beautiful
-
సాల్ట్ అండ్ పెప్పర్: అందాల ఈ పెళ్లి కూతుర్ని గుర్తు పట్టండి! (ఫొటోలు)
-
జోరు.. హుషారుగా : మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్-బ్యూటీఫుల్ ఆడిషన్స్
నగరంలో జరుగుతున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ – బ్యూటీఫుల్ ఆడిషన్స్ ఆకట్టుకున్నాయి. మాసాబ్ ట్యాంక్లోని జేఎన్ఎఫ్ యూలో శుక్రవారం యువతులతో పాటు వివాహిత మహిళలకు ఈ ఆడిషన్స్ నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రంగాలకు చెందిన వారు ఈ పోటీల్లో హుషారుగా పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో సినీనటుడు జోయల్, మిస్ ఇండియా రన్నరప్ నిషితా తదితర ఫ్యాషన్ రంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఆడిషన్స్ ద్వారా ఎంపికైన వారు మార్చి 29న జరిగే ఫైనల్స్లో పోటీ పడతారని నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి : హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ ఆడిషన్స్ (ఫొటోలు) శిల్పారామానికి గోల్డ్ గార్డెన్మాదాపూర్ : మాదాపూర్ శిల్పారామం అరుదైన పురస్కారాన్ని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో గార్డెన్ ఫెస్టివల్లో మాదాపూర్ శిల్పారామానికి ల్యాండ్స్కేప్ గార్డెన్ నిర్వహణకు గానూ గోల్డ్గార్డెన్ సర్టిఫికెట్, జ్ఞాపికను అందజేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్రావు సంతోషం వ్యక్తం చేశారు .డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టీకల్చర్ ఎనిమిదో ఫెస్టివల్లో ప్రదానం -
Valentine's Day Special: టాలీవుడ్ బ్యూటిఫుల్ జోడీ రామ్చరణ్- ఉపాసన (ఫోటోలు)
-
సారా టెండుల్కర్ స్టన్నింగ్ లుక్స్.. అదిరిపోయిన ఫొటోలు
-
అనన్య నాగళ్ల కొత్త ఫోటోలు చూశారా? ఆహా అనిపించేలా అందాలు
-
భార్య, కుమారుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ (ఫోటోలు)
-
మహాకుంభమేళలో అందమైన సాధ్వి..!
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్రాజ్(Prayagraj)లో మహా కుంభమేళ(Maha Kumbh) అత్యంత అట్టహాసంగా జరుగుతోంది. ఈ వేడుకలో పాల్గొని గంగా స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. ఎందరో ప్రముఖులు, ఉన్నత చదువులు చదివి ఆధ్యాత్మికతవైపు అడుగులు వేసి సన్యాసులగా మారిన మేధావులను కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేగాదు ఈ మహత్తర వేడుకలో పాల్గొని తరించేందుకు దేశవిదేశాల నుంచి భక్తుల లక్షలాదిమందిగా కదిలి రావడం విశేషం. తాజాగా ఈ వేడుకలో ఒక అందమైన సాధ్వి(beautiful sadhvi) తళుక్కుమంది. ఆమె అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. హీరోయిన్ రేంజ్లో అందంగా ఉన్న ఆ యువతి సాధ్వీగా జీవిస్తోందా..? అని అంతా విస్తుపోయారు. ఇది నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చనీయాంశమైంది. అయితే ఆమె అంతా అనుకున్నట్లు సాధ్వి కాదని తేలింది. కేవలం అది గెటప్ అని ఆమె ఎలాంటి దీక్ష తీసుకోలేదని ఆ యువతే స్వయంగా చెప్పింది. ఆ అందమైన సాధ్వి పేరు హర్ష రిచారియా. ఆమె ఓ సోషల్ మీడియా ఇన్ఫ్టుయెన్సర్. గతంలో కూడా తాను ఇలా రీల్స్ద్వారా సనాతన ధర్మంలోని గొప్ప గొప్ప విశేషాలను ప్రజలకు తెలియజేశానని చెప్పుకొచ్చింది. అలానే ఈసారి ఈ కుంభమేళలో వారిలా సాధ్విగా గెటప్ వేసుకుని వారిని ఇంటర్వ్యూ చేసి..ఆధ్యాత్మికత గొప్పతనం గురించి తెలియజే యత్నం చేస్తున్నట్లు తెలిపింది. అందులో భాగంగానే ఈ గెటప్లో ఉన్నట్లు వివరణ ఇచ్చింది. అయితే ఆమె ఇలా సాధ్విలా కనిపించడంపై సోషల్మీడియా ట్రోల్కి గురయ్యింది. ఆధ్మాత్మికత అంటే నవ్వులాటగా ఉందా..?. ఆ వేషధారణలోనే తెలుసుకునే యత్నం చేయాలా అంటూ నెటిజన్లు తింటిపోశారు. (చదవండి: ఆ రెండు అస్సలు వదిలిపెట్టని రమ్యకృష్ణ.. అందుకే 50 ఏళ్లు దాటినా అంత ఫిట్గా..!) -
ఎరుపు రంగు లెహంగాలో మిల్కీ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్..! (ఫోటోలు)
-
మేము.. మా రెండు హృదయాలు.. పీవీ సింధు పోస్ట్ వైరల్ (ఫోటోలు)
-
ఒక్క పాటతో స్టార్డమ్.. కొన్నాళ్లకు ప్రమాదకర క్యాన్సర్.. ఇప్పుడేమో! (ఫొటోలు)
-
కేకేఆర్ ఖరీదైన ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అందమైన భార్య (ఫోటోలు)
-
బేబీ బంప్తో 'మహాతల్లి' జాహ్నవి (ఫొటోలు)
-
గ్లామర్లో వేరే లెవల్.. సైనా నెహ్వాల్ను ఇలా ఎపుడైనా చూశారా? (ఫొటోలు)
-
గ్రీన్ డ్రెస్లో బుల్లితెర భామ తేజస్విని అందాలు (ఫొటోలు)
-
ఐఫా వేడుకల్లో హీరోయిన్ మీనా.. బ్లాక్ డ్రెస్లో అదిరిపోయింది! (ఫొటోలు)
-
‘బంగారు తల్లి’ హారిక ద్రోణవల్లి.. అందమైన కుటుంబం (ఫొటోలు)
-
Hyderabad: సెలయేటికి చలో..
చిన్ని చిన్ని ఆశ అంటూ పాతికేళ్ల క్రితం ఓ సినిమాలో హీరోయిన్ నీళ్లలో తడుస్తూ పరవశించి పాడినా, జల.. జల.. జలపాతం.. నువ్వు అంటూ ఇటీవల ఓ సినిమాలో హీరో కీర్తించినా.. ప్రకృతి అందాల్లో జలధారల ప్రత్యేకతే వేరు. అలాంటి నిలువెత్తు నీటి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే వాటర్ ఫాల్స్ని మించిన మార్గం లేదు. ఆ తెల్లని నీళ్ల సిరుల్ని కళ్లకు హత్తుకోవాలంటే.. మాన్సూన్ని మించిన సీజన్ లేదు. మిగిలిన అన్ని కాలాల్లోనూ పొడి పొడిగా సాదాసీదాగా కనిపించే ప్రాంతాలు.. వర్షాకాలంలో మాత్రం హర్షామోదాల కేరింతల నిలయాలుగా మారిపోతాయి. ఈ సీజన్లో నప్పే ట్రిప్స్గా జలధారల దారి పట్టేవారి కోసం మన నగరం నుంచి అందుబాటు దూరంలో ఉన్న కొన్ని జలపాతాల విశేషాలివి.. వాటర్ ఫాల్స్.. ఈ పేరు చెప్పగానే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా వాటి అందాలను ఆస్వాదించేందుకు ఉవి్వళ్లూరుతారు.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఆ జలపాతం కింద తడిసి ముద్దవ్వాలనుకుంటారు. నగరం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో పలు జలపాతాలు నగర వాసులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వర్షా కాలంలో కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో గంగ పరవళ్లు.. సెలయేటి గలగలలు చెవులకు వినసొంపుగా వినిపిస్తాయి. భువనగిరికి దగ్గర్లో ఓ జలపాతం ఉంటుంది. చుట్టూ పచ్చదనం రాతి గుట్టలు ప్రకృతి ప్రేమికులకు కొత్త అనుభూతిని ఆస్వాదించే అవకాశాన్ని అందిస్తుంది. బొగత.. మన ఘనత..తెలంగాణ వాసులు సగర్వంగా చెప్పుకునే అద్భుత అందాల ఘనతగా బొగత జలపాతాన్ని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి 120 కిమీ దూరంలో నగరం నుంచి 329 కిమీ దూరంలో ఉందీ వాటర్ ఫాల్స్. ఖమ్మం జిల్లాలో, రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలపాతం ఇదే. తెలంగాణ నయాగరగా పేరుగాంచి మాన్సూన్లో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశం. ఇక్కడకు చేరుకోడానికి సందర్శకులు కొంత దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. రాయకల్.. జలరాశుల్.. పోతపోసిన ప్రకృతి అందాల నిలయం రాయకల్ జలపాతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్లు, రాయకల్ జలపాతం ఉంటాయి. మార్గమధ్యంలో పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చు. కొండమీది నుంచి రాసులు పోస్తున్నట్టు కిందకు దుమికే నీటి ధారలు రాయకల్ జలపాత దృశ్యం కనువిందు చేస్తుంది. మల్లెల తీర్థం.. అరణ్య మార్గం.. నగరానికి దాదాపు 185 కిమీ దూరంలో నల్లమల అరణ్యంలో ఉంది. ఈ జలపాతానికి చేరుకోడానికి, అడవి గుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంతమేర సాహసోపేతమైన ప్రయాణం అనే చెప్పాలి.రాజేంద్రనగర్.. వాటర్ ఫాల్స్.. నగరానికి కేవలం 13.9 కిమీ దూరంలో ఈ సుందరమైన జలపాతం శీఘ్ర విహారానికి అనువైనది. సందర్శకులు ఒక చిన్న రైడ్ ద్వారా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు.జలజల.. కుంటాల.. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. నగరం నుంచి 564.9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం ఆదిలా బాద్లో ఉంది. దాదాపు 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ వీక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.వైజాగ్ వారి ఆతిథ్యం.. అందం ‘చందం’ నల్లగొండ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో వైజాగ్ కాలనీ ఉంది. దేవరకొండ నియోజకవర్గంలోని చందం పేట మండలంలో కృష్ణానది బ్యాక్ వాటర్ ఆనుకుని ఉన్న కుగ్రామం ఇది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నలువైపులా నల్లమల అడవులు, గుట్టలతో కప్పి ఉంటుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు వైజాగ్కు చెందిన కొన్ని కుటుంబాలు స్థిరపడడంతో దీనికి వైజాగ్ కాలనీగా పేరొచి్చంది. వీకెండ్లో టూరిస్టుల కోసం కాలనీ వాసులే వసతి ఏర్పాట్లు చేస్తుంటారు. బోటింగ్ సౌకర్యం కూడా ఉంది. కృష్ణానదిలో పట్టిన తాజా చేపల వంటకాలు ఇక్కడ ఫేమస్.ఎత్తిపోతల.. జలకళ.. సిటీకి 163.4 కిలోమీటర్ల దూరంలో చంద్రవంక నది సమీపంలో ఈ జలపాతం సందర్శకులను ఆకట్టుకుంటుంది. సమీపంలోని మొసళ్ల పెంపక కేంద్రం కూడా సందర్శనీయమే. నాగార్జున సాగర్ డ్యామ్ వైపు ఎన్హెచ్ 56 నుంచి డ్రైవింగ్ చేయడం ద్వారా జలపాతాన్ని, డ్యామ్ను చూడవచ్చు.భీముని పాదం.. ఆనందానికి ఆ‘మోదం’ దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూఎత్తయిన కొండలు, పక్షుల కిలకిలలు. సాయంత్రం వేళ అడవి జంతువుల అరుపులు, వర్షా కాలంలో ఎత్తయిన గుట్ట మీది నుంచి పాదం మధ్యలో జాలువారే నీటి సిరులు.. అస్వాదించాలంటే భీమునిపాదం జలపాతం దగ్గరికి పోవాల్సిందే. మానుకోట జిల్లాలో ఏకైక పర్యాటక ప్రాంతంగా దీన్ని చెప్పుకుంటారు.ఏడు బావుల.. వింతలా..బయ్యారం, గంగారం సరిహద్దుల్లో మిర్యాలపెంట సమీపంలో ఏడుబావుల జలపాతాలున్నాయి. పాండవుల గుట్టపై సహజసిద్ధంగా ఏర్పడ్డాయి. జలపాతం నుంచి కిందికి పడే నీళ్లు కొద్ది దూరం ప్రవహించి తరువాత అదృశ్యమవడం. దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి పాలధారలా నీళ్లు పడుతూ కనువిందు చేస్తుంది.పచ్చని నెచ్చెలి.. చెచ్చెర..ఉమ్మడి ఆదిలాబాద్లో ఎన్నో జలపాతాలున్నా ఎక్కువ మందికి పరిచయం లేని జలపాతం చెచ్చెర. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని కౌరగామ్ సమీపంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉందీ జలపాతం. ఎత్తయిన కొండల మధ్యలో 200 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకే జలపాతాన్ని చూడటం కనువిందే. ఇక్కడి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆకట్టుకుంటాయి. -
కూతుళ్లే అందం..ప్రముఖుల బ్యూటిఫుల్ డాటర్స్..!(ఫొటోలు)
-
మిస్&మిస్సెస్ ఫ్యాషన్ ఈవెంట్ కర్టన్ రైసర్ (ఫొటోలు)
-
Sreemukhi: లంగా ఓణీలో రాములమ్మ.. ఎంత చక్కగా ఉందో! (ఫొటోలు)
-
టాలీవుడ్ విలన్కి ఇంత అందమైన కూతురు.. ఈమెని గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
గ్రూమింగ్ అంటే ఇదీ! మీరే చూడండి దీని వయ్యారం!
గుర్రం అంటే రాజసం, పౌరుషం. అందుకే గుర్రాల వాల్ పేపర్ను, అందమైన గుర్రం పెయింటింగ్లను చాలామంది ఇష్టపడతారు. చల్ చల్ గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, రాణి ఎక్కే కీలు గుర్రం, రాకుమారి ఎక్కే రత్నాల గుర్రం. గుర్రపు స్వారీ ఒక ఫ్యాషన్...సాహస క్రీడ. పెంపుడు జంతువుగా గుర్రాని ఎంచుకోవడం కొందరికి హాబీ. మరికొందరి అదొక వృత్తి. వ్యాపారం కూడా. అందుకే గుర్రాలను బలమైన దాణాను అందిస్తారు. అందంగా తయరు చేస్తారు.అంతేకాదుకొన్ని రకాల గుర్రాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి ద్వారా పోలియో, పక్షవాతం మెదడు, వెన్నెముక సమస్యలు... వినికిడి, భావ వ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడంవంటి వాటికి చికిత్సగా గర్రపు స్వారీని వాడతారట.Before 🐎 After 🦄 pic.twitter.com/9R1jYkoZxI— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 30, 2024గుర్రాలు ఆరోగ్యంగా, సరిగ్గా పనిచేయాలంటే దానికి నిరంతరం, బ్రషింగ్, గ్రూమింగ్ అవసరం అంటున్నారు జంతు సంరక్షణ నిపుణులు. ప్రతీ రోజు గుర్రం శరీరంలోని ప్రతి అణువును అప్యాయంగా తాకుతూ ఉంటే యజమాని, గుర్రం మధ్య బంధం పెరగడమేకాదు ఇది ప్రీవెంటివ్ మెడిసిన్లాగా పనిచేస్తుందట. అంటే దాని శరీరంపై మనకు తెలియకుండా ఏమైనా గాయాలు, పుండ్లు లాంటివి వుంటే అర్థమవుతాయి.అలా ఒక గుర్రాన్ని చక్కగా జుట్టు కత్తిరించి, రకరకాల క్రీములతో శుభ్రంగా స్నానం చేయించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో వివేషంగా నిలుస్తోంది. మనుషులకేనా తైల మర్దనాలు, అభ్యంగనస్నానాలు.. గుర్రాలకు కూడా అన్నట్టుగా ఉన్న ఈ వీడియో నెటిజనులకు తెగ నచ్చేస్తోంది. నేచర్ ఈజ్ అమేజింగ్ అనే ఎక్స్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియో దాదాపు 8.5 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. -
Tejaswini Gowda: తేజు అందాన్ని రెట్టింపు చేసేది ఆ నవ్వే! (ఫోటోలు)
-
అనంత్ అంబానీ - రాధిక వెడ్డింగ్ : అందమైన ఫోటోలు
-
అందాల శ్రీమతికి అందమైన లెహెంగా (ఫోటోలు)
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
మరీ ముద్దొచ్చేలా యాంకర్ రష్మి.. ఇలా అయితే ఎలా? (ఫొటోలు)
-
హుందాగా గాగ్రా, అందంగా లెహెంగా... కళ్లు తిప్పుకోలేరు! (ఫోటోలు)
-
జీవిత రాజశేఖర్ కూతురు 'శివాత్మిక' స్టన్నింగ్ ఫోటోలు
-
Mouni Roy: సొగసరి చీర కడితే.. (ఫోటోలు)
-
‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ స్టయిల్ చూశారా?
-
దేశంలో ఎత్తైన జలపాతాలు:రెండు కళ్లూ చాలవంతే! (ఫొటోలు)
-
బ్యూటిఫుల్ సారీ, జ్యుయల్లరీ, వాటే కాంబో.. శ్రియా శరణ్ (ఫోటోలు)
-
Anna Ben: కల్కి బ్యూటీ టాప్ లుక్స్.. ఓసారి చూసేయండి (ఫోటోలు)
-
ప్రగ్యా జైస్వాల్ అందాన్ని ఎలా వర్ణించాలి... (ఫొటోలు)
-
మీ మూడ్ ని మార్చేసే పూ బాలలు.. (ఫొటోలు)
-
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
-
ఐశ్వర్యా రాజేశ్ మత్తెక్కించే పోజులు.. రోజురోజుకీ అందంగా! (ఫొటోలు)
-
ఎవరీ పూబంతి.. అందాల సందళ్లు మోసుకొచ్చింది! (ఫోటోలు)
-
Kajal: అందంతో అల్లాడించే సొగసుల రాణి (ఫోటోలు)
-
Priyanka Arul Mohan: సీతాకోకచిలుకలా మెరిసిపోతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ (ఫొటోలు)
-
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
-
ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
విలాసవంతమైన భవనం అనగానే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ నివాసం ఆంటిలియా గుర్తొస్తుంది కదా. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసంగా గుర్తింపు పొందిన మరోకటి ఉంది తెలుసా. అది ఎక్కడ ఉంది? అందులో ఎవరుంటారు.. ఈ వివరాలు తెలుసుకుందాం రండి..!దాదాపు 600 ఎకరాల్లో ఉండే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ మన దేశంలోనే ఉంది. బరోడాలోని గైక్వాడ్ కుటుంబానికి చెందిన గుజరాత్లోని వడోదరలో ఉన్న ఈ రాజభవనాన్ని వీక్షించాలంటే రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది బకింగ్హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ. దాని పేరు లక్ష్మీ విలాస్ ప్యాలెస్.1890లో మరాఠా గైక్వాడ్ వంశస్థులు దీన్ని నిర్మించారు. శిల్పి మేజర్ చార్లెస్ మాంట్ ఇండో-సారసెనిక్ శైలిలో దీన్ని నిర్మించారు. 176 లగ్జరీ గదులు, కళ్లు చెదిరిపోయేలా హాళ్లు, తోటలు, ఫౌంటెన్ ఇలా సర్వ హంగులూ దీని సొంతం.ప్యాలెస్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంది. బరోడా పాలకులుగా ఉన్న సమయంలో 1890లో మహారాజా శాయాజీరావ్ గైక్వాడ్ - III దీన్ని నిర్మించారు. ఈ రాజప్రాసాదాన్ని నిర్మించడానికే సుమారు పన్నెండేళ్లు పట్టిందట. ఇంతకీ ఈ అందమైన రాజభవనం విలువ ఎంతో తెలుసా? రూ.24,000 కోట్లకు పైమాటే. విశేషాలు3,04,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది లక్ష్మీ విలాస్ ప్యాలెస్. బకింగ్హామ్ ప్యాలెస్ విస్తీర్ణం 8,28,821 చదరపు అడుగులుమాత్రమే. మహారాజా ఫతే సింగ్ మ్యూజియంలో రాజా రవివర్మకు సంబంధించిన అనేక అరుదైన పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు రాజభవనంలో ప్రపంచంలోని ఇతర ప్యాలెస్ల కంటే ఎక్కువ గాజు కిటికీలు ప్రత్యేక ఆకర్ణణ అని చెబుతారు. వీటిలో ఎక్కువ గాజు కిటికీలను బెల్జియం నుంచి తీసుకొచ్చారు.అందమైన రాణి రాధిక రాజే గైక్వాడ్ప్రస్తుతం గైక్వాడ్ వంశ కుటుంబానికి సారధి సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ భార్య, మహారాణి మహారాణి రాధికరాజే గైక్వాడ్ దేశంలోని అత్యంత అందమైన , ఆధునిక రాణులలో ఒకటి గుర్తింపు తెచ్చుకున్నారు. గుజరాత్లోని వాంకనేర్కు చెందిన రాధిక రాజే 1978, జూలై 19న జన్మించారు. తండ్రి డా. MK రంజిత్సిన్హ్ ఝాలా.ఈయన ఐఏఎస్ అధికారికావడానికి రాజ్షాహి బిరుదును వదులు కున్నారట.రాధికారాజే గైక్వాడ్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీరామ్ కళాశాల నుండి భారతీయ చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 2002లో మహారాజా సమర్జిత్సింగ్ గైక్వాడ్తో వివాహానికి ముందు, ఆమె జర్నలిస్టుగా పనిచేశారు. 2012లో లక్ష్మీ విలాస్ ప్యాలెస్లో జరిగిన సంప్రదాయ వేడుకలో సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ బరోడా కిరీటాన్ని స్వీకరించారు. ఈ దంపతులకు నారాయణి ,పద్మజ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చేతివృత్తుల కళాకారులు,మహిళల కోసం అనేక ప్రాజెక్టులను చేపడుతూ, వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు రాధికా రాజే -
Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
మెట్గాలా 2024 ఈవెంట్లో అంబానీ కుమార్తె, రిలయన్స్ రీటైల్ ఎండీ ఇషా అంబానీ మరోసారి మెరిసి పోయింది. ఈ ఏడాది ఇషా అంబానీ మెట్ గాలా వేదికపైకి రావడం ఇది నాలుగోసారి. మెట్ గాలా 2024లో భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీర గౌనులో తళుక్కున మెరిసింది. ఆరు గజాల 3డీ గౌనుకు కార్సెట్ బ్లౌజ్తో గ్లామర్ లుక్ను మరింత ఎలివేట్ చేసుకుంది. పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగల సిగ్నేచర్ మోటిఫ్లతో తయానైన గౌనులో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. పూర్తిగా ప్రకృతి ప్రేరణగా తీర్చిదిద్దిన ఆభరణాలు, చేతితో నేసిన గౌను, నెమలి ఫీచర్డ్ బ్యాగ్తో వనదేవతలా కనిపించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania)ఫ్యాషన్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఈవెంట్ మెట్ గాలా వేదికపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ తన ఫ్యాషన్ స్టయిల్ను చాటుకుంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికపై ఇండియాలోని గ్రామాలలో చేతితో ఎంబ్రాయిడరీ చేసిన గౌనుతో ప్రత్యేకంగా కనిపించింది.ఈ ఏడాది మెట్ గాలా థీమ్ "స్లీపింగ్ బ్యూటీస్: రీవేకనింగ్ ఫ్యాషన్." "ది గార్డెన్ ఆఫ్ టైమ్" అనే దుస్తుల కోడ్కు అనుగుణంగా, తన డ్రెస్లో పువ్వులు, సీతాకోక చిలుకలు, తూనీగలు ఉండేలా చూసుకున్నారు. అలాగే చేతికి ట్రెడిషనల్ లోటస్ బ్రేస్లెట్, ప్యారెట్ ఇయర్ రింగ్స్, ఫ్లవర్ చోకర్లతో పాటు, నకాషి మినియేచర్ పెయింటింగ్ వంటి భారతీయ కళ పద్ధతుల్లో స్వదేశ్ రూపొందించిన క్లచ్ను కూడా ఆమె ధరించింది. జాతీయ పక్షి మయూరం పెయింటింగ్ డిజైన్ క్లచ్ బ్యాగ్ చూడాల్సిందే. ఈ పెయింటింగ్ను జైపూర్కు చెందిన హరి నారాయణ్ మరోటియా రూపొందించారు. డిజైనర్, రాహుల్ మిశ్రా, ఇషా అంబానీ స్టైలిస్ట్ అనైతా ష్రాఫ్ అడజానియా ప్రకారం ఆమె ధరించిన 3డీ గౌను పూర్తి చేయడానికి 10,000 గంటలు పట్టిందట. ఫరీషా, జర్దోజీ, నక్షి , దబ్కా వంటి అప్లిక్, ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఇందులో ఉన్నాయి. ఈ గౌనులో ఫ్రెంచ్ నాట్లు కూడా ఉన్నాయి.2017లో మెట్ గాలా అరంగేట్రం చేసింది ఇషా అంబానీ. 2019 లో,భారతీయ డిజైనర్ ప్రబల్ గురుంగ్ రూపొందించిన లిలక్ గౌను ధరించింది. ఇక 2023లో, మళ్లీ గురుంగ్ని డిజైన్ చేసిన బ్లాక్ పట్టు గౌను ధరించిన సంగతి తెలిసిందే. -
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
ఎవర్ గ్రీన్ సుమ.. లంగా ఓణీలో మరింత క్యూట్ (ఫొటోలు)
-
కలర్ఫుల్ లంగావోణీలో యాంకర్ సుమ లుక్స్.. ఫోటోలు
-
Sreemukhi: అందాల బొమ్మ.. రాములమ్మ!
-
Saina Nehwal: జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటున్న సైనా నెహ్వాల్
-
దేవర బ్యూటీ చీర సోయగాలు,ఒక్కసారి చూస్తే..! (ఫొటోలు)
-
మనతో పాటు గోళ్ళు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే..
మన జీవితంలో.. ఎన్నోవాటిపై మనం ముఖ్యతను చూపుతాం. మరెన్నో వాటిపై లీనమైపోతూ ఉంటాం. ఒక్కసారైనా ఆరోగ్యాన్ని పట్టించుకుంటామా..! మరెందుకు దీనిపై అశ్రద్ధ. అలాగే మన శరీరంలోని చేతిగోళ్ల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా..? వాటి అందం, రంగు గురించి ఎప్పుడైనా చూడడంగానీ, గమనించడంగానీ చేశారా..! ఓసారి వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ నిజాలు తెలుస్తాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం..! ఈ విధంగా.. గోళ్లు అందంగా ఉండాలంటే దేహం ఆరోగ్యంగా ఉండాలి. గోళ్లలో చీలికలు, పొడిబారిపోవడం కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు అర్థం.. తెల్ల చుక్కలు కనిపిస్తే ఎప్పుడూ నెయిల్ పాలిష్ వేస్తుంటారని లేదా మీకు గోళ్లు కొరికే అలవాటుందని అర్థం చేసుకోవాలి. అడ్డంగా గీతలు, గాడి ఏర్పడినట్లు ఉంటే విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, తీవ్రమైన జ్వరం బారిన పడినట్లు అర్థం. ఉబ్బెత్తుగా ఉండాల్సిన గోరు గుంట పడినట్లు పలుచగా మారితే అది ఐరన్లోపానికి గుర్తు. సమతుల ఆహారం తీసుకుంటూ, దేహం డీ హైడ్రేషన్కు గురి కాకుండా తగినంత నీటిని తీసుకుంటూ ఉండాలి. దాంతోపాటు కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్/ ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి వలయాకారంలో రుద్దుతూ ఉండాలి. అప్పుడు గోరు గులాబీరంగులో ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. ఇవి చదవండి: కుండలినీ యోగాతో అల్జీమర్స్కు చెక్: తాజా పరిశోధన -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
పాత జీన్స్ను ఇలా కూడా వాడవచ్చని మీకు తెలుసా?
అతి కొద్దిమంది మాత్రమే వ్యర్థాలను కూడా ఉపయుక్తంగా మలచి, తమ జీవితాన్ని కూడా అర్థవంతంగా మార్చుకుంటారు. ఆ కొద్దిమంది జాబితాలో నిలుస్తుంది సౌమ్య కల్లూరి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాసి అయిన సౌమ్యముంబైలో సోషల్ ఎంటర్ప్రైజ్ ‘ద్విజ్’ అనే సంస్థను ఏర్పాటు చేసిదాని ద్వారా వాడి పడేసే డెనిమ్ దుస్తులను తిరిగి ఉపయోగించుకునేలా బ్యాగులు, టోపీలు, జ్యువెలరీ, క్లచ్లు, ఇతర యాక్సెసరీస్.. తయారు చేస్తోంది. ఈ పని ద్వారా 40 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నిథిమ్లో జరుగుతున్న దస్తకారి హాత్ సమితి క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన డెనిమ్ స్టాల్లో తన ఉత్పత్తుల ద్వారా వ్యర్థాలతో కొత్త అర్థాలను మనకు పరిచయం చేస్తోంది.రెండోసారి మరింత కొత్తగా! ‘‘ద్విజ్ అంటే రెండవది అని అర్థం వచ్చేలా ఈ రీయూజ్ కాన్సెప్ట్ను ఎంచుకున్నాను. డెనిమ్ లేదా జీన్స్ అని పిలిచే క్లాత్ చాలా గట్టిగా ఉంటుందని మనకు తెలుసు. కొంత కాలం వాడాక పాతబడి పోవడమో, బోర్ అనిపించడమో, రంగు వెలిసిందనో పిల్లలవైతే పొట్టిగా అయ్యాయనో .. ఇలా రకరకాల కారణాలతో డెనిమ్ దుస్తులను ఎవరికైనా ఇచ్చేస్తుంటారు. అవి తీసుకున్నవాళ్లు వాటిని వాడతారు అనే నమ్మకం లేదు. ఎందుకంటే, అవి వారి సైజుకు సరిపోకపోవచ్చు. వారు వాటిని చెత్తలో పడేయచ్చు. ప్రపంచమంతటా విరివిగా ఉపయోగిస్తూ, వాడి పడేసే జీన్స్ను తిరిగి ఉపయుక్తంగా మార్చేలా చేసిన ప్రయోగాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. దీంతో 2018లో ఈప్రాజెక్ట్ను 6 లక్షల రూపాయలతో ఆరంభించాను. పర్యావరణ హితంగా.. మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎమ్మెస్ కోసం జర్మన్ వెళ్లాను. అక్కడ కార్బన్ ఉద్గారాలు, వ్యర్థాలపై పరిశోధన చేస్తున్నప్పుడు చాలా విషయాలు పరిశీలనకు వచ్చాయి. పర్యావరణహితంగా ఏదైనా వర్క్ చేయాలనుకున్నాను. ఏడాదిన్నర పాటు ఉద్యోగం చేసినా నా ఆలోచనలు మాత్రం రీ సైక్లింగ్ చుట్టూ తానే తిరుగుతూ ఉండేవి. వాడేసిన డెనిమ్పైన దృష్టి మళ్లి వాటిని సేకరించడం మొదలుపెట్టాను. వాడేసిన వాటర్ బాటిల్స్ను సేకరించి, రీ సైకిల్ చేసి, బ్యాగ్ లోపలివైపు వచ్చేలా డిజైన్ చేశాను. దీనివల్ల ఏదైనా పదార్థాన్ని బ్యాగ్లో తీసుకెళుతున్నప్పుడు డబ్బా మూతలు లీక్ అయినా సమస్య ఉండదు. ఈ బ్యాగ్లుఎక్కడా పాతవిగా అనిపించవు. మొదటిసారి వాడు తున్నట్టుగానే ఉంటాయి. ఈ తరం కోరుకునే బ్యాక్ ప్యాక్స్, క్లచ్లు, ల్యాప్టాప్ బ్యాగ్లు.. కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. చిన్న పీస్ను కూడా వదలం వాడేసిన జీన్స్ను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బల్క్లో కొనుగోలు చేస్తాం. కొందరు నేరుగా వచ్చి డొనేట్ చేస్తారు. ముందు వాటిని శుభ్రం చేయిస్తాం. ఆ తర్వాత వాటి సైజ్, షేడ్, సన్నం, మందం.. క్లాత్ని బట్టి దేనిని ఎలా మలచాలి అనే ఆలోచనకు వస్తాం. పదిమంది ఫుల్ టైమ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 30మంది మహిళలు వాళ్ల ఇంటి నుంచే పని చేస్తారు. బాగా మందంగా ఉండి, పెద్ద పెద్ద జీన్స్ వస్తే వాటిని బ్యాగ్లుగా తయారు చేస్తాం. కొంచెం మీడియం సైజు వాటితో చిన్న బ్యాగ్స్,. పలుచటి, చిరిగిన జీన్స్తో హ్యాండ్మేడ్ జ్యువెలరీ తయారు చేస్తాం. ఇంకా, బొమ్మలు, ఎంబ్రాయిడరీ చేసి హోమ్ డెకార్ ఐటమ్స్ కూడా ఇందులో ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన జీన్స్లో చిన్న ముక్కను కూడా వృథాగా పోనివ్వం. ఈ రోజుల్లో పర్యావరణం ఎలా ఉంటుందో చూస్తున్నాం. కాలానుగుణంగా వర్షాలు పడవు, భూ తాపం పెరిగిపోతుంటుంది. కాలుష్యం కంపెనీల నుంచో, వాహనాల నుంచో వస్తుందనే అనుకుంటాం. కానీ, మనం రోజూ వాడే బట్టలు కూడా కాలుష్యానికి పెద్ద కారకం. ఈ సమస్య నివారణకు చేసిన చిన్న ప్రయత్నమే ద్విజ్. స్వచ్ఛంద సంస్థలతో కలిసి మిషన్ గ్రీన్ ముంబయ్ స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రభుత్వ స్కూల్ పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. దీని ద్వారా అటు చదువుకునే పిల్లలనూ, ఇటు ఈ పనిలో భాగం పంచుకుంటున్న మహిళలనూ ్ ప్రోత్సహిస్తున్నాం. అనిమేథ్ చారిటబుల్ ట్రస్ట్ వారితో కలిసి మహిళలకు డెనిమ్ రీ యూజ్ ప్రాజెక్ట్లో భాగంగా వర్క్షాప్స్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇస్తున్నాం. 2022లో సర్వోదయ ట్రస్ట్ ద్వారా తెలంగాణలోని వికారాబాద్ ప్రభుత్వ పాఠశాల పిల్లలకు హ్యాండ్ బ్యాగ్లను కానుకగా ఇచ్చాం. ఇండియా మొత్తంలో క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్స్ ఎక్కడ జరిగినా అక్కడ మా స్టాల్ ఏర్పాటుకు కృషి చేస్తుంటాం. దీనికి విడిగా షాప్ అంటూ ఏమీ లేదు. ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తుంటాం’’ అని వివరిస్తారు సౌమ్య. -
జుట్టు లేకపోయినా మోడల్గా రాణించి శభాష్ అనిపించుకుంది!
‘‘నిర్దిష్టమైన లక్షణాలు, ముఖ కవళికలు అందాన్ని నిర్వచించలేవు. ఎందుకంటే జుట్టు ఉన్నా లేకపోయినా గుండెల్లో ఆత్మవిశ్వాసం... పెదవులపై చిరునవ్వూ ఉంటే అందంగానే ఉంటారు’’ అని నిరూపించి, ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది కేతకీ జానీ. నలభైఏళ్ల వయసులో అలోపేసియా వ్యాధితో కేతకీ జుట్టు రాలిపోయినప్పటికీ కృంగిపోకుండా హెయిర్లెస్ మోడల్గా రాణిస్తూనే అలోపేసియా బాధితులకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తోంది. అహ్మదాబాద్లో పుట్టిన కేతకీ జానీ పుణెలో పెరిగింది. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక బిఏ, బిఈడీ, ఎమ్ఏ చేసింది. మహారాష్ట్ర టెక్ట్స్బుక్ ప్రొడక్షన్లో ప్రత్యేక అధికారిగా పనిచేసేది. ఉన్నట్టుండి కేతకీ జుట్టు రాలిపోవడం మొదలైంది. అలా రాలిపోయిన ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వచ్చేవి కావు. విచిత్రంగా అనిపించింది. జుట్టు ఇలా రాలిపోవడానికి అలోపేసియా అంటే పేనుకొరుకుడు వ్యాధి కారణమని డాక్టర్ చెప్పారు. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేదని తెలిసి కేతకి తీవ్రనిరాశకు గురైంది. జుట్టు రాలిపోయి తను అసహ్యంగా మారిపోతుందేమో అని భయపడిపోయింది. ఒకపాప, బాబుకు తల్లి అయిన కేతకికి భర్త కూడా మద్దతుగా నిలవకపోవడం, బంధువులు, ఇరుగు పొరుగు క్యాన్సరా? అని అడగడం, అంతా అవహేళన మాటలు, చూపులు... దాంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని త్యజించాలనుకుంది. కానీ తను లేకపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందో తలచుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంది. వ్యాధితోనే పోరాడుతూ బతకాలని నిర్ణయించుకుంది. గుండులా మారిన తలపైన టాటూలతో అందంగా అలంకరించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అవహేళన కాదు అండగా నిలవండి.. ‘‘ఎంతో ఒత్తుగా ఉండే నా జుట్టు 2010 నుంచి ఊడిపోవడం మొదలైంది. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయాను. అందరూ నన్ను అదోరకంగా చూస్తుండడంతో ఆఫీసుకు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేసేదాన్ని. ఇలా కొన్నాళ్లు భయంభయంగా గడిపాను. జుట్టు లేకపోతేనేం? గుండు మీద టాటూలు వేసుకుంటే అందంగా కనిపించవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే టాటూలు వేసుకున్నాను. ఫరవాలేదనిపించి ధైర్యంగా మోడలింగ్లో అడుగు పెట్టాను. అక్కడ దక్కిన గౌరవంతో హెయిర్లెస్ మోడల్గా ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగిన తరువాత... నాకున్న సమస్య గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టాను. అలోపేసియా గురించి అవగాహన కలిగించి గుండెల్లో ధైర్యం నింపితే బాధితులకు ఊరటగా ఉంటుంది’’ అని కేతకీ జానీ కోరుతోంది. యాడ్ చూసి... ఒకరోజు మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటీషన్ యాడ్ చూసి కాంపిటీషన్లో పాల్గొంది. ఆ పోటీలో పాల్గొన్న తొలి అలోపేసియా బాధితురాలిగా నిలిచింది. ఆ తర్వాత మిసెస్ యూనివర్స్ కాన్ఫిడెంట్గా, మిసెస్ పూనె, మిస్ అండ్ మిసెస్ పూనే ఇంటర్నేషనల్, మిసెస్ పాపులర్ వంటి అనేక టైటిల్స్ను వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. కొప్పున్నా లేకున్నా ఆత్మవిశ్వాసమే అందం అని నిరూపించింది. హెయిర్లెస్ మోడల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతకి తనలా మరెవరూ బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో అలోపేసియా గురించిన అవగాహన కల్పిస్తోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బాధితులకు ధైర్యాన్ని నూరిపోస్తోంది. (చదవండి: ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!) -
Tejaswini Gowda: అమర్దీప్ భార్య, నటి తేజస్విని బ్యూటిఫుల్ లుక్స్ (ఫోటోలు)
-
Kritika Kamra: బాలీవుడ్ బ్యూటీ కృతిక కమ్రా అదిరిపోయే పోజులు (ఫోటోలు)
-
Nargis Fakhri: బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ బ్యూటిఫుల్ ఫొటోస్
-
ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
దేశంలోని పలు నగరాల తళుకుబెళుకులను మన చూసేవుంటాం. కానీ దేశంలోని అత్యంత అందమైన గ్రామాలను చూసివుండం. ఇప్పుడు మన దేశంలోని అందమైన గ్రామాలను దర్శిద్దాం. కల్ప (హిమాచల్ప్రదేశ్) కల్ప.. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న ఒక రహస్య గ్రామం. ఇది హైవే నుంచి అస్సలు కనిపించదు. అయితే ఈ గ్రామం అందం ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది. గ్రామం చుట్టూ యాపిల్ తోటలు కనిపిస్తాయి. ఇక్కడ నుండి కైలాస పర్వత మంచు శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ కనిపించినట్లు ఆ శిఖరాలు మరెక్కడా అంత స్పష్టంగా కనిపించవు. మవ్లిన్నోంగ్ (మేఘాలయ) మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్లో ఉన్న మావ్లిన్నోంగ్.. ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామం. దీనిని దేవుడి తోట అని కూడా పిలుస్తారంటే దీని అందాలను అంచనా వేయవచ్చు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగం ఉండదు. వెదురుతో చేసిన డస్ట్బిన్లను ఇక్కడ ఉపయోగిస్తారు. ఖిమ్సర్ (రాజస్థాన్) చుట్టూ స్వచ్ఛమైన గాలి, ఇసుకతో కూడిన గ్రామం ఇది. ఊరి మధ్యలో సరస్సు కనిపిస్తుంది. గ్రామ సమీపంలో అందమైన చెట్లు ఉంటాయి. అందమైన గుడిసెలు కనువిందు చేస్తాయి. రాజస్థాన్లోని ఈ గ్రామాన్ని ఇసుక దిబ్బల గ్రామం అని కూడా అంటారు. ఈ గ్రామం అందమైన రిసార్ట్ను తలపిస్తుంది. ఇక్కడ దాదాపు 300 నుంచి 400 అడుగుల ఎత్తులోని భారీ మట్టి దిబ్బలు ఉన్నాయి. పూవార్ (కేరళ) తిరువనంతపురానికి దక్షిణ తీరాన ఉన్న ఈ గ్రామం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. ఇక్కడి పరిశుభ్రమైన, అందమైన బీచ్లు పర్యాటకులను ఇంకొన్ని రోజుల ఇక్కడ గడిపేలా చేస్తాయి. అక్టోబర్- ఫిబ్రవరి మధ్య కాలం ఈ గ్రామాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. కొల్లెంగోడ్ (కేరళ) పచ్చదనం, మామిడి తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ చిన్న గ్రామం ఎంతో శుభ్రంగా ఉంటుంది. సంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించిన కొల్లెంగోడ్ ప్యాలెస్ ఇక్కడ ప్రధాన ఆకర్షణ. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తుంటారు. జిరాంగ్ (ఒడిశా) స్వచ్ఛమైన గ్రామీణ జీవితాన్ని చవిచూసేందుకు చంద్రగిరి ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడి జిరాంగ్ లోయ, బౌద్ధ దేవాలయాలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టిందిపేరుగా నిలుస్తుంది. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? -
ఇండియా ఫస్ట్ సన్రైజ్.. నాగాలాండ్ మంత్రి వీడియో వైరల్..
కోహిమా: నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానుల ముందుకు వస్తుంటారు. కామెడీ, సందేశాత్మక, నాలెడ్జ్కు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ఉంటారు. తాజాగా భారత దేశంలో సూర్యోదయం మొదట అయ్యే దృగ్విషయాన్ని వీడియో రూపంలో పోస్టు చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ వ్యాలీని టెమ్జెన్ షేర్ చేశారు. అప్పుడే వెలుతురు వస్తుండగా.. అందమైన లోయ ప్రాంతాలు మనోహరంగా కనిపించాయి. మేఘాలు తాకుతున్న పర్వత శిఖరాల మధ్య నది పరవళ్లు, పచ్చని లోయ ప్రాంతాల్లో విహారాన్ని గుర్తు చేశారు. ఈశాన్య భారతం అందాలు సింపుల్గా ఒక్క వీడియోలో చూపించారు. గూగుల్ చేసి చూడండి అని ట్యాగ్ను జతచేసి వీడియోను పోస్టు చేశారు. భారత్లో మొదట సూర్యోదయం అయ్యే ప్రదేశంగా డాంగ్ లోయను చెప్పుకుంటారు. Google Kar Ke to Dekho 🤨 pic.twitter.com/FJYzzK9jYC — Temjen Imna Along (@AlongImna) September 13, 2023 ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్లతో నింపేశారు. ప్రస్తుతం ఈశాన్య భారతం ట్రిప్లోనే ఉన్నా.. చాలా అందమైన ప్రదేశం అని ఓ యూజర్ కామెంట్ చేశారు. ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా తప్పకుండా చూడాలని మరో యూజర్ స్పందించారు. దేశంలో సూర్యుడు మొదట ముద్దాడే డాంగ్ లోయను మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: పార్క్లో సరదాగా.. -
అమెరికాలో వరలక్ష్మి వ్రతం ఆచరించిన హీరోయిన్ లయ (ఫోటోలు)
-
పెదవులు ఆరోగ్యంగా అందంగా కనిపించాలంటే ఇలా చేయండి!
ఏ సమస్యనైనా దాచడం సాధ్యమేమోగానీ... పెదవులకు వచ్చే సమస్యలు ఇట్టే బయటకు కనిపిస్తాయి. దాంతో అనారోగ్యం బయటపడటంతో పాటు అందం కూడా తగ్గుతుంది. ఫలితంగా సెల్ఫ్ ఎస్టీమ్ కూడా తగ్గుతుంది. అందుకే పెదవుల ఆరోగ్యం కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పెదవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... అన్ని పోషకాలు ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సిగరెట్లు తాగేవారిలో పెదవులు నల్లగా, బండగా మారవచ్చు. అందుకే స్మోకింగ్ అలవాటును వెంటనే మానేయాలి మహిళల్లో లిప్స్టిక్ వాడేవారు వాటి కొనుగోలు సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో ప్రొపైల్ గ్యాలేట్ అనే రసాయన పదార్థం ఉంటుంది. దాని వల్లనే ప్రధానంగా అలర్జీలు వస్తుంటాయి. లిప్స్టిక్ వాడే వారు అది తమకు సరిపడుతుందా లేదా అన్న విషయాన్ని తొలుత పరిశీలించుకుని, తమకు సరిపడుతుందని తేలిన తర్వాతే వాడటం మంచిది నిద్రకు ఉపక్రమించే ముందు లిప్స్టిస్ శుభ్రంగా కడుక్కోవాలి. ఆ టైమ్లో పెదవులపై పలుచగా నెయ్యి లేదా బాదం నూనె రాసుకోవచ్చు కొన్ని టూత్పేస్ట్ల వల్ల కూడా మనకు పెదవులపై దురద రావచ్చు. అలాంటప్పుడు వాటిని ఉపయోగించడం ఆపేయాలి నీరు ఎక్కువగా తాగుతుండాలి. పెదవులు తడి ఆరిపోకుండా చూసుకోవాలి. అయితే నాలుకతో తడపకూడదు. (చదవండి: మచ్చలు లేని ముఖ సౌందర్యం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!) -
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
కర్ణాటక వెళ్తే గెర్సొప్పా జలపాతం చూడాల్సిందే
శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జోగ్ (గెర్సొప్పా) జలాశయం ఎట్టకేలకు పరవళ్లు తొక్కుతోంది. నలభై రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో నదులు, వాగులు, వంకలు వట్టిపోయాయి. దీంతో రాష్ట్రంలో ప్రముఖ జలపాతాలు మూగనోము పట్టాయి. అయితే సుమారు వారంరోజులుగా రుతుపవన వర్షాలు ముమ్మరం కావడంతో నదులు, వాగులకు కొత్త జీవం వచ్చింది. దీంతో శరావతి నదికి ప్రవాహం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో జోగ్ వద్ద శరావతి ప్రవాహంతో జలపాతం నురగలు కక్కుతోంది. 253 మీటర్ల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటే నీటి తుంపరలు రేగి సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. దేశంలోనే ఇది రెండవ ఎత్తైన వాటర్ ఫాల్స్గా పేరు గడించింది. One of the most beautiful Waterfalls in the World.Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳 pic.twitter.com/WtwEZzGNGW— Raghu (@IndiaTales7) September 14, 2022 పర్యాటకుల వరద జోగ్ సౌందర్యాన్ని చూడటానికి వేలాది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో జోగ్ పరిసరాలు కిక్కిరిశాయి. మొన్నటివరకు నీరు లేక బోసి పోయిన జోగ్ జలపాతం కొత్తందాలను చూసి సందర్శకులు మురిసిపోయారు. పైగా ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతూ, పొగమంచు కొమ్ముకోవడంతో ఆ ప్రాంతంగా ఆహ్లాదమయం అయ్యింది. ఎక్కడెక్కడి నుంచో కార్లు, బస్సులు, బైక్లపై సందర్శకులు వచ్చారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. Jogh falls very less water.. pic.twitter.com/aNCYinrBhJ— prathap cta (@PrathapCta) September 2, 2017 Sound of Jog Falls. Meditative. River Sharavathi has been like this for millions of years. Water to #Bengaluru will completely kill this indescribable beauty. If no excess water, no waterfalls. #Shimoga #Karnataka #Monsoon2019 pic.twitter.com/nxNEYLSYVZ— DP SATISH (@dp_satish) July 21, 2019 -
బ్రహ్మానందం చేతి నుంచి జాలువారిన కళాఖండాలు (ఫోటోలు)
-
చీరలో చందమామలా మెరిసిపోతున్న కాజల్ (ఫొటోలు)
-
ప్రపంచంలోని 10 ప్రసిద్ధి చెందిన టొంబ్స్
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన రాజభవనాలు
-
ప్రపంచంలోని టాప్ 10 అందమైన చర్చిలు
-
మరోసారి అభిమానులను ఫిదా చేసిన ఆనంద్ మహీంద్ర
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి తన అభిమానులను ఫిదా చేశారు. పచ్చని పకృతి, పల్లె అందాలకు మురిసిపోతూ ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. భారతదేశంలోని 10 అత్యంత అందమైన గ్రామాల లిస్ట్ను షేర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని కల్పా నుండి మేఘాలయలోని మావ్లిన్నాంగ్ వరకు ఉన్న ఫోటోలు మిమ్మల్ని ఆనంద పరవశంలో ముంచేస్తాయి. దేశంలో పలు ప్రాంతాల శోభను ప్రతిబింబించేలా దేశం నలుమూలలా పరుచుకున్న ప్రకృతి మాత ఒడిలో, ఎనలేని సోయగంతో అలరారే అద్భుత అందాలను చూసి తరించాలని అందరికీ ఉంటుంది. రోజువారీ రొటీన్ లైఫ్ నుంచి సేదదీరేందుకు సాధారణంగా పల్లెలకు పరుగులు తీస్తాం. అక్కడి అందాలను ఆత్మీయతలను జీవిత మంతా పదిలపర్చుకుంటాం. కానీ ఈ విశాల ప్రపంచంలో ప్రతీ మూలలోని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) అలాంటి వారికి భారీ ఊరటనిచ్చేలా దేశంలోని అందమైన టాప్ టెన్ పల్లెల అద్భుతమైన ఫోటోలను కలర్స్ ఆఫ్ భారత్ పేరుతో ఉన్న ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. వీటిని చూసిన ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర వాటిని రీట్వీట్ చేశారు. మండు వేసవిలో చల్లని చిరుజల్లుల్లా ఉన్న ఫోటోలనుచూసి ఆయన మురిసిపోయారు. మన చుట్టూ ఉన్న అందాలు చూసి తనకు మాటలు రావడం లేదంటూ పరశించిపోయారు. భారతలో తాను ఆస్వాదించాల్సిన అందమైన ప్రాంతాల లిస్ట్ పెరిగిపోతోంది అంటూ కమెంట్ చేశారు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) This beauty around us just left me speechless…My bucket list for travel in India now overflows…. https://t.co/WXunxChIKg — anand mahindra (@anandmahindra) June 8, 2023 -
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన హిల్ స్టేషన్లు
-
భారతదేశంలోని అత్యంత అందమైన టాప్ 10 గ్రామాలు
-
ఊరిలోని చిన్నాపెద్దా అందరూ బంగారం ప్రియులైతే.. ఏఐ ఫోటోలు
-
భారతదేశంలోని టాప్ 10 అందమైన పక్షులు
-
ప్రపంచంలోని టాప్ 10 ఆకర్షణీయమైన పక్షులు
-
పుంజు అందం అదరహో.. జాతీయ స్థాయిలో రాజుపాలెం కోడికి మూడో స్థానం
కొమరోలు: ప్రకాశం జిల్లా పుంజు అంటే మజాకా.. అన్నట్టుగా మరోసారి నిరూపితమయింది. కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన సయ్యద్ బాషాకు చెందిన కోడిపుంజు అందాల పోటీల్లో జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. ఇటీవల తమిళనాడు రాష్ట్రంలోని కొయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి చిలకముక్కు కోళ్ల అందాల పోటీల్లో ఈ పుంజు 3వ స్థానం దక్కించుకోగా పుంజు యజమాని సయ్యద్ బాషాను బహుమతులు వరించాయి. నిర్వాహకులు ప్రశంస పత్రం, షీల్డ్ను అందజేశారు. రాజుపాలెం కోళ్లు అందానికి మారుపేరు. బలమైన కాళ్లు, అంతకు మించిన శక్తితో రెక్కలు, సూటిగా ఉండే చిలక ముక్కు వీటికి ప్రత్యేక ఆకర్షణ. అందుకే ఎన్ని కోళ్లు ఉన్నా ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి, విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి యజమానులు కూడా ఈ కోళ్లు అందంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కొన్ని బ్యూటీ టిప్స్ కూడా పాటిస్తారు. వేళకు భోజనం, కొన్ని ఎక్సర్ సైజ్ లు , ప్రత్యేకంగా స్నానాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోడిపై పెట్టే శ్రద్ధ.. అంతా ఇంతా కాదు. అందుకే 5 రాష్ట్రాలకు చెందిన కోళ్లతో పోటీ పడి మరీ రాజుపాలెం కోడిపుంజు విజేతగా నిలిచింది. -
క్లియోపాత్ర వాటితోనే స్నానం చేసింది!: మేనక గాంధీ వ్యాఖ్యలు వైరల్
బీజేపీ పార్లమెంటు సభ్యురాలు కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ గాడిద పాల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. ఈ మేరకు ఆమె ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో జరిగిన బహిరంగ సమావేశంలో గాడిద పాల సబ్బులు మహిళలను ఎల్లప్పుడూ అందంగా ఉంచుతాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఆమె ఆ వీడియోలో..గాడిద పాలతో చేసిన సబ్బులు మహిళల సౌందర్యాన్ని పెంచుతాయని, ఈజిప్టు రాణి క్లియోపాత్రా కూడా గాడిద పాలతోనే స్నానం చేసిందని అన్నారు. పైగా ఢిల్లీలో గాడిద పాలతో చేసిన సబ్బు ఒక్కొక్కటి రూ. 500 ధర పలుకుతుందని చెప్పారు. లడఖ్ కమ్యూనిటీ కూడా గాడిద పాలతోనే సబ్బులు తయారు చేస్తున్నట్లు చెప్పారు. అందువల్లే గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్లు చెప్పుకొచ్చారు. అదీగాక చాకలివాళ్లు కూడా గాడిదలను వినయోగించడం లేదని అన్నారు. లడఖ్లోని కమ్యూనిటీ సంఘం కూడా గాడిదల సంఖ్య తగ్గిపోతున్నట్ల గుర్తించిందని తెలిపారు. తన ప్రసంగంలో పెరుగుతున్న ఖర్చుల గురించి కూడా ప్రస్తావించారు..చెట్లు అంతరించిపోతున్నాయని, అందువల్లే కలప ఖరీదు పెరిగిపోయిందన్నారు. దీంతో దహన సంస్కారాల ఖర్చులు కూడా పెరిగిపోయాయని చెప్పుకొచ్చారు. అందువల్ల పేద ప్రజలు మరణంలో సైతం తమ కుంటుంబికులను నిర్థాక్షిణ్యంగా వదిలేస్తున్నారని చెప్పారు. దహన సంస్కరాలకు కలపను/ఆవు పేడను వినియోగిస్తే అయ్యే ఖర్చుల వ్యత్యాసాన్ని సైతం విపులంగా వివరించారు మేనకా గాంధీ. అయితే తన ఉద్దేశ్యం ప్రజలు జంతవుల నుంచి డబ్బు సంపాదించమని కాదని, ఐనా ఈనాటికి మేకలు, ఆవులు పెంచుతున్న వారెవరూ ధనవంతులు కాలేదని చెప్పారు. అయినా మన వద్ద తగిన సంఖ్యలో వైద్యులు కూడా అందుబాటులో లేరని అన్నారు. సుమారు 25 లక్షల మంది ఉండే సుల్తాన్పూర్లో కనీసం ముగ్గురు డాక్టర్లు కూడా లేరని, కొన్నిసార్లు అంతమంది కూడా ఉండరని చెప్పుకొచ్చారు. గెదె, మేక జబ్బు పడితే లక్షలు ఖర్చు పెడతారు, పైగా ఆడవాళ్లను కూడా పశుపోషణలో చేయమని అడుగుతాం. అయితే వారు ఎంతవరకు చేయగలరు. అందుకే తాను మేక లేదా ఆవు పెంపకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను. దీంతో మీరు సంపాదించాలంటే దశాబ్దం పడుతుంది. పైగా ఆ జంతవు ఒక్క రాత్రిలో చనిపోతుంది. దీంతో అప్పటి వరకు చేసిందంతా వృధా అయిపోతుందంటూ మేనకా గాంధీ చాలా విచిత్రంగా ప్రసంగించారు. गधे के दूध का साबुन औरत के शरीर को खूबसूरत रखता है"इनकी सुंदरता की राज आजा के सामने आई जो गधे के दूध से बनी और गोबर से बनी साबुन का प्रोडक्ट यूज करती हैं ◆ BJP सांसद @Manekagandhibjp का बयान #BJP | BJP | #ManekaGandhi | Maneka Gandhi pic.twitter.com/rXW1aY1t6o — AZAD ALAM (@Azad24906244) April 2, 2023 (చదవండి: కాంగ్రెస్ ఫైల్స్ అంటూ వీడియో రిలీజ్ చేసిన బీజేపీ) -
అందమంటే భారత మహిళలదే.. అధ్యయనంలో ఆసక్తికర అంశాలు!
ప్రపంచంలో 200కుపైగా దేశాలు ఉన్నాయి. ఏటా ప్రపంచ సుందరి, విశ్వ సుందరి పోటీల్లో ఏదో ఓ దేశానికి చెందిన, ఎవరో ఒకరు గెలుస్తూ ఉంటారు. ఇలా ఒకరిద్దరి అందం గురించి కాకుండా.. సగటున అత్యంత అందమైన మహిళలు భారతీయులేనని ఓ నివేదిక చెబుతోంది. ఈ అంశంపై యూకేకు చెందిన మల్టీనేషనల్ వస్త్రాల కంపెనీ ‘పోర్ మోయి’ ఆన్లైన్లో అధ్యయనం చేసి తాజాగా నివేదిక విడుదల చేసింది. పోస్టులు, ప్రశంసలను విశ్లేషించి.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘రెడ్డిట్’లో గత ఏడాది మహిళలు, పురుషుల అందానికి సంబంధించి వచ్చిన లక్షలాది పోస్టులను ‘పోర్ మోయి’సంస్థ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా విశ్లేషించింది. వివిధ దేశాలకు చెందిన మహిళలు, పురుషుల చిత్రాలతో కూడిన పోస్టులు, వాటిలోని ‘అట్రాక్టివ్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, ప్రెట్టీ, గుడ్ లుకింగ్, గార్జియస్, ప్రెట్టీ..’వంటి కామెంట్లను.. ఆ పోస్టులు, చిత్రాలకు వచ్చిన అప్వోట్లను (ఫేస్బుక్లో లైక్ల తరహా ఇచ్చేవి) పరిగణనలోకి తీసుకుంది. వీటి ఆధారంగా ఆయా దేశాల వారికి ర్యాంకులను ఇచ్చింది. కృత్రిమ మేధ ఇమేజ్ జనరేషన్ టూల్ ‘మిడ్జర్నీ’సాయంతో ఆయా దేశాల వారి రూపురేఖలపై రూపొందించిన చిత్రాలను కూడా విడుదల చేసింది. భారత మహిళలే టాప్.. ‘పోర్ మోయి’స్టడీలో అత్యంత అందమైన మహిళలుగా భారతీయులే నిలిచారు. జపాన్, స్వీడన్ మహిళలు రెండు, మూడో స్థానం సాధించగా.. వరుసగా పోలాండ్, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యూఎస్ఏ వారు ఉన్నారు. ఓవరాల్గా మహిళలు, పురుషులు కలిపి చూస్తే కూడా.. భారతీయులే టాప్లో ఉండటం గమనార్హం. - అదే పురుషుల కేటగిరీలో చూస్తే.. బ్రిటన్లు టాప్లో ఉండగా, భారతీయులు రెండో స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఇటలీ, యూఎస్ఏ, స్వీడన్, జపాన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, బ్రెజిల్ వారు ఉన్నారు. どういう仕組みかわからないけれども自信満々であろうあの国の名前は50位以内に無かった Most Attractive Nationalities In The World 27th February 2023 https://t.co/ZBmpe5PMQb pic.twitter.com/bJEyq8JHve — mknbearpaw (@mknbearpaw) March 7, 2023 -
భార్యతో టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న.. ఫోటోలు వైరల్
-
హీరోయిన్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
తిరుమలలో అద్భుత దృశ్యాలు..
-
వైరల్ వీడియో: ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
-
ఈమెకి అందంతో పాటు ధైర్యమూ ఎక్కువే!
వైరల్: ‘దేవుడు మరో అవకాశం ఇస్తే..’ ఇప్పుడున్న జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాలని కోరుకుంటారు ఎక్కువ మంది!. కానీ, ఈ అందమైన శివంగి మాత్రం అలా కాదు.. తాను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండాలనుకుంటోంది. అది శారీరకంగా కాదు.. మానసికంగా!. డబ్బు కోసమో, సుఖం కోసమో ఆమె అస్సలు ఆశపడడం లేదు. ఎందుకంటే.. వ్యవస్థలో చెడుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమె.. తనలాగే బతకాలనుకుంటోంది కాబట్టి! కొలంబియా మెడెలిన్కు చెందిన డియానా రామిరెజ్diana ramirez.. ఈ మధ్య తరచూ వార్తల్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఆమె అందం. ప్రపంచంలోనే అత్యంత అందమైన పోలీసాఫీసర్గా ఇంటర్నెట్లో ఆమెపై ఓ ప్రచారం నడుస్తోంది. అఫ్కోర్స్.. ఈమె కంటే అందగత్తెలు ఉండొచ్చు. కానీ, ఇప్పటికైతే ఈమెదే హవా నడుస్తోంది. View this post on Instagram ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరంగా పేరున్న మెడెలిన్ వీధుల్లో పోలీస్ అధికారిణిగా డియానా రామిరెజ్ పహారా కాస్తూ కనిపిస్తుంటుంది. రోజులో 14 గంటలు ఆమె డ్యూటీలోనే గడుపుతోంది. ఈ సర్వీసులో ఇప్పటిదాకా వీరోచితంగా ఛేజ్ చేసి ఆమె ఎంతో మంది నేరగాళ్ల ఆటకట్టించింది కూడా. అందంగా ఉంది.. రిస్క్ చేసి ఈ ఉద్యోగం చేయడం ఎందుకు? హాయిగా ఏ మోడల్ కుదరకుంటే ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్ కావొచ్చు కదా అని కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు ఆమెకు. కానీ, ఆమె మాత్రం ‘నో’ అని తెగేసి చెప్తోంది. ‘‘ఒకవేళ మరోసారి కెరీర్ను ఎంచుకోమని దేవుడు అవకాశం ఇస్తే.. నేను పోలీస్ వృత్తినే ఎంచుకుంటా. ఎందుకంటే నేను ఎలా ఉంటానో అలాగే ఉండడం నాకు ఇష్టం. ఈ వృత్తి నాకు ఎంతో నచ్చింది. పోలీస్ వ్యవస్థ కూడా నాకు అంతే గౌరవం ఇచ్చింది. రంగు, రూపం, అందం ఇవన్నీ పుట్టుకతో వచ్చినవి. కానీ, శాశ్వతమైంది మాత్రం ఆత్మవిశ్వాసమే. నా తల్లిదండ్రులు నాలో దేశభక్తిని నింపారు.నా దేశం కోసం.. నేరరహిత సమాజం కోసం ఈ వృత్తిని ఎంచుకున్నా.. వీడే ప్రసక్తే లేదు. రిస్క్ చేయడంలోనే మజా ఉంటోంది కదా అని చెబుతోందామె. తాజాగా డియానా రామిరెజ్ను బెస్ట్ పోలీస్/మిలిటరీ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుకు నామినేట్ చేశారు అక్కడ. బాధ్యత గల వృత్తుల్లో ఉంటూ సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఎక్కువ మందిని ఆకట్టుకునేవాళ్లకు ఈ గుర్తింపు ఇవ్వాలని ఇన్స్టాఫెస్ట్ అవార్డుల పేరుతో ఓ మీడియా హౌజ్ అవార్డులను ప్రదానం చేయడం ప్రారంభించింది అక్కడ. -
దీపాల కాంతుల్లో వెలిగిపోతున్న ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే (ఫొటోలు)
-
అందాలతో రచ్చ చేస్తున్న హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
అదో మురికివాడ.. కానీ చాలా ప్రత్యేకం!
