beautiful
-
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
సారా టెండుల్కర్ స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిన ఫొటోలు
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు. ఇది నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది. అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్మీడియా ట్రోల్కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు. (చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్గా..!) -
ఎరుపు రంగు లెహంగాలో మిల్కీ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్..! (ఫోటోలు)
-
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
బేబీ బంప్తో 'మహాతల్లి' జాహ్నవి (ఫొటోలు)
-
గ్లామర్లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
గ్రీన్ డ్రెస్లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా.. బ్లాక్ డ్రెస్లో అదిరిపోయింది! (ఫొటోలు)
-
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
Hyderabad: సెలయేటికి చలో..
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్సూన్ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్లో నప్పే ట్రిప్స్గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి.. వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. బొగత.. మన ఘనత..తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్సూన్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రాయకల్.. జలరాశుల్.. పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది. మల్లెల తీర్థం.. అరణ్య మార్గం.. నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్.. నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.జలజల.. కుంటాల.. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’ నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.ఎత్తిపోతల.. జలకళ.. సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్ను చూడవచ్చు.భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’ దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు.ఏడు బావుల.. వింతలా..బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి. -
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
మిస్&మిస్సెస్ ఫ్యాషన్ ఈవెంట్ కర్టన్ రైసర్ (ఫొటోలు)
-
Sreemukhi: లంగా ఓణీలో రాములమ్మ.. ఎంత చక్కగా ఉందో! (ఫొటోలు)
-
టాలీవుడ్ విలన్కి ఇంత అందమైన కూతురు.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
గ్రూమింగ్ అంటే ఇదీ! మీరే చూడండి దీని వయ్యారం!
గుర్రం అంటే రాజసం, పౌరుషం. అందుకే గుర్రాల వాల్ పేపర్ను, అందమైన గుర్రం పెయింటింగ్లను చాలామంది ఇష్టపడతారు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే కీలు గుర్రం, రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం. గుర్రపు స్వారీ ఒక ఫ్యాషన్...సాహస క్రీడ. పెంపుడు జంతువుగా గుర్రాని ఎంచుకోవడం కొందరికి హాబీ. మరికొందరి అదొక వృత్తి. వ్యాపారం కూడా. అందుకే గుర్రాలను బలమైన దాణాను అందిస్తారు. అందంగా తయరు చేస్తారు.అంతేకాదుకొన్ని రకాల గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి ద్వారా పోలియో, పక్షవాతం మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చికిత్సగా గర్రపు స్వారీని వాడతారట.Before 🐎 After 🦄 pic.twitter.com/9R1jYkoZxI— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2024గుర్రాలు ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం, బ్రషింగ్, గ్రూమింగ్ అవసరం అంటున్నారు జంతు సంరక్షణ నిపుణులు. ప్రతీ రోజు గుర్రం శరీరంలోని ప్రతి అణువును అప్యాయంగా తాకుతూ ఉంటే యజమాని, గుర్రం మధ్య బంధం పెరగడమేకాదు ఇది ప్రీవెంటివ్ మెడిసిన్లాగా పనిచేస్తుందట. అంటే దాని శరీరంపై మనకు తెలియకుండా ఏమైనా గాయాలు, పుండ్లు లాంటివి వుంటే అర్థమవుతాయి.అలా ఒక గుర్రాన్ని చక్కగా జుట్టు కత్తిరించి, రకరకాల క్రీములతో శుభ్రంగా స్నానం చేయించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వివేషంగా నిలుస్తోంది. మనుషులకేనా తైల మర్దనాలు, అభ్యంగనస్నానాలు.. గుర్రాలకు కూడా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో నెటిజనులకు తెగ నచ్చేస్తోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో దాదాపు 8.5 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక వెడ్డింగ్ : అందమైన ఫోటోలు
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
మరీ ముద్దొచ్చేలా యాంకర్ రష్మి.. ఇలా అయితే ఎలా? (ఫొటోలు)
-
హుందాగా గాగ్రా, అందంగా లెహెంగా... కళ్లు తిప్పుకోలేరు! (ఫోటోలు)
-
జీవిత రాజశేఖర్ కూతురు 'శివాత్మిక' స్టన్నింగ్ ఫోటోలు
-
Mouni Roy: సొగసరి చీర కడితే.. (ఫోటోలు)
-
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
-
దేశంలో ఎత్తైన జలపాతాలు:రెండు కళ్లూ చాలవంతే! (ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
Anna Ben: కల్కి బ్యూటీ టాప్ లుక్స్.. ఓసారి చూసేయండి (ఫోటోలు)
-
ప్రగ్యా జైస్వాల్ అందాన్ని ఎలా వర్ణించాలి... (ఫొటోలు)
-
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
-
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
-
Priyanka Arul Mohan: సీతాకోకచిలుకలా మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
-
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్లోని వాంకనేర్కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే -
Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
మెట్గాలా 2024 ఈవెంట్లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్తో గ్లామర్ లుక్ను మరింత ఎలివేట్ చేసుకుంది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్తో వనదేవతలా కనిపించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania)ఫ్యాషన్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్కు అనుగుణంగా, తన డ్రెస్లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్ను జైపూర్కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. -
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
ఎవర్ గ్రీన్ సుమ.. లంగా ఓణీలో మరింత క్యూట్ (ఫొటోలు)
-
కలర్ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
Sreemukhi: అందాల బొమ్మ.. రాములమ్మ!
-
Saina Nehwal: జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటున్న సైనా నెహ్వాల్
-
దేవర బ్యూటీ చీర సోయగాలు,ఒక్కసారి చూస్తే..! (ఫొటోలు)
-
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
పాత జీన్స్ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా! ‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను. పర్యావరణ హితంగా.. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్లు, ల్యాప్టాప్ బ్యాగ్లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. చిన్న పీస్ను కూడా వదలం వాడేసిన జీన్స్ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్తో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన జీన్స్లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్. స్వచ్ఛంద సంస్థలతో కలిసి మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్లో భాగంగా వర్క్షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య. -
జుట్టు లేకపోయినా మోడల్గా రాణించి శభాష్ అనిపించుకుంది!
‘‘నిర్దిష్టమైన లక్షణాలు, ముఖ కవళికలు అందాన్ని నిర్వచించలేవు. ఎందుకంటే జుట్టు ఉన్నా లేకపోయినా గుండెల్లో ఆత్మవిశ్వాసం... పెదవులపై చిరునవ్వూ ఉంటే అందంగానే ఉంటారు’’ అని నిరూపించి, ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది కేతకీ జానీ. నలభైఏళ్ల వయసులో అలోపేసియా వ్యాధితో కేతకీ జుట్టు రాలిపోయినప్పటికీ కృంగిపోకుండా హెయిర్లెస్ మోడల్గా రాణిస్తూనే అలోపేసియా బాధితులకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తోంది. అహ్మదాబాద్లో పుట్టిన కేతకీ జానీ పుణెలో పెరిగింది. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక బిఏ, బిఈడీ, ఎమ్ఏ చేసింది. మహారాష్ట్ర టెక్ట్స్బుక్ ప్రొడక్షన్లో ప్రత్యేక అధికారిగా పనిచేసేది. ఉన్నట్టుండి కేతకీ జుట్టు రాలిపోవడం మొదలైంది. అలా రాలిపోయిన ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వచ్చేవి కావు. విచిత్రంగా అనిపించింది. జుట్టు ఇలా రాలిపోవడానికి అలోపేసియా అంటే పేనుకొరుకుడు వ్యాధి కారణమని డాక్టర్ చెప్పారు. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేదని తెలిసి కేతకి తీవ్రనిరాశకు గురైంది. జుట్టు రాలిపోయి తను అసహ్యంగా మారిపోతుందేమో అని భయపడిపోయింది. ఒకపాప, బాబుకు తల్లి అయిన కేతకికి భర్త కూడా మద్దతుగా నిలవకపోవడం, బంధువులు, ఇరుగు పొరుగు క్యాన్సరా? అని అడగడం, అంతా అవహేళన మాటలు, చూపులు... దాంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని త్యజించాలనుకుంది. కానీ తను లేకపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందో తలచుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంది. వ్యాధితోనే పోరాడుతూ బతకాలని నిర్ణయించుకుంది. గుండులా మారిన తలపైన టాటూలతో అందంగా అలంకరించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అవహేళన కాదు అండగా నిలవండి.. ‘‘ఎంతో ఒత్తుగా ఉండే నా జుట్టు 2010 నుంచి ఊడిపోవడం మొదలైంది. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయాను. అందరూ నన్ను అదోరకంగా చూస్తుండడంతో ఆఫీసుకు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేసేదాన్ని. ఇలా కొన్నాళ్లు భయంభయంగా గడిపాను. జుట్టు లేకపోతేనేం? గుండు మీద టాటూలు వేసుకుంటే అందంగా కనిపించవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే టాటూలు వేసుకున్నాను. ఫరవాలేదనిపించి ధైర్యంగా మోడలింగ్లో అడుగు పెట్టాను. అక్కడ దక్కిన గౌరవంతో హెయిర్లెస్ మోడల్గా ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగిన తరువాత... నాకున్న సమస్య గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టాను. అలోపేసియా గురించి అవగాహన కలిగించి గుండెల్లో ధైర్యం నింపితే బాధితులకు ఊరటగా ఉంటుంది’’ అని కేతకీ జానీ కోరుతోంది. యాడ్ చూసి... ఒకరోజు మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటీషన్ యాడ్ చూసి కాంపిటీషన్లో పాల్గొంది. ఆ పోటీలో పాల్గొన్న తొలి అలోపేసియా బాధితురాలిగా నిలిచింది. ఆ తర్వాత మిసెస్ యూనివర్స్ కాన్ఫిడెంట్గా, మిసెస్ పూనె, మిస్ అండ్ మిసెస్ పూనే ఇంటర్నేషనల్, మిసెస్ పాపులర్ వంటి అనేక టైటిల్స్ను వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. కొప్పున్నా లేకున్నా ఆత్మవిశ్వాసమే అందం అని నిరూపించింది. హెయిర్లెస్ మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతకి తనలా మరెవరూ బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో అలోపేసియా గురించిన అవగాహన కల్పిస్తోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బాధితులకు ధైర్యాన్ని నూరిపోస్తోంది. (చదవండి: ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!) -
Tejaswini Gowda: అమర్దీప్ భార్య, నటి తేజస్విని బ్యూటిఫుల్ లుక్స్ (ఫోటోలు)
-
Kritika Kamra: బాలీవుడ్ బ్యూటీ కృతిక కమ్రా అదిరిపోయే పోజులు (ఫోటోలు)
-
Nargis Fakhri: బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ బ్యూటిఫుల్ ఫొటోస్
-
ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం. కల్ప (హిమాచల్ప్రదేశ్) కల్ప.. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఒక రహస్య గ్రామం. ఇది హైవే నుంచి అస్సలు కనిపించదు. అయితే ఈ గ్రామం అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ యాపిల్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి కైలాస పర్వత మంచు శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ కనిపించినట్లు ఆ శిఖరాలు మరెక్కడా అంత స్పష్టంగా కనిపించవు. మవ్లిన్నోంగ్ (మేఘాలయ) మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్బిన్లను ఇక్కడ ఉపయోగిస్తారు. ఖిమ్సర్ (రాజస్థాన్) చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి. పూవార్ (కేరళ) తిరువనంతపురానికి దక్షిణ తీరాన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడి పరిశుభ్రమైన, అందమైన బీచ్లు పర్యాటకులను ఇంకొన్ని రోజుల ఇక్కడ గడిపేలా చేస్తాయి. అక్టోబర్- ఫిబ్రవరి మధ్య కాలం ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. కొల్లెంగోడ్ (కేరళ) పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. జిరాంగ్ (ఒడిశా) స్వచ్ఛమైన గ్రామీణ జీవితాన్ని చవిచూసేందుకు చంద్రగిరి ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడి జిరాంగ్ లోయ, బౌద్ధ దేవాలయాలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టిందిపేరుగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
ఇండియా ఫస్ట్ సన్రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్లో సరదాగా.. -
అమెరికాలో వరలక్ష్మి వ్రతం ఆచరించిన హీరోయిన్ లయ (ఫోటోలు)
-
పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్స్టిక్ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్స్టిస్ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు కొన్ని టూత్పేస్ట్ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. (చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!) -
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్ ఫాల్స్గా పేరు గడించింది. One of the most beautiful Waterfalls in the World.Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/WtwEZzGNGW— Raghu (@IndiaTales7) September 14, 2022 పర్యాటకుల వరద జోగ్ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. Jogh falls very less water.. pic.twitter.com/aNCYinrBhJ— prathap cta (@PrathapCta) September 2, 2017 Sound of Jog Falls. Meditative. River Sharavathi has been like this for millions of years. Water to #Bengaluru will completely kill this indescribable beauty. If no excess water, no waterfalls. #Shimoga #Karnataka #Monsoon2019 pic.twitter.com/nxNEYLSYVZ— DP SATISH (@dp_satish) July 21, 2019 -
