నేరాలు చేసి వెళ్లాడు. మళ్లీ గత ఏడాది జూలైలో జెరేహ్దౌస్త్ కమ్రాన్, పహంఘే అలీ అతడి భార్య పహంగే మీనతో కలసి వచ్చాడు. తామంతా ఓ కుటుంబమని, విహారయాత్రకు వచ్చామంటూ చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్లో బస చేసిన వీరు అక్కడ నుంచి ఓ వాహనాన్ని రోజుకు రూ.2,300 అద్దెకు తీసుకున్నారు. దీనిపై ఒక్కో మెట్రో నగరానికి వెళ్లి రాత్రి బస చేసేవారు. అదే పూట మనీ ట్రాన్స్ఫర్, మనీ ఎక్సే ్చంజ్ సంస్థలు ఎక్కడ ఉన్నాయో గుర్తించేవారు. మరుసటి రోజు ఆయా దుకాణాలకు సూటుబూటుతో వెళ్లి నిర్వాహకుల దృష్టి మళ్లించి క్యాష్ కౌంటర్లోని డబ్బు పట్టుకుని ఉడాయించేవారు. ఈ ముఠా అహ్మదాబాద్, షోలాపూర్, ముంబై, పుణేల్లో ఈ తరహా చోరీలు చేసింది. ఓ ప్రాంతంలో ఒక రోజు ఒక నేరం చేసి వెంటనే ఆ నగరాన్ని వదిలేస్తారు. మరో మెట్రో సిటీకి వెళ్లి తమ వద్ద ఉన్న డబ్బులో వీలైనంత హవాలా మార్గంలో తమ దేశానికి పంపించి కొంతే దగ్గర ఉంచుకుంటారు. ఎవరైనా తనిఖీలు చేసినా అనుమానం రాకుండా తమ వద్ద ఉన్న దాన్ని ఇరాన్ కరెన్సీగా మార్చేసుకుంటారు. పుణే మార్గంలో పట్టుకున్న టాస్క్ఫోర్స్... ఈ గ్యాంగ్ గత ఏడాది ఆగస్టు 27న హైదరాబాద్ వచ్చి ఆ మరునాడు మాదన్నపేటలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థలో నేరం చేసింది. యజమాని దృష్టి మళ్లించి రూ.2 లక్షలతో ఉడాయించింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరం చేసిన వెంటనే ఇరానీ ముఠా నగరం విడిచిపెట్టాల్సి ఉంది. అయితే కాలకృత్యాల కోసం పాతబస్తీలోని ఓ షాపునకు వెళ్లి అవకాశం చిక్కడంతో క్యాష్ కౌంటర్లోని డబ్బు కాజేసింది. మాదన్నపేట కేసును పర్యవేక్షిస్తున్న పోలీసులకు ఈ విషయం తెలిసి ఆ దుకాణం వద్దకు వెళ్లి సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి దుండగులు వాడిన వాహనం నంబర్ గుర్తించారు. దాని యజమానిని సంప్రదించగా.. ఇరాన్ నుంచి వచ్చిన కుటుంబానికి అద్దెకు ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో సాంకేతికంగా కదలికలు గుర్తించిన టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితులు పుణే మార్గంలో ఉన్నట్లు గుర్తించారు. సెప్టెంబర్ 3న అక్కడకు వెళ్లిన టీమ్ నలుగురిని పట్టుకోవడంతో కథ వెలుగులోకి వచ్చింది. ఎంబసీ సాయం తీసుకోవాలనే యోచన.. ఈ గ్యాంగ్ను విచారించగా ఆ పని తాము చేయలేదని, తమ మాదిరిగానే మరో రెండు ముఠాలు సంచరిస్తున్నాయని వెల్లడించారు. వీరు అరెస్టు అయినట్లు బయటకు వస్తే ఆ ముఠాలు అప్రమత్తం అవుతాయనే ఉద్దేశంతో విషయాన్ని గోప్యంగా ఉంచారు. మిగిలిన రెండు ముఠాల కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు అవసరమైతే ఎంబసీ సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే అహ్మద్ గ్యాంగ్ను అరెస్టు చేసినట్లు ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారమిచ్చారు. వీసా వివరాలను తీసుకుని సమగ్రంగా అధ్యయనం చేస్తే ఇరాన్ నుంచి వచ్చిన ముఠాలెన్ని అనేది తెలుస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ‘ఈ తరహా ముఠాలు చేస్తున్న నేరాల్లో అనేకం అనివార్య కారణాల నేపథ్యంలో పోలీసుల వరకు రావట్లేదు. ఆదాయపు పన్ను, జీఎస్టీ ఇలాంటి అనేక అంశాలతో వ్యాపారులు ఫిర్యాదులకు వెనుకాడుతున్నారు. ఫలితంగా కొన్నాళుగా ఈ ముఠాల ఆగడాలు హద్దూ్ద అదుçపూ లేకుండా సాగిపోతున్నాయ’ని ఆయన వివరించారు. -
బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
సాక్షి,హైదరాబాద్: హైటెక్ పంథాలో ప్రత్యేక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును నగర టాస్క్ఫోర్స్ బృందం రట్టు చేసింది. నార్త్జోన్ టాస్క్ఫోర్స్ బృందం నిర్వహించిన దాడుల్లో ముఠాకు చెందిన ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి పోలీసులు రూ.41లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి కొత్వాల్ అంజనీకుమార్ తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. పంటర్గా మొదలై బుకీగా..: హిమాయత్నగర్కు చెందిన వ్యాపారి అలోక్ జైన్ ముందు పంటర్గా పందాలు కాసి నష్టపోయాడు. దీంతో తన సోదరుడు అభిషేక్ జైన్, స్నేహితుడు మేహుల్ కే మార్జారియాలతో కలి సి బుకీగా మారాడు. చిక్కడపల్లిలో ఓ ఫ్లాట్ తీసుకుని బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. పరిచయస్తులైన పంటర్ల నుంచి పందాలు అంగీకరి స్తూ ఆ లెక్కల్ని రికార్డుల్లో నోట్ చేసుకునే వారు. మ్యాచ్ ముగిశాక పందెం ఓడిన వారి నుంచి డబ్బు వసూలు, గెలిచిన వారికి చెల్లింపులు చేసేవారు. అప్పట్లో మ్యాచ్ వివరాలను టీవీలో చూస్తూ, బెట్టింగ్ నిష్పత్తిని సూత్రధారుల నుంచి ఫోన్లో తెలుసుకునే వారు. యాప్ తయారు చేయించిన సుభాష్ దేశంలోనే ప్రముఖ బుకీగా పేరున్న రాజస్థాన్ వాసి సులేమాన్ సురానీ అలియాస్ సుభాష్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు. బెట్టింగ్స్ నిర్వహణకు సుభాష్ వెబ్సైట్, యాప్ రూపొందించాడు. వీటిల్లోకి లాగిన్ కావాలం టే యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తప్పనిసరి. గత ఐపీఎల్లో అలోక్ ఇందులో భాగస్వామిగా చేరాడు. అలోక్ వద్ద బెట్టింగ్కు పాల్పడే పంటర్లకూ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చేందుకు ఒక్క క్కరి నుంచి రూ.30 వేలు వసూలు చేస్తూ కొంత సుభాష్కు పంపిస్తున్నాడు. ఆ సైట్, యాప్స్లోకి ప్రవేశించిన పంటర్లకు మ్యాచ్ వివరాలు, బెట్టింగ్ నిష్పత్తి అన్నీ అక్కడే కనిపిస్తాయి. క్రికెట్కే కాకుండా ఏ క్రీడకైనా ఈ యాప్ ద్వారా పందాలు కాసుకోవచ్చు. హవాలా మార్గంలో నగదు లావాదేవీలు ఈ యాప్లోకి ప్రవేశించిన పంటర్ల వివరాలు, ఏ జట్టుపై ఎంత పందెం కాశారనేది రికార్డు అయిపోతాయి. గెలిచిన, ఓడిన వారు హవా లా మార్గంలో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేస్తుంటారు. సమస్యలుంటే వాట్సాప్ ద్వారా నే సంప్రదింపులు జరపాలి. అనేక మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహించిన అలోక్ గ్యాంగ్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు నేతృత్వంలో బృందం దాడి చేసి అలోక్, అభిషేక్, మార్జారియాలను అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో సైట్, యాప్లను సుభాష్ బ్లాక్ చేశాడు. సుభాష్పై ఎల్ఓసీ జారీ చేయించాలని నిర్ణయించారు. ఈ అంశాల్లోనే బెట్టింగ్.. 1. టాస్ ఏ జట్టు గెలుస్తుంది? 2. ఫేవరేట్ టీమ్ ఏది? 3. ఓ బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ దాటతారు? 4. ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు? 5. మొదటి సెషన్లో (6 ఓవర్లు) ఎన్ని రన్స్ చేస్తారు? 6. రెండు, మూడు, నాలుగు సెషన్స్లో ఎన్నేసి నమోదవుతాయి? -
మళ్లీ రెచ్చిపోయిన ఎర్ర స్మగ్లర్లు
చిత్తూరు ,భాకరాపేట : భాకరాపేట ఘాట్ రోడ్డు మార్గంలోని అడవుల్లో తమిళ స్మగ్లర్లు భారీ స్థాయిలో విరుచుకుపడినట్లు టాస్క్ పోర్స్ ఐజీ కాంతారావు పేర్కొన్నారు. ఆయన కథనం..రహస్య సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి తిరుపతి టాస్క్ ఫోర్స్ బృందం, ఆర్ఎస్ఐ వాసు బృందం భాకరాపేట ఘాట్ రోడ్డుకు చేరుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తూ అటవీ ప్రాంతాన్ని నిశితంగా గమనించసాగారు. అయితే అడవిలో నుంచి మినుకు మినుకు మంటూ వెలుతురు వస్తుండడంతో అనుమానించారు. ఆ వైపు వెళ్లి పరిశీలించారు. 30 మంది వరకు అడవిలో నడుస్తూ వెళుతున్నట్లు గుర్తించి, వారిని పట్టుకునేందుకు యత్నించారు. వారు దుంగలు పడేసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో దుంగల వద్ద కొంతమంది సిబ్బందిని కాపలా ఉంచి వారిని వెంబడించారు. మరో వైపు నుంచి శబ్దం రావడంతో అటుకేసి పరుగులు తీశారు. సుమారు 40–50 మంది వరకు ఉన్న స్మగ్లర్లు టాస్క్ఫోర్స్పై దాడికి తెగబడ్డారు. రాళ్లు, గొడ్డళ్లు, కత్తులు విసరడంతో టాస్క్ ఫోర్స్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపింది. దీంతో స్మగ్లర్లు పారిపోయారు. సంఘటన స్థలంలో 55 దుంగలను స్వాధీనం చేసుకున్నారన్నారు. పరిసర ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ మరో 3 దుంగలను గుర్తించింది. ఇవన్నీనూ ఏ–1 గ్రేడ్ కలిగినవి కావడం గమనార్హం! కొనసాగుతున్న కూంబింగ్ పరారైన స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ను కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా శేషాచలం అటవీ సరిహద్దు గ్రామాలు, భాకరాపేట, ఎర్రావారిపాళెం మండలాల్లోని చెక్ పోస్టులు, సీసీ కెమెరాల పుటేజీలను ఎప్పటికప్పుడు తీసుకుని వాటిని పరిశీలిస్తున్నట్లు ఐజీ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్ఆర్ఓలు లక్ష్మీపతి, ప్రసాద్, సీఐ కొండయ్య, ఆర్ఐ భాస్కర్, ఎస్ఐ సోమశేఖర్తోపాటు డాగ్ స్క్వాడ్, నైట్ పెట్రోలింగ్ స్క్వాడ్, వాసు బృందం పాల్గొంది. స్మగ్లర్ల సంచుల్లో వన్య ప్రాణులకళేబరాల అవశేషాలు! స్మగ్లర్లు ఎప్పుడు పట్టుబడినా ఆహార పదార్థాలు, బట్టలు లభించేవి..అయితే ప్రస్తుతం బ్యాగుల్లో జంతు కళేబరాల అవశేషాలు (కొండముచ్చు కాళ్లు, చిన్న కోతి చర్మం, బెట్లుడత తోక), వీటితో పాటు తుపాకీ గుండ్లకు ఉపయోగించే సీసం స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే స్మగ్లర్లు, ఎర్రకూలీలు మారణాయుధాలతో సంచరిస్తూ వన్యప్రాణులను కూడా వేటాడుతున్నట్టు తేలింది. -
టాస్స్ఫోర్స్ లైవ్ ఆపరేషన్.. నలుగురు స్మగ్లర్ల అరెస్ట్
సాక్షి, తిరుపతి: గత కొంతకాలంగా యథేచ్చగా స్మగ్లింగ్కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు స్మగ్లర్లు తిరుచానూరు సమీపంలోని చైతన్యపురంలోని ఓ ఇంట్లో దాగిఉన్నారని పక్కా సమాచారం అందుకున్న టాస్క్పోర్స్ అధికారులు లైవ్ ఆపరేషన్ చేపట్టారు. మొదట భారీగా సిబ్బందిని మోహరించి స్మగ్లర్లు ఉన్న ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన స్మగ్లర్లు సిబ్బందిపై బాటిల్స్ విసిరారు. అంతేకాకుండా ఇంటిలోపలికి ప్రవేశించిన సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నించారు. స్మగ్లర్ల దాడిని చాకచక్యంగా ప్రతిఘటించిన సిబ్బంది, వారిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది. -
లెక్క పెట్టించాల్సినోడు లెక్క పెడుతున్నాడు.
కరీంనగర్లీగల్: మేకల విక్రయదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై మర్రిపల్లి రమేష్, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్కు ఏడాది జైలుశిక్ష, రూ.10వేల జరిమానా, మరో కానిస్టేబుల్ కోడూరి కనకశ్రీనివాస్కు ఆర్నెళ్ల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్రావు మంగళవారం తీర్పునిచ్చారు. పీ.పీ వివరాల ప్రకారం.. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన జక్కుల సారయ్య, లంక అంజయ్య, మరికొంత మంది మేకల వ్యాపారం నిర్వహిస్తున్నారు. మేకలను మహేంద్ర, టాటాఏస్ వాహనాల్లో కరీంనగర్, గంగాధర, హుస్నాబాద్ తదిరత ప్రాంతాల్లోని అంగడిబజార్లకు తరలించి విక్రయించేవారు. 2011 మార్చి 26న చొప్పదండి అంగడికి మేకలను తరలించారు. సదరు వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఎస్సై మర్రిపల్లి రమేష్ జరిమానా విధించాడు. దీంతో సారయ్య, తదితరులు మరునాడు ఎస్సైని కలిశారు. ఏడాది వరకు రూ.40వేలు మాముళ్లుగా ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశాడు. అంత ఇచ్చుకోలేమని చెప్పిన బాధితులు పదిహేను రోజులకు మళ్లీ ఎస్సైని కలిశారు. రూ.15 ఇవ్వాలని ఎస్సై ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఎస్సై వద్దకు వెళ్లేందుకు గన్మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 డిమాండ్ చేశాడు.దీంతో సారయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 2011 ఏప్రిల్ 15న సారయ్య పోలీస్స్టేషన్కు వెళ్లాడు. రూ.15వేలు ఎస్సైకి ఇవ్వబోతుం డగా రైటర్ శ్రీనివాస్కు ఇవ్వమని చెప్పాడు. రైటర్ రూ.15వేలు తీసుకున్నాడు. బయటకు రాగానే గన్మెన్ ఎల్లయ్యగౌడ్ రూ.1000 తీసుకున్నాడు. దీంతో ముందస్తు పథకం ప్రకారం వేచి ఉన్న ఏసీబీ అధికారులు స్టేషన్లోనికి వెళ్లారు. లంచం డబ్బులు స్వాధీనం చేసుకుని ఎస్సై, గన్మెన్, రైటర్ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్షులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరుచగా వాగ్మూలంను నమోదు చేశారు. అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి భాస్కర్రావు మంగళవారం ఎస్సై మర్రిపల్లి రమేష్(40), కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ (40)లకు ఏడాది జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా, కోడూరి కనక శ్రీనివాస్(47)కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున 20మంది సాక్షులను ప్రవేశపెట్టగా 13మంది కేసుకు వ్యతిరేకంగా, నిందితులకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వడంతో వీరిపై కేసు ఎందుకు నమోదు చేయరాదో డిసెంబర్ 20వ తేదీ వరకు సంజాయిషీని ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇందులో ఫిర్యాదుదారుడు జక్కు సారయ్య, లంక అంజయ్య, ట్రాప్ జరిగినపుడు హాజరైన సాక్ష్యులు డాక్టర్ గుర్రం శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ పూదరి నరేష్, ఏఎస్సై ముచ్చె మధుసూధన్రెడ్డితోపాటు మెరుగు జానయ్య, కానిస్టేబుల్ గోలి శ్రీనివాస్రెడ్డి, పులి అంజయ్య, రంగు శ్రీనివాస్, తొర్తి కొమురయ్య, సాగాల రాజయ్య, జెట్టి ప్రభాకర్, బి. మల్లేశంకు నోటీసులు జారీ చేయబడ్డాయి. ప్రస్తుతం ఎస్సై రమేష్ కరీంనగర్ టాస్క్ఫోర్స్లో, కానిస్టేబుల్ బూస ఎల్లయ్యగౌడ్ గంగాధర పోలీస్స్టేషన్లో, కోడూరి కనక శ్రీనివాస్ ముస్తాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం..విద్యార్థి అరెస్ట్
తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ఓ బీటెక్ విద్యార్థిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో భాగంగా వాహనానికి డ్రైవర్గా వచ్చి టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాలు..మంగళవారం అర్ధరాత్రి కరకంబాడి అడవులలో కూంబింగ్ చేస్తున్న టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ విజయ్ నరసింహులు బృందానికి భూపాల్ నాయుడు కాలనీ వెనక టవేరా కారు కనిపించింది. ఆ కారు నెంబర్ ప్లేటు చూసి, ఆ నెంబర్ను వెబ్సైటల్లో చూడగా అది ఒక స్కూటర్ నెంబరని తేలింది. వెంటనే కారుని ఆపి తనిఖీలు చేశారు. కారుకు సమీపంలో నాలుగు ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. కారులో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. టాస్క్ఫోర్స్ సిబ్బందిని చూసి మరో వ్యక్తి పారిపోగా..డ్రైవర్ పట్టుబడ్డాడు. డ్రైవర్ని విచారించగా..తన పేరు మేఘనాథన్ అని..తమిళనాడులోని వేలూరు జిల్లా రెడ్డిపాళయంకు చెందిన వాడినని వెల్లడించాడు. తనకు వేలూరులో హమీద్ అనే ట్రావెల్ యజమాని కారును తిరుపతికి తీసుకుని వెళ్లి అక్కడ మంగళం వద్ద మరో డ్రైవర్కు అప్పగించి రావాలని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. తనతో పాటు సతీష్ అనే వ్యక్తి వేలూరు నుంచి వచ్చినట్లు చెప్పాడు. సంఘటనాస్థలానికి ఎస్పీ రవిశంకర్ చేరుకుని స్మగ్లర్ను విచారించి కూంబింగ్ కొనసాగించాల్సిందిగా ఆదేశించారు. ఎర్రచందనం దుంగలను, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులో నోట్ల కట్టల కలకలం
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ బస్సులో నోట్ల కట్టలు బయటపడటంతో కలకలం రేగింది. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వస్తున్న ప్రైవేట్ బస్సులో 30లక్షల అనధికార నగదు దొరికింది. ఆ డబ్బును తరిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే బస్సులో గంజాయి తరలిస్తున్న మరో ఇద్దరు కేటుగాళ్లు పట్టుబడ్డారు. దాదాపు 50కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్తే, అనధికార సొమ్మును కూడా గుర్తించామని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. -
చేపల ప్యాకింగ్పై టాస్క్ఫోర్స్ తనిఖీ
ఉంగుటూరు: మండలంలోని నారాయణపురం, ఉంగుటూరు చేపల ప్యాకింగ్ కేంద్రాలను మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ సమక్షంలో టాస్క్ఫోర్స్ బృందం గురువారం తనిఖీలు చేసింది. ప్యాకింగ్లో ఫార్మోలిన్ ద్రవ పదార్థాలు వాడటం లేదని గుర్తించింది. చేపల ఎగుమతుల్లో సరకు పాడవకుండా గట్టిగా ఉండేందుకు ఫార్మోలిన్ ద్రవ పదార్థాన్ని వాడుతున్నారని ఈశాన్య రాష్ట్రాల్లోని దిగుమతిదారుల ఆరోపణ. దీంతో పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్కు ఇటీవల మన చేపల ఎగుమతులు తగ్గటంతో రైతులు, ప్యాకింగ్దారులు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో చేపల ఎగుమతులపై అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్సును ఏర్పాటుచేసింది. నారాయణపురంలో రెండు ఐస్ ఫ్యాక్టరీలతోపాటు, ఉంగుటూరులోని ఒక ఐస్ ఫ్యాక్టరీలో గురువారం టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేసింది. చేపల ప్యాకింగ్, ఐస్ క్వాలిటీని కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్యాకింగ్ చేసిన తరువాత దానిపై ప్రభుత్వం అందజేసిన స్టిక్కర్లు (ఫార్మోలిన్ ద్రవ పదార్థాలు వాడటం లేదని) అంటించారు. నిడమర్రులో చెరువుల పరిశీలన అనంతరం మత్స్యశాఖ కమిషనర్ శంకర్ నాయక్, మత్స్యశాఖ జేడీ అంజలి నిడమర్రులో చేపల చెరువులను సందర్శించారు. చెరువు నీటిని, చేపలను పరిశీలించారు. తనిఖీలో ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి, మత్స్య శాఖ అభివృద్ధి అధికారి గోపాలకృష్ణ, చేబ్రోలు పశు వైద్యాధికారి డాక్టర్ సందీప్, మత్స్య శాఖ ఎంపీఈఓలు వాసు, రాజేష్, స్వామి, సత్యనారాయణ ఉన్నారు. సహకరించాలి అనంతరం శంకర్నాయక్ చేపల ప్యాకింగ్ అసోసియేషన్ సభ్యులు పత్సమట్ల ధర్మరాజు, వేగేశ్న రంగరాజు, తొత్తల గణపతి, గెడ్డం శ్రీనివాసరాజుతో సమావేశమయ్యారు. చేపల ప్యాకింగ్లో ఫార్మోలిన్ ద్రవం వాడుతున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టామని, చేపల ట్రేడర్లు, ప్యాకింగ్ అసోసియేషన్లు సహకరించాలని కోరారు. ఎవరూ ఫార్మోలిన్ ద్రవ పదార్థం వాడటం లేదని చెప్పారు. ఈ సందర్భంగా ట్రేడర్లు మాట్లాడుతూ.. సుమారు 40 ఏళ్ల నుంచి చేపల వ్యాపారం చేస్తున్నామని, నాణ్య మైన చేపలనే ఎగుమతి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శంకర్ నాయక్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఫార్మోలిన్ వాడడం లేదని తనిఖీ ల్లో తేలిందన్నారు. ఇప్పటికే దీనిపై ఈశాన్య రాష్ట్రాల వ్యాపారులు, ప్రభుత్వాలతో చర్చించా మని, అసోం, త్రిపుర, మేఘాలయ, పశ్చిమ బెం గాల్ మన చేపలపై నిషేధం ఎత్తివేయగా.. నాగాలాండ్ మాత్రమే కొనసాగిస్తుందని పేర్కొన్నారు. -
కడప అటవీ ప్రాంతంలో కాల్పులు
-
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
సాక్షి, తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్గా నటించిన శ్రీహరి(హరిబాబు) మంగళవారం టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పలు విషయాలను శ్రీహరి వెల్లడించాడు. తొలుత తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన నటుడు ఆపై జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి జాబ్ మానేసినట్లు తెలిపాడు. టాస్క్ఫోర్స్ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని శ్రీహరి.. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. నాలుగేళ్ల కిందట తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం ఫ్రెండ్ ద్వారా తొలిసారి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి ట్రీట్మెంట్ ఇప్పించినట్లు అంగీకరించాడు. అయితే గతంలో తొలిసారి కేసు నమోదు చేశాక.. ఇప్పుడు తనకేం సంబంధం లేకపోయినా నాలుగేళ్లకు మరో కేసు నమోదు చేశారని ఆందోళనకు గురయ్యాడు. గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడన్నాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్ చేయడం నిజమే కనుక నిజాయితీగా తాను లొంగిపోయానని.. ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు. తాను ఎప్పుడో వదిలేసిన ఈ పనికి ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని, ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్ఐతో కలిసి స్లగ్లింగ్ చేశాడని వివరించాడు. బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్ఫోర్స్కు బహిర్గతం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించారని తన ఆవేదనను కమెడియన్ వెల్లగక్కాడు. మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తిన కమెడియన్.. సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం గాలించారు. ఈ క్రమంలో తిరుపతి టాస్క్ ఫోర్స్ అధికారుల ఎదుట లొంగిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు. టాస్క్ఫోర్స్ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్ కమెడియన్ కోసం పోలీసుల వేట -
అమ్మను బతికించడం కోసమే స్మగ్లరయ్యా!
-
లొంగిపోయిన ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్..!
తిరుపతి సిటీ: ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్ షోలో కమెడియన్గా నటించిన శ్రీహరి మంగళవారం టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయాడు. తిరుపతికి చెందిన యల్లంపల్లి శ్రీహరి న్యాయవాదితో వచ్చి కపిలతీర్థం సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో లొంగిపోయాడు. ఎర్రచందనం స్మగ్లింగ్తో వచ్చిన ఆదాయంతో సినిమా తీశాడని, టీవీ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు టాస్క్ఫోర్స్ సీఐ మధుబాబు తెలిపిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో శ్రీహరి కోసం 5 రోజులుగా టాస్క్ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టగా, ఐజీ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు శ్రీహరిని కోర్టులో హాజరుపరిచారు. ఇతనిపై 10కి పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన ఆర్థిక పరిస్థితి బాగోలేక తాను ఒకే ఒక్క సారి ఎర్రచందనం స్మగ్లింగ్లో పాల్గొన్నానని శ్రీహరి మీడియాకు తెలిపారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి పట్టించానని, దాన్ని దృష్టిలో పెట్టుకుని కానిస్టేబుల్ తనపై అనేక కేసులు బనాయించి ఇరికించాడని చెప్పారు. -
గోరక్షకులకు సుప్రీం వార్నింగ్
న్యూఢిల్లీ : గోరక్షణ పేరిట చట్టాన్ని ఎవరు చేతులోకి తీసుకోవద్దని మంగళవారం సుప్రీం కోర్టు మరోసారి హెచ్చరించింది. గోరక్షణతో హింసాత్మక ఘటనలు చెలరేగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. ఇక గతేడాది నవంబర్లోనే ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఈ హింసకు చెక్ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్ఫోర్స్లను ఏర్పాటుచేయాలని అప్పట్లో ఆదేశించింది. ఓ సీనియర్ పోలీసు అధికారి నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని కూడా తేల్చిచెప్పింది. అయితే ఈ తీర్పుకు రాజస్తాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లు కట్టుబడి లేవని జాతిపిత మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వాదనలు విన్న చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇది లా అండ్ ఆర్డర్ విషయమని, ప్రతి రాష్ట్రం బాధ్యతగా తీసుకోవాలని హెచ్చరించింది. గోరక్షణ పేరుతో దాడులు చేయడం హింసను ప్రేరిపించడమేనని, ఇది క్రైమ్ అని పిటిషనర్ తరపు వాదనలు విన్న ధర్మాసనం.. ఏ ఒక్కరు కూడా చట్టాన్ని చేతులోకి తీసుకోవద్దని, ఈ విషయంలో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. -
మెట్రోతో మారుమూలల అనుసంధానం
సాక్షి, హైదరాబాద్: మెట్రో రైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. రవాణా మంత్రి పి.మహేందర్ రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ మారుమూల ప్రాంతాలకు మెట్రో రైలు అనుసంధానంపై సమీక్షించారు. మెట్రో రైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు రవాణా శాఖ, ఆర్టీసీ, సెట్విన్, మెట్రో రైలు సంస్థలు సమన్వయంతో ముందుకు పోవాలని కోరారు. శాఖల మధ్య సమన్వయం, నగరంలో ప్రజారవాణా వ్యవస్థ మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యల కోసం టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రవాణా, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు, మెట్రో రైలు ఎండీ, సెట్వీన్, జీహెచ్ఎంసీ, దక్షిణ మధ్య రైల్వే సంస్థల ప్రతినిధులను ఈ టాస్క్ఫోర్సులో సభ్యులుగా నియమించారు. నగరంలో ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఇందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ఈ కమిటీని కోరారు. రెండు నెలల్లో ప్రాథమిక నివేదికతో ముందుకు రావాలని ఆదేశించారు. నగరంలో రవాణా అవసరాలను తీర్చడంలో ఆర్టీసీ, మెట్రో రైలు సంస్థలు పరస్పర సహకారంతో పనిచేస్తే మరింత మేలు చేకూరుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరంలో ప్రయాణికుడే లక్ష్యంగా ప్రజా రవాణా సౌకర్యాలుంటాయని, ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు, మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలను అనుసంధానం చేస్తూ రవాణా సదుపాయం కల్పించేందుకు దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఎలక్ట్రిక్ బస్సులు, వ్యాన్లు, ఆటోలనే తీసుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్సు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. -
టాస్క్ఫోర్స్ అధ్యయనం చేస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని ఖమ్మం జిల్లా, ఏపీలోని వైఎస్సార్ జిల్లాల్లో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుపై టాస్క్ఫోర్స్ అధ్యయనం కొనసాగుతోందని కేంద్ర ఉక్కు శాఖ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. 2016లో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్స్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉక్కు శాఖ పరిధిలోని కేంద్ర పబ్లిక్ సెక్టార్ సంస్థ మెకాన్ ఉన్నాయని వివరించింది. ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలత, రోడ్మ్యాప్ తయారీ చేపట్టేందుకు టాస్క్ఫోర్స్ పనిచేస్తోందని పేర్కొంది. ప్లాంటు ఏర్పాటు సాధ్యత నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు మెకాన్కు అందజేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపింది. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్లు యోగ్యత కలిగి ఉండేందుకు వీలుగా తాము పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామంది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో ప్లాంట్ల ఏర్పాటుకు చట్టం చేసిన 6 నెలల్లోపు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫీజిబులిటీ నివేదిక అందజేయాల్సి ఉందని, ఆ నివేదిక ప్రకారం ఆర్థికంగా ఆయా ప్లాంట్లకు యోగ్యత లేదని కేంద్రం ఈ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాతే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. -
‘ప్లే’టీఎం ముఠా ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో : పేటీఎం యాప్నకు ప్లే వెర్షన్ అయిన ‘ప్రాంక్ పేటీఎం’ వినియోగించి మాల్స్కు టోకరా వేశాడు. ముఠా కట్టి ఐదు ప్రాంతాల్లో కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి నిరుద్యోగుల్ని నిండా ముంచాడు. ఏడాది కాలంగా దాదాపు రూ.70 లక్షల వరకు స్వాహా చేశాడు. ఈ గ్యాంగ్పై సిటీలోని తొమ్మిది ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. పోలీసులకు చిక్కకుండా ముప్పుతిప్పలు పెడుతున్న ఈ ముఠాను మధ్య మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు సభ్యులున్న ఈ గ్యాంగ్లో సూత్రధారి, అతడి రెండో భార్య సహా ఐదుగురు చిక్కారని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని డీసీపీ పి.రాధాకిషన్రావు తెలిపారు. ఈ ముఠాపై పీడీ యాక్ట్ నమోదుకు సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు. మాల్స్ టార్గెట్... మొబైల్ వ్యాలెట్ పేటీఎంలో రెండు రకాలు ఉంటాయి. కొందరు వ్యాపారులు వ్యక్తిగతంగా తమ సెల్ఫోన్లలో బిజినెస్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటారు. ఇలాంటి దుకాణాల్లో పేటీఎం వినియోగిస్తే, నగదు బదిలీ సమాచారం తక్షణం ఆ యజమానికి వస్తుంది. షాపింగ్మాల్స్తో పాటు కొన్ని బడా స్టోర్స్లో కంప్యూటర్ యాడెడ్ వెర్షన్ ఉంటుంది. ఇక్కడ నగదు చెల్లించింది? లేనిది? వినియోగదారుడి ఫోన్ ద్వారా మాత్రమే తక్షణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. జహనుమ ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకున్నాడు. విజయ్నగర్ కాలనీకి చెందిన మహ్మద్ అమన్ అహ్మద్తో కలిసి భారీ స్కెచ్ వేశాడు. ప్లేస్టోర్లో పేటీఎంకు ప్లే వెర్షన్ ‘ప్రాంక్ పేటీఎం’ అందుబాటులో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న ఈ ద్వయం నగరంలో ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో ఉన్న మాల్స్, భారీ షాపింగ్ దుకాణాలకు వెళ్లేది. అక్కడ తమకు అవసరమైన వస్తువుల్ని ఖరీదు చేసేది. బిల్లింగ్ పూర్తయిన తర్వాత కౌంటర్లో ఉన్న ఉద్యోగి నుంచి పేటీఎం ఫోన్ నెంబర్ తీసుకునేది. దీన్ని తమ ఫోన్లో ఉన్న ‘ప్రాంక్ పేటీఎం’లో ఎంటర్ చేయడం ద్వారా నగదు చెల్లించినట్లు చూపించేది. ఈ యాప్లో జనరేట్ అయ్యే ఓ డమ్మీ ట్రాన్సాక్షన్ ఐడీని సదరు ఉద్యోగికి చెప్పి, నగదు బదిలీ అయినట్లు చూపించి సరుకు పట్టుకుపోయేది. ఆయా మాల్స్కు చెందిన వారు ఆడిటింగ్ చేసే వరకు మోసపోయిన విషయం గుర్తించలేకపోయేవి. ఒకసారి వెళ్లిన మాల్కు మరోసారి వెళ్లకుండా మోసాలకు పాల్పడిన వీరిద్దరి పైనా ఇప్పటి వరకు నారాయణగూడ, అబిడ్స్, జూబ్లీహిల్స్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. నిరుద్యోగులనూ మోసం... మహ్మద్ అలీ ‘ప్లేటీఎం’ మాత్రమే కాకుండా జాబ్ ఫ్రాడ్స్కు పాల్పడ్డాడు. తన రెండో భార్య రేష్మతో పాటు మరో ఐదుగురితో కలిసి ముఠా కట్టాడు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ప్రతి ఆఫీస్ గరిష్టంగా రెండు నెలల మాత్రమే పని చేసేది. ఈ ముఠా సభ్యులైన సయ్యద్ సాధిక్, నరేష్ కుమార్, సయ్యద్ అఫ్రోజ్ అలీలు ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలైన విప్రో, అమెజాన్, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి కార్యాలయాల వద్దకు వెళ్లేవారు. అక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు వెళ్లి వస్తున్న వారిని గుర్తించేవారు. అదును చూసుకుని వీరితో మాటలు కలిపే గ్యాంగ్ మెంబర్స్ తమకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని దొడ్డిదారిన ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారు. ఆకర్షితులైన వారికి తమ కన్సల్టెన్సీ చిరునామా చెప్పి అక్కడకు రమ్మని సూచించేవారు. అలా వచ్చిన వారికి రేష్మ ఇంటర్వ్యూలు నిర్వహించేది. ఎంపికయ్యారని చెప్తూ అందినకాడికి వారి నుంచి దండుకునేవారు. వీరికి ఆయా సంస్థ పేర్లతోనే ఈ–మెయిల్స్ రూపంలో ఆఫర్ లెటర్స్, బోగస్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపడం బీటెక్ మధ్యలోనే ఆపేసిన మహ్మద్ ఫిర్దోష్ బాధ్యత. ఆయా అభ్యర్థులు నగదు చెల్లించి, ఈ లేఖలు తీసుకున్న తర్వాత సదరు సంస్థకు వెళ్లిన తర్వాతే మోసపోయామని గుర్తించేవారు. ఈలోపు ముఠా తమ కేరాఫ్ అడ్రస్ను మార్చేసి తప్పించుకునేది. ఇలా దాదాపు 50 మంది నుంచి రూ.50 లక్షల వరకు దండుకున్న వీరిపై సుల్తాన్బజార్, మలక్పేట, హబీబ్నగర్, మాదాపూర్, కేపీహెచ్బీ ఠాణాల్లో ఆరు కేసులు నమోదయ్యాయి. పట్టుకున్న టాస్క్ఫోర్స్... ఈ ముఠా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు బి.కాంతరెడ్డి, జి.తిమ్మప్ప తమ బృందాలతో రంగంలోకి దిగారు. అనేక ప్రాంతాల్లో గాలించిన నేపథ్యంలో బుధవారం మహ్మద్ అలీ, ఫిర్దోష్, సాధిఖ్, రేష్మ, నరేష్లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.59 వేల నగదు, బోగస్ ఆఫర్ లెటర్లు, సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం, బంగారు ఆభరణాలు తదితర స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదివిన మహ్మద్ అలీ ఈ ముఠాకు నేతృత్వం వహిస్తూ వ్యూహరచన చేసేవాడని అధికారులు చెప్తున్నారు. ఇతడి రెండో భార్య రేష్మ నెలకు దాదాపు రూ.60 వేల వరకు ఖర్చు చేసేదని గుర్తించామన్నారు. 2013లో జాబ్ ఫ్రాడ్స్ పాల్పడిన నేపథ్యంలోనే అలీని నాంపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఇతగాడు కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్–బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీన్ని సైతం ఎగ్జిక్యూట్ చేయడానికి నిర్ణయించారు. రేష్మపై నారాయణగూడ, కేపీహెచ్బీ ఠాణాల్లో కేసులు నమోదై ఉన్నాయని డీసీపీ తెలిపారు. ప్రాంక్ పేటీఎం యాప్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాపారులకు సూచించారు. -
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల సీజ్
కొల్లూరు : గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అక్రమ తరలింపు వ్యవహారం బట్టబయలైంది. గుంటూరు టాస్క్ఫోర్స్ పోలీసులు అందించిన పక్కా సమాచారంతో కొల్లూరు ఎస్ఐ బి. అశోక్కుమార్ కొల్లూరు మీదుగా వెళుతున్న కారును పోలీసు స్టేషన్ వద్ద ఆపి తనిఖీ చేశారు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతం నుంచి గుంటూరు వెళుతున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 23 బస్తాల గుట్కా, ఖైనీ ప్యాకెట్లను గుర్తించారు. వాటిని తరలిస్తున్న రేపల్లెకు చెందిన తుమ్మలపెంట ప్రదీప్, కొలుసు గోపీకృష్ణను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ. 4 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. తెనాలి డీఎస్సీ స్నేహిత హుటాహుటిన కొల్లూరు స్టేషన్కు చేరుకుని గుట్కా ప్యాకెట్లను పరిశీలించారు. నిందితుల నుంచి సమాచారం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒరిస్సా నుంచి వచ్చినట్లు అనుమానాలు గుట్కా ప్యాకెట్లు ఒరిస్సా నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ నుంచి గుంటూరుకు రొయ్యలు సరఫరా చేసే కంటైనర్లో రవాణా అయినట్లు భావిస్తున్నారు. నిందితులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. పెద్ద తలకాయల పేర్లు బయట పడకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న అక్రమ వ్యాపారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించాలనే పట్టుదలతో ఉన్నారు. -
గంజాయి అమ్ముతున్న ఒకరి పట్టివేత
కరీంనగర్క్రైం: కొత్తపల్లి మండలం రేకుర్తిలో విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ఒకరిని ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చూపారు. నగరంలోని అశోక్నగర్కు చెందిన సయ్యద్ చాంద్ పాషా విద్యార్థులకు గం జాయి విక్రయిస్తున్నాడు. బయటినుంచి తీసుకొచ్చి ప్యాకెట్లుగా చేసి రూ.200 చొప్పున అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అతడిపై నిఘా ఉంచారు. అదివారం రేకుర్తి సమీపంలో అమ్మకాలు చేస్తుండగా సీఐ కిరణ్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. అతడి వద్ద 250 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి ఎస్సై నాగరాజు కేసు నమోదు చశారు. -
సెల్ పాయింట్లపై టాస్క్ఫోర్స్ దాడులు
సాక్షి, కరీంనగర్ : రామడుగు మండలం, గోపాలరాపు పేటలో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ విస్తృత తనిఖీలు చేశారు. ఈసందర్భంగా నాలుగు సెల్ పాయింట్స్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నీలిచిత్రాల సీడీలతో పాటు, ఇటీవలే విడుదలైన కొత్త చిత్రాల పైరసీ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్రమ గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్లపై తనిఖీలు చేశారు. 14 సిలిండర్లు, ఫిల్లింగ్ మిషన్తో పాటు, వెయింగ్ మెషీన్ను పట్టుకున్నారు. మరో దుకాణంపై జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 50 లీటర్ల పీడీఎస్ కిరోసిన్, 2క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీన పరచుకున్నారు. ఈసందర్భంగా టాస్క్పోర్స్ అధికారులు మాట్లాడుతూ భవిష్యత్తులో దాడులనున విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. -
టాస్క్ఫోర్స్ మెరుపు దాడులు
నవీపేట(బోధన్): ఇసుక అక్రమ రవాణాపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేసి, రెండు టిప్పర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం వేకువజామున నాళేశ్వర్ నుంచి నిజామాబాద్కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండలంలోని జన్నెపల్లి, నాళేశ్వర్, శాఖాపూర్, చిక్లి వాగుల నుంచి కొందరు ఇసుకాసురులు రాత్రి వేళల్లో నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని రెవెన్యూ, పోలీసులకు వివిధ గ్రామాల రైతులు, యువకులు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశారు. అయితే, వారు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని కొందరు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పగడ్బందీగా దాడులు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఇసుక రవాణాలో ముదుర్లుగా పేరున్న గాంధీనగర్, చిక్లి క్యాంప్లకు చెందిన ఇరువురు ఎప్పటిలాగే నాళేశ్వర్ వాగు నుంచి నిజామాబాద్ వైపు రెండు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పథకం ప్రకారం నిఘా వేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ వాహనాలను వెంబడించి పాల్దా సమీపంలో పట్టుకున్నారు. ఈ రెండు వాహనాలకు రక్షణగా ఉన్న కారును కూడా సీజ్ చేశారు. టిప్పర్లతో పాటు కారును స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
ఈ కోటు గుండీ ధర రూ.కోటి ఇరవై లక్షలట!
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ వద్ద సండే మార్కెట్లో ఖరీదు చేసిన రాయి అది.. సాధారణంగా కోటు గుండీల్లో పొదగడానికి వినియోగిస్తుంటారు.. దీన్ని ఓ చోర ద్వయం రూ.4.5 కోట్ల విలువైన వజ్రంగా నమ్మించింది.. మార్కెట్లో ఖరీదు చేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారంటూ పరిచయస్తుడికే ఎర వేసి.. ఆ గుండీని రూ.1.2 కోట్లకు అమ్మేసింది.. విషయం టాస్క్ఫోర్స్ వద్దకు చేరడంతో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి, రూ.1.15 కోట్ల నగదు, నకిలీ వజ్రం స్వాధీనం చేసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. టాస్క్ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్రావుతో కలసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఆసిఫ్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అథర్ సిద్ధిఖీ, ఆర్సీపురం వాసి మహ్మద్ సల్మాన్ఖాన్ ముత్యాలు, రత్నాల వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారంలో నష్టాలు రావడం.. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వీటి నుంచి గట్టెక్కడానికి భారీ స్కెచ్ వేశారు. రత్నాల వ్యాపారంలో ఉన్న నేపథ్యంలో వజ్రం పేరుతో ఎవరినైనా మోసం చేద్దామని భావించారు. సల్మాన్ గతంలో నాంపల్లిలోని మహ్మద్ ఖాన్ జ్యువెలర్స్లో సేల్స్ మెన్గా పని చేశాడు. ఆ సమయంలో అతడితో కలసి పనిచేసిన సనత్నగర్ వాసి షేక్ హాజీ అలియాస్ ఇలియాస్ ప్రస్తుతం సొంతంగా వ్యాపారం చేస్తున్నాడు. వజ్రం విక్రయం పేరుతో అతడిని మోసం చేద్దామని నిర్ణయించుకున్నారు. రూ.3,500కు స్టోన్ ఖరీదు చేసి.. ఈ నెల 14న ఖాన్, అథర్ చార్మినార్ వద్ద సండే మార్కెట్కు వెళ్లారు. అక్కడ అమ్ముతున్న కోటు బటన్కు ఏర్పాటు చేసే భారీ స్టోన్ వీరిని ఆకర్షించింది. దాన్ని రూ.3,500కు ఖరీదు చేసి.. ఓ బాక్సులో పెట్టి 25 క్యారెట్ల వజ్ర మంటూ ప్రచారం చేశారు. హాజీని సంప్రదించిన ఖాన్ తనకు తెలిసిన వ్యక్తి వద్ద రూ.4.5 కోట్ల విలువ చేసే మేలైన వజ్రం ఉందని, మార్కె ట్లో ఖరీదు చేసే వాళ్లు అనేక మంది ఉన్నారని చెప్పి నమ్మించాడు. సదరు వ్యక్తికి అత్యవస రంగా డబ్బు అవసరమై రూ.1.2 కోట్లకే అమ్ముతున్నాడంటూ చెప్పాడు. ఇప్పుడు దాన్ని ఖరీదు చేస్తే.. వారంలోనే రూ.4.5 కోట్లకు అమ్ముకుని లాభం పొందవచ్చంటూ చెప్పాడు. దీంతో అప్పులు చేసిన హాజీ తన దగ్గర ఉన్న డబ్బు కలిపి రూ.1.2 కోట్లు సిద్ధం చేశాడు. లాడ్జికి రప్పించి మోసం.. ఈ నెల 18న హాజీని నాంపల్లిలోని ఓ లాడ్జికి రప్పించిన ఖాన్.. ‘వజ్రం’తోపాటు అథర్నూ అక్కడకు తీసుకువచ్చాడు. హాజీ ఎదురుగా వివిధ ‘పరీక్షలు’ చేసినట్లు నటించిన అథర్ అది అత్యంత విలువైన వజ్రమంటూ షో చేశాడు. దీంతో పూర్తిగా నమ్మిన హాజీ ఆ మొత్తం వారికి ఇచ్చి స్టోన్ తీసుకెళ్లాడు. వారం రోజులు వేచి చూసినా ‘వజ్రాన్ని’ ఖరీదు చేసే పార్టీలను తీసుకురాక పోవడం, తనకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో హాజీ స్వయంగా రంగంలోకి దిగాడు. మార్కెట్లో సదరు స్టోన్ను విక్రయిం చడానికి ప్రయత్నం చేశాడు. సదరు ‘వజ్రాన్ని’ పరిశీలించిన వ్యాపారులు అది కోటుకు వినియోగించే గుండీ స్టోన్గా తేల్చారు. దీంతో మోసపోయానని గుర్తించిన హాజీ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం ఖాన్, అథర్లను పట్టుకుని రూ.1.15 కోట్లు స్వాధీనం చేసుకుంది. కేసును అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
బ్రెడ్ ప్యాకెట్ల మధ్యలో కరెన్సీ కట్టలు
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్: విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు నగర పోలీసులు చెక్ పెట్టారు. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పాతబస్తీ వాసుల్ని అరెస్టు చేసి, వీరి నుంచి రూ.3.96 కోట్ల విలువైన ఏడు దేశాల కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్పుర ప్రాంతానికి చెందిన స్ప్రే పెయింటర్ రవూఫ్ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని దుబాయ్కి తరలిస్తున్నట్లు దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అం దింది. దీంతో నిఘా ఉంచిన అధికారులు రవూఫ్ బుధవారం అరబ్ ఎమిరేట్స్ విమానం ఎక్కుతు న్నట్లు గుర్తించారు. అప్పటికే అతడు తన లగేజ్ను చెక్ ఇన్లో వేసి ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ కౌంటర్లు దాటి నట్లు నిర్థారించుకున్నారు. విమానాశ్రయం లోపలకు వెళ్లి చర్యలు తీసుకునే అధికారం టాస్క్ఫోర్స్కు లేకపోవడంతో కస్టమ్స్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది రవూఫ్ను అదుపులోకి తీసుకోవడంతోపాటు లగేజ్ బెల్ట్పై ఉన్న బ్యాగ్ను వెనక్కు రప్పించారు. దాన్ని తెరిచి చూడగా అందులోని ఆరు కట్టల్లో ఏడు దేశాలకు చెందిన కరెన్సీ లభించింది. ఈ బండిళ్లను రవూఫ్ బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్ల మధ్యలో ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వాటిలో అమెరికన్ డాలర్లు, యూరోలతో పాటు సౌదీ, కువైట్, బెహరేన్, ఒమన్ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. తనకు ఈ డబ్బును మొఘల్పురకే చెందిన మెహరేన్ అందించాడని, దుబాయ్లో ఉండే అబ్దుల్లాకు చేరిస్తే రూ.15 వేల కమీషన్, విమాన టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడని రవూఫ్ అంగీకరించాడు. మెహరేన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి తనను దించి వెళ్లినట్లు ఇతడు చెప్పాడు.దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మెహరేన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. రవూఫ్తోనే ఫోన్ చేయించి అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. విమానాశ్రయం నుంచి పహాడీషరీఫ్ వెళ్లే మార్గంలో ఓ హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అతడు ఉన్నట్లు గుర్తించారు. అయితే అతడు రవూఫ్నే క్యాబ్లో రమ్మని చెప్పి.. ఆ వాహనం నంబర్ తెలుసుకుని ఫాలో అవడం ప్రారంభించాడు. దీంతో సిటీ శివార్ల వరకు రహస్యంగా వెంబడించిన టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా మెహరేన్ను అదుపులోకి తీసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ నగదు మెహరేన్ సొంతం కాదని, కొందరు వ్యాపారుల వద్ద తీసుకుని 3 శాతం కమీషన్కు ఆశపడి దుబాయ్కు పంపుతున్నట్లు బయటపడింది. సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సైతం ఈ రాకెట్ మూలాలు కనుక్కోవడంపై దృష్టి పెట్టారు. ఇంత భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ ఏఏ మార్గాల్లో సిటీకి వచ్చిందనే అంశాలనూ ఆరా తీస్తున్నారు. -
పన్ను వ్యవస్థలో సమూల మార్పులకు టాస్క్ఫోర్స్
సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో మారుతున్న ఆర్థిక అవసరాలకు అనుగుణంగా 50 ఏళ్ల కిందటి ఆదాయ పన్ను చట్టాన్ని మార్చేందుకు ప్రభుత్వం బుధవారం టాస్క్ఫోర్స్ను నియమించింది.ఆరుగురు సభ్యులుండే ఈ టాస్క్ఫోర్స్లో సీబీడీటీ సభ్యులు అరవింద్ మోదీ కన్వీనర్గా ఉంటారు. చార్టెడ్ అకౌంటెంట్ గిరీష్ అహుజా, యర్నెస్ట్ అండ్ యంగ్ ఛైర్మన్, రీజినల్ మేనేజర్ రాజీవ్ మెమాని, ఐసీఆర్ఐఈఆర్ కన్సల్టెంట్ మన్సి కేడియా సభ్యులుగా ఉంటారు. ఐదు దశాబ్థాలకు పైబడిన ఆదాయ పను చట్టాన్ని రీడ్రాఫ్ట్ చేయాల్సిన అవసరం ఉందని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన ట్యాక్స్ అధికారుల వార్షిక సదస్సులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆదాయ పన్ను చట్టం, 1961ని సమీక్షించి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పుచేర్పులు చేసేందుకు ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను నియమించిందని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. టాస్క్ఫోర్స్ ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి తన నివేదిక సమర్పిస్తుంది. టాస్క్ఫోర్స్లో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. -
ఎర్ర స్మగ్లర్లును వంద స్పీడ్లో టాస్క్ ఫోర్స్ ఛేజ్
-
వంద స్పీడ్లో టాస్క్ ఫోర్స్ ఛేజ్
సాక్షి, చిత్తూరు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీ, స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు 45 నిమిశాల పాటు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో ఇద్దరి నిందితులను అరెస్టు చేయగా 82దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని జవ్వాది మలైకు చెందిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 80 మందితో శేషాచలం లోని కాకులమాను వద్ద చెట్లని నరికి దాదాపు 30 కిలోమీటర్లు దుంగలను మోసుకుని ఏర్పేడు శ్రీ కళాశాల ప్రాంతం వద్ద ఈచర్ వాహనం లోకీ లోడ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడ కు చేరుకునే సమయానికి ఈచర్ వాహనం బయలు దేరింది. స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసులు మూడు వాహనాల్లో వెంబడించారు. ఒక దశలో టాస్క్ ఫోర్స్ వాహనాన్ని గుద్దే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా తిరుపతి చిత్తూరు హైవే లోని మల్లంగుంట చెక్ పోస్ట్ వద్ద బ్యారికేట్స్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ విధిలేని పరిస్థితులలో వేగాన్ని తగ్గించగా టాస్క్ ఫోర్స్ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపగలిగారు. వెంటనే డ్రైవర్ శంకర్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని తో పాటు కీలక వ్యక్తిగా బావిస్తున్న శివాజీ అనే వ్యక్తిని కూడా అరేస్ట్ చేశారు. లారీలోని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
నగర రోడ్ల కోసం టాస్క్ఫోర్స్
సాక్షి, హైదరాబాద్: నగర రహదారుల కోసం హైదరాబాద్ రోడ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ప్రస్తుతం నగర రోడ్లను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు సూచించడంతో పాటు, రోడ్ల మరమ్మతులు, నూతన ప్రాజెక్టులను ఈ టాస్క్ఫొర్స్ సమన్వయం చేస్తుందన్నారు. నగర రోడ్ల పరిస్థితిపై మంత్రి కేటీఆర్ జలమండలిలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ సిబ్బంది కొరత తీర్చడంతోపాటు, నిధులకు సంబంధించి ప్రభుత్వం తరపున ఆర్థిక సహకారం, బ్యాంకుల నుంచి రుణాల సేకరణ వంటి అన్ని ఏర్పాట్లు నగర రోడ్ల కోసం చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో సుమారు రూ.20 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రహదారుల కోసం ఖర్చు చేయనున్న నేపథ్యంలో ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్ఫోర్స్లో పురపాలక శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మెట్రో రైల్, టీఎస్ఐఐసీ ఎండీలు, నగర చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ), జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సీఈలు సభ్యులుగా ఉంటారన్నారు. నగరంలో భారీ వర్షాలకు పాడయిన రోడ్లను యుద్ధ ప్రాతిపాదికన మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం రూ.77 కోట్లతో మరమ్మతులు ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ వర్షాకాలంలో నీళ్లు నిలిచి, ట్రాఫిక్ జామ్కు కారణమైన సుమారు 350 రోడ్ పాయింట్లను అధికారులు గుర్తించారని, ఈ ప్రాంతాల్లో వైట్ టాపింగ్ రోడ్లు వేసేందుకు రూ.130 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలన్నారు. డివిజన్కు ఒక ఇంజనీర్.. దీంతో పాటు నగరంలోని రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చేపట్టిన పలు ప్రాజెక్టులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపట్టనున్న పనుల తాలూకు డీపీఆర్లు సిద్ధమయ్యాయని, వాటికి వెంటనే టెండర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్సార్డీపీ ద్వారా వచ్చే ఏడాదిలోగా సుమారు రూ.వెయ్యి కోట్ల పనులు పూర్తవుతాయని, వీటితో ప్రస్తుతం రద్దీగా ఉన్న పదుల సంఖ్యలోని కూడళ్లలో ట్రాఫిక్ ఇబ్బందులు దూరమవుతాయని చెప్పారు. రోడ్ల నిర్వహణకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి వినూత్న విధానాలు పాటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా సుమారు 50 మంది ఇంజనీర్లు రోడ్ల నిర్వహణను పర్యవేక్షించేవారని, ఇకపై డివిజన్కు ఒకరు చొప్పున 150 మంది ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తారన్నారు. వచ్చే నెల మొదటి వారంలోగా 150 మంది ప్రత్యేకంగా రోడ్లపైనే పనిచేస్తారని మంత్రి చెప్పారు. -
మోసపోయి అదే బాట!
♦ ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరా ♦ ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో : దొడ్డి దారిన ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి ఓ వ్యక్తిని నమ్మి మోసపోయిన యువకుడు కూడా అదే బాట పట్టాడు. తన స్నేహితుడితో కలిసి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో టోకరాలు వేయడం ప్రారంభించాడు. విషయం మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులకు చేరడంతో ఇద్దరూ అరెస్టయ్యారు. వీరిలో ఓ నిందితుడు ఇటీవల మరో మోసం కేసులో టాస్క్ఫోర్స్కే చిక్కి జైలుకు వెళ్ళివచ్చాడని అదనపు డీసీపీ సి.శశిధర్ రాజు సోమవారం వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని లాల్ సింగ్ తండకు చెందిన భూక్యా రాము ఎంబీఏ పూర్తి చేశాడు. 2011లో ఉద్యోగం కోసం సిటీకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో దొడ్డి దారిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తిని నమ్మాడు. రూ.2.7 లక్షలు చెల్లించి మోసపోయాడు. నష్టపోయిన డబ్బు తిరిగి రాబట్టుకోవడంతో పాటు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి రాము కూడా అదేబాట పట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోటోలిచౌకి ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు సీహెచ్ సత్యనారాయణ ముదిరాజ్ను సంప్రదించాడు. ఇతగాడు కాపీ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే బోగస్ సంస్థలో సీనియర్ ఇన్వెస్టిగేటర్గా పని చేస్తున్న ఓ నకిలీ ఐడీ కార్డు కలిగి ఉన్నాడు. ఈ ఇద్దరూ తొలుత సత్యనారాయణ సోదరుడైన సీహెచ్ మల్లేష్కు ఇరిగేషన్ విభాగంలో ఉద్యోగం వచ్చినట్లు పత్రాలు, గుర్తింపుకార్డు తయారు చేశారు. వీటిని చూపించి ఉద్యోగార్థుల్ని దొడ్డిదారిలో ఉద్యోగాల పేరుతో మోసం చేయడానికి రంగంలోకి దిగారు. సంపత్కుమార్, వికేష్ అనే యువకుల్ని రాముకు పరిచయం చేసిన సత్యనారాయణ అతడు సెక్రటేరియేట్లో ఉద్యోగం చేస్తున్నట్లు నమ్మించాడు. తనకు ఉన్న పరిచయాలను వినియోగించి ఇరిగేషన్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తాడని నమ్మబలికారు. వారి నుంచి రూ.2.5 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్మెంట్ పత్రాలు, గుర్తింపుకార్డు అంటగట్టారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.వినోద్కుమార్, జి.తిమ్మప్ప వలపన్ని సోమవారం రాము, సత్యనారాయణలను పట్టుకున్నారు. వీరి నుంచి నకిలీ ఆఫరింగ్ లెటర్లు, బోగస్ గుర్తింపుకార్డులు, నకిలీ లెటర్ హెడ్స్, కంప్యూటర్, రెండు సెల్ఫోన్లతో పాటు రూ.75 వేల విలువైన బంగారు ఆభరణాలు స్వా«ధీనం చేసుకున్నారు. అప్పట్లో కటకటాల్లోకి వెళ్ళిన వారిలో సత్యనారాయణ ముదిరాజ్ సైతం ఉన్నాడు. ఆ కేసులో బెయిల్పై వచ్చిన కొన్ని రోజులకే మరో చీటింగ్ కేసులో టాస్క్ఫోర్స్కు చిక్కాడు. -
గోరక్షకులపై సుప్రీంకోర్టు ఉక్కుపాదం!
న్యూఢిల్లీ: గో రక్షకుల ఆగడాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు చెక్ పెట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ టాస్క్ఫోర్స్లను ఏర్పాటుచేయాలని బుధవారం ఆదేశించింది. సీనియర్ పోలీసు అధికారి నోడల్ ఆఫీసర్గా నియమిస్తూ వారంలోగా టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేయాలని తేల్చిచెప్పింది. గో రక్షణ పేరిట దళితులు, మైనారిటీలపై అరాచకాలు, హింసాత్మక దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తెహసీన్ ఎస్ పూనావాలా గత ఏడాది అక్టోబర్ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై ప్రతిస్పందన తెలియజేయాలని ఆరు రాష్ట్రాలను ఆదేశించింది. గత జూలై 21న వాదనల సందర్భంగా దాడులకు దిగుతున్న గో రక్షకులను కాపాడాలని చూడొద్దని, గో రక్షణ పేరిట జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలేమిటో తెలుపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజా విచారణ సందర్భంగా గో రక్షణ దాడులకు వ్యతిరేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రాలకు ఏడురోజుల గడువు ఇచ్చింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకున్నా ఉపేక్షించవద్దని, గోరక్షణ దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. -
బిర్యానీ హౌస్పై దాడులు
కరీంనగర్: నగరంలో ఓ ఐస్క్రీం కంపెనీ, ఓ బిర్యానీ హౌస్పై టాస్క్ఫోర్సు పోలీసులు, శానిటరీ విభాగం అధికారులు దాడులు చేశారు. రాంనగర్లో గల దారపునేని కృష్ణకు చెందిన ఐస్క్రీమ్ కంపెనీపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ, నాసిరకపు ఐస్క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేయగా ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. బిర్యానీ హౌస్లో... కరీంనగర్ కోర్టు చౌరస్తాలో గల దూలం శివశంకర్కు చెందిన ఈ బిర్యానీ హౌస్లో కుళ్ళిన, దుర్వాసన వస్తున్న మాంసంతో బిర్యానీ, ఇతర పదార్ధాలు తయారు చేసి వడ్డిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ సంయుక్తంగా దాడులు చేశారు. పది రోజులనాటి మాంసం, కుళ్ళిన, పాచిన కూరలకు దుర్గంధం రాకుండా సుగంధ ద్రవ్యాలు ఉపయోగించి వేడి చేసి వండి వడ్డిస్తున్నారు. అలాగే మిగిలిపోయిన బిర్యానీ నుంచి మాంసం ముక్కలు తీసి మళ్ళీ ఉపయోగిస్తూ వేడి బిర్యానీతో వడ్డిస్తున్నారు. వంట గది కూడా అపరిశుభ్రంగా ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అక్కడినుంచి నివేదిక రాగానే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్సు సీఐ గౌస్ బాబా, ఎస్సైలు కిరణ్, సంతోష్, నాగరాజు, ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృత శ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. -
టాస్క్ఫోర్స్కు చిక్కిన మరో డ్రగ్స్ ముఠా
♦ 180 గ్రాముల కొకైన్ స్వాధీనం ♦ మార్కెట్ విలువ రూ.10 లక్షల పైనే..: డీసీపీ సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ దందాకు కళ్లెం పడట్లేదు. హైదరాబాద్ నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మరో డ్రగ్స్ ముఠాను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో నగర వాసులతో పాటు నైజీరియన్ సైతం ఉన్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి ఆదివారం వెల్లడించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 180 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకు న్నట్లు తన కార్యాలయంలో మీడియాకు తెలిపారు. నైజీరియాలోని లాగోస్ ప్రాంతానికి చెందిన జాన్ బాస్కో గత ఏడాది జూన్లో బిజినెస్ వీసాపై భారత్కు వచ్చాడు. ముంబైలోని వసీ ప్రాంతంలో స్థిరపడిన ఇతను మాదక ద్రవ్యాల విక్రేతగా మారాడు. హైదరాబాద్తో పాటు మెట్రో నగరాల్లోని ఏజెంట్లకు హోల్సేల్గా సరఫరా చేస్తు న్నాడు. ఏపీలోని కాకినాడకు చెందిన మహ్మద్ జహరుల్లా మధురానగర్లో నివసిస్తున్నాడు. కొకైన్కు బానిసైన ఇతను మరికొందరికి విక్రయించేవాడు. గతేడాది హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్లో వీరికి పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి జాన్ బాస్కో నుంచి కొకైన్ను కొని జహరుల్లా దాన్ని తన వినియోగదారులకు విక్రయిస్తున్నా డు. ఇటీవల జాన్ను సంప్రదించిన జహరుల్లా తనకు కొకైన్ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. దీంతో జాన్ ఆదివారం నగరానికి చేరుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మధురానగర్లో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కొకైన్తో పాటు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. -
ప్రమాదాల నివారణకు టాస్క్‘ఫోర్స్’
– 14 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం – ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనేలా శిక్షణ – జిల్లా అగ్నిమాపకశాఖలో నూతన ఒరవడి ప్రమాదం ఎప్పుడు ఎలాగొస్తుందో తెలియదు. సామాన్యులు ప్రమాదాల్లో చిక్కుకున్నపుడు వెంటనే సాయం కోరేది పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులనే. విపత్తులను దీటుగా ఎదుర్కొనేందుకు సుక్షితులైన సిబ్బందిని తయారుచేయడంపై జిల్లా అగ్నిమాపకశాఖ అధికారులు దృష్టి సారించారు. అనంతపురం సెంట్రల్: ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో పోలీసుశాఖతో పాటు అగ్నిమాపకశాఖ అధికారులు కూడా కీలకం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, మంటలు ఎగిసిపడినప్పుడు, వరదల సంభవించినప్పుడు అగ్నిమాపక శాఖ అధికారుల సేవలు ఎంతో కీలకం. భారీ భవంతుల్లో అగ్నికీలలు సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా బయటకు చేరవేయడం చాలా కష్టం. రోప్ల సాయంతో భవంతులపైకి ఎక్కాల్సి వస్తుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేయాల్సి ఉంటుంది. వరదల సమయంలో ముంపులో చిక్కుపోయిన ప్రజలను బయటపడేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ విభాగం : విపత్తులను ఎదుర్కొనేందుకు అగ్నిమాపకశాఖలో ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ విభాగాన్ని నెలకొల్పారు. 14 మంది సిబ్బందితో రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరికి వివిధ అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. రెండు రోజులుగా జీడిపల్లి జలాశయంలో స్విమ్మింగ్ (ఈత), బోటింగ్పై శిక్షణ ఇస్తున్నారు. ఈ విభాగాల్లో కానిస్టేబుల్ మనోహర్ మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో పాటు భవంతుల్లో ప్రమాదాలు జరిగినప్పుడు రోప్ క్లెయిమింగ్, అగ్నిప్రమాదాలు సమయాల్లో తీసుకోవాల్సిన మెలకువలు తదితర అంశాలపై వీరికి తర్ఫీదు ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది టాస్క్ఫోర్స్ సిబ్బందికి ఒడిశాలో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో జిల్లా నుంచి ముగ్గరు అధికారులు పాల్గొన్నారు. సముద్రంలో సహాయక చర్యల్లో పాల్గొనేలా వీరికి తర్ఫీదు ఇచ్చారు. ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటాం ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొనేలా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా 14 మంది టాస్క్ఫోర్సు సిబ్బందిని ఏర్పాటు చేశాం. జిల్లా నుంచి ముగ్గురు సభ్యులు ఇటీవల ఒడిశాలో కూడా శిక్షణ తీసుకున్నారు. జిల్లాలో కూడా జీడిపల్లి జలాశయానికి తీసుకెల్లి బోటింగ్, స్విమ్మింగ్ శిక్షణ ఇస్తున్నాం. సుశిక్షితులైన వారు ఉండడం వలన ప్రమాదాల సమయంలో నష్టం లేకుండా ప్రజలను, ఆస్తులను కాపాడేందుకు ఆస్కారం ఉంటుంది. - సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి -
అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
అన్యాక్రాంతమైన భూములపై సర్కారు తర్జనభర్జన - రాష్ట్రంలో 98 వేల ఎకరాలు పరాధీనం - పరిశీలనలో గుర్తించిన టాస్క్ఫోర్స్ కమిటీ - క్రమబద్ధీకరించాలన్న దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వాటిని చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలా లేక చట్టాలను సవరించి పొజిషన్లో ఉన్నవారికే క్రమబద్ధీకరించాలా అని తర్జనభర్జన పడుతోంది. 98 వేల ఎకరాలు పరాధీనం రాష్ట్రంలో ఇప్పటివరకు అసైన్ చేసిన భూముల్లో సుమారు 98 వేల ఎకరాల మేర పరాధీనమైనట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను పేదలకు అసైన్ చేశారు. కానీ అందులో 14.28 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఈ 14 లక్షల పైచిలుకు ఎకరాల్లో 98 వేల ఎకరాలకుపైగా అన్యాక్రాంతమయ్యాయని.. ఒకరికి అసైన్ చేస్తే ఇతరులెవరో అనుభవిస్తున్నారని వెల్లడైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ.. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. పలు ఇబ్బందులు కూడా..! పీవోటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైతే దానిని ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా పక్కా సాక్ష్యాలు లేకుండా ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే అసైన్ భూమిలో ఎవరున్నా.. ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టరై ఉంది, ఆ వ్యక్తి అనుభవంలో ఉన్నాడా? అనే దానిపై రెవెన్యూ యంత్రాం గం సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 77 వేల ఎకరాల్లో పీవోటీ ఉల్లంఘనలు కనిపిస్తుంటే ఇప్పటివరకు 4,135 కేసులు నమోదు చేసి.. 3,705 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగారు. క్రమబద్ధీకరిస్తే భారీగా ఆదాయం ఈ అంశంలో ప్రభుత్వం వద్దకు మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాగూ ప్రభుత్వ భూములక్రమబద్ధీకరణ ఎప్పటి నుంచో కొనసాగుతున్నందునా ... అసైన్డ్ భూములనూ క్రమబద్ధీకరించాలని, తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని సూచనలు అందాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక క్రమబద్ధీకరిస్తే.. మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుసుము కింద తీసుకోవాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రుసుములో మార్పులు చేయాలని... ఎన్నేళ్లుగా ఆ భూమి అనుభవిస్తున్నారు, ఆ భూమిలో ఏం చేస్తున్నారన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. భారీ జరిమానాతో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా తేలలేదు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలకుపైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు టాస్క్ఫోర్స్ నివేది కలో తేలింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 87,064 వేల ఎకరాల మేర అసైన్ చేయగా.. 9,885 ఎకరాల్లో మాత్రమే అసలైన పట్టాదారులు ఉన్నారు. మిగతా 77,179 ఎకరాల్లో పీవోటీ చట్టం ఉల్లంఘనలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేలకుపైగా ఎకరాల్లో ఇతరులు పాగా వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సరూర్నగర్, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్నగర్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి డిమాండ్ ఉన్న చోట్ల పెద్ద ఎత్తున ఈ భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. అన్యాక్రాంతమైన భూములు 98 వేల ఎకరాలు పీవోటీ చట్టం ఉల్లంఘన 77 వేల ఎకరాలు పీవోటీ ఉల్లంఘనులపై నమోదైన కేసులు 4,135 స్వాధీనం చేసుకున్నవి 3,705 ఎకరాలు -
గంజాయి విక్రేతలుగా రైతులు
- సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి అరెస్టు - 8 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: అప్పుల్లో కూరుకుపోయిన ముగ్గురు రైతులు గంజాయి విక్రేతల అవతారం ఎత్తారు! ఓ ఆటో డ్రైవర్ అందించిన గంజాయిని కమీషన్ కోసం అమ్మేందుకు హైదరాబాద్కు వచ్చి పోలీసులకు దొరికారు. వీరి నుంచి 8 కేజీల గంజాయి, మూడు సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబా రెడ్డి సోమవారం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలోని యనక్పల్లి, కృష్ణనాయక్ తండా ప్రాంతాలకు చెందిన మారుతి రాథోడ్, కర్రా నెహ్రూ, అజ్మీర సవాయ్ సింగ్లు రైతులు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీరికి పటాన్చెరులోని గౌతమ్నగర్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మోతీరామ్తో పరిచయం ఏర్పడింది. అతడి సూచనల మేరకు గంజాయిని పటాన్చెరు నుంచి తెచ్చి నగరంలో విక్రయించేందుకు అంగీకరించారు. ఆదివారం సాయంత్రం 8 కేజీల గంజాయితో హైదరాబాద్ వచ్చిన ఈ ముగ్గురు.. గోల్కొండ సమీపంలోని రామ్దేవ్గూడ వద్ద సంచరిస్తుండగా సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్రావు నేతృత్వంలోని బృందం అరెస్ట్ చేసింది. పరారీలో ఉన్న మోతీరామ్ చిక్కితేనే ఈ గంజాయి ఎక్కడ్నుంచి వచ్చిందనేది తెలుస్తుందని పోలీసులు చెప్పారు. గంజాయి అమ్ముతున్న మహిళ అరెస్టు బాలానగర్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న ఓ మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతేనగర్ డివిజన్లోని పిట్టల బస్తీకి చెందిన కళ (32) ఇంటి వద్ద గంజాయి అమ్ముతోందన్న సమాచారం అందడంతో ఆమె ఇంటిపై దాడి చేసి 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కళను రిమాండ్కు తరలించారు. -
టాస్క్ఫోర్స్ ఏదీ?
కర్నూలు (రాజ్విహార్) : వేలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకునే నాథులే కరువయ్యారు. భూబకాసురుల నుంచి వాటిని స్వాధీన పర్చుకోవాలన్న ఆలోచన కూడా ఎవరికీ రావడం లేదు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ప్రభుత్వం నియమించినప్పటికీ.. అది కాస్తా నిద్రావస్థలో ఉండిపోయింది. టాస్క్ఫోర్స్ ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా వక్ఫ్ ఆస్తులు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. కలెక్టర్ చైర్మన్గా టాస్క్ఫోర్స్ కమిటీ వక్ఫ్ ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ 2014 అక్టోబరు 13న జీవో నంబర్ 18 జారీ చేసింది. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా, డీఆర్ఓ/ జిల్లా వక్ఫ్ ఆఫీసర్ కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు, మునిసపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్అండ్బీ ఈఈ, మైనార్టీ సంక్షేమాధికారి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, జిల్లా రిజిస్ట్రార్, ఫారెస్టు ఆఫీసర్లను సభ్యులుగా నియమించారు. కమిటీ చేయాల్సిందేమిటంటే.. కలెక్టర్ అధ్యక్షతన ప్రతినెలా సమావేశమై భూముల వివరాలు, ఎవరి ఆక్రమణలో ఉన్నాయి, గతంలో వీరిపై తీసుకున్న చర్యలు, తిరిగి స్వాధీనానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించాలి. వాటిని అభివృద్ధిలోకి తెచ్చేందుకు సలహాలు, ఆదాయ వనరులపై సూచనలు ఇవ్వాలి. భూములపై తీసుకున్న పట్టాదారుపాసు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రద్దు చేయించాలి. ఇనామ్ అబాలిష్ యాక్ట్ ప్రకారం నేరస్తులపై క్రిమినల్ కేసులు పెట్టి.. ఆ వివరాలను కమిషనర్కు తెలపాలి. కబ్జాదారులపై ఐపీసీ, సీఆర్పీసీ వక్ఫ్ యాక్ట్ కింద కేసుల నమోదుకు జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టాలి. ఆస్తుల జాబితాను జిల్లా రిజిస్ట్రార్కు పంపి పీఓబీలో నమోదు చేయించాలి. ఇతరులకు రిజిష్టర్ కాకుండా చూడాలి. రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదు చేయించాలి. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కట్టడాలు చేపడితే మునిసిపల్ కమిషనర్లు ఎన్ఓసీలు ఇవ్వరాదు. కమిటీ సమావేశమై తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యల వివరాలను ప్రతి నెల మూడున మైనారిటీ శాఖ కమిషనర్కు పంపితే.. వాటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు. రెండున్నరేళ్లలో రెండే సార్లు.. జీఓ ప్రకారం టాస్క్ఫోర్స్ కమిటీ ప్రతి నెలా సమావేశం కావాలి. కానీ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే సమావేశమైంది. వాటికి కూడా గత కలెక్టర్ హాజరు కాలేదు. దీంతో జేసీ నిర్వహించారు. టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో ఒక్క ఎకరాను కూడా అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోలేకపోయారు. మొత్తం 32,599 ఎకరాల్లో 8,100 ఎకరాలు కబ్జాకు గురైనట్లు చెబుతున్నా...వాటి స్వాధీనంపై దృష్టి పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్ చర్యలు తీసుకోవాలి జిల్లాలో వేలాది ఎకరాల వక్ఫ్ భూములు కబ్జాకు గురయ్యాయి. వీటి స్వాధీనం, మిగిలి ఉన్న ఆస్తుల రక్షణకు చిత్తశుద్ధి అవసరం. ఈ అంశంలో టాస్క్ఫోర్స్ ఏమీ చేయలేకపోతోంది. తహసీల్దార్, వీఆర్ఓలతో సమావేశాలు నిర్వహించి వారికీ పరిరక్షణ బాధ్యతలు అప్పగించాలి. కొత్తగా వచ్చిన కలెక్టర్, ఎస్పీలు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలి. ఎస్. రోషన్ అలీ, రిటైర్డు తహసీల్దారు, సీనియర్ మైనార్టీ నాయకులు ప్రభుత్వం చట్టాన్ని నీరుగార్చింది వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అమ్మిన, కొన్నవారిపై కేసులు పెట్టి శిక్షించాలి. అప్పుడే భయం వస్తుంది. మసీదుల నిర్వహణ కోసం కేటాయించిన భూములను ఆక్రమించుకుని అనుభవించడం అన్యాయం. ఎం.ఖదీరుల్లా, ఇంటలెక్చువల్ కలెక్టివ్స్ సంస్థ జిల్లా అధ్యక్షుడు రెండు సార్లు మాత్రమే నిర్వహించాం టాస్క్ఫోర్స్ కమిటీ జీవో ప్రకారం ప్రతి నెలా సమావేశం కావాల్సిన మాట వాస్తవమే. అయితే ఇప్పటి వరకు రెండు సార్లు మాత్రమే సమావేశం జరిగింది. ఇనాయత్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ -
డ్రగ్ పెడ్లర్గా ఇంటర్ విద్యార్థి
► అతడే సూత్రధారిగా క్రయవిక్రయాలు ► నలుగురిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ డ్రగ్ పెడ్లర్గా మారాడు. మాదకద్రవ్యమైన ఎక్స్టసీని తాను వినియోగించడంతో పాటు మరికొందరికి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం మైనర్తో సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు డీసీపీ బి.లింబారెడ్డి తెలిపారు. తార్నాక నాగార్జుననగర్కు చెందిన ఓ మైనర్ పదో తరగతిలో ఉండగానే హుక్కాకు అలవాటుపడ్డాడు. శివంరోడ్లోని ఓ హుక్కా పార్లర్కు రెగ్యులర్ కస్టమర్గా మారాడు. కొన్నాళ్ళకు హుక్కాతో పాటు గంజాయికీ బానిసగా మారాడు. ధూల్పేట ప్రాంతానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి నుంచి గంజాయి ఖరీదు చేసేవాడు. తన ఇంటిపై ఉన్న ఓ గదిలోనే స్నేహితులతో కలిసి హుక్కా, గంజాయి పీల్చేవాడు. ఇతడికి 2016లో మెహదీపట్నం ప్రాంతానికి చెందిన హన్నన్ అనే వ్యక్తితో పరిచయమైంది. ఇతడి నుంచి ఎక్స్టసీ, ఎల్ఎస్డీ వంటి మాదకద్రవ్యాలు ఖరీదు చేయడం ప్రారంభించిన మైనర్ తొలినాళ్ళల్లో తానే వినియోగించేవాడు. కొన్నాళ్ళకు విక్రేతగా మారి లాలాగూడకు చెందిన అల్తాఫ్ హుస్సేన్, మహ్మద్ ఇబ్రహీం, బొగ్గులకుంటకు చెందిన ప్రశాంత్ పౌల్కు అమ్మడం ప్రారంభించాడు. మంగళవారం 26 గ్రాముల ఎక్స్టసీని తీసుకుని వచ్చిన మైనర్ దాన్ని తార్నాక ప్రాంతంలో విక్రయించే ప్రయత్నం చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.మోహన్కుమార్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, ఎస్.సైదాబాబు, కె.శ్రీనివాస్ వలపన్ని నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి మాదకద్రవ్యం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు ఉస్మానియా వర్శిటీ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న హన్నన్, కిషోర్ కోసం గాలిస్తున్నారు. -
టాస్క్ఫోర్స్పై ఎర్ర కూలీల దాడి
►ఎర్రచందనం దుంగలు స్వాధీనం ►ఇద్దరు తమిళ కూలీల అరెస్టు ►కొనసాగుతున్న కూంబింగ్ భాకరాపేట : టాస్క్ఫోర్స్పై ఎర్రకూలీలు రాళ్లతో దాడికి దిగిన సంఘటన బుధవారం ఉదయం భాకరాపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. రెడ్ శాండల్ టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు ఆదేశాల మేరకు తెల్లవారుజామున ఆర్ఎస్ఐ భాస్కర్ నేతృత్వంలో సిబ్బందితో కలసి భాకరాపేట ఘాట్ మార్గం నుంచి కూంబింగ్ నిర్వహించారు. భాకరాపేట అటవీ ప్రాంతంలోని గద్దలగూడు బండల సమీపంలో తమిళ కూలీలు తారసపడ్డారు. ఆర్ఎస్ఐ భాస్కర్ సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు. దీంతో తమిళ కూలీలు వారిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. 12 మంది ఉన్న తమిళ కూలీల బృందంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు; మిగిలిన వారు పారిపోయారు. వీరి నుంచి 11 దుంగలు, వెంట తీసుకొచ్చిన బట్టలు, బ్యాగులు, అన్నం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జువాదిమలైకు చెందిన మనోహర్, రాజేంద్రన్ ఉన్నారు. మిగిలిన వారి కోసం మరో టాస్క్ఫోర్స్ బృందాన్ని డీఐజీ పంపించారు. -
అడవి నిండా స్మగ్లర్లే
►వారాల తరబడి కొండా కోనల్లో మకాం ►అదును చూసి వన సంపదపై వేటు ►నలు దిశలా యథేచ్ఛగా అక్రమ రవాణా ►టాస్క్ఫోర్స్ కదలికలపై స్మగ్లర్ల ముందస్తు నిఘా ►ఎదురు పడితే దాడి... క్షణాల్లో కనుమరుగు ►రాత్రింబవళ్లూ కొనసాగుతున్న కూంబింగ్ అడవి తల్లి కన్నీరు పెడుతోంది. కొండల మధ్య పెరుగుతున్న ఎర్ర కూలీల అరాచకాలకూ, అక్రమ రవాణాకు తల్లడిల్లుతోంది. టన్నుల కొద్దీ తరలిపోతున్న ఎర్రచందనాన్ని కాపాడుకోలేక విలవిలలాడుతోంది. పోలీసుల కూంబింగ్ జరుగుతున్నా తెలివిగా తప్పించుకుంటోన్న స్మగ్లర్ల మాయాజాలానికి మూగగా రోదిస్తోంది. మారుతున్న మంత్రులు, ఏడాదికోసారి జరిపే సమీక్షలు, తీసుకునే నిర్ణయాలూ స్మగింగ్ను ఏ మాత్రం ఆపలేకపోతున్నాయని పదేపదే ఆక్రోశిస్తోంది. తిరుపతి : స్మగ్లర్ల గొడ్డళ్ల వేటుకు శేషాచలం నిలువెల్లా వణికిపోతోంది. తిరుపతి, భాకరాపేట, పీలేరు, తలకోన, కరకంబాడి ప్రాంతాలతో పాటు కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో శేషాచలం విస్తరించి ఉంది. రెండు వారాలుగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ పోలీసుల తనిఖీలు పగటి పూట తగ్గాయి. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం వేళ స్మగ్లర్లు వ్యూహాత్మకంగా అడవిలోకి ప్రవేశిస్తున్నారు. తమిళనాడు నుంచి బస్సుల్లో, కారుల్లో వచ్చే వందలాది మంది ఎర్ర కూలీలు, స్మగ్లర్లు వాటర్ బాటిళ్లు, బియ్యం. పప్పు, బిస్కెట్లు, కూల్డ్రింక్స్, తినుబండారాలతో పాటు పదునైన గొడ్డళ్లు, రంపాలతో అడవిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రధానంగా భాకరాపేట, శ్రీవారిమెట్లు, కరకంబాడి, మామండూరు ప్రాంతా ల్లో ఉన్న కాలి బాటల ద్వారా ఫారెస్టులోకి ప్రవేశిస్తున్న స్మగ్లర్లు మేకలిబండ, సచ్చినోడిబండ, చీకటీగలకోన ప్రాంతాల్లోని కొండ రాళ్లు, చిన్నచిన్న గుహల్లో రోజుల కొద్దీ తలదాచుకుంటూ పగటి పూట ఎర్రచందనం చెట్లు నరుకుతున్నారు. సుమారు 10 నుంచి 20 చెట్లు నరికాక వాటిని రవాణా చేసే పనుల్లో పడుతున్నారు. అక్రమ రవాణా సమయంలో పోలీసులు ఎదురు పడితే దుంగలను కింద పడేసి అడవిలోకి పారిపోతున్నారు. రోజుకు వంద మందికి పైగా ఎర్ర కూలీలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారని అంచనా. అన్ని ప్రాంతాల్లోనూ సుమారు వెయ్యిమందికి పైగా ఎర్ర కూలీలు అడవిలోనే ఉంటారని పోలీసుల అంచనా. పారిపోయే వారే ఎక్కువ... శేషాచలంలో తిరుపతి టాస్క్ఫోర్స్ కూంబింగ్ పెరిగింది. మొత్తం 4 బృందాలు ఆయుధాలతో అడవిలో స్మగ్లర్ల కోసం జల్లెడ పడుతున్నాయి. అయితే వీరి రాకను ముందే పసిగడుతున్న స్మగ్లర్లు పోలీసుల కన్నుగప్పి రాళ్లు, గుబురు చెట్ల మధ్య తలదాచుకుంటున్నారు. కొంత మంది తప్పించుకోలేక పోలీసులకు చిక్కుతున్నారు. అయితే పోలీసులకు దొరికేవారి కంటే తప్పించుకుని అడవిలోకి పారిపోయే వారే ఎక్కువ. పటిష్ట ప్రణాళికలు కరువు... ఎర్ర చందనం స్మగ్లింగ్ను నిలువరించే విషయంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. పటిష్టమైన ప్రణాళికలు లేకపోవడం, సరిపడ సిబ్బందిని, ఆయుధాలను సమకూర్చలేకపోవడమే కారణమని తెలు స్తోంది. తిరుపతి టాస్క్ఫోర్సుకు కేటాయించిన సిబ్బందిని పూర్తిగా సమకూర్చే విషయంలో సర్కారు మూడేళ్లుగా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. ఈ లోగా ఇటీవలనే అటవీ శాఖకు కొత్త మంత్రి వచ్చారు. సీఎంతో చర్చించిన మీదట అదనపు బలగాల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. ఈ లోగా జరగాల్సిన స్మగ్లింగ్ మొత్తం జరుగుతూనే ఉంది. దుంగలు రోజూ దొరుకుతూనే ఉన్నాయ్... రోజూ ఎక్కడో ఒక చోట టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న ఎర్ర చందనం దుంగలు పెరిగిన స్మగ్లింగ్ను తేట తెల్లం చేస్తున్నాయి. దుంగలు దొరుకుతున్నాయి గానీ, వాటిని రవాణా చేసే ఎర్ర కూలీలు, స్మగ్లర్లు మాత్రం దొరకడం లేదు. దీంతో కోట్ల విలువ చేసే వన సంపద యథేచ్ఛగా సరిహద్దులు దాటుతూనే ఉంది. దీనికి ముగింపు ఎలా పలకాలో పోలీసులకు అర్థం కావడం లేదు. -
పోలీస్ శాఖలో 105 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలు, కమిషనరేట్లను దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖలో 105 కొత్త పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. డీజీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఇటీవల జరిగిన కేబినెట్ ఆమోదించడంతో ఈ ఉత్తర్వులు జారీచేసినట్టు పోలీస్ శాఖ తెలిపింది. కమిషనరేట్లు, జిల్లా పోలీస్ విభాగాల్లో నాన్క్యాడర్, అదనపు ఎస్పీ, డీఎస్పీ పోస్టుల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. సివిల్ విభాగంలో 23 నాన్క్యాడర్ ఎస్పీ పోస్టులు, అదే విధంగా పోలీస్ కమ్యూనికేషన్లో 2 నాన్క్యాడర్ ఎస్పీ పోస్టులు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ కోటాలో సివిల్ విభాగంలో 17, ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో ఒక అదనపు ఎస్పీ పోస్టును ఏర్పాటుచేశారు. ఇకపోతే డీఎస్పీ కోటాలో సివిల్ విభాగంలో 57 పోస్టులు, ఆర్మ్డ్ రిజర్వ్ 2, కమ్యూనికేషన్ విభాగంలో 3 పోస్టులు ఏర్పాటుచేశారు. టాస్క్ఫోర్స్ డీఎస్పీలు..: నూతనంగా ఏర్పాటయిన కరీంనగర్, రామగుండం, వరంగల్, సిద్దిపేట్, నిజామాబాద్, ఖమ్మం కమిషనరేట్లలో నేరాల నియంత్రణ, నేరస్థులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించేందుకు టాస్క్ఫోర్స్ డీఎస్పీ పోస్టులను ఏర్పాటుచేశారు. మంజూరు చేసిన 57 పోస్టుల్లోనే ఈ డీఎస్పీ పోస్టులుంటాయని ఆర్థిక శాఖ జీవోలో స్పష్టంచేసింది. -
కాలుష్య నియంత్రణకు టాస్క్ఫోర్స్: కేటీఆర్
- కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి ఒత్తిడి - పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమైన మంత్రి సాక్షి, హైదరాబాద్: రాజధానిలో కాలుష్య నియంత్రణకు జీహెచ్ఎంసీ, కాలుష్య నియం త్రణ మండలి, పోలీసులు, పరిశ్రమ వర్గాల తో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. పరిశ్రమ వర్గాల సలహా మేరకు ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని, పీసీబీ అధికారులు, పరిశ్రమ వర్గాలతో కామన్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పారిశ్రామిక కాలుష్యం తగ్గించాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందని, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. పారిశ్రామిక కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగా వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో మంగళవారం సనత్నగర్లోని పీసీబీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. కాలుష్య నియంత్రణ, పారిశ్రామిక వ్యర్థాల నియంత్రణపై ప్రభుత్వ ఆలోచనలను చర్చించారు. హైదరాబాద్ నుంచి కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్రోడ్డు వెలుపలికి తరలించాలన్న జీవో 20ని తప్పకుండా అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు తరలి వెళ్లే వరకు జీరో లిక్విడ్ డిశ్చార్జి వంటి అధునాతన ఏర్పాట్లు చేసుకుని వ్యర్థాలను అరికట్టాలని కోరారు. పరిశ్రమలు పెరుగుదలకు సహకరిస్తూనే, చట్టాల అమల్లో కచ్చితంగా ఉంటామన్నారు. పరిశ్రమల తరలింపునకు ఔటర్ రింగ్రోడ్డు వెలుపల 17 ప్రాంతాలు గుర్తించామని, వాటిలో క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా క్లస్టర్లలో ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పన పూర్తయ్యాకే, పరిశ్రమలను తరలిస్తామన్నారు. తరలించా ల్సిన పరిశ్రమల్లో 50 శాతానికి పైగా లైఫ్ సైన్సెస్, ఫార్మా కంపెనీలే ఉన్నాయని, వీటిని అంతర్జాతీయ సౌకర్యాలతో కూడిన ఫార్మాసిటీ కేంద్రంగా ఉంటుందన్నారు. మూడోవంతు గ్రీన్బెల్ట్: మంత్రి జోగు రామన్న పరిశ్రమల్లో మూడో వంతు గ్రీన్ బెల్ట్ నిర్వహణకు హరితహారం కార్యక్రమం ద్వారా కార్యాచరణ కచ్చితంగా అమలు చేస్తామని జోగు రామన్న తెలిపారు. కాలుష్య నివారణ చట్టాలను ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తుందన్నారు. ప్రభు త్వ యంత్రాంగం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణకు ప్రభు త్వం సహకరిస్తుందని, ప్రమాణాలను ఉల్లం ఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ముఖ్యంగా నాలాల్లోకి వ్యర్థాలను వదిలే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నా రు. సీసీ టీవీ నెట్వర్క్, రాత్రి సమయాల్లో నూ పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. టోక్కో క్లీన్ ఎయిర్ అథారిటీ మాదిరిగా హైదరాబాద్లోనూ అథారిటీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
సేవలు మెరుగుపరుస్తాం
► 14 మందితో టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు ► జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి రాజాం రూరల్: జిల్లాలో అగ్నిమాపకశాఖ సేవలు మరింత మెరుగుపరుస్తామని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి యం.శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రాజాం అగ్నిమాపక స్టేషన్ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖకు చెందిన 14 మంది యువకులతో టాస్క్ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రకృతి వైఫరీత్యాలు ఎదుర్కోవడం, అధునాతన యంత్రాలు, పరిజ్ఞానం ఉపయోగించడంలో వీరికి శిక్షణ ఇవ్వనున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రకృతి వైఫరీత్యాలు సంభవించినప్పుడు వీరు సేవలందిస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రమాదాలు సంభవించినప్పుడు కరెంటు లేకుండా పనిచేసే ఆఫ్కాలైట్లు ఆరు, ఫైర్బోర్డులు4, మిస్ట్ వెహికల్1, మిస్టిబుల్లెట్లు2 అందుబాటులో ఉన్నాయన్నారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 21 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచ్లతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రమాదాలపై చైతన్యం చేస్తామన్నారు. గ్రామాల్లో నీటివనరులు అందుబాటు, పూరిపాకలు, ఆవాసప్రాంతాలపై సమగ్రంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు. రూ. 60 లక్షలతో పాలకొండలో నూతన భవనం నిర్మించామని, రూ. 35 లక్షలతో శ్రీకాకుళం ఫైర్స్టేషన్లో ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపడతామన్నారు. ఆయనతో పాటు రాజాం ఎస్ఐ పక్కి చంద్రమౌళి ఉన్నారు. -
2నుంచి రెండో విడత పల్స్పోలియో
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ 2వ తేదీ నుంచి రెండో విడత పల్స్పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ తెలిపారు. సోమవారం జిల్లా స్థాయి టాస్క్ పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఐదేళ్లలోపు పిల్లలందరికీ విధిగా చుక్కలు వేయించాలన్నారు. ఇందుకు వైద్య ఆరోగ్య, రెవెన్యూ, విధ్యా శాఖలతో పాటు పొదుపు మహిళలు, ఎంపీడీఓలు సహరించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పొదుపు సంఘాల మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైల్వేస్టేషన్లు, బస్టాండులు, ఇతర జనరద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మురికి వాడలు, చెంచుగూడెంలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెండో తేదీన బూత్ స్థాయిలో చుక్కలు వేయాలని, 3 నుంచి 5వ తేదీ వరకు ఇంటింటికి వెళ్లాలన్నారు. పోలియో మహమ్మారి బారిన పడి ఎంతో మంది కాళ్లు, చేతులు లేక నరకం అనుభవిస్తున్నారని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సమావేశంలో జేసీ హరికిరణ్, డీఆర్ఓ గంగాధర్గౌడు, డీఎంహెచ్ఓ మీనాక్షిమహదేవ్ తదితరులు పాల్గొన్నారు. -
పాతనోట్ల ముఠా అరెస్టు
హైదరాబాద్: నగరంలో పాతనోట్ల మార్పిడి ముఠాలు పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా మరో ముఠాను టాస్క్ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని మొగల్కోర్టు బిల్డింగ్లో పాతనోట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్న 10మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తరచుగా నగరంలో పాతనోట్లను మార్చుతున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8కోట్లు విలువ చేసే పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. -
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
తమిళ కూలీల స్థావరాలు గుర్తింపు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా ఫారెస్టు, పోలీసు, టాస్క్ఫోర్స్ దాడులు ముమ్మరం భాకరాపేట: తిరుపతి టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో శేషాచలం అడవుల్లో చేపట్టిన కూంబింగ్ కొనసాగుతోంది. తమిళ కూలీలు రాత్రిపూట ఉండే ప్రధాన స్థావరాలను టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలో పరిధిలో ఉన్న ఎర్రచందనం వనాలలోని 28 స్థావరాలను గుర్తించారు. రాత్రిపూట ఉండేందుకు ఈ స్థావరాలు అనువుగా ఉన్నాయని, సమీపంలో తాగునీటి వసతి ఉండడంతో కూలీలు వాటినే కుటీరాలుగా మలుచుకున్నారని టాస్క్ఫోర్స్ అధికారులు చెబుతు న్నారు. ఈ స్థావరాలపై దృష్టి పెట్టడంతోనే నాలుగు రోజుల క్రితం వందలాది మంది కూలీలను టాస్క్ఫోర్స్, ఫారెస్టు అధికారులు వైఎస్సార్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పట్టుకోగలిగారు. సరిహద్దులపై ప్రత్యేక నిఘా.. శేషాచలం అటవీ ప్రాంతంలోని చిత్తూరు, వైఎస్సార్ జిల్లా సరిహద్దులపై టాస్క్ఫోర్స్ నిఘా పెట్టింది. సరిహద్దులు దాటిపోతున్న అక్రమ వాహనాలు, అందుకు సహకరిస్తున్న వారిని కూడా గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా వైఎస్సార్ జిల్లా భాకరాపేట, చిత్తూరు జిల్లా భాకరాపేట కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మధ్య కాలంలో భాకరాపేట నుంచి టాస్క్ఫోర్స్, పోలీసు, ఫారెస్టు అధికారులకు సమాచారం వస్తోంది. అధికారులు అక్కడికి చేరుకునే లోపు దొంగలు తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో భాకరాపేటలో ప్రొటెక్షన్ వాచర్లు మరిన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాడులు ముమ్మరం.. టాస్క్ఫోర్స్, పోలీసులు, అటవీ శాఖ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. జిల్లా పోలీసు అధికారులు సైతం శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్న పీలేరు రూరల్ సర్కిల్ కార్యాలయం పరిధిలోని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. భాకరాపేట కేంద్రంగా నాలుగు రోడ్ల కూడలిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసి వాహనాలను గమనిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా భాకరాపేటలో నిఘా పెంచారు. -
శేషాచలంలో కట్టుదిట్టమైన భద్రత
తిరుపతి మంగళం(చంద్రగిరి): శేషాచల అటవీ ప్రాంతంలో అక్రమంగా ప్రవేశిస్తున్న కూలీలను నిలువరించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు డీసీసీఎఫ్ బీ.ఎన్.ఎన్. మూర్తి వెల్ల డించారు. బుధవారం ఆయన టాస్క్ఫోర్స్ అధికారులతో కలసి శేషాచలంలోని అన్నదమ్ముల బండ, మామిళ్లమంద, చామలరేంజ్ ప్రాంతాల్లో ఆయన కూంబింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కూలీలు ప్రవేశించే మార్గాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బాలపల్లె రేంజ్ను నుంచి ఎక్కువగా ఎర్రదొంగలు అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కూలీలు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను ఆయన పరిశీలించారు. శేషాచలంలోకి అనేక మార్గాల ద్వారా కూలీలు అక్రమంగా చొరబడుతున్నట్లు ఆయన తెలిపారు. టాస్క్ ఫోర్స్, అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం తో కూంబింగ్కు పూనుకుని కూలీలు ప్రవేశించకుండా చూడాలని ఆయన సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఐ భాస్కర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
రద్దయిన కరెన్సీ నోట్లు మార్చే ముఠా అరెస్టు
విజయవాడ : రద్దయిన పాత కరెన్సీ నోట్లు మార్చే ముఠాను శనివారం టాస్క్ఫోర్స్, సూర్యారావుపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.23 లక్షల పాత రూ.500 నోట్లు 10 సెల్ఫోన్లు, రెండు మోటారు బైక్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కె.శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ ఏసీపీ మురళీధర్ సూర్యారావుపేట పోలీసు స్టేష¯న్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం రాత్రి స్వరాజ్య మైదానం వద్ద ఎమిమిది మంది వ్యక్తులు పాత నోట్లు మార్చేందుకు బేరసారాలు చేస్తుండగా వలపన్ని పట్టుకున్నట్లు ఏసీపీలు పేర్కొన్నారు. రూ.లక్ష పాత నోట్లకు రూ.45 వేలు ఇచ్చే ఒప్పందంపై ఈ ముఠా తన కార్యకలాపాలను నిర్వహిస్తోందని వివరించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు నోట్లు మార్పిడి చేస్తున్న 8 మందిని పట్టుకున్నామని తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. నోట్లు చెలామణి గాక పోయినా నిందితులు సంస్థల పేరుతో రిజర్వ్ బ్యాంకు నుంచి నేరుగా మార్పిడి చేస్తామని ఈ విధంగా డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. విజయవాడకు చెందిన తోట సాయి వెంకట్, టి.కమల్కుమార్, చిరువెళ్ల గోపాలకృష్ణ, హరీష్, కుమార్, వెంకటేశ్వరరావు, జీవన్, విజయ్కుమార్ను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. విలేకరుల సమావేశంలో సూర్యారావుపేట సీఐ వినయ్మోహన్, టాస్క్ఫోర్స్ సీఐ సురేష్రెడ్డి పాల్గొన్నారు. -
షెల్ కంపెనీలపై కఠిన చర్యలు
• బ్యాంకు ఖాతాల స్తంభన • టాస్క్ఫోర్స్ ఏర్పాటు న్యూఢిల్లీ: పన్నులు ఎగవేసేందుకు, మనీలాండరింగ్ కోసం ఏర్పాటయ్యే డొల్ల కంపెనీలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఆయా సంస్థల ఖాతాలను స్తంభింపచేయడంతో పాటు పలు కఠిన చర్యలు తీసుకోనుంది. షెల్ కంపెనీలపై శుక్రవారం సమీక్ష జరిపిన ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. రెవెన్యూ విభాగం, కార్పొరేట్ వ్యవహారాల విభాగాల కార్యదర్శుల సారథ్యంలోని ఈ టాస్క్ఫోర్స్లో ఇతర శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు సభ్యులుగా ఉంటారు. ’దేశంలో 15 లక్షల కంపెనీలు నమోదై ఉండగా, కేవలం 6 లక్షల సంస్థలు మాత్రమే వార్షికంగా రిటర్నులు దాఖలు చేస్తున్నాయి. అంటే, చాలా పెద్ద సంఖ్యలో కంపెనీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నాయి’ అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే ఈ తరహా డొల్ల సంస్థల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయడం, కార్యకలాపాలు సాగించని సంస్థలను రద్దు చేయడం, బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగించడం తదితర చర్యలు చేపట్టనున్నట్లు వివరించింది. అలాగే ఇలాంటి కార్యకలాపాలకు సహకరించే వృత్తి నిపుణులపై కూడా చర్యలు ఉంటాయని పీఎంవో తెలిపింది. 49 సంస్థలపై ఎస్ఎఫ్ఐవో కేసులు.. గణాంకాల ప్రకారం 54 మంది ప్రొఫెషనల్స్తో 559 మంది దాదాపు రూ. 3,900 కోట్ల మనీలాండరింగ్కు పాల్పడినట్లు తేలిందని పీఎంవో తెలిపింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) 49 షెల్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది. డొల్ల సంస్థల తీరుతెన్నులు.. షెల్ కంపెనీల తీరుతెన్నుల గురించి పీఎంవో వివరించింది. నామమాత్రపు పెయిడప్ క్యాపిటల్, షేరుకు అధిక ప్రీమియం కారణంగా ఖాతాల్లో అధిక నిల్వలు.. మిగులు, అన్లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడులు, డివిడెండ్ ఆదాయం లేకపోవడం, అత్యధికంగా నగదు నిల్వలుండటం ఈ షెల్ కంపెనీల లక్షణాలని పేర్కొంది. అలాగే ప్రైవేట్ సంస్థలు మెజారిటీ వాటాదారులుగా ఉండటం, టర్నోవరు.. నిర్వహణ ఆదాయాలు తక్కువగా ఉండటం, నామమాత్రపు వ్యయాలు..చెల్లింపులు, అతి తక్కువ స్థిరాస్తులు మొదలైనవి కూడా ఇందులో ఉంటాయని వివరించింది. -
అందరికీ ఆల్బెండజోల్
- జాయింట్ కలెక్టర్ హరికిరణ్ - పద్దెనిమిదేళ్ల వారందరినీ కవర్ చేయాలని ఆదేశం - రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం కర్నూలు(హాస్పిటల్): పల్స్పోలియో తరహాలో ఒకటి నుంచి పద్దెనిమిదేళ్లలోపు వారందరూ నులిపురుగుల నివారణ మాత్రలు మింగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం రాష్ట్రీయ బాల స్వాస్త్య జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఒకటి నుంచి 18 ఏళ్లలోపు వారు 7,90,000 మంది ఉన్నట్లు గుర్తించామని జేసీ తెలిపారు. ఈ నెల 10వతేదీన నులిపురుగుల నివారణ దినోత్సవం వీరందరికీ ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలన్నారు. పాఠశాలల, కళాశాలల విద్యార్థులెవరూ ఆ రోజు గైర్హాజరు కాకుండా హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర, 3 నుంచి 18 ఏళ్లలోపు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వాలన్నారు. 9వ తేదిలోగా అన్ని విద్యాలయాలకు నులిపురుగుల నివారణ మాత్రలను చేరవేయాలని ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలతను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలన్నారు. మాత్రలు మింగిన విద్యార్థులు వాంతులు, విరేచనాలు చేసుకుంటే ప్రథమ చికిత్స అందించేందుకు 108, 102 వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లేనిపక్షంలో జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ (ఫోన్ నెం.277305, 277309), డివిజన్ స్థాయిలో డీసీహెచ్ఎస్కు ఫోన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ మీనాక్షిమహదేవ్ను ఆదేశించారు. సమావేశానికి గైర్హాజరైన అర్బన్హెల్త్ సెంటర్ సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణ, డెమో ఎర్రంరెడ్డి, డీఐఓ వెంకటరమణ పాల్గొన్నారు. -
ఎర్రచందనం దేశ సరిహద్దులు ఎలా దాటుతోంది?
టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు ప్రశ్న తిరుపతి మంగళం: మనదేశంలో ఎవరి సహాయ సహకారాలు లేకుండా అత్యం త విలువైన ఎర్రచందనం ఆంధ్ర రాష్ట్రం తో పాటు దేశ సరిద్దులు దాటి ఇతర దేశాలకు ఎలా వెళుతోందని టాస్క్ఫోర్స్ డీఐజీ మాగాంటి కాంతారావు ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలు లేకుం డా ఒక్క దుంగ కూడా బయటకు వెళ్లే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం కపిలితీర్థం సమీపంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో డీఐజీ విలేకరుల సమావేశం నిర్వహిం చి మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తాము కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నామన్నారు. తమకు ఎవరి సహకారం లభిం చకున్నా కేవలం 150మంది సిబ్బందితో ఎర్రచందన అక్రమ రవాణాను, బడా స్మగ్లర్ల ఆట కట్టించినట్లు పేర్కొన్నారు. శేషాచల అడవుల్లోకి తమిళనాడులోని జావాదీహిల్కు చెందిన కూలీలు రాకుం డా చాలావరకు కట్టడి చేశామన్నారు. అటవీ, టాస్క్ఫోర్స్ అధికారులపై ఎర్ర స్మగ్లర్లు దాడులకు పాల్పడాలంటే భయపడేలా చేశామన్నారు. అయితే ఎర్రచందనంతో పాటు అడవుల్లో అక్కడక్కడా ఉన్న శ్రీగంధం చెట్లపై కూడ ఎర్రస్మగ్లర్ల కన్ను పడిందన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. డీఎస్పీలు శ్రీధర్రావు, హరినాథ్బాబు, మహేశ్వరరాజు పాల్గొన్నారు. -
కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని త్వరగా అందించండి
మిల్లర్లను కోరిన మంత్రి ఈటల సాక్షి, హైదరాబాద్: కస్టమ్ మిల్లింగ్ రైస్ను సాధ్యమైనంత త్వరగా అందించాలని మిల్లర్లను రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. 2016–17 సంవత్సరానికి 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అంచనా వేయగా 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు, దీనిలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్కు ఇచ్చినట్లు తెలిపారు. సోమవారం రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో మంత్రి ఈటల సమావేశమై చర్చించారు. హాస్టళ్లకి సరఫరా చేసే సన్నబియ్యంను రైతుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్ల ద్వారా కొనుగోలు చేయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో మిల్లర్లు త్వరగా కొనుగోలు చేసి బియ్యం అందించాలని కోరారు. 10 జిల్లాలు యూనిట్గా అన్ని మిల్లులకు ధాన్యం కేటాయించాలని మిల్లర్లు మంత్రిని కోరగా, ఈ సారి ముందే సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు రాకుండా చూస్తామని మంత్రి హామీనిచ్చారు. అయితే కొంతమంది దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, దానిని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలను మరింత బలోపేతం చేయాలని కమిషనర్ను మంత్రి ఆదేశించారు. ఏడాదికి బియ్యంపై రూ.2,395 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని కనుక ఈ బియ్యాన్ని అమ్ముకోవద్దని ప్రజలకు సూచించారు. ఒకవేళ ఎవరికైనా రేషన్ బియ్యం అవసరం లేకపోతే కార్డులు వెనక్కు ఇచ్చివేయాలని కోరారు. -
గ్యాంగ్స్టర్ అయూబ్ఖాన్ అరెస్టు
- మైనర్గానే నేరాలు ప్రారంభించిన అయూబ్ - ఇప్పటి వరకు మొత్తం 72 కేసులు నమోదు - తాజాగా కామాటిపురలో ‘పాస్పోర్ట్ కేసు’ హైదరాబాద్: నగర పోలీసులు అసాంఘిక శక్తులపై ప్రయోగిస్తున్న ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్కు భయపడి దేశం దాటిపోయిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ అయూబ్ఖాన్ను ఎట్టకేలకు పట్టుకున్నారు. సోమవారం ముంబైలో ఇమిగ్రేషన్ అధికారులకు చిక్కిన ఇతడిని నగరానికి తీసుకువచ్చి మంగళవారం అరెస్టు ప్రకటించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ పూర్తి వివరాలు వెల్లడించారు. హడలెత్తించే నేరచరిత్ర.. మహ్మద్ అయూబ్ఖాన్ అలియాస్ అయూబ్ పహిల్వాన్ అలియాస్ పఠాన్. ఆర్మీ మాజీ ఉద్యోగి జహంగీర్ ఖాన్ కుమారుడైన అయూబ్ తన 16వ ఏటే నేరాలు చేయడం ప్రారంభించాడు. 1989లో దోపిడీ, 1990లో హత్య కేసులు నమోదయ్యాయి. తన ముఠా సభ్యులతో కలసి కామాటిపుర, హుస్సేనీ ఆలం పోలీస్స్టేషన్ల పరిధిలో మతఘర్షణలకు పాల్పడాడు. ఈ క్రమంలోనే 1991 ఏప్రిల్ 30న ఇతడిపై కాలాపత్తర్ పోలీసులు రౌడీషీట్ను తెరిచారు. ఎనిమిది మందితో ముఠా ఏర్పాటు చేసిన అయూబ్ గ్యాంగ్స్టర్గా మారి దందాలు ప్రారంభించాడు. 2005–07 మధ్య రియల్ఎస్టేట్ జోరుగా ఉన్నప్పుడు అనేక వివాదాల్లో తలదూర్చి ఆర్థికంగానూ బలపడ్డాడు. అయూబ్ అండ్ కో మీద మూడు కమిషనరేట్ల పరిధిలో 72 కేసులు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో రౌడీషీటర్ మహ్మద్ ఖైసర్తో వైరం ఏర్పడింది. వీరి ముఠాల మధ్య గ్యాంగ్ వార్స్, రెండు హత్యలు సైతం జరిగాయి. పీడీకి భయపడి పరార్.. అదే సమయంలో నగర పోలీసు కమిషనర్ అసాంఘిక శక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగించడం మొదలెట్టారు. ఖైసర్, జంగ్లీ యూసుఫ్లపై దీన్ని ప్రయోగించడంతో తనకూ తప్పదని భావించిన అయూబ్ బోగస్ పాస్పోర్ట్తో దుబాయ్ పారిపోయాడు. విదేశాలకు పారిపోయిన అయూబ్ను ఎలాగైనా పట్టుకోవాలని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి ఐటీ సెల్, టాస్క్ఫోర్స్, సౌత్జోన్ పోలీసులను రంగంలోకి దింపారు. అయూబ్ చిన్న చిన్న మార్పులతో మూడు పాస్పోర్టులను పొందాడు. వీటి వివరాలతో తనపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసే అవకాశం ఉందని భావించిన అయూబ్ షార్జాలో డూప్లికేట్ పాస్పోర్ట్ సైతం పొందాడు. అయితే సిటీ ఐటీ సెల్ చేసిన కృషి ఫలితంగా తాజా పాస్పోర్ట్ వివరాలు లభించాయి. దీని ఆధారంగా లుక్ అవుట్ సర్కులర్(ఎల్ఓసీ) జారీ చేశారు. దీంతో ముంబై విమానా శ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులకు అతను దొరికిపోయాడు. ఒక్క రోజులో రెండు కేసులు.. అయూబ్కు జారీ అయిన రెండు నాన్ బెయిలబుల్ వారంట్ల ఆధారంగా ఎల్ఓసీ జారీ చేశారు. మరోవైపు అతడు తీసుకున్న నకిలీ పాస్పోర్ట్స్కు సంబంధించి కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయూబ్ను ఈ కేసులో అరెస్టు చేసినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఇతను విదేశాల్లో ఉంటూనే ఫోన్, తన అనుచరుల ద్వారా సిటీలో దందాలు చేశాడు. మంగళవారం ఇద్దరు అయూబ్ బాధితులు హుస్సేనిఆలం, చాంద్రాయణగుట్ట పోలీసు లకు తమకు ఎదురైన బెదిరింపులపై ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. వీటిలోనూ పీటీ వారంట్పై అరెస్టు చేయనున్నారు. న్యాయవాది హత్యతో తీవ్ర సంచలనం... అయూబ్ చేసిన నేరాల్లో న్యాయవాది మన్నన్ ఘోరీ హత్య తీవ్ర సంచలనం సృష్టించింది. మన్నన్ ఘోరీ ఖరీదు చేసిన ఓ ఇంటికి సంబంధించి అయూబ్ రూ.2.5 లక్షల మామూలు డిమాండ్ చేశాడు. దీనికి నిరాకరించడంతో 2002 జూలై 10న తన నలుగురు అనుచరులతో కలసి దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో కింది కోర్టు అయూబ్కు జీవితఖైదు విధించింది. మూడేళ్ల జైలు జీవితం అనుభవించిన తర్వాత పైకోర్టు ద్వారా బెయిల్ పొంది 2014 ఏప్రిల్ 11న విడుదలయ్యాడు. -
తమిళ కూలీల ఖాతాల్లో ఎర్రస్మగ్లర్ల నల్లధనం
టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు వెంకటగిరి: రాష్ట్రంలోని ఎరచ్రందనం స్మగ్లర్ల నల్లధనం తమళనాడులోని జవాదమలై గ్రామానికి చెందిన ఎరచ్రందనం కూలీల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎరచ్రందనం అక్రమరవాణా నివారణ విభాగం ఏపీ ఇన్చార్జ్, టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువాదిమలై గ్రామంలో ఉన్న బ్యాంకులో ఎన్నడూ లేనివిధంగా కూలీలుగా జీవనం సాగిస్తున్న వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి వరకు జమ అయినట్లు తెలిపారు. -
‘గోల్డ్’ స్ట్రైక్స్
తణుకు : పెద్ద నోట్ట రద్దుతో కుబేరులకు ఊపిరి ఆడటం లేదు. దాచుకున్న నల్లధనాన్ని మార్చేందుకు బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించారు. సందట్లో సడేమియా అన్నట్టుగా వ్యాపారులు సైతం ప్రభుత్వానికి లెక్క చూపని బంగారాన్ని వదిలించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇలాంటి వ్యవహారాలపై దృష్టి సారించిన కస్టమ్స్, టాస్క్పోర్స్, ఆదాయ పన్ను శాఖల అధికారులు ముప్పేట దాడులకు దిగుతున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డులో బంగారాన్ని కరిగించే ఇద్దరు వ్యక్తుల నుంచి శనివారం రాత్రి సుమారు కేజీ బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు, ఆదివారం కూడా దాడులను కొనసాగించారు. పలు దుకాణాలతోపాటు, కొందరు వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి నుంచి రూ.17.80 లక్షల విలువ చేసే 6 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా తణుకులోనే.. తణుకు పట్టణంలో నల్లధనం మార్పిడి, బంగారం కొనుగోళ్లపై దృష్టి సారించిన వివిధ శాఖల అధికారులు నాలుగు రోజులుగా తణుకులో మకాం వేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాకు చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు సామాన్యుల మాదిరిగా వీధుల్లో ఆటోల్లో తిరుగుతూ నల్లధనం ప్రవాహ మూలాలను వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఆదివారం పట్టణంలోని కొందరి నివాసాలకు వెళ్లి సోదాలు జరిపారు. ఇదిలా ఉంటే టీడీపీకి చెందిన ఓ వార్డు కౌన్సిలర్ను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆయన నుంచి వాంగ్మూలం తీసుకుని విడిచిపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. శనివారం రాత్రి టాస్క్ఫోర్స్, ఐటీ శాఖ అధికారులు వేల్పూరు రోడ్డులోని ఒక దుకాణానికి వెళ్లి బంగారం కావాలని అడిగారు. అక్కడి వ్యాపారి సుమారు పది బంగారం బిస్కెట్లను బయటకు తీయడంతో దానికి లెక్కలు అడిగారు. నోరెళ్లబెట్టడంతో మహంతి శ్రీరాములు, కలిశెట్టి సూరిబాబు అనే యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వ్యాపారుల గుండెల్లో రైళ్లు కస్టమ్స్, టాస్క్ఫోర్స్, ఆదాయ పన్ను శాఖ అధికారులు తణుకులో మకాం వేయడంతో జిల్లాలోని బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇన్నాళ్లు లెక్కలేని విధంగా వ్యాపారం చేసిన బంగారు బాబులు అధికారుల దాడులతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో అధిక శాతం వ్యాపారులు ఆదివారం దుకాణాలు తెరవలేదు. మరోవైపు సీసీ కెమెరాలు లేని దుకాణాల్లో బంగారు ఆభరణాలను కొందరు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటిని బంధులు, నమ్మకస్తుల వద్ద అనుమానం రాని ప్రాంతాల్లో ఉంచుతున్నట్టు సమాచారం. -
టోల్ ఎత్తివేత.. ఏటీఎంల కోసం టాస్క్ఫోర్స్!
పెద్దనోట్లను రద్దు వల్ల దేశంలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. ఇప్పటికే బ్యాంకులు, ఏటీఎంలలో నగదు ఉపసంహరణ పరిమితులను సడలించడం, రూ. 500, 2000 నోట్లను ఏటీఎంలలో అందుబాటులోకి తీసుకురావడం వంటి నిర్ణయాలు తీసుకున్న కేంద్రం వాహనదారులకు ఊరట కలిగిచేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులన్నింటిపై మరో నాలుగురోజులపాటు టోల్ రుసుమును రద్దుచేస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి వరకు జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఏటీఎంల కోసం టాస్క్ఫోర్స్! పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలు సేవలు అందించేందుకు వీలుగా భారత రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేసింది. ఏటీఎంలలో కొత్తనోట్లు అందుబాటులోకి వచ్చేలా చేయడం, ఇందుకోసం ఏటీఎం సాఫ్వేర్లలో మార్పులు చేసి, రీయాక్టివేషన్ చేయడం ఈ టాస్క్ఫోర్స్ ప్రధాన కర్తవ్యం. దేశవ్యాప్తంగా ఏటీఎంలు అందుబాటులోకి వస్తే ప్రజల కష్టాలు ఘననీయంగా తగ్గే అవకాశముంది. -
‘కాలుష్యం’పై కట్టడి
- డీజిల్, ఇతర కాలుష్య వాహనాల నియంత్రణపై సర్కారు దృష్టి - ఢిల్లీ తరహాలో 15 ఏళ్ల పైబడిన వాహనాలపై నిషేధం? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డీజిల్ వాహనాలు, ఇతర వాయు కాలుష్యకారక వాహనాల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్ట నుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధి లో వాహనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేందుకు కార్యాచరణను రూపొందిస్తోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం మితిమీరి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండటం, జనజీవనం స్తంభించడంతో రాష్ట్రంలో జాగ్రత్తలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందుకోసం ఉన్నతస్థారుు టాస్క్ఫోర్సును ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలో 15 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించిన తరహాలోనే రాష్ట్రంలోనూ ఈ వాహనాలపై నిషేధించే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించి ముందుగా రాష్ట్రంలో ఎన్ని డీజిల్ వాహనాలను వినియో గిస్తున్నా రు, వాటిలో 10 ఏళ్లలోపు, 15 ఏళ్ల లోపు, 20 ఏళ్లలోపు ఎన్ని ఉన్నాయన్న దానిపై సమాచా రాన్ని రవాణాశాఖ ద్వారా సేకరించాలని కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యా వరణ శాఖ మంత్రి జోగురామన్న ఆదేశించా రు. ముందుగా ఈ వాహనాలకు సంబంధిం చిన వివరాలను సేకరించాక తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. 50 మైక్రాన్లకన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లు ఉంటే చర్యలు... ప్లాస్టిక్ కవర్లు 50 మైక్రాన్లకన్నా తక్కువగా ఉన్న వాటిని రాష్ట్రంలో ఉత్పత్తి చేయకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కవర్లను దొంగదారిలో తరలించకుండా రవాణా-కమర్షియల్ టాక్స్ తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని నిర్ణరుుంచింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలుష్య నియంత్రణ మండలిని అటవీ, పర్యావరణ శాఖ ఆదేశించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైకిల్ కాకపోవడంతో వాటిని సిమెంట్ పరిశ్రమల్లో ఉపయోగించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. కాలుష్య నివారణకు ప్రచార కార్యక్రమాలు రాష్ట్రంలో కాలుష్య నివారణకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కరపత్రాలు, మీడియా ఇతరత్రా రూపాల్లో ప్రచారానికి కార్యక్రమాలను రూపొందిం చాలని కాలుష్య నియంత్రణ మండలికి ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యారుు. కాలుష్యంపై నియంత్రణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ కార్యాలయాలను బలోపేతం చేసేందుకు, మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణరుుంచింది. కాగా, కాలుష్యా ప్రాంతాల్లో పరిశ్రమల తనిఖీకి వీలుగా వాహనాలు కొనుగోలు చేయనుంది. -
‘సన్న’గా దోపిడీ
• అక్రమాలతోనే సన్న బియ్యం సేకరణకు శ్రీకారం • పక్షం రోజుల నుంచే ప్రారంభమైన సరఫరా ప్రక్రియ • టాస్క్ఫోర్స్ దాడిలో వెలుగులోకి బాగోతం సాక్షి, నిజామాబాద్ : సన్న బియ్యం(పీవీఆర్) సేకరణ ప్రక్రియ అక్రమాలతోనే శ్రీకారం చుట్టినట్లయింది. ఈ రకం బియ్యం సరఫరాలో ఆరంభం నుంచే బియ్యం కల్తీ వెలుగు చూస్తుండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. సన్న బియ్యం సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్న జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మి గణపతి రైసుమిల్లరు సన్న బియ్యంలో కల్తీ చేస్తున్నట్లు మంగళవారం టాస్క్ఫోర్స్ అధికారుల బృందం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూసింది. చిన్నారులకు ఆరోగ్యానికి హాని చేసే సీడ్ కంపెనీలకు చెందిన బియ్యాన్ని పౌర సరఫరా శాఖకు సరఫరా చేసే బియ్యంలో కల్తీ చేసినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సన్న బియ్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న ఈ మిల్లరు సరఫరా ఆరంభం నుంచే నాణ్యత లేని బియ్యాన్ని సర్కారుకు అట్టగట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పటికే 20 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరా శాఖ ఎంఎల్ఎస్ పాయింట్ గోదాముకు సరఫరా చేయగా.. అవి కూడా నాణ్యత లోపించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనరేట్కు నివేదిక ఇచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా అధికారులు పేరొంటున్నారు. పక్షం రోజుల క్రితమే షురువైన సేకరణ ప్రక్రియ ప్రభుత్వం పాఠశాలలు, వసతిగృహాల్లో చదివే నిరుపేద విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో భోజనం వడ్డించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఈ సన్న బియ్యం సేకరణకు శ్రీకారం చుట్టింది. గతేడాది జిల్లాలోనే ఈ బియ్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టగా భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి పౌరసరఫరా శాఖ కమిషనరేట్ నుంచే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రెండు నెలల క్రితం టెండరు ప్రక్రియ నిర్వహించింది. క్వింటాళుకు రూ.3,850 చొప్పున సరఫరా చేసే కాంట్రాక్టును దక్కించుకున్నారు. జిల్లాకు ఈ సన్నబియ్యం సరఫరా చేసే కాంట్రాక్టు ఈ వరలక్ష్మి రైసుమిల్లుతోపాటు, హైదరాబాద్కు చెందిన మరో మిల్లరుకు ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అప్పగించింది. పక్షం రోజుల క్రితం నుంచి ఈ సన్న బియ్యం సరఫరా మెుదలైంది. సెప్టెంబర్ 29న కమిషనరేట్ నుంచి మూమెంట్ ఆర్డర్ వచ్చింది. ఇంతలోనే ఈ అక్రమం వెలుగు చూడటం గమనార్హం. ప్రతినెలా 1,170 టన్నులు అవసరం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 2,175 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. సుమారు 2.10 లక్షల మంది విద్యార్థులు వీటిలో చదువుకుంటున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో వడ్డిస్తున్నారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు కూడా సన్న బియ్యంతో కూడిన భోజనం పెడుతున్నారు. ఇందుకోసం ప్రతినెల సుమారు 1,170 టన్నుల సన్న బియ్యం అవసరమని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు ఈ సన్న బియ్యాన్ని సేకరిస్తున్నారు. మిల్లరుపై 6 ఏ కేసు : కృష్ణప్రసాద్, డీఎస్ఓ టాస్క్ఫోర్స్ తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలపై 6ఏ కేసు నమోదు చేశాం. ఈ మేరకు అక్కడ సేకరించిన బియ్యం శాంపిళ్లను కమిషనరేట్ ల్యాబ్కు పంపాం. ల్యాబ్ రిపోర్టును బట్టి చర్యలు తీసుకుంటాం. -
అంతరాష్ట్ర డ్రగ్ ముఠాపై పీడీ యాక్ట్
సాక్షి, సిటీబ్యూరో: గోవా కేంద్రంగా దేశ వ్యాప్తంగా మాదకద్రవ్యాల దందా నిర్వహిస్తూ గత నెలలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుబడిన అంతరాష్ట్ర డ్రగ్ ముఠాపై నగర పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ప్రయోగించారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో చిక్కిన నలుగురిపై ఈ చట్టం ప్రయోగించినట్లు టాస్క్ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి సోమవారం తెలిసారు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సొలోమెన్, ఒబేరా, చుకు, చుక్వాడీ సిటీలో చిక్కి ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ కొత్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
- వ్యక్తిగత కారణాలతోనే..: నార్త్జోన్ డీసీపీ సుమతి - వేధింపులే కారణం..: హన్మంతరెడ్డి బావ వెంకట్రెడ్డి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో పని చేస్తున్న హన్మంతరెడ్డి అనే కానిస్టేబుల్ ఆదివారం బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. 2010 బ్యాచ్కు చెందిన హన్మంతరెడ్డి గతంలో కార్ఖానా ఠాణాలో విధులు నిర్వర్తించాడు. గుర్తు తెలియని ప్రాంతంలో కిరోసిన్ తాగిన ఆయన ఆదివారం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి కుప్పకూలాడు. అక్కడున్న పోలీసు లు అతన్ని హుటాహుటిన సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హన్మంతరెడ్డి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్లు నార్త్జోన్ డీసీపీ బి.సుమతి చెప్పారు. ఆయన ప్రస్తుతం డీసీపీ కార్యాలయంలోని ఐటీ వింగ్లో పని చేస్తున్నాడని తెలిపారు. సుదీర్ఘకాలంగా అనారోగ్య సెలవులో ఉండటంతో జీతం, ఇంక్రిమెంట్లు కట్ అయ్యాయని, దీంతో ఆర్థిక ఇబ్బం దులు ఎదురైనట్లు హన్మంతరెడ్డి తెలిపాడని వివరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సలహా మేరకు అబ్జర్వేషన్లో ఉంచామని వెల్లడించారు. మెసేజ్ చేశారనే వేధింపులు: పోలీసుల వేధింపులే హన్మంతరెడ్డి ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆయన బావ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ కాలర్ను ఓ ఆటో డ్రైవర్ పట్టుకున్నట్లు వాట్సప్, ట్వీటర్లో వచ్చిందని.. ఆ మెసేజ్ను హన్మంతరెడ్డి ఇతర గ్రూపుల్లో పోస్టింగ్ చేయడంతోనే వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. ఇదే విషయంపై రెండు రోజుల క్రితం టాస్క్ఫోర్స్ ఎస్సై విచారణ కోసం హన్మంతరెడ్డిని తీసుకుని వెళ్లారని తెలిపారు. దీంతో పాటు 2012-13లో విద్యార్థులపై లాఠీచార్జీ చేయాలని కొంత మంది పోలీసులు చెప్పగా.. హన్మంతరెడ్డి చేయలేదని దీంతో అప్పుడు రెండు ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. నాటి నుంచి తీవ్ర మనస్తాపంతో ఉన్న హన్మంతరెడ్డి.. ఇటీవల టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకుని పోవడంతో మానసికంగా మరింత కుంగిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉద్యోగుల పంపిణీకి తుది ప్రణాళిక
- శాఖల వారీగా టాస్క్ఫోర్స్ కమిటీ భేటీ - నేటి నుంచి రెండ్రోజులు వరుస సమావేశాలు -15 మంది అధికారులతో టాస్క్ఫోర్స్ ఉత్తర్వులు - కొత్త జిల్లాల పరిపాలనకు వర్కింగ్ కమిటీలు - జీఏడీలో జిల్లాల పునర్విభజనకు ప్రత్యేక విభాగం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువు దీరేందుకు అవసరమైన ఉద్యోగుల సర్దుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలతో తుది ప్రణాళికలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కేబినేట్ భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సూచించిన మేరకు ఉద్యోగుల కేటాయింపు జరగాలని సూచించారు. నిర్దేశించిన నమూనాలో సిబ్బంది ప్రణాళికను అందజేయాలని ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలకు ఏయే కేడర్ల ఉద్యోగులు, ఎంత మంది అవసరం, ఎవరిని ఎప్పుడు కొత్త జిల్లాలకు పంపాలనే దానిపై చర్చించారు. 15 మందితో టాస్క్ఫోర్స్.. జిల్లాల పునర్విభజనపై సీఎస్ రాజీవ్శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. సీఎస్ చైర్మన్గా ఉండే ఈ కమిటీలో మొత్తం 15 మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సీసీఎల్ఏను మెంబర్ కన్వీనర్గా నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ప్రణాళిక శాఖ, సాధారణ పరిపాలన విభాగం, హోం, ఆర్థిక, ఆర్ అండ్ బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, సర్వీసెస్, ఆర్థిక శాఖ, ఐటీ శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ, సింగరేణి సీఎండీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొన్నారు. జీఏడీలో పునర్విభజన విభాగం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశాలను పరిశీలించడానికి సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగంలో అదనంగా రెండు సెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. జీఏడీ (డీఆర్) సాధారణ పరిపాలన జిల్లాల పునర్విభజన విభాగం పేరుతో ఇది మనుగడలోకి రానుంది. డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ సెక్షన్లు పనిచేస్తాయి. ఈ మేరకు రెండు అసిస్టెంట్ సెక్రెటరీ, నాలుగు సెక్షన్ ఆఫీసర్, నాలుగు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను కొత్తగా మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. విభాగాల వారీగా వర్కింగ్ గ్రూప్లు కొన్ని శాఖలను కుదించడంతో పాటు ఉద్యోగుల సర్దుబాటుకు వీలుగా కొత్త జిల్లాల్లో పరిపాలన స్వరూపాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏయే శాఖలను కొనసాగించాలి, వేటిని విలీనం చేయాలి, ఇప్పుడు జిల్లా పరిధిలో ఉన్న అధికారుల హోదాలను ఎలా మార్చాలనే అంశంపై అధ్యయనానికి శాఖల వారీగా వర్కింగ్ గ్రూప్లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కోడ్ను సమీక్షించే వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న ఎస్ఈలను అన్ని జిల్లాలకు సర్దుబాటు చేయడంతోపాటు ఆ పోస్టును సాగునీటి అభివృద్ధి అధికారి (ఇరిగేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్)గా మార్చాలనే ప్రతిపాదన ఉంది. ఇలాంటి అంశాలపై వర్కింగ్ గ్రూప్లు తమ నివేదికలు ఇస్తాయి. రెండు రోజుల పాటు సమావేశాలు సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్ఫోర్స్ కమిటీ గురువారం నుంచి రెండ్రోజుల పాటు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. ఉద్యోగుల పునఃపంపిణీ ప్రణాళికలు, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక వసతులను ఆ సమావేశాల్లో సమీక్షిస్తారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులంతా సంబంధిత ఉద్యోగుల పంపిణీ ప్రణాళికతో హాజరుకావాలని ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ అన్ని విభాగాలకు నోట్ జారీ చేశారు. అన్ని శాఖలు తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలను నిర్ణీత నమూనా జాబితాగా తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్ సంఖ్య, పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు.. విభజన జరిగితే 27 జిల్లాల వారీగా పోస్టులు, ఉండే ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలు ఆ నిర్ణీత నమూనాలో ఉన్నాయి. -
కొత్త జిల్లాలపై టాస్క్ఫోర్స్
-
జిల్లాలపై టాస్క్ఫోర్స్
- సీఎస్ నేతృత్వంలో ఏర్పాటు: సీఎం కేసీఆర్ నిర్ణయం - అభ్యంతరాలు, సలహాలు పరిశీలించాకే తుది నిర్ణయం - దసరా నుంచే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీ ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. కొత్త జిల్లాల్లో పని విభజన, ఉద్యోగుల కేటాయింపు, పరిపాలన విభాగాల ఏర్పాటు, కొన్ని శాఖల విభజన, పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. సీసీఎల్ఏ రేమండ్ పీటర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, వరంగల్, మెదక్ కలెక్టర్లు వాకాటి కరుణ, రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ కమిటీ సభ్యులుగా ఉంటారు. మరో ఇద్దరు ముగ్గురు సీనియర్ అధికారులను కూడా కమిటీలో నియమించుకోవాలని సీఎం సూచించారు. సోమవారం సచివాలయంలో కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కొనసాగుతున్న పురోగతి, ముసాయిదాపై వస్తున్న అభ్యంతరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఆన్లైన్లో, ప్రత్యక్షంగా ప్రజల నుంచి పలు సూచనలు, అభ్యంతరాలు, సలహాలు వస్తున్నాయని, వాటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. దసరా నుంచే కొత్త జిల్లాలతోపాటు కొత్త డివిజన్లు, కొత్త మండలాలు కూడా ప్రారంభమవుతాయని, దీ నికి సంబంధిం చిన పాలనా విభాగాల కూర్పు వేగవంతం కావాలని ఆదేశించారు. కొత్త ఉద్యోగులను నియమించుకోండి... కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో ఏ విభాగానికి ఎక్కువ పని ఉంది.. క్షేత్రస్థాయిలో ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఎక్కడ ఉంది.. అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగులను నియమించుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పరిపాలనా విభాగాలు ఎలా ఉండాలనే అంశంపై అన్ని ప్రభుత్వ శాఖలు రెండ్రోజుల్లో తమ ప్రతిపాదనలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందించాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రస్తుతమున్న పరిపాలనా విభాగాలను యథావిధిగా కొనసాగించాలా? ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలా? అనే విషయంపై కూడా అధికారులు సూచనలు చేయాలని చెప్పారు. ఆయా శాఖల మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు సమావేశమై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పారు. ఈ నివేదికను సీఎస్ నాయకత్వంలోని టాస్క్ఫోర్స్ కమిటీ పరిశీలిస్తుందని, తర్వాత కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమై పాలనా విభాగాల కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. వారికి అన్యాయం జరగొద్దు తెలంగాణలో జిల్లా, రాష్ట్రస్థాయి కేడర్ మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నందున ప్రస్తుతం జోనల్ అధికారులకు అన్యాయం జరుగకుండా వారిని పోస్టుల్లో సర్దుబాటు చేయాలని సీఎం సూచిం చారు. అధికారులను జిల్లాలకు కేటాయిం చే క్రమంలో సదరు ఉద్యోగి ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వండి జిల్లా అధికారుల కూర్పులో కొత్త పద్ధతి అవలంబించాలని సీఎం చెప్పారు. ప్రతి శాఖకు జిల్లాస్థాయి హోదా ఉన్న అధికారి ఉండాలన్నారు. నీటి పారుదల శాఖకు నీటి పారుదల అభివృద్ధి అధికారి, ఆర్అండ్బీకి రహదారుల అభివృద్ధి అధికారి.. ఇలా ప్రతీ శాఖకు ఓ జిల్లా అధికారి ఉండాలన్నారు. జిల్లా అధికారులుగా నియమించే వారికి అధికారాల బదలాయింపు జరగాలన్నారు. వ్యవసాయం, వైద్యం, విద్య తదితర విభాగాల్లో అవసరాల ప్రాధాన్యం మేరకు ఉద్యోగుల సర్దుబాటు జరగాలన్నారు. సూపర్వైజరీ పోస్టుల కన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులే ఎక్కువ అవసరం కాబట్టి.. మం డల స్థాయి అధికారులు, సిబ్బంది నియామకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. ఒకే రకమైన పనితీరు ఉన్న విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి ఒకే అధికారిని నియమించటం సబబుగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. -
ఒలింపిక్స్ పతకాల కోసం ఇప్పటి నుంచే
న్యూఢిల్లీ: వచ్చే మూడు ఒలింపిక్స్ ఈవెంట్లలో భారత్ మెరుగైన ప్రదర్శన చేసి, ఆశించిన స్థాయిలో పతకాలు సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపడుతోంది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఓ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ కమిటీలో క్రీడాకారులు, మాజీలకు చోటు కల్పించనున్నారు. రియో ఒలింపిక్స్లో భారత్కు రెండే పతకాలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగుతేజం పీవీ సింధు బ్యాడ్మింటన్లో రజతం, రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య సాధించడం మినహా స్టార్ క్రీడాకారులు పతకాల వేటలో విఫలమయ్యారు. క్రీడాకారులకు తగిన మౌలికసదుపాయాలు కల్పించి ప్రోత్సహించాలని, చాంపియన్లను తయారు చేయడానికి ప్రభుత్వం తగిన స్పోర్ట్స్ పాలసీని అమలు చేయాలని మీడియా, క్రీడా వర్గాల నుంచి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్టు మోదీ ప్రకటించారు. -
డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్!
అంతర్రాష్ట్ర డ్రగ్స్ గ్యాంగ్ గుట్టురట్టు నైజీరియన్ల దందా ఏడుగురి అరెస్టు.. కొకైన్, బ్రౌన్షుగర్ స్వాధీనం హైదరాబాద్: గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్షుగర్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 మధ్య బిజినెస్ వీసాతో భారత్కు వచ్చారు. కోయంబత్తూర్లో వస్త్రాలు ఖరీదు చేసి నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు. సొలోమెన్, చుకు, ప్రామిస్ నగరంలోని బండ్లగూడ, సైనిక్పురి, టోలిచౌకి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మిగిలిన నలుగురూ గోవాలో ఉంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొకైన్ను సమీకరిస్తున్న రఫెల్ దీన్ని విక్రయించడానికి దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికైనా డ్రగ్ సరఫరా చేయడానికి అనోరా, పీటర్ను వినియోగించుకునే వాడు. వీరిద్దరూ బస్సులు, రైళ్లల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ ఇచ్చి వచ్చేవారు. రూ. 2.5 వేలకు కొనుగోలు, రూ.5 వేలకు విక్రయం.. ఈ మాదక ద్రవ్యాన్ని గ్రాము రూ.2,500 నుంచి రూ.3 వేలకు రఫెల్ కొనేవాడు. దీన్ని ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్మేవాడు. ఆయా నగరాల్లో కస్టమర్లుగా ఉన్న విద్యార్థులు, యువతకు భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ప్రామిస్ అనే నైజీరియన్ జాన్ అనే మరో వ్యక్తి నుంచి కొకైన్, బ్రౌన్షుగర్ ఖరీదు చేసి విక్రయిస్తున్నాడు. రఫెల్తో పాటు నిందితులంతా హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.. సీసీఎస్లోని నార్కొటిక్ సెల్ అధికారులతో కలసి వలపన్ని ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై హైదరాబాద్తో పాటు గోవా, ముంబై తదితర నగరాల్లో కేసులున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మాదకద్రవ్యాల దందాలో సంపాదించిన మొత్తాన్ని ఈ ముఠా తమ స్వదేశానికి వస్త్రాల రూపంలో పంపేస్తున్నారు. ప్రతి డీల్లోనూ వచ్చిన లాభాలతో కోయంబత్తూర్లో రెడీమేడ్, ఇతర వస్త్రాలు ఖరీ దు చేస్తున్నారు. వీటిని నైజీరియాకు ఎక్స్పోర్ట్ చేస్తూ, తమ అనుచరులు ద్వారా అమ్మించి సొ మ్ము చేసుకుంటున్నారు. కేసును తదుపరి ద ర్యాప్తు నిమిత్తం యాంటీ నార్కొటిక్స్ సెల్కు అప్పగించారు. -
ఇంజనీరింగ్ కళాశాలల్లో టాస్క్ఫోర్స్ తనిఖీలు
3 కళాశాలల్లో శుక్ర, శనివారాల్లో తనిఖీలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల నిర్వహణపై టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కళాశాలల్లో ఆయా కోర్సులకు ఫీజులు పెంచాలన్న యాజమాన్యాల డిమాండ్తో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. 5 మంది సభ్యులతో కూడిన బృందం ఆయా కళాశాలల్లో మౌలిక వసతులపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపధ్యంలో బృందం గతనెల 29, 30 తేదీల్లో జిల్లాలోని మూడు ప్రధాన ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించింది. అకౌంట్స్, ఫ్యాకల్టీ, విద్యార్థుల సంఖ్య, ల్యాబ్ల నిర్వహణ, కంప్యూటర్స్ తదితర వాటిని పరిశీలించారు. ఆయా కళాశాలల్లో లోపాలను గుర్తించి, నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం. దీంతో మిగిలిన కళాశాలల యాజమాన్యం ఆందోళన పడుతోంది. మౌలిక వసతులు అంతంత మాత్రమే: జిల్లాలోని ఒకటి రెండు కళాశాలలు తప్ప మిగిలిన కళాశాలల్లో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని కళాశాలలు ల్యాబ్ల కోసం పొరుగున ఉన్న చిత్తూరు జిల్లాలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలపై ఆధారపడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. బీటñ క్ పూర్తి చేసిన వారిని ఫ్యాకల్టీగా నియమించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక కళాశాలలో మాత్రమే 100శాతం సీట్లు భర్తీ అయ్యాయంటే కళాశాలల నిర్వహణ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇంజినీరింగ్ కళాశాలలు, టాస్క్ఫోర్స్, వసతుల లేమి -
ఆక్రమిత స్థలాల పరిశీలన..
ప్రొద్దుటూరు: ఆక్రమణలో ఉన్న వక్ఫ్బోర్డు స్థలాలను రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వక్ఫ్బోర్డు సీఈఓ ఎల్.అబ్దుల్ ఖాదర్, టాస్క్ఫోర్సు ఆఫీసర్ అబ్దుల్ ఉద్దూస్, డెరైక్టర్ మేనేజ్ మెంట్ క్లర్క్ ఖాజామొహిద్దీన్, జిల్లా వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహ్మద్షఫివుల్లా, జూనియర్ అసిస్టెంట్ గౌస్ కర్నూలు జిల్లా నుంచి మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడంపల్లె మసీదు పరిధిలో అక్రమంగా అమ్మిన స్థలాల గురించి ఆరా తీశారు. అలాగే చౌసేన్వలి ఆస్తుల వివరాల గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం డీఎస్పీ నీలం పూజితను కలిశారు. ఈ నెల 11న సాక్షిలో ‘ఆక్రమణలకు అడ్డేది’ శీర్షికన వక్ఫ్బోర్డు స్థలాల ఆక్రమణపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి: వరద వక్ఫ్బోర్డు భూములను, ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం అధికారులను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రొద్దుటూరు పరిధిలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన తెలిపారు. పోలీసు కేసులకే పరిమితమైతే ఫలితం ఉండదని, వీటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఖాజామొహిద్దీన్ కూడా వక్ఫ్బోర్డు ఆస్తుల అన్యాక్రాంతపై అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి కేసుల్లో ఉన్న వారు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి వర్గీయులుగా ఉండటం కొసమెరుపు. -
కల్తీ.. ‘కిక్కు’
♦ మారుమూల ప్రాంతాల్లో జోరుగా మద్యం దందా ♦ గుట్టుచప్పుడు కాకుండా కాస్ట్లీ సరుకులోనూ.. ♦ ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు విక్రయాలు ♦ టేకులపల్లిలో టాస్క్ఫోర్స్కు చిక్కిన వ్యవహారం ♦ నామమాత్రపు దాడులతో సరిపెడుతున్న ఎక్సైజ్శాఖ ఒకటో పెగ్గు.. రెండో పెగ్గు దాకా ఓకే.. ఆ తర్వాత మందుబాబులు మత్తులోకి జారుకుంటారు. ఇక కొన్ని బార్షాప్ నిర్వాహకులు కల్తీ మూత తీస్తారు. కాస్ట్లీ మందులో ‘చీప్’క్వాలిటీని కలిపేస్తారు. అది తాగిన మద్యం ప్రియులకు ఇంకాస్త కిక్కు ఎక్కుతుంది. మళ్లీ.. మళ్లీ అదే బార్షాప్నకు వచ్చి కాస్ట్లీ మందుకు డబ్బు చెల్లించి కల్తీ మద్యం తాగివెళ్తుంటారు. మారుమూల ప్రాంతాల్లో మస్తుగా జరుగుతున్న ఈ కల్తీ మద్యం దందా టాస్క్ఫోర్స దాడులతో టేకులపల్లి మండలకేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఏటా మద్యం కల్తీ దందా జోరుగా సాగుతూనే ఉంది. గతంలో వైరాలో కల్తీ మద్యంపై మద్యం ప్రియులు ఆందోళన చేశారు. ఈ సారి కూడా ఈ దందా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వైన్ షాపుల్లో సాగుతున్నా, ఎక్సైజ్శాఖ నామమాత్రపు దాడులతోనే సరిపెడుతోంది. టేకులపల్లి మండల కేంద్రంలోని వైన్షాపుపై టాస్క్ఫోర్స్ బుధవారం దాడులు చేసింది. కల్తీ మద్యం కలుపుతుండటంతోపాటు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తుండటంపై కేసులు నమోదు చేసింది. ఈ దాడులు జిల్లావ్యాప్తంగా సాగితేనే ఈ దందాకు చెక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉన్న సీలు ఉన్నట్టే.. జిల్లాలో 148 మద్యం దుకాణాలున్నాయి. ఇందులో మారుమూల ప్రాంతాల్లో ఉన్న దుకాణాలపై ఎక్సైజ్శాఖ నిఘా కొరవడిందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఎమ్మార్పీకన్నా ఎక్కువకు విక్రయిన్నారని అంటున్నారు. లిక్కర్, బీర్ బాటిళ్లపై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇందులోనూ ఎక్కువ ధర ఉన్న బాటిళ్లలో ధర తక్కువగా ఉన్న మద్యం కలుపుతుండటం గమనార్హం. రాయల్ స్ట్రాగ్, బ్లెండర్స్స్పైడ్, ఐబీ బాటిళ్లలోనే ఎక్కువగా చీప్ లిక్కర్ను కలుపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ బాటిళ్లకు ఉన్న సీల్ను అలాగే ఉంచి.. మూతను చాకచక్యంగా తొలగించి అందులో చీప్ లిక్కర్ను కలుపుతారు. ఒక్కో ఫుల్ బాటిల్ నుంచి క్వార్టర్ బాటిల్ మద్యం తీసి దీనిలో చీప్ లిక్కర్ను ఈ ప్రక్రియలో నైపుణ్యం ఉన్న వారితో కలిపిస్తున్నారు. వీటిని కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువగానే విక్రయిస్తున్నారు. టేకులపల్లిలో టాస్క్ఫోర్స్కు చిక్కి తాజాగా టేకులపల్లిలో ఓ వైన్షాపుపై టాస్క్ఫోర్స్ బృందం దాడి చేసి ఈ దందాపై కేసులు నమోదు చేసింది. టేకులపల్లిలోని బోడబజారులో ఉన్న రవి వైన్స్కు టాస్క్ఫోర్స్ బృందం వచ్చి ఎవరికీ అనుమానం రాకుండా మద్యాన్ని ఏ రేట్లకు అమ్ముతున్నారో స్వయంగా పరిశీలించింది. ఆ తర్వాత షాపు వెనుకాలే ఉన్న గోదాంలోకి వెళ్లారు. అదే సమయంలో మద్యం బాటిళ్లలో ఇతర ద్రావణాన్ని కలుపుతుండటాన్ని గమనించారు. మద్యాన్ని కల్తీ చేస్తున్నారనే అనుమానంతో బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. షాపు లెసైన్స్ పత్రాలను పరిశీలించారు. షాపు, గోదాంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధిక రేట్లకు మద్యం విక్రయాలు, కల్తీ మద్యం నేపథ్యంలో షాప్, గోదాంకు తాళాలు వేయించి.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఇల్లెందు ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ఏజెన్సీలో మారుమూల ఉన్న మండల కేంద్రాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఎవరికీ అనుమానం రాకుండా గోదాంలో కల్తీ చేస్తున్నారు. మద్యం మత్తులో బార్లలోనూ... జిల్లావ్యాప్తంగా 46 బార్లున్నాయి. ఇందులో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. బార్లలో ఫుల్ బాటిల్ కాకుండా పెగ్ల వారీగా మద్యం విక్రయిస్తారు. ఒక పెగ్, రెండు పెగ్లు కంపెనీ మద్యం ఇచ్చిన తర్వాత.. మద్యం కల్తీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బార్లపై ఎక్సైజ్శాఖ అధికారులు కనీస తనిఖీలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఈ పాస్ గుట్టు విప్పుతోంది...!
► వేలిముద్ర వేస్తేనే సరుకులు వినియోగం ► లేని కార్డులు40 శాతం పైనే బయటపడుతున్న డీలర్ల చేతివాటం సాక్షి, సిటీ బ్యూరో : గ్రేటర్ హైదరాబాద్ ప్రజాపంపిణీ వ్యవస్ధ లో ఈ-పాస్ అమలు డీలర్ల గుట్టు విప్పుతోంది. ఆహార భద్రత కార్డుల్లో వినియోగంలో లేనివి 40 శాతం పైనే ఉన్నట్లు తేటతెల్లమైంది. ఇప్పటి వరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రతి నెలా వందల కోట్ల రూపాయల సబ్సిడీ బియ్యం పక్కదారి పడ్డాయా..? అంటే అవుననేపిస్తోంది. సాక్షాత్తూ స్పెషల్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ (ఎస్ఓటీ) సైతం దాడుల సందర్భంగా పేర్కొంటూ వచ్చింది. తాజాగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో ఈ-పాస్ అమలుతో డీలర్ల చేతివాటానికి చెక్ పెట్టినట్లయింది. ఈ-పాస్ అమలుకు ముందు ఫిబ్రవరి మాసం వరకు సుమారు 90 నుంచి 95 శాతం వరకు కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తుం డగా.... ఈ-పాస్ పూర్తి స్థాయి అమలుతో వినియోగకార్డుల సంఖ్య ఒకేసారి 60 శాతానికి పడిపోయింది. దీనిని బట్టి డీలర్ల మాయజాలంతో వినియోగం లేని కార్డుల సరుకు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతోందని రికార్డులను బట్టి తెలుస్తోంది. ఇదీ పరిస్థితి... గ్రేటర్ హైదరాబాద్లోని జంట పౌర సరఫరాల శాఖకు చెందిన 12 అర్బన్ సర్కిళ్లలో 13.57 లక్షల మంది కార్డుదారులు ఉండగా ప్రతి నెలా సగటున 12 లక్షల కార్డుదారుల వరకు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. తాజాగా ఈ-పాస్ అమలుతో సరుకులు తీసుకుంటున్న కార్డుదారుల సంఖ్య ఒకే సారి తగ్గిపోయింది. ప్రస్తుత నెలలో సరుకుల పంపిణీ గడువు ముగిసే బుధవారం నాటికి 8.67,208 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు ఈ-పాస్లో రికార్డు అయింది. ఏప్రిల్ లో మొత్తం కార్డుదారుల్లో 8,51,205 కార్డుదాలు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు నమోదైంది. మొత్తం మీద హైదరాబాద్లోని 859 చౌకధరల దుకాణాల పరిధిలో మొత్తం 7,95,418 కార్డులు ఉండగా ఈ నెల 4,94,996 కార్దుదారులు, గత నెలలో 4,87,623 కార్డుదారులు సరుకులు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా అర్బన్ లోని 684 దుకాణాల పరిధిలో మొత్తం 5,61,880 కార్డు దారులు ఉండగా ఈ నెలలో 3,72,212 కార్డుదారులు, గత నెలలో 3,63,582 కార్డు దారులు మాత్రమే సరుకులు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. దీనిని బట్టి సబ్సిడీ సరుకులు ఇప్పటి వరకు పెద్ద ఎత్తున పక్కదారి పడినట్లు స్పష్టం అవుతోంది. -
స్నాచర్ల వేటలో దిట్ట
టాస్క్ఫోర్స్ హెచ్సీ వెంకటస్వామి నేపథ్యమిది సర్వోన్నత పోలీసు పతకం పొందిన ఇద్దరిలో ఒకడు ‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే సిటీబ్యూరో: స్నాచర్ పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్లో హెడ్-కానిస్టేబుల్గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు. -
నా భర్తను విడిపించండి
► మగ్గాల నిర్వాహకుడి భార్య వేడుకోలు ►24 గంటలు గడిచినా తెలియని జింకా రామాంజనేయులు ఆచూకీ ► రంగంలోకి స్పెషల్, టాస్క్ఫోర్స్ పోలీసులు ధర్మవరం: నా భర్తను విడిపించండి.. అంటూ ధర్మవరంలో కిడ్నాప్నకు గురైన జింకా రామాంజనేయులు భార్య జింకా లక్ష్మిదేవి కన్నీటి పర్యంతమైంది. రామాంజనేయులును కిడ్నాప్ చేశామంటూ వాట్సప్ ద్వారా వీడియో పంపి డబ్బులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రామాంజనేయులు కిడ్నాప్ జరిగినప్పటి నుంచి వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కిడ్నాప్ సంఘటన వెలుగులోకొచ్చి 24 గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం లేదు. ధర్మవరం పోలీసులు, అనంతపురం స్పెషల్ టాస్క్ఫోర్స పోలీసులు రంగంలోకి దిగి మమ్ముర గాలింపుచర్యలు చేపట్టారు. అయినా ఇప్పటి దాకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. విచారంలో కుటుంబ సభ్యులు : రామాంజనేయులు, లక్ష్మిదేవికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి అభిశ్రీ, తనుశ్రీ కుమార్తెలు ఉన్నారు. రామాంజనేయులు శారదానగర్లో 8 మగ్గాలు ఏర్పాటు చేసుకొని కూలీల ద్వారా పట్టు చీరలు తయారు చేస్తుండేవాడు. అతను ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదని, వివాదరహితుడని, ఎలాంటి దురలవాట్లు లేవని స్థానికులు చెప్తున్నారు. అయితే శనివారం సాయంత్రం కిడ్నాప్ సంగతి పత్రికలు, మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు, పట్టణ వాసులు రామాంజనేయులు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. -
సిద్దిపేట.. ఇక క్లీన్ సిటీ!
♦ మున్సిపాలిటీని ఎంపిక చేసిన కేంద్రం ♦ సమగ్రాభివృద్ధికి కొత్త ప్రణాళిక ♦ అన్ని వర్గాలచే టాస్క్ఫోర్స్ ఏర్పాటు ♦ రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు ♦ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం నివేదిక సిద్దిపేట జోన్: వినూత్న పథకాలు, ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీకి కేంద్రం మరో అవకాశాన్ని కల్పించింది. శానిటేషన్ను ఆధారంగా పట్టణాన్ని సమగ్రాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఐదు కార్పొరేషన్లను, ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. జిల్లా నుంచి సిద్దిపేటకు అవకాశం దక్కడం విశేషం. శానిటేషన్ టాస్క్ఫోర్స్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచన మేరకు సిద్దిపేట మున్సిపల్ అధికారులు శుక్రవారం కొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ ముఖ్యులుగా పట్టణంలోని విభిన్న వర్గాలకు చెందిన 30 మందితో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి తొలిసమావేశం నిర్వహించారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు అందజేసేందుకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందించారు. ఇటీవల కేంద్రం తెలంగాణలోని 64 మున్సిపాలిటీల్లో లక్ష జనాబా ప్రతిపాదికను ప్రమాణికంగా తీసుకుని ఐదు మున్సిపాలిటీలను ఎంపిక చేసింది. వాటిలో సిద్దిపేటకు అవకాశం దక్కింది. ఇప్పటికే పట్టణంలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగుతున్న సిద్దిపేట.. ఇంటింటికి తడి, పొడి చెత్తసేకరణతో పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే పట్టణంలో కంపోస్ట్ యార్డు, డంప్యార్డుతో పాటు తడిపొడి చెత్త సేకరణ ఐటీసీ హబ్లాంటి వినూత్న ప్రయోగాలను కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే శానిటేషన్ను వందశాతం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి వివిధ పథకాల ద్వారా విడుదలవుతున్న నిధుల వివరాలను, వాటి వినియోగాన్ని నివేదిక రూపంలో అందించాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు ప్రణాళికపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం అడుగు ముందుకేసింది. చైర్మన్, కమిషనర్ నేతృత్వంలో పట్టణంలోని స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, మహిళ సంఘాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు శాఖకు చెందిన అధికారులచే టాస్క్పోర్స్ను ఏర్పాటు చేసింది. ఆయా వార్డుల్లో ప్రజల ఆవసరాలను, మున్సిపల్ పరంగా చేపట్టాల్సిన గురుతర భాద్యతను సలహసూచనల రూపంలో టాస్క్ఫోర్సు నివేదిక రూపొందించాల్సి ఉంది. ముఖ్యంగా శానిటేషన్, నీటి సరఫరాపై ఇప్పటికే సఫలీకృత బాటలో ఉన్న మున్సిపల్కు కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద సీవరేజి ప్లాంట్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు నిధులను కూడా కేటాయించారు. ఈ ప్రక్రియ విజయవంతం అయితే సిద్దిపేట పట్టణం స్మార్ట్సీటితో పాటు క్లిన్సిటీగా మారడం ఖాయం ఆ దిశగా భవిష్యత్తు ప్రణాళిక కోసం మున్సిపల్ అధికారులు రూ. 144 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదన నివేదికను అందించనున్నారు. -
మిషన్ ఇంద్రధనుష్ విజయవంతం చేయండి
సాక్షి,సిటీబ్యూరో: జిల్లాలో మిషన్ ఇంధ్రధనుష్ మూడవ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని ఇన్చార్జి ఏజేసీ అశోక్కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వ తేదీ 13 వరకు నాలుగు రోజుల పాటు ఇంద్ర దనుష్ మూడవ విడత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 0-2 ఏళ్ల వయస్సు పిల్లలతోపాటు గర్భిణి స్త్రీలకు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని సూచించారు.ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మూడవ విడత ఇంద్రధనుష్ ఏర్పాట్లపై వివరించారు. సమావేశంలో అడిషనల్ డీఎంఅండ్ హెచ్ఓ పద్మజ, డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆటకట్టు
► ముగ్గురిని అరెస్టు చేసిన టాస్క్ఫోర్స్ సాక్షి, సిటీబ్యూరో: వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్థల పేర్లతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను తూర్పు మండల టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరి నుంచి 160 నకిలీ సర్టిఫికెట్లు, 30 బోగస్ ఉద్యోగ సిఫార్సు లేఖలు,10 నకిలీ బ్యాంకు స్టేట్మెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన బి.శేఖర్ నర్సారావుపేటలో 2010లో బీటెక్ ఫెయిలయ్యాడు. గుంటూరులో మూడు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. ఉద్యోగం కోసం 2014లో అమెరికా వెళ్లాలని భావించిన శేఖర్ గుంటూరులో శౌర్య కన్సల్టెన్సీ నిర్వాహకుడు రవిని సంప్రదించాడు. డిగ్రీ లేనిదే ఆయా దేశాలకు వెళ్లడం అసాధ్యమని అతను చెప్పాడు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేల్ నకిలీ విద్యార్హత పత్రాలు విక్రయిస్తాడని తన బంధువు విజయ్ ద్వారా శేఖర్ తెలుసుకున్నాడు. రూ.38 వేల వెచ్చించి ఇమ్మానుయేల్ ద్వారా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు నుంచి బుందేల్ఖండ్ వర్శిటీకి చెందిన డిగ్రీ సర్టిఫికెట్ ఖరీదు చేశాడు. దీని ఆధారంగా న్యూజిలాండ్లోని ఓ సంస్థలో పీజీ డిప్లమోకు దరఖాస్తు చేసుకున్నా సీటు రాలేదు. దీంతో తాను కూడా నకిలీ సర్టిఫికెట్ల విక్రయించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న శేఖర్... రవి, ఇమ్మానుయేల్తో కలిసి రంగంలోకి దిగాడు. ఎస్సార్నగర్ పరిధిలో శేఖర్ గ్రూప్ ఓవర్సీస్ సర్వీస్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. నకిలీ సర్టిఫికెట్ల కోసం తమ వద్దకు వచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఈ ముఠా ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు సాయంతో వాటిని రూపొందించి అందిస్తున్నారు. ఢిల్లీ, తమిళనాడు, ఝూన్సీ, సిక్కిం యూనివర్శిటీల పేర్లతో తయారవుతున్న నకిలీ సర్టిఫికెట్లను భారీ మొత్తాలకు అమ్ముతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం ఆదివారం దాడి చేసిన శేఖర్, రవి, ఇమ్మానుయేల్లను అరెస్టు చేసింది. కేసును ఎస్సార్నగర్ పోలీసులకు అప్పగించిన టాస్క్ఫోర్స్ పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తోంది. -
రూ.3.5 కోట్ల ఎర్రచందనం పట్టివేత
పోలీసుల అదుపులో ఇద్దరు కూలీలు తిరుపతి మంగళం/ఎర్రావారిపాళెం: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున వన్యప్రాణుల విభాగం అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసులు రెండు చోట్ల కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సుమారు రూ.3.5 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకొని, ఇద్దరు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. మామండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం డంప్ను గుర్తించినట్లు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్వో) చలపతిరావు తెలిపారు. ఈ సమయంలో అధికారుల రాకను గమనించి కొందరు కూలీలు పరారవ్వగా.. తమిళనాడులోని వేలూరుకు చెందిన రమేశ్ అనే కూలీని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ, తువ్ముచేనుపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారంటూ అందిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఆర్ఎస్ఐ భాస్కర్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం భాకరాపేట ఘాట్లో కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన సువూరు వంద మంది కూలీలు పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసి పారిపోయేందుకు యుత్నించారు. ఈ దాడిలో శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ గాయుపడ్డాడు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. -
17 మంది ఎర్రకూలీల అరెస్టు
► 19 ఎర్రదుంగలు, ద్విచక్ర వాహనం స్వాధీనం ► పోలీసులపై తిరగబడ్డ ఎర్రకూలీలు తిరుపతి క్రైం: తిరుపతి- కరకంబాడీ రోడ్డులోని రెడ్డిభవనం వద్ద బుధవారం ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న వారిపై దాడి చేసి 15 మంది ఎర్రకూలీలను అరెస్టు చేసినట్టు ఈస్టు డీఎస్పీ మురళీకృష్ణ, టాస్క్ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. వారు గురువారం అలిపిరి పోలీసు స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుగా అందిన సమాచారం మేరకు కరకంబాడి రోడ్డులోని రెడ్డిభవనం సమీపంలోని శేషాచలం రిజర్వ్ ఫారెస్టులో ఆంధ్ర, తమిళనాడుకు చెందిన 17 మంది కూలీలు, స్మగ్లర్లు 13 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా గుర్తించామన్నారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా రంపాలు, గొడ్డళ్లు, రాళ్లతో దాడిచేకి దిగారని పేర్కొన్నారు. అలిపి రి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చాకచక్యంగా వ్యవహరించి 15 మంది ఎర్రకూలీలను పట్టుకున్నారని, మరో ఇద్దరు స్మగ్లర్లు పరారయ్యారని తెలిపా రు. వారు తిరుపతికి చెందినవారని, ఎర్రచందనం రవాణాకు పెలైట్లుగా వ్యవహరిస్తున్నారని వెల్లడిం చారు. అరెస్టు చేసిన వారిలో ఆది అనే వ్యక్తి మేస్త్రీగా ఉంటూ కూలీలను శేషాచలం అడవిలోకి పంపి అక్రమ రవాణా చేస్తున్నట్టు తేలిందన్నారు. దుంగలను రహస్య ప్రదేశాలకు తరలించి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడుకు చెందిన బడాస్మగ్లర్లకు పంపుతున్నారని వివరిం చారు. వారిని పోలీసులు అడ్డుకుంటే చంపేందుకు కూడా వెనుకాడరని పేర్కొన్నారు. నిందితుల నుంచి 13 ఎర్రచందనం దుంగలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీ నం చేసుకున్నామన్నారు. వీరందరిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చంద్రగిరిలో.. చంద్రగిరి : సుమారు రూ.5 లక్షల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్టు డీఆర్వో విజయ్కుమార్ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి శేషాచలం అటవీ ప్రాంతం సచ్చినోడుబండ సమీపంలోని సన్నరాళ్ల గుట్ట వద్ద కూంబింగ్ చేపట్టామన్నారు. ఏడుగురు కూలీలు ఎర్రచందనం దుంగలను మోసుకొస్తుండగా దాడి చేశామన్నారు. తమను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా రామిరెడ్డిపల్లికి చెందిన హరి, అయినార్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కూచువారిపలికి చెందిన ఎర్రక్క, ఆమె మనవడు నవీన్నాయుడు, రంగంపేట దుర్గాకాలనీకి చెందిన పోలా వెంకటేష్, మారయ్య, చిన్నవెంకటేష్ పారిపోయారని వివరించారు. ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీ నం చేసుకున్నట్టు చెప్పారు. ఎర్రక్క విద్యానికేతన్ సమీపంలో దుకాణం ఏర్పాటు చేసుకుని స్మగ్లర్లకు సరుకులు పంపిణీ చేస్తోందని, ఆమె మనవడు నవీన్తో కలిసి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందిందని పేర్కొన్నారు. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
హైటెక్ బెట్టింగ్ దందా గుట్టు రట్టు
క్యాష్ డెలివరీ బాయ్ పట్టివేత పరారీలో బుకీలు సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా హైటెక్ పద్ధతిలో కొనసాగుతున్న బెట్టింగ్ దందా గుట్టును రట్టు చేశారు దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు. ముఠాకు చెందిన క్యాష్ డెలివరీ బాయ్ను అరెస్టు చేసి రూ.7.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... ఫీల్ఖానాకు చెందిన విశాల్విశాల్ గతంలోనూ క్రికెట్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ముఖేష్, గౌరవ్లతో కలిసి ముఠా ఏర్పాటు చేసిన విశాల్ పోలీసులకు చిక్కకుండా పక్కాగా దందా నిర్వహిస్తున్నాడు. గోవాలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఈ ముగ్గురూ బల్క్ ఎస్సెమ్మెస్ల ద్వారా సందేశాలు పంపుతూ పంటర్లను ఆకర్షిస్తున్నారు. పందాలు కాసేవారి (పంటర్లు) నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకోవడానికి, వాటిని రికార్డు చేయడానికి ఉద్యోగుల్ని నియమించుకున్నారు. పందెం డబ్బు వసూళ్లు, గెలిచిన వారికి చెల్లింపులు చేయడానికి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ రకంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు టర్నోవర్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎ.యాదగిరి నేతృత్వంలోని బృందం బుధవారం వలపన్నింది. క్యాష్ డెలివరీ బాయ్గా పని చేస్తున్న నిఖిల్ షాను పట్టుకున్న అధికారులు రూ.7.5 లక్షలు, ద్విచక్ర వాహనం, సెల్ఫోన్లు రికవరీ చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల (బుకీలు) కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం షాహినాయత్గంజ్ పోలీసులకు అప్పగించారు. -
‘డెయిరీ’ ముసుగులో క ల్తీ నెయ్యి తయారీ
► సితార అగ్మార్క్ పేరుతో విక్రయం ► ‘వెంకటేశ్వర డెయిరీ ఫామ్’పై ► టాస్క్ఫోర్స్ దాడి ► ఇద్దరి అరెస్ట్, 930 లీటర్లు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: డెయిరీ ఫామ్ ముసుగులో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టును ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి భారీగా కల్తీ నెయ్యి, తయారీకి ఉపకరించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట మహంకాళి తోట ప్రాంతానికి చెందిన గాజుల నటరాజ్ కార్ఖానాలో వెంకటేశ్వర డెయిరీ ఫామ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. డెయిరీ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇతను కల్తీ నెయ్యి తయారీకి తెరలేపాడు. పామాయిల్, వనస్పతి, క్రీమ్లు కలిపి నెయ్యిని తయారు చేసి ‘సితార అగ్మార్క్’ పేరుతో విక్రయిస్తున్నాడు. తన డ్రైవర్ జోజిబాబు ద్వారా కల్తీ నెయ్యిని దుకాణాలకు సరఫరా చేయిస్తున్నాడు. వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే ఈ దందాపై ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ కె.నరేష్ గౌడ్కు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శివ తమ బృందాలతో దాడి చేసి నటరాజ్, జోజిబాబుల్ని అరెస్టు చేశారు. 930 లీటర్ల కల్తీ నెయ్యి, 700 లీటర్ల క్రీమ్, 92 లీటర్ల పామాయిల్, 10 లీటర్ల వనస్పతి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. -
లబ్ధిదారుల ఎంపికకు.. దారిద్య్రరేఖకు సంబంధం లేదు
దక్షిణాది రాష్ట్రాలతో నీతి ఆయోగ్ టాస్క్ఫోర్స్ భేటీలో పనగారియా సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖ అనేది పేదరికాన్ని అంచనా వేసే కొలమాన మాత్రమే తప్ప పేదరిక నిర్మూలన పథకాలు, కార్యక్రమాల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రామాణికం కాదని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా స్పష్టం చేశారు. పేదరికపు శాతం ఏ మేరకు తగ్గిందోఅంచనా వేసే దారిద్య్ర రేఖను లబ్ధిదారుల ఎంపికతో ముడిపెట్టొద్దని అన్ని రాష్ట్రాలూ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు చెప్పారు. అందరికీ ఇళ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, ఆహార భద్రత, పారిశుద్ధ్యం తదితర పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక మార్గదర్శకాలకు దారిద్య్ర రేఖతో సంబంధమే లేదని ఉదాహరించారు. నీతి ఆయోగ్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పేదరిక నిర్మూలన టాస్క్ఫోర్స్.. దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో హైదరాబాద్లో బుధవారం తొలి సమావేశం ఏర్పాటు చేసింది. నీతి ఆయోగ్ సలహాదారు అశోక్కుమార్ జైన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ఏపీ సీఎస్ ఎస్పీ టక్కర్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షదీవులకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో స్త్రీ నిధి భేష్: మహిళా స్వయం సహాయక సంఘాలకు 48 గంటల్లోనే రుణమిచ్చేలా తెలంగాణలో అమలవుతున్న స్త్రీ నిధి కార్యక్రమాన్ని పనగారియా ప్రశంసించారు. ‘‘తమిళనాడులో అక్షయపాత్ర పేరుతో అమలవుతున్న మధ్యా హ్న భోజన పథకం ఆదర్శంగా ఉంది.పంట ఉత్పత్తులు, మార్కెటింగ్కు స్వయం సహాయక సంఘాలతో రైతులను అనుసంధానం చేయడం ఏపీలో సత్ఫలితాలిచ్చింది. వ్యవసాయ సీజన్లో కూలీల కొరతను అధిగమించేందుకు 75 శాతం చెల్లించేందుకు రైతులు ముందుకొస్తే మిగతా 25 శాతాన్ని ఉపాధి హామీ నుంచి చెల్లించాలనే టాస్క్ఫోర్స్ ప్రతిపాదనను కౌలు రైతులకూ వర్తింపజేయాలని ఏపీ సూచించింది. ఉపాధి హామీ పనుల్లో 40 శాతం యంత్ర సామూగ్రి, 60 శాతం కూలీలుండాలనే నిబంధనను పంచాయతీ యూనిట్గా కాకుండా జిల్లా యూనిట్గా పరిగణనలోకి తీసుకోవాలనే సూచన వచ్చింది’’ అన్నారు. తాగునీరు మహాప్రభో! ఈ భేటీలో పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండా అయినా, దాదాపుగా రాష్ట్రాలన్నీ తాగునీటి సమస్యను నీతి ఆయోగ్ దృష్టికి తీసుకెళ్లాయి. తాగునీటి కొరతను తీర్చేందుకు అత్యంత ప్రాధాన్య క్రమంలో చర్యలు చేపట్టాలని కోరాయి. ఆర్థిక సాయమందిచాలని కోరగా, కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పనగారియా అన్నారు. మిషన్ భగీరథకు ఆర్థిక సాయం చేయాలన్న అధికారుల విజ్ఞప్తిపై ఆచితూచి స్పందించారు. టాస్క్ఫోర్స్ కమిటీ ఈనెల 22న జైపూర్లో పశ్చిమాది రాష్ట్రాలతో, మే 2న ఉత్తరాది రాష్ట్రాలతో, మే 6న ఈశాన్య రాష్ట్రాలతో సమావేశమవుతుందని చెప్పారు. -
బాబోయ్.. బ్లేడ్ బ్యాచ్
మళ్లీ తెరపైకి ఆగడాలు గంజాయి మత్తులో దందాలు భయపెట్టి డబ్బు వసూలు చేయటమే లక్ష్యం రైల్వేస్టేషన్ కేంద్రంగా కార్యకలాపాలు చిట్టినగర్ ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టి విజయవాడ : నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయి. మత్తులో చిన్నపాటి వివాదానికే పరస్పరం దాడులు చేసుకోవటం, డబ్బు వసూళ్లలో తేడాలు వచ్చి ఒక బ్యాచ్ సభ్యులపై మరో బ్యాచ్ సభ్యులు దాడులకు దిగటం నగరంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం చిట్టినగర్ ప్రాంతంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలు పరస్పరం బ్లేడ్లతో దాడులు చేసుకోవటంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. దీంతో నగరంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గతంలో కమిషనరేట్ టాస్క్ఫోర్స్ పోలీసులు బ్లేడ్ బ్యాచ్ ముఠాలపై సీరియస్గా వ్యవహరించి రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరిచి ఉక్కుపాదం మోపారు. మళ్లీ ఏడాది కాలం నుంచి దీనిపై దృష్టి సారించకపోవటంతో బ్యాచ్ల ఆగడాలు శృతిమించాయి. పారిపోయి వచ్చి.. పెడదోవ పట్టి.. ఇంటి నుంచి పారిపోయి నగరానికి వచ్చి పెడదోవ పడుతున్న అనేక మంది యువకులు కాలక్రమంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలుగా మారిపోతున్నారు. ముఖ్యంగా ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోని అనేక ప్రాంతాల నుంచి ఇళ్లలో అలిగి వచ్చిన చిన్నారులు, అనాథలుగా ఉన్న కొందరు యువత రైల్వేస్టేషన్, బస్టాండ్ కేంద్రంగా ఉండి కాలం గడుపుతున్నారు. ఈ క్రమంలో గంజాయి, వైట్నర్ మత్తుకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించటానికి యాచనతో మొదలుపెట్టి బ్లేడ్ చూపి ప్రయాణికుల నుంచి డబ్బులు వసూలు చేసే స్థాయికి చేరారు. పన్నెండేళ్ల క్రితమే బీజం... కచ్చితంగా విజయవాడ నగరంలో 12 ఏళ్ల కిత్రం బ్లేడ్ బ్యాచ్ సంస్కృతికి బీజం పడింది. రెండేళ్లలోనే 64 మంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు నగరంలో తయారయ్యారు. వీరు నాలుగు ముఠాలుగా ఏర్పడి బెదిరించి డబ్బులు వసూలు చేయటం, ఇవ్వని వారిపై బ్లేడ్లతో దాడి చేసి గాయపర్చటం మొదలుపెట్టారు. ముఖ్యంగా విజయవాడ రైల్వేస్టేషన్, బస్టాండ్, వన్టౌన్ సెంటర్, సీతమ్మ పాదాలు, బెంజ్సర్కిల్, కృష్ణలంక, కెనాల్ రోడ్డు, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో వీరి ఆగడాలు కొన్నేళ్లపాటు కొనసాగాయి. చిట్టినగర్లో ఏడాదిగా... గత ఏడాది కాలం నుంచి చిట్టినగర్లో వీరి దందా మొదలైంది. కేఎల్ రావు నగర్కు చెందిన బ్యాచ్ సభ్యుడు అంజిబాబు అలియాస్ అంజికి, మరో ముఠా సభ్యుడు ప్రసాద్కు మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో వారి మధ్య బుధవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కాళేశ్వరరావు మార్కెట్లో ప్రసాద్ వెంట ఉండే గణేష్తో గొడవపడి గాయపర్చాడు. ఈ ఘటన జరిగిన వెంటనే ఈ బ్యాచ్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లే అధికం బ్లేడ్ బ్యాచ్ ముఠాలో దాదాపు అందరూ 20 ఏళ్లలోపు యువకులే. బుధవారం నాటి ఘటనలో దాడి చేసింది.. గాయపడింది కూడా 18 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఎనిమిదేళ్ల క్రితం వరకు నగరంలో 64 మంది ఉండగా.. వారిలో కొందరు మరణించారు. మిగిలినవారిలో 20 మంది వరకు వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్నారు. పోలీసులు సుమారు 20 మందిపై పెండింగ్ కేసులు, సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు కూడా తెరిచారు. ఏడాదిన్నర కిత్రం వరకు బ్లేడ్ బ్యాచ్పై సీరియస్గా పనిచేసిన టాస్క్ఫోర్స్ ప్రస్తుతం పట్టించుకోవటం లేదు. క్రికెట్ బెట్టింగ్లు, పేకాట స్థావరాలు, వ్యభిచార ముఠాల అరెస్ట్, ఇతర కేసుల్లో బిజీగా మారి దీనిని పూర్తిగా విస్మరిస్తోంది. దీంతో చాపకింద నీరులా బ్యాచ్ ఆగడాలు కొనసాగుతునే ఉన్నాయి. మార్కెట్లో దాడి ఘటనతో ఇవి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో వెస్ట్ బుకింగ్ కౌంటర్ నుంచి డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లే మార్గంలో ఈ ముఠా సభ్యులు అధికంగా సంచరిస్తూ తరచూ ఏదో ఒక గొడవ చేసి పరస్పర దాడులకు దిగుతూనే ఉన్నారు. పోలీసులు సీరియస్గా స్పందిచకపోతే రాజధాని నగరంలో బ్లేడ్ బ్యాచ్ ముఠాలు మరింతగా పుట్టుకొచ్చే ప్రమాదముంది. -
నలుగురు ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్
11 దుంగల స్వాధీనం ఉదయగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, తరలించేందుకు సిద్ధంగా 11 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి టాస్క్ఫోర్స్ డీఎస్పీ జి.హరినాథ్బాబు తెలిపారు. ఆయన ఉదయగిరి అటవీ రేంజ్ కార్యాలయం లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ లారీలో నెల్లూరు నుంచి వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం ద్వారా వెలుగొండ అడవుల్లోకి ప్రవేశించారన్నారు. సీతారామపురం మండలంలో దేవమ్మ చెరువు బీట్ పరిధిలో దున్నపోతుల గుండం, కణితిల సిరి ప్రాంతాల్లో చొరపడ్డారని సమాచారం అందిందన్నారు. దీంతో తిరుపతి టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బంది సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించామన్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్మగ్లర్లు సెల్వకుమార్, ఎలుమలై, సత్యరాజు, కుమార్ను అరెస్ట్ చేశామన్నారు. ఉదయగిరి రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, టాస్క్ఫోర్స్ రేంజ్ అధికారి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
రూటు మార్చిన ఎర్ర స్మగ్లర్లు
► తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో ► కర్ణాటక రాష్ట్రానికి తరలింపు ► అనంతపురం కేంద్రంగా రవాణా సాక్షి ప్రతినిధి తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. తమిళనాడులో ఎన్నికలు జరుగుతుండడంతో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను కర్ణాటకకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనంతపురం సరిహద్దు ప్రాంతాలు కదిరి, హిందూపురం, రాప్తాడు కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు సమాచారం. ఇటీవల కర్ణాటక ప్రాంతంలోని బాగేపల్లెలో లారీలో మొత్తం 95 దుంగలు దొరకడం అనుమానాలకు తావిస్తోంది. దీనికితోడు జిల్లాలో 4, 5 రోజు లుగా ఎర్రచందనం దుంగల స్వాధీనం తగ్గింది. దీంతో టాస్క్ఫోర్స్, అటవీ శాఖ అధికారులు ఆరా తీశారు. దీని ప్రకారం అడవిలోకి వెళ్లిన స్మగ్లర్లు దుంగలను బయటకు తరలించకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో డంపులు ఏర్పాటు చేస్తున్నట్లు సమచారం. బాలుపల్లె, సానిపాయితోపాటు అనంతపురం జిల్లాలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో... తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి తోడు సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టుల్లో నిఘా కట్టుదిట్టం చేయడంతో స్మగర్లు తాత్కాలికంగా తమిళనాడు వైపు ఎర్రచందనాన్ని తరలించడం ఆపివేసినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఎండలు కూడా మండిపోతుండడంతో అడవిలోకి వెళ్లడానికి కూలీలు జంకుతున్నట్లు అటవీ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనంతపురం జిల్లాపై దృష్టి.... ఎర్ర స్మగ్లర్లు అనంతపురం జిల్లాలో డంపులు ఏర్పాటు చేస్తున్నారని పసిగట్టిన టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి ఎర్ర స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో ఎర్ర చందనంపై అవగాహన కల్పించేందుకు డీఐజీ కాంతారావు చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా త్వరలో కదిరి ప్రాంతంలో సదస్సు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలోని హిందుపురం ప్రాంతాల్లో డంపులు ఏర్పాటు చేసుకుని, కర్ణాటకకు ఎర్ర చందనం తరలించేందుకు సురక్షిత మార్గంగా స్మగ్లర్లు ఎంచుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుగూళ్ల మాటున కర్ణాటకకు ఎర్రదుంగలను తరలిస్తున్నట్లు పోలీసులు సైతం కనుగొన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ఎర్ర రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రత్యేక బలగాలను వినియోగిస్తున్నారు. -
సిండి‘కేట్ల’ గుప్పిట్లో మద్యం వ్యాపారం
►ఎంఆర్పీ ఉల్లంఘనపై కమిషనర్ సీరియస్ ►చర్యలకు తటపటాయిస్తున్న అధికారులు ►ధరల నియంత్రణ అమలు చేయాల్సిందే : డిప్యూటీ కమిషనర్ ►క్రాస్ చెకింగ్ కోసం టీంల ఏర్పాటుకు ఆదేశం కర్నూలు: జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి అన్ని రకాల మద్యం సీసాలపై రూ.20 నుంచి రూ.40 వరకు ధర పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం ఇటీవల గూళ్యంలో మద్యం దుకాణంపై దాడి చేసి ధరల ఉల్లంఘనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలూరులో సీఐగా పనిచేస్తూ శాఖాపరమైన చర్యల్లో భాగంగా మాదవరం చెక్పోస్టుకు ఇటీవలే బదిలీ అయిన సీఐ మహేష్కుమార్పై ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్కుమార్ మీనా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఈ అంశం హాట్టాపిక్గా మారింది. జిల్లాలో మొత్తం 209 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. గత ఏడాది జులై నుంచి కొత్తవారికి అనుమతులిచ్చారు. కొంతకాలం నిర్ణీత ధరలకే విక్రయాలు జరిపిన వ్యాపారులు స్థానికంగా ఎక్సైజ్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండటంతో స్థానికంగా ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులకు వంత పాడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కమిషనర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రస్థాయిలో బృందాలు జిల్లాకు తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తుండటంతో జిల్లాస్థాయి ఎక్సైజ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. కొంతకాలంగా యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను కట్టడి చేయడం ఎక్సైజ్ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. అధికారుల చర్యలు ఫలించేనా: ఎక్సైజ్ కమిషనర్ హెచ్చరికల నేపథ్యంలో డిప్యుటీ కమిషనర్ నాగలక్ష్మి ధరల నియంత్రణ అమలుపై దృష్టి సారించారు. శనివారం కర్నూలు, నంద్యాల ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హెప్సీబా రాణి, ఫయాజ్లతో పాటు సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్పీ ఉల్లంఘనపై చర్చించారు. ఎక్కడైనా సిండికేట్లకు వంత పలికితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రాస్ చెకింగ్ కోసం టీములను ఏర్పాటు చేశారు. ఒక సర్కిల్ పరిధిలోని దుకాణాలను మరో సర్కిల్ పరిధిలోని అధికారులు తనిఖీలు చేసి ఎంఆర్పీ ఉల్లంఘన బయటపడితే కేసులు నమోదు చేసే విధంగా నిర్ణయించారు. ఎంఆర్పీ ధరల ఉల్లంఘన వ్యవహారంలో సీఐ మహేష్కుమార్పై సస్పెన్షన్ వేటు భయం ఒకవైపు అధికారుల్లో ఉన్నప్పటికీ వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో నిక్కచ్చిగా ధరల నియంత్రణ అమలు చేయడానికి తటపటాయిస్తున్నారు. స్థానిక అధికారుల సహకారం లేకుండా జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు అమలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. -
చిన్నారి పెళ్లి కూతుళ్లు!
♦ మూడుముళ్లతో బందీ అవుతున్న బాల్యం.. ♦ జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు నిరక్షరాస్యత, పేదరికం రాజ్యమేలుతున్న చోట ముక్కుపచ్చలారని బాలికల బాల్యం మూడుముళ్లతో బందీ అవుతోంది. బరువు దించుకునే పనిలో తల్లిదండ్రులు పదేళ్లు దాటిందే తడువుగా ఓ అయ్యచేతిలో పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. మాంగల్యమంటే అర్థం తెలియని వయస్సులోనే ఓ ఇంటి ఇల్లాలై పోతోంది బాలిక. ఆటబొమ్మలతో ఆడుకునే వయసులో పొత్తిళ్లపాపను ఆడిస్తోంది. ఎంత చైతన్య పరిచినా, పిల్లల భవిష్యత్ చీకటిమయమవుతుందని వివరించినా జనం చెవికెక్కడం లేదు. నెలలో పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఇంకా కొన్ని వెలుగులోకి రాకుండా జరిగిపోతున్నాయి. - పరిగి/ వికారాబాద్ రూరల్ 67జిల్లాలో గత మూడు నెలల్లో అడ్డుకున్న బాల్య వివాహాలు 15 - 20% బాల్య వివాహాల కారణంగా ప్రతి ఏడాది స్కూల్ మానేస్తున్న బాలికలు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి.. గ్రామాల్లో అవగాహనా రాహిత్యంతోనే బాల్య వివాహాలు చేస్తున్నారు. మేం కల్పించుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన చోట ఫలితం ఉంటోంది. పీటలమీది పెళ్లిళ్లను ఆపేస్తున్నప్పుడు కొన్ని గ్రామాల్లో స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతోంది. అలాంటి సమయంలో పోలీసుల సాయం తీసుకుంటున్నాం. ప్రతిఒక్కరు వాళ్ల దృష్టికి వచ్చిన బాల్య వివాహం గురించి టోల్ ఫ్రీ నెంబర్కు చెప్పాలి. తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు రావాలి.. అప్పుడే వీటిని పూర్తిస్థాయిలో అరికట్టగలం. - వరలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓ జిల్లాలో పెరుగుతున్న బాల్య వివాహాలు పరిగి/ వికారాబాద్ రూరల్ : సమాజం సాంకేతికంగా శరవేగంతో దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఇంకా బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. బాల్యం తన హ క్కును కోల్పోతూనే ఉంది. సామాజిక దురాచారం ఉనికి చాటుకుంటూ బాల్యాన్ని కబలించి వేస్తూనే ఉంది. బాల్యవివాహాలకు బలవుతున్న వారిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంత బాలిక లే ఉంటున్నారు. చదువుకుంటూ ఆడుతూపాడుతూ గడపాల్సిన వయసులో పెళ్లిళ్లు చేసుకొని తమ పిల్లల్ని ఆడిస్తున్నారు. బాల్య వివాహాలు ఆర్థిక, ఆరోగ్య, సామాజిక అంశాలను ప్రభావితం చేస్తాయని మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా నిలిచిన వివాహాలు అనేకం.. తాజాగా పరిగి, వికారాబాద్ ప్రాంతాల్లోనే తొమ్మిది బాల్య వివాహాలను అధికారులు నిలిపేశారు. నిలిపేసిన వాటిలో అనేక పదో తరగతి కంటే తక్కువ చదువుతున్న బాలికలవే. పరిగి మండలం భర్కత్పల్లిలో 9వ తరగతి చదవుతున్న బాలికను, పరిగి ఉన్నత పాఠశాలలో అదే తరగతి చదువుతున్న, బసిరెడ్డిపల్లికి చెందిన మరో బాలిక, కస్తూర్భాలో చదువుతున్న ఇంకో చిన్నారి, 8వ తరగతి చదువుతున్న కుల్కచర్లకు చెందిన బాలిక.. ఇలా అనేక మంది వివాహాలు ఇప్పటికే జరిగిపోయేవి. కానీ సకాలంలో టోల్ఫ్రీ నంబర్కు సమాచారం అందడంతో అధికారులు స్పందించి ఆపేశారు. వీరంతా కూడా 15 ఏళ్ల లోపు బాలికలే. జాడలేని టాస్క్ఫోర్స్.. బాల్య వివాహాల నిర్మూలనకు 2004లో మండలస్థాయిలో టాస్క్ఫోర్స్ ఏర్పాటైంది. ఎంపీపీ చైర్మన్గా, తహసీల్దార్ కన్వీనర్గా, ఎంపీడీఓ, సీడీపీఓ, స్థాయిక ఎస్ఐ, పీహెచ్సీ డాక్టర్, సీఆర్పీఎఫ్ మండల కన్వీనర్లను సభ్యులుగా చేర్చారు. వీరందరూ ప్రతి నెలా బాల్య వివాహాలపై సమీక్ష సమావేశం నిర్వహించి బాల్య వివాహాల అదుపుకు కృషి చేయాల్సి ఉంది. రెండు మూడేళ్లపాటు పటిష్టంగా కొనసాగిన టాస్క్ఫోర్స్ ఆ తర్వాత అప్పుడప్పుడే ఉనికి చాటింది. కారణం ఏదైనా బాలికే బలి! బాల్య వివాహాలు జరగడంపై గ్రామీణ ప్రాంతాల్లో చెబుతున్న కారణాల్లో ఏ ఒక్కటీ సహేతుకంగా లేదు. ఇంట్లో ఉండే అమ్మమ్మలు, నాన్నమ్మలు మనవ రాలి పెళ్లి ముచ్చట చూసి చనిపోతారని, పిల్ల పెద్దమనిషి అయిందని, పక్కింటి పిల్లలు ఎవరితోనో లేచిపోయారని, వరకట్నం ఎక్కువగా ఇచ్చుకోవాల్సి వస్తుందని తదితర కారణాలను చెబుతుండడం గమనార్హం. కారణాలు ఏమైనప్పటికీ ప్రతి సంవత్సరం ప్రతి హైస్కూల్లో బాల్యవివాహాల కారణంగా 10 నుంచి 20 మంది విద్యార్థులు బడులు మానేస్తున్నారు. చట్టాలు ఏం చెబుతున్నాయి.. బాల్యవివాహాలు సామాజిక దురాచారంగా పరిగణించి 18 శతాబ్దంలోనే కందుకూరి వీరేషలింగం పంతులు సామాజిక ఉద్యమాన్ని నడిపారు. 1929లో బాల్యవివాహ నిర్మూలన చట్టం వచ్చింది. ఇది స్పష్టంగా లేనప్పటికీ 18 సంవత్సరాల ఆడపిల్లలకు, 21 ఏళ్లు నిండిన పురుషులకు మాత్రమే వివాహం జరిపించాలనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ చట్టం లో లొసుగులున్నాయని 2006లో తిరిగి ఆ చట్టాన్ని సవరిస్తూ బాల్య వివాహల నిషేధ చట్టాన్ని తీసుకువచ్చారు. చిన్నతనంలో పెళ్లిళ్లు చేస్తే ఆ వివాహాన్ని రద్దు చేయడంతోపాటు పెళ్లికొడుకుకు రూ.లక్ష జరిమానా, పెళ్లికి సహకరించిన వారికి జైలు శిక్ష, పెళ్లి నిర్వహించిన పంతులుకు జైలు తదితర అంశాలను స్పష్టం చేసింది. అయినా చట్టం అమల్లో లోపాల వల్ల బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఓ సంస్థ సర్వే ప్రకారం నేటికీ గ్రామాల్లో 30 నుంచి 40 శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయని తేలింది. ఒక్కరోజు ముందే బ్రేక్.. ♦ శంషాబాద్ మండలంలో రెండు నెలల వ్యవధిలోనే అధికారులు రెండు బాల్య వివాహాలను అడ్డుకున్నారు. మండలంలోని సుల్తాన్పల్లిలోని నలుగురు కూతుళ్లున్న తల్లిదండ్రులు పాఠశాలలో చదువుతున్న కూతురుకు పెళ్లి చేయాలని భావించారు. వివాహానికి ఒక్కరోజు ముందే విషయం తెలియడంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకుని అడ్డుకున్నారు. ♦ అదే మండలంలోని జూకల్లోనూ ముగ్గురు కూతుళ్లున్న దంపతులు ఇంటర్ చదివే బాలికకు పెళ్లి చేయాలని చూశారు. ఈ నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. బాలిక కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తుండగానే అధికారులకు ఉప్పందింది. వెంటనే గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి వివాహాన్ని నిలిపేశారు. బంట్వారం మండలంలో మూడు.. ♦ ఇటీవలే బంట్వారం మండలంలో మూడు బాల్య వివాహాలు ఆగిపోయాయి. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు రెండు నెలల క్రితమే నిశ్చితార్ధం చేశారు. విషయం 1098 టోల్ప్రీ నంబరుకు చేరడంతో ప్రోగ్రాం ఆర్గనైజర్ శ్రీనివాస్ అధికారులతో కలిసి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ బాలిక ఇప్పుడు మళ్లీ చదువుకుంటోంది. ♦ బార్వాద్ గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే విధంగా సుల్తాన్ పూర్కు చెందిన మరో బాలిక 9వ తరగతి చదువుతోంది. వీరిద్దరూ మైనర్లు కావడంతో 1098కు సమాచారం అందింది. వెంటనే గ్రామానికి చేరుకున్న అధికారులు వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి వయస్సు వచ్చే వరకు వివాహాలు చేయమని తల్లిదండ్రులతో ఒప్పంద పత్రాలు సైతం రాయించుకున్నారు. ♦ వికారాబాద్ నియోజకవర్గంలో నెల రోజులుగా 13 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంధ సంస్థలు అడ్డుకున్నాయి. అధికారులు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి వేళ సమావేశాలు ఏర్పాటుచేసి చైతన్యం తీసుకువచ్చే బాగుంటుంది. బాల్య వివాహం అడ్డుకున్నచోట కౌన్సెలింగ్ ఇస్తున్నా.. అదే వివాహం మరికొన్ని రోజుల తేడాతో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోంది. ఇటీవల మోమిన్పేట మండలంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నప్పటికీ 15 రోజుల తర్వాత వివాహం జరిగిపోయింది. ♦ మొయినాబాద్ మండలం మేడిపల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక తనకు తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తున్నారని గత సంవత్సరం డిసెంబర్ 19న జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలిని కలిసి ఫిర్యాదు చేసింది. తనకు పెళ్లి ఇప్పుడే వద్దని, ఇంకా చదువుకుంటానని మొరపెట్టుకుంది. వెంటనే స్పందించిన జేసీ బాలికను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించి రిస్క్యూహోంలో చేర్పించారు. తర్వాత అధికారులు బాలిక తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి పెళ్లి ఇప్పుడే చేయవద్దని సూచించారు. ప్రస్తుతం బాలిక రిస్క్యూహోంలోనే ఉంటూ చదువుకుంటోంది. -
ఇసుక తవ్వకాలకు టాస్క్ఫోర్స్
విశాఖపట్నం: ఉచిత ఇసుక పాలసీ అమలు కోసం జిల్లా స్థాయిలో టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ చైర్మన్గా వ్యవహరించే ఈ టాస్క్ఫోర్స్లో నగర పోలీస్ కమిషనర్, జిల్లా పోలీస్ సూరింటెండెంట్, జాయింట్ కలెక్టర్, జెడ్పీ సీఈఓ, డ్వామా, డీఆర్డీఎ పీడీలు, ఇరిగేషన్ ఎస్ఈ, గ్రౌండ్ వాటర్ డీడీ, డీపీఒ, డీటీసీ, ఇంజనీరింగ్ శాఖల హెడ్లు, సబ్కలెక్టర్, ఆర్డీవో, వీపీటీ, ఎన్టీపీసీ, స్టీల్ప్లాంట్ తదితర బల్క్ యూజింగ్ సంస్థల ప్రతినిధులు, మైన్స్ ఏడీ తదితరులు సభ్యులుగా ఉంటారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్సు కమిటీలకు అనుమతించిన ఇసుక రీచ్ల నిర్వహణా బాధ్యతలను అప్పగించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను కలెక్టర్ యువరాజ్ మీడియాకు వివరించారు. అందుబాటులో ఉన్న ఇసుక పరిమాణం, నాణ్యతలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని ఇసుక రీచ్లను మూడు కేటగిరిలుగా విభజించారు. కాశీపట్నం, కైలాసపట్నం, నారాయణరాజుపేట రీచ్లను కేటగిరి-1 పరిధిలోకి తీసుకురాగా, ఇరిగేషన్ రిజర్వాయర్లలోని ఇసుకను కేటగిరి-2, నదీపరివాహక ప్రాంతాల్లోని ఇసుకను కేటగిరి-3 కింద పరిగణిస్తారు. తొలి కేటగిరి పరిధిలోని ఇసుకను పోర్టుట్రస్ట్తోపాటు బల్క్ యూజర్లయిన బిల్డర్స్కు కేటాయిస్తారు. కేటగిరి-2లో ఉన్న ఇసుకను సీసీ రోడ్లు, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇతర అభివృద్ధి పనులకు కేటాయిస్తారు. కేటగిరి-3లోని ఇసుకను పూర్తిగా ప్రజల వినియోగార్ధం కేటాయిస్తారు. ఆయా రీచ్లకు పర్యావరణానికి, ఆనకట్టలకు, కట్టడాలకు ఎలాంటి హానీ కలగకుండా ఇసుక తవ్వకాలు జరుపుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం డిప్యూటీ ఈఈ, ఈఈ కే డర్ స్థాయి ఇంజినీర్లను రీచ్ల ఇన్చార్జిలుగా నియమించారు. ఆయా రీచ్ల పర్యవేక్షణ, ఇసుక స్టాక్ యార్డుల నిర్వహణ తదితర బాధ్యతలను వీరు పర్యవేక్షిస్తారు. ఇసుక తవ్వకాలు లోడింగ్ తదితర పనుల నిర్వహణకు యంత్రాల వినియోగం పూర్తిగా నిషేధించారు. అనుమతించిన ఇసుక రీచ్లకు రహదారి సౌకర్యాలు, ర్యాంపుల నిర్మాణ బాధ్యతను పంచాయతీరాజ్కు అప్పగించారు. అలాగే రీచ్లు.. తవ్వకాలు వివరాలను సంబంధిత వెబ్సైట్లో ఉంచాల్సిన బాధ్యతను మైన్స్ డిపార్టుమెంట్కు అప్పగించారు. ఇందుకు అవసరమైన లేబర్ను సమకూర్చుకోవడం.. వారికి చెల్లించాల్సిన చార్జీలను నిర్ణయించే బాధ్యతను డీఆర్డీఎ పీడీకి అప్పగించారు. విశాఖ జిల్లా డిమాండ్కు తగ్గట్టుగా ఇసుక స్థానికంగా లేనందున తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు రీచ్లను కేటాయించాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తూర్పు కలెక్టర్ను కోరారు. ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ మూడు రీచ్లను కేటాయించారు. ముగ్గళ్ల, జొన్నాడ, గోపాలపురం రీచ్లను కేటాయించడంతో ఆ రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు చర్యలు చేపట్టారు. వాల్టా చట్టం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులకు లోబడే ఇసుక తవ్వకాలు జరపాల్సి ఉంది. -
65 లీటర్ల స్పిరిట్ పట్టివేత
10 బస్తాల ఖాళీ సీసాలు, లేబుళ్లు స్వాధీనం ఎమ్మిగనూరు రూరల్: గోనెగండ్ల మండలం పుట్టపాశం గ్రామంలో 65 లీటర్ల స్పిరిట్, 10 బస్తాల ఖాళీ సాలు, లెబుళ్లను సోమవారం ఎక్సైజ్, టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ డీసీ ధనలక్ష్మీ విలేకరులతో మాట్లాడుతూ పుట్టపాశం గ్రామానికి చెందిన బోయ రంగన్న స్పిరిట్తో నకిలీ మద్యం తయారు చేసి ఎమ్మిగనూరు, కోసిగి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావటంతో దాడి చేశామన్నారు. ఎక్కడా అనుమానం రాకుండా సీసాలపై లేబుళ్లను అతికించి గ్రామాల్లో విక్రయిస్తున్నాడన్నారు. గంజెళ్ల ఉరుసు సందర్భంగా విక్రయించేందుకు సరుకు సిద్ధం చేసుకోగా అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రంగన్నపై గతంలో పీడీ యాక్ట్ కింద కేసు కూడా నమోదయిందన్నారు. ఈ కేసు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించిన పత్తికొండ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, సిబ్బందిని ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సూపరిటెండెంట్ హెబ్సిబారాణి, టాస్క్ఫోర్స్ సీఐ కృష్ణకుమార్, ఎమ్మిగనూరు సీఐ లక్ష్మీదుర్గయ్య, పత్తికొండ, ఎమ్మిగనూరు ఎస్సైలు సునీల్కుమార్, భాగ్యలక్ష్మీ , సిబ్బంది పాల్గొన్నారు. -
మత బోధకుడికి బెదిరింపులు
బ్లాక్మెయిల్తో రూ.1.34 కోట్లు వసూలు అదుపులో గ్యాంగ్ సభ్యులు న్యాయవాది పాత్రపై టాస్క్ఫోర్స్ ఆరా విజయవాడ సిటీ : ఓ మత బోధకుడిని డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్న గ్యాంగ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలి సింది. గ్యాంగ్లో ప్రధాన నిందితుడు పరార్ కాగా పట్టుబడిన న్యాయవాది పాత్రపై పోలీ సులు ఆరా తీస్తున్నారు. సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంలో మత బోధకుడిని పటమట ప్రాంతానికి చెందిన సుధీర్ అనుచరులతో కలిసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పెనమలూరు నియోజకవర్గంలో పొదుపు సంఘాలు నిర్వహించే సుధీర్ మత బోధకుడి వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. సెప్టెంబర్, 2005 నుంచి మత బోధకుడికి సంబంధించిన అశ్లీల చిత్రాలతో కూడిన పెన్డ్రైవ్ తమ వద్ద ఉందని, రూ.4 కోట్లు ఇస్తే ఇచ్చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. అప్పటి నుంచి పలుమార్లు దశలవారీగా మత బోధకుడు రూ.1.34 కోట్లు సుధీర్ గ్యాంగ్కు ఇచ్చాడు. మిగిలిన డబ్బుల కోసం ఒత్తిడి తెస్తుండడంతో కొద్ది రోజుల కిందట మత బోధకుడు నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి మత బోధకుడి బ్లాక్మెయిల్ చేస్తున్న గ్యాంగ్ పట్టివేతకు గాలింపు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్ లీడర్ సుధీర్ నగరంలోని ఓ హోటల్లో ఉన్నట్లు వచ్చిన సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పోలీసుల దాడిని ముందే ఊహించిన సుధీర్ అక్కడి నుంచి పరార్ కాగా ఆ సమయంలో అక్కడున్న న్యాయవాది కరుణేంద్రని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని సమాచారంపై మత బోధకుడిని బ్లాక్బెయిల్ చేస్తున్న గ్యాంగ్లోని కొందరు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. న్యాయవాది వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న పెన్డ్రైవ్ ఖాళీగా ఉన్నట్లుచెబుతున్నారు. మధ్యవర్తిత్వమా.. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న న్యాయవాది కరుణేంద్ర మధ్యవర్తిత్వం నెరిపేందుకు వెళ్లినట్టు న్యాయవాద వర్గాల సమాచారం. గత కొద్ది రోజులుగా మత బోధకుడిని బెదిరింపులకు గురి చేస్తున్న సుధీర్ వద్దకు వెళ్లి అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకోవద్దని, పెన్డ్రైవ్ ఇస్తే పోలీసుల చర్యలు లేకుండా మత బోధకుడితో మాట్లాడతానని చెప్పినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి చర్చించుకుంటుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారని, అప్పటికే సుధీర్ తప్పించుకోగా న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నట్లు సహచరుల వాదన. దీనిపై టాస్క్ఫోర్స్ ఏసీపీ ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్ను సంప్రదించగా విచారణ జరుగుతోందని, తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురి అరెస్టు
గోదామును సీజ్ చేసిన అధికారులు షాద్నగర్ : అక్రమంగా బియ్యం తరలిస్తున్న ముగ్గురు నిందితులను టాస్క్ఫోర్స్, ఎన్ఫోర్స్మెంటు అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కొందుర్గు మండలం పుల్లప్పగూడకు చెందిన అల్లె గోపాల్, పాపిశెట్టి శ్రీనివాస్ కొన్నాళ్లుగా సబ్సిడీ బియ్యాన్ని హైదరాబాద్ నగరంలోని రేషన్ డీలర్ వద్ద కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా సరఫరా చేసేవారు. ముందుగా బియ్యాన్ని బోలెరో, ట్రాలీఆటోలలో ఫరూఖ్నగర్ మండలం నాగులపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాసుమల్లగూడెం శివారులో ఉన్న గోదాముకు తరలించేవారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కర్నూలుకు చెందిన కన్నారెడ్డికి చెందిన డీసీఎంలో కర్ణాటక రాష్ట్రానికి బియ్యాన్ని తీసుకెళ్లేవారు. ఈ క్రమంలోనే గత నెల 26న 15 క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా నాగులపల్లి వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గోపాల్, బోలెరో డ్రైవర్ రతన్సింగ్, ట్రాలీఆటో డ్రైవర్ వడ్డ చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేశారు. దీనిపై టాస్క్ఫోర్స్ డీఎస్పీ లింబారెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ విచారణ చేపట్టారు. అక్కడి గోదాములో ఇంకా 149 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు తాజాగా బుధవారం తేలడంతో సీజ్ చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
3.7 కిలోల బంగారం పట్టివేత
వే బిల్స్ లేకుండా తరలిస్తున్న బంగారాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బుధవారం వేబిల్స్ లేకుండా 3.7 కిలోల బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. బంగారాన్ని స్వాధీనం చేసుకొని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించారు. -
90 లీటర్ల కల్తీ నెయ్యి సీజ్
గోషామహల్ ప్రాంతంలో పామోయిల్తో కల్తీ చేసిన 90 లీటర్ల నెయ్యిని హైదరాబాద్ టాస్క్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న దినేష్ పాండియాను అదుపులోకి తీసుకున్న పోలీసులు 90 లీటర్ల నెయ్యిని సీజ్ చేసి, స్థానిక పోలీసులకు అప్పగించారు. నగరంలోని ముర్గీచౌక్ నుంచి హసన్నగర్కు చెందిన మహ్మాద్ నిజాముద్ధీన్, మహ్మాద్ యూసుఫ్తో కలిసి చికెన్ వెస్టేజ్తో తయారు చేసిన 555 లీటర్ల అయిల్ను తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చే శారు. ఈ దాడి నుంచి మహ్మాద్ యూసుఫ్ తప్పించుకున్నారు. దోరికిన మహ్మాద్ నిజాముద్ధీన్ నుంచి స్వాధీనం చేసుకున్న 555 లీటర్ల అయిల్ను సీజ్ చేసి , ఆయనను ఆరెస్టు చేసి ,స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనలపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘కాగితం’తో భగ్నమైన కుట్ర!
2004లో గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర అమెరికా, ఇజ్రాయెలీల హత్యకూ పథకంవాహన దొంగను పట్టిన టాస్క్ఫోర్స్ అతడి వద్ద లభించిన ఫోన్ నెంబర్ల స్లిప్ కూపీతో భగ్నమైన లష్కరే తొయిబా పన్నాగం అజీజ్ను సోమవారం అరెస్టు చేసిన సీఐడీ సిటీబ్యూరో: సౌదీ నుంచి డిపోర్టేషన్పై తీసుకొచ్చిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ను రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు 2004 నాటి గణేష్ ఆలయం పేల్చివేత కుట్రలో సోమవారం సాంకేతికంగా అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అజీజ్ను తమ కస్టడీకి ఇవ్వాలని కో రుతూ పిటిషన్ దాఖలు చేశారు. పన్నెండేళ్ల క్రితం నాటి ఈ భారీ కుట్ర వెలుగులోకి రావడంలోనూ ఆసక్తికర కో ణం ఉంది. ఓ వాహన దొంగ వద్ద లభించిన చిన్న కాగి తం ముక్క ఆధారంగా సౌత్జోన్ టాస్క్ఫోర్స్ దర్యాప్తు చేపట్టి భారీ విధ్వంసానికి జరిగిన కుట్రను భగ్నం చేశారు. సీజర్లో దొరికిన స్లిప్... నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి వచ్చి పహాడీషరీఫ్ హఫీజ్బాబానగర్లో మెకానిక్గా స్థిరపడిన సయ్యద్ అబ్దుల్ ఖదీర్కు పలు వాహనచోరీలతో ప్రమేయం ఉందని టాస్క్ఫోర్స్ పోలీసులకు ఓ వేగు సమాచారం ఇచ్చాడు. వెంటనే టాస్క్ఫోర్స్ అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వాహన చోరీలు చేస్తున్నట్టు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసే ముందు చోరీ వాహనాలను రికవరీ చేయడంతో పాటు అతడి జేబుల్లో ఉన్న కాగితాలను సైతం తీసి పరిశీలించారు. వాటిలో ఉన్న ఓ చిన్న స్లిప్లోని వివరాలు టాస్క్ఫోర్స్ పోలీసులకు అనుమానాస్పదంగా కనిపించాయి. లీడ్ ఇచ్చిన ఫోన్ నెంబర్లు... ఆ స్లిప్లో కాశ్మీర్తో పాటు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలకు చెందిన ఫోన్ నెంబర్లు ఉండటంతో ఖదీర్ను లోతుగా విచారించగా... ఇతని స్నేహితుడైన ఒమర్ ఫారూఖ్ షరీఫ్ (స్వస్థలం నల్లగొండ జిల్లా చిట్యాల), లంగర్హౌస్లో నివసిస్తున్న గిడ్డా అజీజ్ల పేర్లు చెప్పడంతో పాటు వారిద్దరూ బండ్లగూడ గౌస్నగర్లోని ఓ ఇంట్లో డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు బయటపెట్టాడు. వెంటనే టాస్క్ఫోర్స్ బృందాలు గౌస్నగర్లోని డెన్పై దాడి చేయగా... అక్కడ ఫారూఖ్ చిక్కగా... అజీజ్ తప్పించుకున్నాడు. అప్పటికే అజీజ్ 2001లో కుట్ర, ఆయుధ చట్టం కింద నమోదైన కేసులో అరెస్టై ఉండటం, ఇప్పుడు పారిపోవడంతో పోలీసులు ఇది కచ్చితంగా ‘పెద్ద విషయం’ అని నిర్థారించుకున్నారు. దీంతో ఖదీర్, ఫారూఖ్లను కలిపి విచారించడంతో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. లష్కరేతొయిబా ప్రేరణతో... సిటీలో తమ ఘర్షణలు సృష్టించాలని పథకం వేసిన పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా.. గణేష్ నిమజ్జనం రోజు సికింద్రాబాద్లోని గణేష్ ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిందని బటయపడింది. దీని కోసం నగరానికి చెందిన సానుభూతిపరులతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్ల్లో శిక్షణ పొంది వచ్చిన వారినీ ప్రేరేపించింది. ఇందులో భాగంగా నగరానికి చెందిన కొందరితో పాటు గులాం యజ్దానీ(ఢిల్లీ ఎన్కౌంటర్లో హతమయ్యాడు) సహా 12 మందిని రంగంలోకి దింపి పేలుడు పదార్థాలు అందించింది. నిమజ్జనం రోజు ఈ గ్యాంగ్కు చెందిన కొందరు ఇతర మతస్తులుగా వేషం వేసుకుని గణేష్ ఆలయంలోకిప్రవేశించి బాంబు పెట్టాలని పథకం వేశారు. గులాం యజ్దానీ ఆ దేశాల మేరకు ఈ పనితో పాటు సిటీలో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ టూరిస్టుల్నీ చంపాలని భావించారు. అం దుకు అవసరమైన పేలుడు పదార్థాలు, వాహనాలనూ సిద్ధం చేసుకున్నారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో వరుసదాడులు చేసిన పోలీసులు 2004 ఆగస్టు 28న ఎనిమిది మందిని అరెస్టు చేసి ఆయుధాలు, పేలు డు పదార్థాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అత్యంత వివాదాస్పదం... ఈ అరెస్టుల సమయంలో టాస్క్ఫోర్స్ అత్యంత వివాదాస్పదమైంది. అమాయకుల్ని కేసుల్లో ఇరికించిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీఐడీ అధికారులు విచారణ జరిపి ఆ ఆరోపణలు నిరాధారమైనవని తేల్చారు. ఆపై కేసు కూడా దర్యాప్తు నిమిత్తం వారికే బదిలీ అయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న టోలిచౌకి వాసి మహ్మద్ జావేద్ 2008 ఆగస్టులోనూ హల్చల్ చేశాడు. కండిషనల్ బెయిల్పై ఉన్న జావేద్ అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లడానికి వీలు లేదు. అయినా దుబాయ్ సందర్శించడానికి వీసా పొందిన ఇతగాడు 2008 ఆగస్టు 16 శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానం ఎక్కాలని ప్రయత్నించాడు. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో చిక్కడంతో వారు సీఐడీకి అప్పగించారు. అలా వెళ్లడానికి కారణాలను విచారించిన అధికారులు జావేద్ను విడిచిపెట్టారు. నాటి నుంచి పరారీలో ఉన్న గిడ్డా అజీజ్ను సీఐడీ సోమవారం అధికారికంగా అరెస్టు చేసింది. -
దొంగ దెబ్బ
దొరికితే ఎర్రచందనం.. దొరక్కపోతే దొంగతన పారా హుషార్. రూటు మార్చిన ఎర్రకూలీలు తిరుమలకొండ మీద తొమ్మిది దుకాణాల లూటీ భక్తులను దోపిడీ చేసే అవకాశం? వివిధ ఆలయాల హుండీలపై ఎర్ర కూలీల కన్ను? తిరుమల: ఎర్రకూలీల ఆగడాలపై టాస్క్ఫోర్స్ దాడులు పెంచింది. శేషాచలంలో ఎక్కడికక్కడ నిఘా పెంచారు. దీంతో ఎర్ర కూలీలకు కొంత ఇబ్బందిగా మారింది. దీంతో ఎర్రచందనం కోసం వచ్చి పట్టుబడుతున్నారు. ఇలా చాలా మంది కూలీలు వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఎర్రచందనం చెట్ల నరికివేతకు మాత్రమే పరిమితమైన వీరు తాజాగా దొంగతనాలకు పాల్పడటం ప్రారంభించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు ఇక్కడి పాపవినాశనం తీర్థం ఎగువన ఉండే తొమ్మిది దుకాణాలను లూటీ చేశారు. దుకాణాల్లోని రూ.10 వేల నగదుతోపాటు రూ.లక్ష విలువైన వస్తు సామగ్రిని అపహరించుకుపోయారు.తిరుమల కాటేజీలు, ఆలయాలపై ఎర్రకూలీల ప్రభావం ఇప్పటికే తిరుమల శేషాచల అడవుల్లో వందలాది మంది ఎర్రకూలీలు మాటు వేశారు. రోజూ పట్టుబడుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. పాపవినాశనం ఘటనతో అక్కడి ఆలయంతోపాటు ఆకాశగంగ, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయాల హుండీలపై వీరు కన్ను పడే అవకాశం ఉంది. ఇక అటవీప్రాంతాలను ఆనుకుని ఉండే కాటేజీలు, అతిథి గృహాల్లో బస చేసే భక్తులపై కూడా ఎర్రకూలీల ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదో హెచ్చరికపాపవినాశనం మార్గంలోని దుకాణాలను లూటీ చేసిన ఎర్రకూలీలు పరోక్షంగా టీటీడీ భద్రత, పోలీసు చర్యల్ని హెచ్చరించినట్లైంది. ఎన్నడూ లేనివిధంగా ఏక కాలంలో తొమ్మిది దుకాణాలు లూటీకి గురికావడంపై దుకాణదారులే కాదు; క్రైం పోలీసుల సైతం విస్మయానికి గురయ్యారు. తాజా ఘటనతో ఇటు టీటీడీ విజిలెన్స్ విభాగం, అటు పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టూ టౌన్ పోలీసుల అదుపులో తొమ్మిది మంది కూలీలు తిరుమలలో మంగళవారం తొమ్మిది మంది ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్ట్ను బుధవారం పోలీసులు ధ్రువీకరించనున్నారు.