సాధారణంగా నిరుపేదలు ఎక్కువగా జీవించే ప్రదేశాలను మురికివాడలు అంటాం. నీటి ప్రవాహం, పారిశుధ్య వ్యవస్థ, కనీసం మౌలిక సదుపాయాలు లేని మురికి వాడల్ని చాలానే చూసుకుంటాం. కానీ బ్రెజిల్లోని రియోలో ‘శాంటా మర్ట ఫావెల’ అనే మురికివాడ చాలా ప్రత్యేకం. అత్యంత ఏటవాలైన, అందమైన మురికివాడ ఇది. అక్కడ ప్రజల్లో నైతికతను పెంపొందించేందుకు, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి స్లమ్ పెయింటింగ్స్ అనే వినూత్న ప్రయోగమే.. ఈ మురికి వాడని ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేసింది. నిత్యం రద్దీగా ఉండే, మురికి భవనాలను రంగుల కాన్వాస్గా మార్చి చూపించింది.ఇక్కడే మైకేల్ జాక్సన్ ప్రసిద్ధిగాంచిన ‘దే డోంట్ కేర్ అబౌట్ అస్’ పాట చిత్రీకరణ చేశారు. దానికి గుర్తుగా అక్కడ స్థానికులు మైకేల్ జాక్సన్ విగ్రహాన్ని కూడా పెట్టుకున్నారు. చదవండి: Cracked Heels Remedy: కాళ్ల పగుళ్లు వేధిస్తున్నాయా.. గోరువెచ్చటి నీటిలో కాస్తంత ఉప్పు వేసి. -
వైరల్గా మారిన క్రాంతిదాస్ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు!
‘కురులున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే’ అన్నట్లు ఎంత పొడవాటి కురులుంటే అంత అందంగా భావిస్తారు చాలా మంది మహిళలు. తమ అందం, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే శిరోజాలను కాపాడుకునేందుకు ఎన్నో రకాల సంరక్షణ పద్ధతులను పాటిస్తుంటారు. అయినా ఉరుకు పరుగుల నేటి ఆధునిక జీవనానికి తోడు పోషకాహార లోపం, తీవ్ర పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యంతో కురులు ఊడిపోతున్నాయి. వాలుజడ అన్నమాట బాపు సినిమాల్లోని హీరోయిన్లకు మాత్రమే పరిమితమైపోయింది. ఊడిపోతున్న జుట్టు.. కోల్పోతున్న అందం.. మహిళల ధైర్యాన్ని.. ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీంతో వారు ఆత్మనూన్యతా భావానికి గురవుతున్నారు. బయట ప్రపంచానికి ముఖం చాటేస్తున్నారు. అలాంటి మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు ఓ మగువ పెద్ద సాహసమే చేసింది. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ క్యాంపెయిన్లో భాగస్వామిగా మారింది. తన ఒత్తైన.. నిగనిగలాడే శిరోజాలను తొలగించుకుంది. సోషల్ మీడియాలో గుండుతో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసి.. మహిళల్లో మనోస్థైర్యం నింపేందుకు ముందుడుగు వేసింది. ఆమే క్రాంతిదాస్. ఈ ఆలోచనల వెనుక కారణాలు ఆమె మాటల్లోనే విందాం.. మద్దిలపాలెం(విశాఖ తూర్పు): అమ్మకు తల వెంట్రుకలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇలా జరిగిందని గుర్తించాం. దీంతో ఆమె బయటకు రావడానికి ఇబ్బందులు పడేది. ఎక్కడికైనా వెళ్లాలంటే స్కార్ఫ్ వేసుకుని వెళ్లేది. దీన్ని చూసి నేను ఆలోచనలో పడ్డాను. అదే సమయంలో క్యాన్సర్ రోగులు పడుతున్న ఇబ్బందులు నన్ను కదిలించాయి. మహిళలకు జుట్టే అందం. క్యాన్సర్, పోషకాహార లోపం, కాలుష్యం, తదితర కారణాలతో చాలా మంది జుట్టును కోల్పోతున్నారు. తక్కువ జుట్టు/గుండుతో బయట తిరగలేక మానసికంగా కుంగిపోతున్నారు. అలాంటి మహిళల్లో ఆత్మస్థైర్యం నింపాలనే దఢృమైన ఆలోచన నాలో మెదిలింది. నా జుట్టును తొలగించుకుని.. బాధిత మహిళలకు అండగా ఉండాలని భావించాను. కుటుంబ సభ్యులు, భర్త ఆమోదంతో నా కురులను షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా హెడ్ షేవ్.. ఇలాంటి వారిని చూసిన తర్వాత.. వారి కోసం ఏదో ఒకటి చేయాలనే తలంపు వచ్చింది. బట్టతల ఉన్న వారు జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పూర్తిగా జట్టురాని వారు విగ్గులు పెట్టుకుని.. ఇబ్బందిగానే కాలం వెల్లదీస్తున్నారు. ఇలా ఎంత కాలం? మీలో మీకే మార్పు రావాలి. ముందుగా మిమ్మల్ని మీరే ఇష్టపడాలి. అప్పుడు అందం కంటే మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అని బాధిత మహిళలకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. అందుకు ఒత్తుగా ఉన్న నా జట్టును తొలగించుకున్నాను. క్లీన్ హెడ్ షేవ్ చేసుకున్నాను. 40 రోజులుగా పూర్తిగా గుండుతోనే ఉంటున్నా.. కొన్నాళ్ల పాటు ఇలానే ఉంటా. నా పరిధిలో సోషల్ మీడియా నెట్వర్క్లో నేను గుండుతో ఉన్న ఫొటోలు షేర్ చేస్తున్నాను. జట్టు రాలిపోయిన మహిళలు ధైర్యంగా ఉండాలని కోరుతున్నాను. గుండుతోనూ మహిళ అందంగా ఉంటుందనే భావన కలిగేందుకు ప్రయత్నం చేస్తున్నా.. నా గుండు ఫొటోలు చూసి కొందరైనా మనోస్థైర్యం పొందుతారని ఆకాంక్షిస్తున్నా.. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ జుట్టులేని వారు వారిలో అలాంటి లోపం ఉందనే భావనే కలగకూడదు. అలా ఉండడం నేటి రోజులు ఓ ట్రెండ్ అనే ఆలోచన రావాలి. బాల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ అనే అంశం ట్రెండింగ్లో ఉంది. ఈ క్యాంపెయిన్ హాలీవుడ్లో జోరుగా సాగుతోంది. గతంలో హీరోయిన్ సోనాలి బింద్రే సైతం ఇలాంటి క్యాంపెయిన్ చేశారు. మనీషా కోయిరాల క్యాన్సర్ను జయించారు. అప్పటో వారు జట్టు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఫొటోలు వైరల్గా మారాయి. సాటి మనిషిని ప్రేమించాలి మనిషిని మనిషిగా ప్రేమించడం.. వారిలో లోపాలను వెతుకుతూ.. ఆత్మనూన్యత భావాన్ని కలిగించడం భావ్యం కాదు. అలాంటి వారిని మనతో సమానంగా చూసుకోవాలి. అప్పుడే వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినవారమవుతాం. అదే నా లక్ష్యం.. స్వతహాగా నేను జంతు ప్రేమికురాలిని. జంతువులకు ఎలాంటి ప్రమాదం జరిగినా.. ఎంతో మదన పడుతుంటాను. గతంలో వైజాగ్ కేంద్రంగా రతన్ టాటా సంస్థతో కలిసి జంతువుల సంరక్షణపై పనిచేశాను. వీధుల్లో సంచరించే జంతువులకు రిఫ్లెక్టివ్ కాలర్లు పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాను. ప్రస్తుతం విశాఖ, బెంగళూరులో జంతువుల సంరక్షణపై పనిచేస్తున్నాను. కుటుంబ నేపథ్యం.. నగరంలోని మురళీనగర్లో చేముడూరి క్రాంతిదాస్ నివాసం ఉంటున్నారు. ఆమె భర్త నాగతేజ చేముడూరి ఐటీ రిక్యూటర్. తండ్రి జగదీష్ నేవీలో విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. తల్లి శారదదాస్ గృహిణి. జుట్టు రాలిపోవడానికి బోలెడు కారణాలు వెంట్రుకలంటే ఆఫ్టరాల్ అని కొట్టిపారేసే విషయం కాదు. వాటి కోసం ఒక్కొక్కరు ఎంత క్షోభపడుతుంటారో... అవి రాలిపోతున్నవారికే తెలుస్తుంది. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పడీపడని కాస్మోటిక్స్.. అన్నింటి ఫలితం జుట్టు రాలిపోతుంది. మహిళల్లో మెనోపాజ్, గర్భధారణ తదితర సమయాల్లో హార్మోన్ల విడుదలలో వచ్చే మార్పుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలాంటి కారణాలతో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. జుట్టు ఒత్తుగా లేకపోకపోతే తోటి ఆడపిల్లలే ఎగతాళి చేసే పరిస్థితులు అక్కడ క్కడా వెలుగుచూస్తుంటాయి. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లల పరిస్థితి మరింత దారుణం. జుట్టు లేనివారితో స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ కారణంగా జట్టును పూర్తిగా తొలగిస్తారు. అలోపిషియా బారిన పడిన పడిన మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. అలాంటి వారు జట్టును పూర్తిగా కోల్పోతారు. పూర్తిగా రూపం కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి డిజార్డర్ బారిన పడిన మగువలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. -
ఏపీలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్స్.. ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు..
రంపచోడవరం(తూర్పుగోదావరి): మనసు దోచే ప్రకృతి అందాలు.. పరవళ్లుతొక్కే నది సోయగాలు.. ఎటూ చూసినా పచ్చని అడవులు.. ఎత్తైన కొండలు, గుట్టలు.. రారమ్మని పిలిచే చిరుగాలులు.. మధురానుభూతి కలిగించే పడవ ప్రయాణం. ఇలాంటి అందమైన లొకేషన్కు వెళ్లాలంటే ఏ గోవానో, ఏ మాల్దీవులకో వెళ్లాల్సిన అవసరం లేదు. రంపచోడవరం వెళితే.. ఈ అనుభూతులన్నీ ఆస్వాదించవచ్చు. అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తున్న గోదావరికి ఇరువైపులా ఉన్న పాపికొండల అందాలు అదరహో అనిపిస్తాయి. నది తీరంలో దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. మారేడుమిల్లి మండలంలోని జలపాతాల సోయగాలు ఎంత సేపు చూసినా.. తనివితీరవు. తూర్పు కనుమల్లోని పచ్చని గడ్డి కొండల్లో (గ్రాస్ ల్యాండ్) గుడిసె ప్రాంతం ఇక్కడ మరో ఆకర్షణ. ఇలా కనుచూపు మేర ప్రకృతి రమణీయ దృశ్యాలు మరెన్నో ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు తరలివస్తారు. రాత్రి సమయాల్లో ఇక్కడే బస చేసి.. ప్రకృతి ఒడిలో సేదతీరుతుంటారు. పాపికొండలు మధ్య బోట్లో ప్రయాణం.. పురాతన ఆలయం రంప శివాలయం రెడ్డిరాజుల కాలం నాటి పురాతన శివాలయం రంపలో ఉంది. రంపచోడవరానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాతితో ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి అనుకుని ఉన్న కొండపై రంప జలపాతం ఉంది. ఏడాది పొడవున జలపాతం ప్రహిస్తునే ఉంటుంది. రంపచోడవరంలో పర్యాటకులు బస చేసేందుకు పర్యాటక శాఖకు చెందిన అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి సమీపంలో జలతరంగణి పొల్లూరు జలపాతం ప్రకృతి గుడి..సందడి మారేడుమిల్లి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలకు నిలయం. సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండడంతో ఈ ప్రాంతం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. వివిధ రకాల పంటలకు అనుకూలమైన ప్రాంతం ఇది. పుల్లంగి పంచాయతీలో గుడిసె ప్రాంతం ఉంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంటుంది. ఆకాశాన్ని హత్తుకునేలా ఎత్తైన కొండలు.. పచ్చని గడ్డితో విశాలంగా ఉంటాయి. సూర్యోదయం వేళ గుడిసె అందాలు తిలకించేందుకు పర్యాటకులు రాత్రికే అక్కడకు చేరుకుని గుడారాల్లో బస చేస్తారు. ఎత్తైన కొండలను తాకుతూ వెళ్లే మబ్బులు పర్యాటకులను అబ్బురపరుస్తాయి. గుడిసె ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వేలాది తరలివస్తున్నారు. కొంత మంది మారేడుమిల్లిలో బస చేసి తెల్లవారుజామున గుడిసెకు వాహనాల్లో చేరుకుంటారు. మారేడుమిల్లిలో పర్యాటశాఖకు చెందిన త్రీస్టార్ వసతులతో ఉడ్ రిసార్ట్స్, ఎకో టూరిజం ఆధ్వర్యంలో అతిథి గృహాలు పర్యాటకులకు వసతి కల్పిస్తున్నాయి. ఇక్కడ సుమారు 300 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. మారేడుమిల్లి నుంచి భద్రాచలం వైపు ఘాట్రోడ్డులో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. జలతరంగణి జలపాతం, వ్యూ పాయింట్, అమృతధార జలపాతం వస్తాయి. ఇక్కడే పాములేరు వద్ద జంగిల్ స్టార్ ఎకో రిసార్ట్స్ కూడా ఉన్నాయి. చింతూరు నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే పొల్లూరు జలపాతం వస్తుంది. ఇక్కడకు ఏడాది పొడవున పర్యాటకులు వస్తారు. ఎత్తైన కొండల నుంచి జాలువారే నీటిధారలు మైమరిపిస్తాయి. పాములేరు రోప్ బ్రిడ్జి మరపురాని మధుర ప్రయాణం దేవీపట్నం–వీఆర్పురం మండలాల మధ్య పాపికొండలు విస్తరించి ఉన్నాయి. పాపికొండలు అందాలు తిలకించేందుకు పర్యాటకులకు రెండు ప్రాంతాల్లో బోట్ పాయింట్లను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. దేవీపట్నం మండలం పోశమ్మ గండి వద్ద ఒకటి, వీఆర్పురం మండలం పోచవరం వద్ద మరో బోట్ పాయింట్ ఉంది. ముందుగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులు రాజమహేంద్రవరం నుంచి పోశమ్మ గండికి చేరుకుంటారు. అక్కడ నుంచి బోట్లు పర్యాటకులతో బయలుదేరుతాయి. సుమారు నాలుగు గంటల పాటు బోట్పై ప్రయాణం చేసి పాపికొండలకు చేరుకుంటారు. జంగిల్ స్టార్ రిసార్ట్స్ ఎత్తైన కొండల మధ్య గోదావరిపై నుంచి వచ్చే చల్లని గాలులు మధ్య బోట్లో ప్రయాణం పర్యాటకులకు ఆహ్లాదం పంచుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపునకు గురైన గిరిజన గ్రామాలను దాటుకుంటూ బోట్లు ముందుకెళ్తాయి. ఈ ప్రయాణంలో పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ను చూడవచ్చు. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పాపికొండలు అందాలు చూసేందుకు వస్తుంటారు. పోచవరం బోట్ పాయింట్ నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్ర చేస్తారు. వీఆర్పురం మీదుగా వాహనాల్లో పోచవరం చేరుకుని బోట్లో పాపికొండలకు వెళతారు. కొల్లూరులో రాత్రి బస చేసేందుకు వీలుగా నైట్హాల్ట్ హట్స్(వెదురు కుటీరాలు) ఉన్నాయి. -
తిరుమల గిరులను కప్పేసిన మంచు దుప్పటి
-
Wildlife: ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా.. మోస్ట్ బ్యూటిఫుల్..!
