కన్నుల పండువగా శోభాయాత్ర | shoba yatra | Sakshi
Sakshi News home page

కన్నుల పండువగా శోభాయాత్ర

Apr 28 2017 12:32 AM | Updated on Sep 5 2017 9:50 AM

భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా, గురువారం శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవద్రామానుజుల విగ్రహాలతో ఉన్న రథాలను గౌతమఘాట్‌లోని శ్రీరంగధామం నుంచి మేళతాళాలతో, కోలాటం ప్రదర్శనలతో

భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా, గురువారం శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవద్రామానుజుల విగ్రహాలతో ఉన్న రథాలను గౌతమఘాట్‌లోని శ్రీరంగధామం నుంచి మేళతాళాలతో, కోలాటం ప్రదర్శనలతో మెయి¯ŒS రోడ్డు మీదుగా నగర ప్రధాన రహదారుల్లో వైభవంగా ఊరేగించారు. ముందుగా స్థానాచార్యులు రఘునాథ పరాశర భట్టర్‌ రథంలోని రామానుజుల విగ్రహాలకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్‌ కర్రి రామారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి ఎంపీ ఆర్‌.విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.          
 – రాజమహేంద్రవరం కల్చరల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement