Published
Sat, Aug 20 2016 9:54 PM
| Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
ఘనంగా తీజ్ పండుగ
మిర్యాలగూడ అర్బన్: పట్టణంలోని ప్రకాశ్నగరలోని 19, 20వ వార్డుల్లో శనివారం గిరిజనుల సాంప్రదాయ పండుగైన తీజ్ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి మాట్లాడారు. 9 రోజులు మెలకలను పెంచి చివరి రోజు పండుగను నిర్వహించడం వల్ల గిరిజనులలో ఐక్యత భావం పెంపొందుతున్నారు. అనంతరం గిరిజన యువతులు మెలకలను నెత్తిపై ఎత్తుకొని సాంప్రదాయ నృత్యాలతో, కాలనీలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్నాయక్, కుర్ర విష్ణు, స్థానిక కౌన్సిలర్ బావండ్ల పాండు, నాయకులు భాస్కర్, సైదులు పాల్గొన్నారు.