ఒక ఈగను పెట్టి ఓ రివేంజ్ స్టోరీ డైరెక్ట్ చేశాడు రాజమౌళి. అదే డైరెక్టర్ ఈ దోమను చూసి ఉంటే మాత్రం కచ్చితంగా ఓ అద్భుతమైన లవ్స్టోరీని తీసేవాడు. ఆ దోమ అంత అందమైంది మరి. దోమ అందంగా ఉండటం ఏంటీ? అని చిరాకుపడకండి. మనుషుల్లోనూ అందమైన ముఖం కలిగిన వారు ఉన్నట్లు.. దోమల్లోనూ అందమైన రూపం కలిగిన దోమలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ, మధ్య అమెరికా ఉష్ణమండల అడువుల్లో కనిపించే ‘సబెథెస్ దోమ’. ఈ జాతి దోమలకు అందమైన కాళ్లు, చక్కటి శరీర ఛాయ ఉంటుంది. అంతేకాదు.. వాటి కాళ్లకు ఉన్న చిన్న చిన్న ఈకల కారణంగా ఈ దోమ ఎగురుతుంటే సీతాకోకచిలుకలా కనిపిస్తుంది. మొదట ఇతర దోమలను ఆకర్షించడానికి, సంభోగంలో పాత్ర పోషించడానికి, ఇవి ఈ ఈకలను ఉపయోగిస్తున్నాయి అని శాస్త్రవేత్తలు తేల్చినా, తర్వాత వాటి ఈకలను తొలగించి పరిశీలిస్తే.. అవి చక్కగా సంభోగంలో పాల్గొంటున్నాయని తేలింది. దీంతో, ప్రస్తుతం వీటికున్న ఆ అద్భుతమైన కాళ్ల కారణం ఏంటో తెలియదు కానీ, దీనిని మాత్రం అత్యంత అందమైన దోమగా శాస్త్రవేత్తలు పరిగణించారు. ఎంత అందమైన దోమ అయితేనేం.. ఇది కూడా జ్వరం, డెంగ్యూ వంటి వ్యాధుల కారకమే కదా! చదవండి: హీరా మండి చీకటి చరిత్ర.. ఎన్నో ఆసక్తికర విషయాలు.. -
సింగర్ హారిక నారాయణ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
మలయాళ నటి మానస రాధాకృష్ణన్ క్యూట్ ఫోటోలు
-
వకీల్ సాబ్ ఫేమ్ అందాల అనన్య నాగల్ల ఫోటోలు
-
అను ఇమ్మాన్యుయేల్ గ్లామరస్ ఫోటోలు
-
చీరకట్టులో ప్రియమణి అందాలు
-
యాంకర్ మేఘనా అదిరే స్టిల్స్
-
అపర్ణ బాలమురళి బ్యూటిఫుల్ పిక్స్
-
'శ్రీకారం' ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ ఫోటోలు
-
నందిత శ్వేత బ్యూటిఫుల్ ఫోటోలు
-
కన్నడ బ్యూటీ హరిప్రియ లేటెస్ట్ ఫోటోలు
-
ప్రియా ప్రకాశ్ వారియర్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు
-
అందమైన స్విమ్మింగ్ పూల్స్ ఇవే!
న్యూఢిల్లీ : ప్రపంచంలో అందమైన ఈత కొలను(స్విమ్మింగ్ పూల్స్)ల గురించి తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ‘పూల్స్ఆఫ్ఇన్స్టాగ్రామ్, పూల్స్ఆఫ్దివరల్డ్, పూల్లైఫ్, పూల్సైడ్’ హ్యాష్ ట్యాగ్లతో ఎన్నో సుందరమైన ఈత కొలనుల ఫొటోలను చూడవచ్చు. కాని అందులో అన్నీ మంచివేమి కాదు, ఎక్కువ కొలనులు సముద్రం నీటితో ఉప్పుగా ఉండి, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువున్న నీటిలో ఎక్కువ సేపు ఈత కొట్టలేం. త్వరగా అలసిపోతాం. నీటి అడుగు భాగం కనిపించదు. నీటి గుండా దేన్నీ చూడలేం. ఇండోనేసియాలోని బాలి రెయిన్ ఫారెస్ట్లో ఉన్న త్రీ టైర్ ఈత కొలను, ఫ్రాన్స్లోని ఇబిజా నగరానికి బలియారిక్ సముద్ర తీరం వెంటనున్న ఈత కొలను, అమెరికాలోని హూబర్టస్లో ఆల్పిన్ మనోరమా హోటల్లో ఆరు అందమైన ఈత కొలనులు ఉన్నాయి. ఇటలీలోని దక్షిణ టిరోల్ పర్వత ప్రాంతంలో మీరామోంటి బోటిక్ హోటల్లో, స్విడ్జర్లాండ్లోని హోటల్ విల్లా హొనెగ్లో తీర్చినట్లుగా ఈత కొలనులు ఉన్నాయి. వీటిని చూస్తుంటే అబ్బా! జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఈత కొలనులో ఈత కొట్టాలనిపించకపోదు. వీటిలో ఈత కొడుతుంటే కొండల మధ్య సహజ సిద్ధమైన నదిలో ఈదుకుంటూ ప్రకృతి ఒడిలోకి జారిపోతున్నట్లు, ఈదుకుంటూ సముద్ర కెరటాల్లోకి వెళుతున్నట్లు, ఆకాశంలో తేలుతూ ఈత కొడుతుంటే కింద భూమి మీద అడవులు, కొండలు చూస్తున్నట్లు ఒక్కో దాంట్లో ఒక్కోరకమైన అనుభవం కలుగుతుంది. కొన్నింటిని సముద్ర తీరంలో నిర్మించగా, మరికొన్నింటిని నీటి సరస్సుల వద్ద, మరికొన్నింటిని అడవుల మధ్య నిర్మించారు. కొన్ని ఈత కొలనులకు అడుగు భాగాన అద్దాలుంటే చాలా కొలనులకు పక్క భాగాన అందాలుండి ప్రకృతిని ఆస్వాదించేందుకు తోడ్పడతున్నాయి. హూబర్టోస్లోని ఆల్ఫిన్ పనోరమా హోటల్లో 25 మీటర్ల పొడవైన ఈత కొలనులో కొంత అడుగు భాగం మొత్తం అద్దాలతోనే నిర్మించారు. అంటే ఆకాశంలో ఈత కొడుతూ భూమ్మీది అందాలను తిలకించవచ్చు. ఈ ఈత కొలనులన్నీ సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో స్వచ్ఛమైన నీటిని నింపడమే కాకుండా ఎప్పుడూ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా వేడి నీటిని కూడా పంప్ చేస్తారు. -
అందాల పూజా హెగ్డే అదిరిపోయే ఫోటోస్
-
రంగీలా 2
-
వర్మ ప్రీ న్యూ ఇయర్ పార్టీ
-
హీరోయిన్ కాళ్లపై పడ్డ వర్మ
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఎప్పుడు ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. తన సినిమాలను వినూత్న ప్రచారం ద్వారా జనాల్లోకి తీసుకెళ్లడం ఆర్జీవీకే చెల్లింది. ఇటీవల బ్యూటీఫుల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆ చిత్ర హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ నైనా కాళ్లు పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వివరాల్లోకి వెళితే.. ఆర్జీవీ శిష్యుడు అగస్త్య మంజు తెరకెక్కించిన తాజా చిత్రం బ్యూటీఫుల్. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’అనేది ఈ సినిమా క్యాప్షన్. అయితే ఆర్జీవీ ఈ చిత్రానికి కథ సమకూర్చాడు. జనవరి 1న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం వోడ్కా విత్ వర్మ పేరిట.. బ్యూటిఫుల్ టీమ్ ప్రీ న్యూ ఇయర్ ప్రైవేటు పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బ్యూటీఫుల్ చిత్రబృందంతో కలిసి ఆర్జీవీ చిందులేశారు. పార్టీ చివర్లో నైనాతో కలిసి డ్యాన్స్ చేసిన ఆర్జీవీ ఆమె కాళ్లమీద పడ్డారు. దీంతో షాక్ అయిన నైనా.. ఒక్కసారిగా కింద కూర్చుండిపోయారు. అనంతరం ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. -
బంపర్ ఆఫర్: వోడ్కా విత్ వర్మ!
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ రూటే సపరేటు. కొత్తగా, వైవిధ్యంగా చిత్రాలను తెరకెక్కించాలన్నా.. పొలిటికల్ సెటైర్ సినిమాలతో అగ్గిరాజేసి వివాదాలు సృష్టించాలన్నా వర్మకే సాధ్యం. అంతేకాకుండా వీటితో పాటు రొమాంటిక్, అడల్ట్ చిత్రాలను కూడా తెరకెక్కించడంలో ఈ వివాదస్పద దర్శకుడు సిద్దహస్తుడు. తన శిష్యులను దర్శకులుగా పెట్టి తక్కువ బడ్జెట్తో తానే స్వయంగా సమర్పిస్తూ ఈ మధ్య వరుసగా సినిమాలు తీస్తున్నాడు. ఇక చిత్ర ప్రమోషన్లను కూడా వర్మ వినూత్నంగా నిర్వహిస్తుంటాడు. భారీ హంగులతో కూడిన ప్రమోషన్లు కాకుండా సింపుల్గా సోషల్ మీడియాను ఉపయోగించుకుటూ తన సినిమాకు కావాల్సిన హైప్ను క్రియేట్ చేసుకుంటాడు. ప్రస్తుతం ఆర్జీవీ సమర్పణలో ‘బ్యూటిఫుల్’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా ప్రారంభించారు ఆర్జీవీ. దీనిలో భాగంగా వర్మ తాజాగా చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ‘వోడ్కా విత్ ఆర్జీవీ లైవ్. ఈ రోజు ‘బ్యూటిఫుల్’టీం ప్రి న్యూఇయర్ ప్రయివేట్ పార్టీ ఉంది. నాతో మరియు మా టీమ్తో కలిసి తాగడానికి అదేవిధంగా మాట్లడటానికి వీలుగా ఈ పార్టీకి మీ అందరినీ ఈ రోజు రాత్రి 8.45 గంటలకు ఫెస్బుక్, ఇన్స్టా లైవ్లో కలవడానికి ఆహ్వానిస్తున్నా’అంటూ వర్మ ట్వీట్ చేశాడు. వర్మ తన దైన స్టైల్లో చేసిన ట్వీట్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ‘ బంపర్ ఆఫర్ వర్మతో వోడ్కా పార్టీ’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘వోడ్కా, స్టఫ్ మీరు పంపిస్తారా లేక మేమే తెచ్చుకోవాలా’అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. ఇప్పటికే చిత్ర హీరోయిన్ నైనా గంగూలీతో వర్మ స్టెప్పులేసి జనాలను ఈ సినిమాపై ఫోకస్ చేసేలా చేశాడు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్కు ప్రేక్షకులనుంచి విశేష ఆదరణ వస్తోంది. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్యూటిఫుల్’. చిత్రం న్యూఇయర్ కానుకగా జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఇంటెన్స్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. రవి శంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ సీరియస్ వంగవీటి కుమారి లో ఈ “బ్యూటిఫుల్” అందాలని ఇలా ఎప్పుడు చూసావయ్యా అగస్త్య మంజు??????🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/tgImoxaRMo — Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2019 చదవండి: కిందటి జన్మలో రంగీలా తీశా! రామ్ గోపాల్ వర్మకు నోటీసులు -
బ్యూటిఫుల్ మూవీ ప్రెస్ మీట్
-
కిందటి జన్మలో రంగీలా తీశా!
‘‘లవ్స్టోరీ చిత్రాల్లో నా పేరు జోడించి కొన్ని యుగాలు అయిపోతుంది. కిందటి జన్మలో ‘రంగీలా’ తీశాను. ‘బ్యూటిఫుల్’ చిత్రం ఒక విధంగా ‘రంగీలా’కి సీక్వెల్లా ఉంటుంది. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది కేవలం పబ్లిసిటీ కోసం పెట్టింది కాదు’’ అన్నారు దర్శకుడు రామ్గోపాల్ వర్మ. ఆర్జీవీ టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో నైనా గంగూలీ, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. టి.నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మాతలు. నట్టి క్రాంతి, నట్టి కరుణ సహనిర్మాతలు. జనవరి 1న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ – ‘‘నాకు వచ్చిన ఆలోచనను మంజుతో పంచుకున్నాను. తను పూర్తి కథ చేసి సినిమా తెరకెక్కించాడు. సాధారణ కథల్లో మగవాళ్లు ఎదుగుతుంటారు. ఆడవాళ్లు ఇంట్లో ఉంటారు. కానీ ఇందులో రివర్స్లో జరుగుతుంది. హీరోయిన్ బాగా ఎదుగుతుంది. తన సక్సెస్ను చూసి హీరో తట్టుకుంటాడా లేదా అనేది కథాంశం. విలన్స్ ఉండరు. సింపుల్గా, రియలిస్టిక్గా ఉంటుంది. నైనా ఈ పాత్ర చేయడానికే పుట్టింది అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘వర్మగారు నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం కోసం బాగా కష్టపడ్డాను. నా పరిచయ గీతాన్ని వర్మగారే షూట్ చేశారు. 3 రోజుల్లో 11 కాస్ట్యూమ్స్తో షూట్ చేశాం’’ అన్నారు నైనా. ‘‘ఇదో ఇంటెన్స్ లవ్స్టోరీ. అందరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా గురించి మాట్లాడినా, చూసినా వర్మగారు కన్నీళ్లు పెట్టుకునేవారు. అంత ఎమోషనల్గా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు’’ అన్నారు సూరి. -
హాట్ హీరోయిన్తో వర్మ నాటు స్టెప్పులు!