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన రాజభవనాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అందమైన చర్చిలు
-
మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్ను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేస్తాయి. దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో, ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి సేదదీరేందుకు సాధారణంగా పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్ టెన్ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వాటిని రీట్వీట్ చేశారు. మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు. భారతలో తాను ఆస్వాదించాల్సిన అందమైన ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్ చేశారు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg — anand mahindra (@anandmahindra) June 8, 2023 -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు
-
భారతదేశంలోని అత్యంత అందమైన టాప్ 10 గ్రామాలు
-
ఊరిలోని చిన్నాపెద్దా అందరూ బంగారం ప్రియులైతే.. ఏఐ ఫోటోలు
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన పక్షులు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆకర్షణీయమైన పక్షులు
-
పుంజు అందం అదరహో.. జాతీయ స్థాయిలో రాజుపాలెం కోడికి మూడో స్థానం
కొమరోలు: ప్రకాశం జిల్లా పుంజు అంటే మజాకా.. అన్నట్టుగా మరోసారి నిరూపితమయింది. కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషాకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో ఈ పుంజు 3వ స్థానం దక్కించుకోగా పుంజు యజమాని సయ్యద్ బాషాను బహుమతులు వరించాయి. నిర్వాహకులు ప్రశంస పత్రం, షీల్డ్ను అందజేశారు. రాజుపాలెం కోళ్లు అందానికి మారుపేరు. బలమైన కాళ్లు, అంతకు మించిన శక్తితో రెక్కలు, సూటిగా ఉండే చిలక ముక్కు వీటికి ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఎన్ని కోళ్లు ఉన్నా ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి, విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి యజమానులు కూడా ఈ కోళ్లు అందంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తారు. వేళకు భోజనం, కొన్ని ఎక్సర్ సైజ్ లు , ప్రత్యేకంగా స్నానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోడిపై పెట్టే శ్రద్ధ.. అంతా ఇంతా కాదు. అందుకే 5 రాష్ట్రాలకు చెందిన కోళ్లతో పోటీ పడి మరీ రాజుపాలెం కోడిపుంజు విజేతగా నిలిచింది. -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్పూర్లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
అందమంటే భారత మహిళలదే.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!
ప్రపంచంలో 200కుపైగా దేశాలు ఉన్నాయి. ఏటా ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఏదో ఓ దేశానికి చెందిన, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. ఇలా ఒకరిద్దరి అందం గురించి కాకుండా.. సగటున అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ నివేదిక చెబుతోంది. ఈ అంశంపై యూకేకు చెందిన మల్టీనేషనల్ వస్త్రాల కంపెనీ ‘పోర్ మోయి’ ఆన్లైన్లో అధ్యయనం చేసి తాజాగా నివేదిక విడుదల చేసింది. పోస్టులు, ప్రశంసలను విశ్లేషించి.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘రెడ్డిట్’లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను ‘పోర్ మోయి’సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా విశ్లేషించింది. వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని ‘అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ప్రెట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..’వంటి కామెంట్లను.. ఆ పోస్టులు, చిత్రాలకు వచ్చిన అప్వోట్లను (ఫేస్బుక్లో లైక్ల తరహా ఇచ్చేవి) పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆయా దేశాల వారికి ర్యాంకులను ఇచ్చింది. కృత్రిమ మేధ ఇమేజ్ జనరేషన్ టూల్ ‘మిడ్జర్నీ’సాయంతో ఆయా దేశాల వారి రూపురేఖలపై రూపొందించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. భారత మహిళలే టాప్.. ‘పోర్ మోయి’స్టడీలో అత్యంత అందమైన మహిళలుగా భారతీయులే నిలిచారు. జపాన్, స్వీడన్ మహిళలు రెండు, మూడో స్థానం సాధించగా.. వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్ఏ వారు ఉన్నారు. ఓవరాల్గా మహిళలు, పురుషులు కలిపి చూస్తే కూడా.. భారతీయులే టాప్లో ఉండటం గమనార్హం. - అదే పురుషుల కేటగిరీలో చూస్తే.. బ్రిటన్లు టాప్లో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్ వారు ఉన్నారు. どういう仕組みかわからないけれども自信満々であろうあの国の名前は50位以内に無かった Most Attractive Nationalities In The World 27th February 2023 https://t.co/ZBmpe5PMQb pic.twitter.com/bJEyq8JHve — mknbearpaw (@mknbearpaw) March 7, 2023 -
భార్యతో టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఫోటోలు వైరల్
-
హీరోయిన్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
వైరల్ వీడియో: ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
-
ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
వైరల్: ‘దేవుడు మరో అవకాశం ఇస్తే..’ ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువ మంది!. కానీ, ఈ అందమైన శివంగి మాత్రం అలా కాదు.. తాను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటోంది. అది శారీరకంగా కాదు.. మానసికంగా!. డబ్బు కోసమో, సుఖం కోసమో ఆమె అస్సలు ఆశపడడం లేదు. ఎందుకంటే.. వ్యవస్థలో చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. తనలాగే బతకాలనుకుంటోంది కాబట్టి! కొలంబియా మెడెలిన్కు చెందిన డియానా రామిరెజ్diana ramirez.. ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమె అందం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్గా ఇంటర్నెట్లో ఆమెపై ఓ ప్రచారం నడుస్తోంది. అఫ్కోర్స్.. ఈమె కంటే అందగత్తెలు ఉండొచ్చు. కానీ, ఇప్పటికైతే ఈమెదే హవా నడుస్తోంది. View this post on Instagram ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరున్న మెడెలిన్ వీధుల్లో పోలీస్ అధికారిణిగా డియానా రామిరెజ్ పహారా కాస్తూ కనిపిస్తుంటుంది. రోజులో 14 గంటలు ఆమె డ్యూటీలోనే గడుపుతోంది. ఈ సర్వీసులో ఇప్పటిదాకా వీరోచితంగా ఛేజ్ చేసి ఆమె ఎంతో మంది నేరగాళ్ల ఆటకట్టించింది కూడా. అందంగా ఉంది.. రిస్క్ చేసి ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? హాయిగా ఏ మోడల్ కుదరకుంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కావొచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆమెకు. కానీ, ఆమె మాత్రం ‘నో’ అని తెగేసి చెప్తోంది. ‘‘ఒకవేళ మరోసారి కెరీర్ను ఎంచుకోమని దేవుడు అవకాశం ఇస్తే.. నేను పోలీస్ వృత్తినే ఎంచుకుంటా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం నాకు ఇష్టం. ఈ వృత్తి నాకు ఎంతో నచ్చింది. పోలీస్ వ్యవస్థ కూడా నాకు అంతే గౌరవం ఇచ్చింది. రంగు, రూపం, అందం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి. కానీ, శాశ్వతమైంది మాత్రం ఆత్మవిశ్వాసమే. నా తల్లిదండ్రులు నాలో దేశభక్తిని నింపారు.నా దేశం కోసం.. నేరరహిత సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వీడే ప్రసక్తే లేదు. రిస్క్ చేయడంలోనే మజా ఉంటోంది కదా అని చెబుతోందామె. తాజాగా డియానా రామిరెజ్ను బెస్ట్ పోలీస్/మిలిటరీ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకు నామినేట్ చేశారు అక్కడ. బాధ్యత గల వృత్తుల్లో ఉంటూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునేవాళ్లకు ఈ గుర్తింపు ఇవ్వాలని ఇన్స్టాఫెస్ట్ అవార్డుల పేరుతో ఓ మీడియా హౌజ్ అవార్డులను ప్రదానం చేయడం ప్రారంభించింది అక్కడ.