-
నా లైఫ్ బ్యూటిఫుల్
‘‘మనసుకి ఆహ్లాదం కలిగించి మనల్ని ఉద్రేకానికి గురి చేసే ఏ ఎమోషన్ అయినా బ్యూటిఫుల్. నా హిట్ని ఎంత బ్యూటిఫుల్గా తీసుకుంటానో నా ఫ్లాప్ని కూడా అంతే బ్యూటిఫుల్గా తీసుకుంటాను. నా జీవితంలో ఎవరిపైనా ఫిర్యాదు చేయను.. నాకు ఎవరి మీదా కోపం రాదు. నేను బ్యూటిఫుల్ కాకపోవచ్చు.. కానీ నా లైఫ్ మాత్రం బ్యూటిఫుల్’’ అని రామ్గోపాల్ వర్మ అన్నారు. నైనా గంగూలి, సూరి జంటగా రామ్గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ఉపశీర్షిక. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదలవుతోంది. హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘ఊర్మిళ లాంటి అమ్మాయి లేకుంటే నేను ‘రంగీలా’ సినిమా తీసుండేవాణ్ణి కాదు. ఇప్పుడు నైనా విషయంలోనూ అదే జరిగింది. కొంతమంది యాక్టర్స్ కొన్ని ప్రత్యేకమైన క్యారెక్టర్స్ కోసమే క్రియేట్ అయ్యారనిపిస్తుంది. నేను పదిహేనేళ్లుగా లవ్ స్టోరీ జోలికి వెళ్లలేదు. దానికి రెండు కారణాలు.. ఒకటి నన్ను అంతగా ఇన్స్పైర్ చేసిన కథ రాలేదు. రెండోది అంతగా ఇన్స్పైర్ చేసిన యాక్టర్ దొరకలేదు.. అవి రెండూ కుదిరాయి కాబట్టే ఈ సినిమా మొదలుపెట్టాం’’ అన్నారు. అగస్త్య మంజు మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా ముంబైలో ఉన్న ధారావి అనే ప్రాంతంలో జరుగుతుంది. ఆ ప్రాంతం అంత ‘బ్యూటిఫుల్’ ప్లేస్ కాదు. కానీ అక్కడి మనుషులు బ్యూటిఫుల్గా ఉంటారు. అందుకే ఆ పేరు పెట్టాం’’ అన్నారు. ‘‘రాము త్వరలోనే ‘శివ’లాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నిర్మాత సి.కల్యాణ్. ‘‘మా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. పెద్ద సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టి.అంజయ్య. ఈ వేడుకలో రామ్గోపాల్ వర్మ డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వేడుకలో నిర్మాతలు నట్టి కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకులు చంద్ర సిద్ధార్థ్, బీవీఎస్ రవి, హీరో ఆకాష్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
‘బ్యూటిపుల్’ ప్రీ రిలీజ్ వేడుక
-
అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్’ సాంగ్
రామ్గోపాల్ వర్మ రూపొందిస్తున్న నూతన చిత్రం బ్యూటీపుల్. ట్రిబ్యూట్ టు రంగీలా అనేది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ సాంగ్ సోమవారం విడుదైలంది. ‘బ్యూటిపూల్.. బ్యూటిపుల్ బ్యూటిపుల్ లైఫ్’ అంటూ సాగే ఈ పాట అందరికి ఆకట్టుకుంటుంది. శైలీ బిద్వికార్ ఆలపించిన ఆ పాటకి సిరాశ్రీ లిరిక్స్ అందించారు. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్కి విశేష స్పందన లభించింది. వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ ఈ చిత్రంలో రొమాంటిక్గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి రవి శంకర్ సంగీతాన్ని అందించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
కొత్త ఏడాది బ్యూటిఫుల్
దర్శకుడు రామ్గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అన్నది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వైవిధ్యభరితంగా రూపొందిన చిత్రమిది. సూరి, నైనాల అభినయం మనసులను హత్తుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రవి శంకర్, సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, రచన, కెమెరా, దర్శకత్వం: అగస్త్య మంజు. -
అందమైన ప్రేమకథ
సూరి, నైనా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్’. ‘ట్రిబ్యూట్ టు రంగీలా’ అనేది ట్యాగ్లైన్. రాంగోపాల్ వర్మకు చెందిన టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. ‘లక్ష్మీస్ యన్టీఆర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకుడు. దర్శకత్వంతో పాటు రచన, ఫొటోగ్రఫీ బాధ్యతలు కూడా చేపట్టారు. టి. నరేశ్ కుమార్, టి.శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. ‘‘ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్కి విశేష స్పందన లభించింది. రొమాంటిక్ ప్రేమ కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. పాటలు మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్. ∙సూరి, నైనా -
అందమైన పాట
సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో రామ్గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘బ్యూటీఫుల్’. టి.అంజయ్య సమర్పణలో టి. నరేష్ కుమార్, టి. శ్రీధర్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ‘‘రొమాంటిక్ కథాంశంతో వైవిధ్యభరితంగా ఉంటుందీ చిత్రం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు విశేష స్పందన లభించింది. త్వరలో ఈ సినిమాలోని తొలి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు సిరాశ్రీ పాటలు రాశారు. రవిశంకర్ సంగీతం అందించారు. ∙నైనా, సూరి -
బ్యూటిఫుల్
రామ్గోపాల్ వర్మ నుంచి వస్తున్న కొత్త చిత్రం ‘బ్యూటిఫుల్’. ఆయన గతంలో తీసిన ఐకానిక్ మూవీ ‘రంగీలా’ కు ఇది ట్రిబ్యూట్. నైనా, సూరి జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇదివరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మతో కలసి దర్శకత్వం వహించారు అగస్త్య మంజు. ప్రస్తుతం ‘బ్యూటిఫుల్’ చిత్రం రామ్గోపాల్ వర్మ టైగర్ ప్రొడక్షన్పై నిర్మాణం జరుపుకుంది. టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్కుమార్, టి. శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ని బుధవారం విడుదల చేశారు. ‘‘మా ట్రైలర్కు విశేష స్పందన లభిస్తోంది.. అందరూ వెరీ బ్యూటిఫుల్ అంటున్నారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం:రవి శంకర్, సాహిత్యం: సిరా శ్రీ. -
ట్రిబ్యూట్ టు రంగీలా
రామ్గోపాల్ వర్మ కెరీర్లో ‘రంగీలా’ సినిమా చాలా స్పెషల్. ఇప్పుడు ఆ సినిమాకు ట్రిబ్యూట్గా ‘బ్యూటిఫుల్’ సినిమా తెరకెక్కుతోంది. ‘ట్రిబ్యూట్ టూ రంగీలా’ అనేది క్యాప్షన్. రామ్గోపాల్ వర్మ టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై టి. అంజయ్య సమర్పణలో టి. నరేశ్కుమార్, టి. శ్రీధర్ నిర్మిస్తున్నారు. సూరి, నైనా జంటగా అగస్త్య మంజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు వర్మతో పాటుగా అగస్త్య మంజు దర్శకత్వం వహించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 9న ‘బ్యూటిఫుల్’ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకు పాటలు: సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్. -
ఎంతో బ్యూటిఫుల్.. ఏ కాలేజ్..
ఎంతో బ్యూటిఫుల్.. ఏ కాలేజ్.. అని కొందరు అమ్మాయిలు అనడం.. ఇంతలో ఎక్కడి నుంచి వస్తుందో ఓ పాప.. మమ్మీ.. అని పిలవడం.. హా.. మమ్మీ.. అని వీళ్లు నోరెళ్లబెట్టడం.. ఈ యాడ్ మనందరికీ బాగా తెలిసిందే.. అక్కడ నోరెళ్లబెట్టింది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలే.. ఇక్కడ మనమందరం నోరెళ్లబెట్టాల్సిన విషయమొకటి ఉంది. ఓసారి ఫొటో చూడండి.. చూశారుగా.. ఇప్పుడు విషయం వినండి.. వీళ్లలో కూడా ఓ మమ్మీ ఉంది.. చిన్నపిల్లకు మమ్మీ కాదు.. ఈ ఫొటోలోని మరో అమ్మాయికి మమ్మీ!! ఇంతకీ వీరిలో ఎవరు మమ్మీ?? ఇందులో నల్లరంగు దుస్తులు వేసుకున్న ఆమె పేరు యాన్నీ.. వయసు 47.. పక్కనున్న యువాన్క్వింగ్(20)కు ఈమెనే మమ్మీ! యాన్నీ చైనాకు చెందిన సినిమా నటి. వయసు పెరిగేకొద్దీ మరింత అందంగా తయారవుతోందంటూ యాన్నీని అందరూ ప్రశంసించేవారు. అయితే.. ఇటీవల 8వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఆమె తన కుమార్తెతో వచ్చింది. అప్పుడా ఇద్దరినీ చూసినవారు మరింత ఆశ్చర్యపోయారు. అచ్చం అక్కచెల్లెల్లా ఉన్నారని.. ఇద్దరిలో ఎవరు పెద్ద అంటే చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. -
అందమైన ఆరోగ్యమైన కళ్ల కోసం...
ఎండకు అలసిన కళ్లకు సాంత్వన కలగాలంటే. టొమాటోరసం, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని కంటి చుట్టూ పట్టించి అరగంట తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. కళ్ల చుట్టూ నల్లని వలయాలుంటే కోడిగుడ్డులోని తెల్లసొన పట్టించి అరగంట తర్వాత కడగాలి. కొబ్బరి నూనెతో మృదువుగా మర్దన చేసినా కూడా... కళ్ల చుట్టూ నలుపు వదులుతుంది. -
నా దృష్టిలో నగ్నంగా ఉండటం ప్రకృతి: నటి
లాస్ ఎంజెల్స్: అప్పుడప్పుడు తాను దిగంబరంగా ఫొటోలకు పోజులివ్వడాన్ని ప్రముఖ హాలీవుడ్ యువనటి, దివంగత స్టార్ పాప్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్(19) సమర్థించుకుంది. నగ్నత్వాన్ని లైంగికంగా చూడొద్దంటూ హితవు పలికింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రమ్లో టాప్ లెస్గా ఓ సొఫాలో కూర్చుని సిగరెట్ తాగుతున్న ఫొటో పంచుకోవడంపట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తండ్రి పరువు తీస్తోందంటూ కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో స్పందించిన పారిస్ జాక్సన్ ‘నన్ను, నా తీరును ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారికి మరోసారి స్పష్టంగా చెబుతున్నాను. తిరిగి ప్రకృతితో కలిసిపోయే ఒక ఉద్యమంలాగా నగ్నత్వం ప్రారంభమైంది. ఇదొక స్వేచ్చా స్వాతంత్ర్యానికి అభివ్యక్తీకరించే చర్య, ఆరోగ్యంగా ఉండటం, ఇంకా చెప్పాలంటే ఇదొక ఫిలాసపీ.. ఏదీ మనల్ని మనుషులుగా తీర్చిదిద్దిందో అందులో నగ్నంగా ఉండటమనేది ఒక భాగం. ప్రత్యేకంగా నాకు సంబంధించి ఇది చాలా అందమైనది. మీ దేహాన్ని ఒక ఆలయంలాగా ఉంచుకోవడం కాదు.. దాన్ని పూజించాలి కూడా. ఒక యువతి తనను తాను తనకు నచ్చినదారిలో వ్యక్తీకరించుకోవడం ఫెమినిజంలో భాగం’ అని కూడా ఆమె రాసుకొచ్చింది. -
కన్నుల పండువగా శోభాయాత్ర
భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలలో భాగంగా, గురువారం శ్రీరంగధామం ఆధ్వర్యంలో జరిగిన శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవద్రామానుజుల విగ్రహాలతో ఉన్న రథాలను గౌతమఘాట్లోని శ్రీరంగధామం నుంచి మేళతాళాలతో, కోలాటం ప్రదర్శనలతో మెయి¯ŒS రోడ్డు మీదుగా నగర ప్రధాన రహదారుల్లో వైభవంగా ఊరేగించారు. ముందుగా స్థానాచార్యులు రఘునాథ పరాశర భట్టర్ రథంలోని రామానుజుల విగ్రహాలకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డాక్టర్ కర్రి రామారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి ఎంపీ ఆర్.విఠల్ తదితరులు పాల్గొన్నారు. – రాజమహేంద్రవరం కల్చరల్ -
పాపికొండల్లో చెర్రీ విహారం
-
ప్రకృతి అందాల తీరం సూర్యలంక
ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ బాపట్ల: సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్గా ఉంటుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ గోయిల్ అన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ ఎమ్మెల్యేలతో కలిసి సూర్యలంక తీరానికి చేరుకున్న స్పీకర్ ఆదివారం ఉదయం తీరంలో పర్యటించారు. స్పీకర్ను హరితా రిసార్ట్స్లో బాపట్ల ఎంపీపీ మానం విజేత మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువాలతో సత్కరించారు. తీరంలో పర్యటించిన వారిలో ఢిల్లీ ఎమ్మెల్యేలు అల్కాలంబ, పరిమళచూసెస్, భావనగౌరే, టీడీపీ రాష్ట్ర నాయకుడు మానం బ్రహ్మయ్య ఉన్నారు. -
మ్యాక్సిమమ్
సింగిల్ పీస్ ఎక్కడైనా! ఎప్పుడైనా!! టాప్ టు బాటమ్ ఇదే మ్యాక్సిమమ్ ఛాలెంజ్! సూపర్ బ్యూటీ వచ్చేసిందహోయ్ మ్యాక్సీయుగం అమ్మాయిలకు ఆనందం అబ్బాయిలకు అసూయ!! చిన్న చిన్న టెక్నిక్స్తో సూపర్ స్టైలిష్. అంచుభాగం క్రాస్ కట్, రెండు రకాల మెటీరియల్స్ జత చేయడం... చైనీస్ కాలర్నెక్, లెదర్బెల్ట్తో ఈ గౌనుకు తీరైన అందం వచ్చింది. ►జార్జెట్ మ్యాక్సీ గౌన్... సీతాకోకచిలుకకు కొత్త హంగులు అద్దిన సింగారం. ►సింగిల్ పీస్ డ్రెస్ ఎక్కడ ఉన్నా... సో... బ్యూటీఫుల్ అనిపిస్తుంది. ► టాప్ టు బాటమ్ ప్లెయిన్ హంగామా! మ్యాక్సీ గౌన్తో తీరైన రాచకళ. ► ఆధునికతకు కొత్త భాష్యం చెబుతున్న లాంగ్ స్లీవ్స్ స్టైలిష్ మ్యాక్సీ గౌన్. -
బ్యూటిఫుల్ ఎస్కేప్!
పైట.. కానీ, పైట కాదు కోటు.. కానీ, కోటు కాదు అలంకరణ.. కానీ, ఒట్టి అలంకరణ కాదు అదీ కాదు.. ఇదీ కాదు.. మరి ఏంటిది? కేప్ అమ్మా.. కేప్! భుజాల మీద నుంచి జాలువారే బ్యూటిఫుల్ ఎస్కేప్!! ►ప్లెయిన్ బ్లూ కలర్ శారీ మీదకు డిజైనర్ కేప్ ధరించిన నటి సమంత. ►లెహంగా ఛోలీ పైన అదే రంగు క్రేప్ ధరించడంతో సీతాకోకచిలుకను తలపిస్తున్న నటి లావణ్యత్రిపాఠి. ►వెస్ట్రన్ లాంగ్ స్కర్ట్ సింపుల్ స్టైల్ కేప్ ధరించడంతో మోడ్రన్గా ఆకట్టుకుంటున్నారు నటి సోనాక్షి సిన్హా! ►స్ట్రాప్లెస్ వెస్ట్రన్ డ్రెస్కి అద్భుతమైన కాంబినేషన్ డిజైనర్ కేప్ అని చాటుతున్న బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ -
అందాలొలికే..
జంగారెడ్డిగూడెం రూరల్: అందాలొలికే జలపాతం రూపంలో.. తామరపై నీటి బిందువు రూపంలో.. పక్కనే ఉన్న గుడిలో ఆధ్యాత్మిక సవ్వడి రూపంలో.. ఇలా నిత్యం అక్కడ కనులకు విందు. వాటర్పాల్స్ను తలపించే నీటి ప్రవాహం. మైమరపించే తామర పువ్వులు, పక్కనే సేదతీరేందుకు నాగేంద్రుడి ఆలయం. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం తామర చెరువులో ఇలా అందాలు అలరిస్తున్నాయి. తామర పుష్పాలు పూయడంతో ఈ చెరువుకు తామర చెరువుగా పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెరువు నిండినప్పుడు చెరువుకు అనుసంధానంగా ఉన్న డ్యామ్ ద్వారా ప్రవహించే నీరు జలపాతాన్ని తలపిస్తోంది. ఇక్కడే నాగేంద్రుడి ఆలయం కూడా ఉండటంతో ప్రజలు ఆలయం వద్ద కూర్చుని అందాలను తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతుంటారు. -
నీలాకాశమా..నీ అందం చూడతరమా!
అందాల ఆవిష్కరణకు క్యాన్వాస్ లాంటింది ఆకాశం. రూపు మారే మేఘాలు, మెరిసే నక్షత్రాలు.. రంగుల హరివిల్లు.. ఇలా ఎన్నో రమణీయ దశ్యాలకు కేరాఫ్. శనివారం సూర్య అస్తమయానికి కొద్ది ముందు ఆకాశం నీలం రంగు మారి ప్రకతి ప్రేమికులను కనువిందు చేసింది. ఈ సమయంలో నీలి మేఘాల కాంతుల్లో కొండారెడ్డి బురుజు వెలిగిపోయింది. ఫొటో: వి. శ్రీనివాసులు, కర్నూలు -
ఆర్ట్ టచింగ్
మల్కాపురం : బొమ్మ గీస్తే అచ్చుగుద్దినట్టు ఉండాలి. జీవకళ ఉట్టిపడాలి. పోలికల్లో ఏ మాత్రం తేడా రాకూడదు. ఇదే లక్ష్యంతో ఆ బాలిక భళా అనిపించుకుంటుంది. అద్భుత చిత్రాలతో జాతీయస్థాయిలో రాణిస్తోంది. పారిశ్రామిక ప్రాంతానికి చెందిన అన్వేష అద్భుత ప్రతిభతో సత్తా చాటుతోంది. జింక్ ప్రాంతంలోని ఎస్ఆర్ డీజీ పాఠశాల్లో అన్వేషిత తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆరో తరగతి చదువుతున్న సమయంలో పాఠశాల స్థాయి పెయింటింగ్ పోటీల్లో మహాత్మాగాంధీ చిత్రానికి ప్రశంసలు అందుకుంది. దీంతో చిత్రలేఖనంపై దష్టి సారించింది. ప్రముఖ చిత్రకారుడు చెల్లూరు భాస్కరరావు వద్ద శిక్షణ పొందుతోంది. తల్లిదండ్రులు,గురువు ప్రోత్సాహంతో జిల్లా,రాష్ట్ర స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని సుమారు వందకు పైగా సిల్వర్,బ్రాంజ్ మెడల్స్తో పాటు సర్టిఫికెట్లు అందుకుంది. జాతీయ పోటీలో... ఇటీవల నెల్లూరు,తెనాలి,విజయవాడలో జరిగిన జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీల్లో అన్వేషిత పాల్గొని బంగారు పతకాలు సాధించింది. ఈ ఏడాది సంక్రాంతిని సందర్భంగా విజయవాడలో జరిగిన జాతీయ స్థాయిపోటీలలో అన్వేషిత కు బంగారు పతకంతో పాటు ప్రోత్సాహక బహుమతి,సర్టిఫికెట్లు అందుకుంది. మరిన్ని చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని భావిస్తున్నట్టు అన్వేషిత చెబుతోంది. -
పిక్చర్.. పొట్లం
-
బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్!!
లండన్: ఫ్యాషన్ డిజైనర్లు ఎప్పటికప్పుడు తమ సృజనకు పదును పెట్టి కొత్త కోణాల్లో ట్రెండ్ సెట్ చేసేందుకు చూస్తుంటారు. అయితే లండన్ కు చెందిన ఆ కేక్ డిజైనర్ మాత్రం తన సృజనతో ఓ బ్యూటిఫుల్ వెడ్డింగ్ కేక్ డ్రెస్ ను రూపొందించి ఔరా అనిపించుకొంది. ఆ డిజైనర్ డ్రెస్ ను చూసి తరించడమే కాదు... కొరికి... రుచి కూడా చూడొచ్చన్నమాట..! లండన్ కు చెందిన కేక్ డిజైనర్ సిల్వియా ఎల్బా... కొత్త కోణంలో వెడ్డింగ్ డ్రెస్ ను రూపొందించింది. విభిన్న డిజైన్లను సృష్టించడంలో మేటిగా పేరొందిన డిజైనర్ ఈసారి కాస్త భిన్నంగా ఆలోచించింది. ఫన్ అండ్ ఫంకీ కేక్ స్థాపకుడు ఎట్టె మ్యానర్ తో పాటు కళాకారుడు లింకా రింక్ లతో కలిసి తన కలను సాకారం చేసుకుంది. సుమారు రెండు మీటర్ల పొడవు, 70 కేజీల బరువైన కేక్ తో 'ద వెడ్డిబుల్ డ్రెస్' పేరిట కొత్తరకం గౌనుకు రూపకల్పన చేసింది. ఎల్బా బృందం.. సృష్టించిన ఈ వినూత్న వెడ్డింగ్ డ్రెస్ రూపొందించేందుకు 300 గంటలు పట్టిందట. అంటే సుమారు పన్నెండు రోజులపాటు కష్టించి ఈ పెళ్ళి గౌనును తయారు చేసిన డిజైనర్లు... దీనికి 35 కేజీల ఫాండెంట్ ప్లస్ ను, వేఫర్ పేపర్ షీట్లతో తయారైన 15,000 రఫుల్స్ ను వినియోగించారట. అంతేకాక వెండిరంగు పూసలను అద్ది.. మిరుమిట్లు గొలిపే డిజైనర్ కేక్ డ్రెస్ ను రూపొందించారు. ఇంత కష్టపడి ఈ కేక్ ను ఏ పెళ్ళికూతురుకోసం రూపొందించారో అనుకుంటున్నారా? అలా అయితే తప్పులో కాలేసినట్లే... ఈ వారాంతంలో లండన్ లో జరగబోయే కేక్ ఇంటర్నేషనల్ షోలో ప్రదర్శనకోసం డిజైనర్లు ఇలా ప్రత్యేక శైలిని ప్రయోగించారన్నమాట. -
చట్టప్రకారం చనిపోయినా.. తల్లిదండ్రుల పోరాటం!
ఏ తల్లిద్రండులకైనా తమ బిడ్డలు ఆయురారోగ్యాలతో హాయిగా బతకాలని ఉంటుంది. వాళ్లకు చిన్న జ్వరం వస్తే చాలు.. కోలుకోవాలని కోటి మొక్కులు మొక్కుతూనే ఉంటారు. అలాంటిది కళ్లెదుటే ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తున్న తమ బిడ్డ చనిపోయిందని చట్టం చెప్పినా ఆ తల్లిదండ్రులు నమ్మేందుకు సిద్ధంగా లేరు. ఆ చిన్నారి గుండెచప్పుడే తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ఎదురు చూస్తున్నారు. ఆమెలో చలనం వచ్చి లేచి రావాలన్న ఆశతో అన్నివిధాల ప్రయత్నిస్తున్నారు. రంగుల దుప్పటి కప్పుకొని నల్లని పొడవైన జుట్టుతో దిండుపై హాయిగా నిద్రిస్తున్నట్లున్న 15 ఏళ్ల జుహి మెక్ మాథ్ ఫొటో ఇప్పుడు ఫేస్ బుక్ లో సంచలనం రేపుతోంది. కేవలం టాన్సిల్ తొలగించేందుకు చేసిన శస్త్రచికిత్స ఆమెకు ప్రాణాంతకమైంది. బ్రెయిన్ డెడ్ కావడంతో 2013లో ఆమె మరణించినట్లు ధ్రువీకరిస్తూ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ గతవారం ఫేస్ బుక్ లో కొన్ని వేలసార్లు షేర్ అయ్యింది. చూసేందుకు మెక్ మాథ్ సజీవంగా కనిపించినా ఆమె చట్టప్రకారం చనిపోయింది. నాడీవ్యవస్థ నిలిచిపోయి, ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఎటువంటి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా పేషెంట్లు బతుకుతారేమో కానీ, బ్రెయిన్ డెడ్ అయినవారు తిరిగి కోలుకునే అవకాశమే లేదు. అందుకు వైద్యం అసలే లేదు. బ్రెయిన్ డెడ్ అయినవారు నడవలేరు, మాట్లాడలేరు, కనీసం కళ్లు కూడా తెరవలేరు. ఇప్పుడు అదే స్థితిలో మెక్ మాథ్ ఉంది. ఇలాంటి వారి శరీర అవయవాలు మాత్రం జీవితకాలం పనిచేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. అంతేకాదు వారి జుట్టు వంటి కొన్ని శరీర భాగాలు పెరిగే అవకాశం ఉంది. చట్టప్రకారం మాత్రం మెక్ మాథ్ మరణించినట్లే. కొన్ని మతాలు ధర్మాల ప్రకారం ఊపిరి ఆగినప్పుడే ప్రాణం పోయినట్లు నమ్ముతారు. అదే నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు, బంధువులు మెక్ మాథ్ మరణాన్నిఅంగీకరించడం లేదు. ఆమె మరణించినట్లు ధ్రువీకరించిన పత్రాన్ని వారు స్వీకరించడం లేదు. వోక్ ల్యాండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెక్ మాథ్ మరణించినట్లు ధ్రువీకరించిన తర్వాత వారు ఆమెను మత ప్రాతిపదికన చట్టం కలిగిన న్యూ జెర్సీకి తీసుకెళ్లారు. బ్రెయిన్ డెడ్ అయి రెండేళ్లపాటు సజీవంగా ఉన్న ఆమె ఏదో ఒకరోజు బతికి బట్టకడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా మెక్ మాథ్ కు చికిత్స అందించి ప్రోత్సహించాలని కోరుతున్నారు. సంరక్షణ, పోషణతో ఆమె బ్రతికే అవకాశం ఉందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఓక్లాండ్ ఆస్పత్రి, సర్జన్ ఫ్రెడరిక్ రోసెన్ పై మెడికల్ మాల్ ప్రాక్టీస్ కింద.. మెక్ మాథ్ తల్లి లతాషా నైలా వింక్ఫైల్డ్, ఆమె కుటుంబం గత మార్చిలో దావా వేసింది. ఈ కేసులో మెక్ మాథ్ తీవ్ర రక్త స్రావంతో బ్రెయిన్ డెడ్ కు గురైందని సర్జన్ వివరణ ఇచ్చారు. అయితే మెక్ మాథ్ సజీవంగా ఉందా, మరణించిందా అన్న విషయం అలమెడా సుపీరియర్ న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంది. మెక్ మాథ్ చనిపోయినట్లు పరిగణిస్తే సర్జన్ల నిర్లక్ష్యం కారణమైందన్న దృష్టితో కాలిఫోర్నియా మాల్ ప్రాక్టీస్ లా ప్రకారం 250,000 డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. బతికే ఉన్నట్లు నిర్థారించినా ఆమె సంరక్షణకు కుటుంబానికి ఆర్థిక సహకారం అందించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే విషయంపై వింక్ఫైల్డ్ తన కుమార్తె మెక్ మాథ్ దగ్గర కూచుని ఉన్న ఫొటోతో ఫేస్ బుక్ పేజీలో చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. 'కీప్ జహి మెక్ మాథ్ ఆన్ లైఫ్ సపోర్ట్' పేరున కొనసాగుతున్న పేజీలో మెక్ మాథ్ బతికే ఉందని కొందరు, మరణించి ఉండొచ్చని కొందరు తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. ఓ మద్దతుదారుడు మెక్ మాథ్ బతికే ఉందని... ఆమె మెదడుకు కేవలం గాయం అయిందని, త్వరలోనే కోలుకుంటుందని మద్దతు పలికాడు. మాటలకు, మ్యూజిక్ కు తన మనుమరాలు స్పందిస్తోందని, చేతులు శరీరం కదుపుతోందని ఆమె తప్పకుండా బతుకుతుందని మెక్ మాథ్ బామ్మ సాండ్రా చెబుతోంది. శరీరంలో చిన్నపాటి కదలికలు వారిలో ఆశలు కల్పిస్తున్నా... ఒక్కోసారి బ్రెయిన్ డెడ్ వ్యక్తుల్లో మెదడు చర్య లేకుండానే కదలికలు కలుగే అవకాశం ఉంది. ఈ విషయంలో ప్రస్తుతం ఎవరెన్ని చెప్పినా మెక్ మాథ్ మరణంపై కోర్టు విచారించిన అనంతరం ధ్రువీకరించాల్సి ఉంది. -
మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కు.. కాంట్రాక్ట్ కష్టాలు!
మూడేళ్ళ వయసునుంచే మోడలింగ్ ఫీల్డ్ లో ప్రతిభను ప్రదర్శించిన ఆ చిన్నారి... ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా పేరొందింది. డాల్సీ అండ్ గబ్బనా.... రాబర్ట్ కావిల్లా.... అర్మానీ వంటి ఎంతోమంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో పని చేసింది. పదేళ్ళ వయసున్న ఆ రష్యా చిన్నది... ఇప్పుడు అమెరికాకు చెందిన టాప్ మోడలింగ్ కాంట్రాక్ట్ విషయంలో సమస్యను ఎదుర్కొంటోంది. రష్యాలో జన్మించిన లిటిల్ సూపర్ మోడల్... 'ఎల్ ఏ మోడల్స్ యూత్' సెక్షన్ కాంట్రాక్ట్ కు సైన్ చేసి... ప్రపంచంలోనే ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. అయితే ఆ అభిమానం ఆమె భవిష్యత్తుకు మాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన క్రిస్టినా ప్రిమెనోవా చిత్రాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఈ పోకడ సరికాదని కొందరు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆమెకు అడ్డంకిగా మారింది. క్రిస్టినాకు ఫేస్ బుక్ లో సుమారు 20 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చిన్నతనంలోనే ఆమె ప్రతిభా పాటవాలను ప్రోత్సహిస్తున్నవారు కొందరైతే... అసూయ, ఆగ్రహం వ్యక్తం చేసేవారూ అందులో కొనసాగుతున్నారు. కొందరు ఆమె చిన్నపిల్లని చూడకుండా ఆమె శరీరభాగాలపై ఎన్నోఅసభ్య కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోపై ఓ కామెంటర్ తనతో ఉండటం ఇష్టమేనా అన్నాడు. అలాగే కొందరు సెక్సీ లెగ్స్ అన్నారు. అయితే క్రిస్టినా తల్లి 40 ఏళ్ళ గ్లికేరియా పిమెనోవా మాత్రం.. తాను పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎలాంటి అసభ్యతా లేదంటోంది. చిన్నారి ధరించిన వస్త్రాలు రెచ్చగొట్టేవిగా లేవని ఆమె వాదిస్తోంది. పసి పిల్లలను అసభ్యంగా చూడటం సరికాదని, తన కూతురు భవిష్యత్తును పాడు చేయొద్దని ఓ పత్రికతో విన్నవించింది. క్రిస్టినా ఫొటోలను తరచుగా ఇన్ స్టాగ్రామ్ లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసే బాధ్యతను తల్లి గ్లైకేరియా కొనసాగిస్తోంది. కూతురుపై వచ్చే అనుచిత వ్యాఖ్యలను వెంటనే డిలీట్ చేస్తూ, ఆమె పోస్ట్ లు ఛైల్డ్ ఫ్రెండ్లీ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది. క్రిస్టినా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ఎవరైనా పోస్టు చేసే వీడియోలు, చిత్రాలు, కామెంట్లు.. క్రిస్టినా వయసుకు తగ్గవిగా లేకపోతే డిలీట్ చేయబడతాయని గ్లికేరియా హెచ్చిరిస్తోంది. అంతేకాక పోస్ట్ చేసిన వారిని బ్లాక్ చేస్తామని చెప్తోంది. అయితే ఆన్ లైన్ లో క్రిస్టినా... ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నా... అతి చిన్న వయసు కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రవేశం ఉండకూడదని కొందరు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేస్తున్నారు. -
2016 బ్రైట్ అండ్ బ్యూటిఫుల్
కొత్తగా ఉండడం బావుంటుంది. కొత్త ఏడాదిలో నలుగురికీ ఫ్రెష్లుక్తో కనపడడం మరీ బావుంటుంది. న్యూ ఇయర్కి హ్యాపీనెస్ యాడ్ చేయాలంటే యాడ్లో మోడల్లా మెరిసిపోవాలి. మెరుపులను వెదికేవారికి మేం అందిస్తున్న బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ 2016 ఇది... క్రీమ్కలర్ లెహంగా పైన నీలం, బంగారు రంగు పువ్వులు. అదే థీమ్తో డిజైన్ చేసిన జాకెట్ ఈవెనింగ్ పార్టీని బ్రైట్ చేస్తుంది. అందరి చూపులను అట్రాక్ట్ చేస్తుంది. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ డ్రెస్ని ఇటీవల లాక్మేఫ్యాషన్ వీక్లో మోడల్ ప్రదర్శించారు. 1970ల కాలంనాటి స్టైల్ని రీ మిక్స్ చేసినట్టు ఉన్న ఈ డ్రెస్ పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ముంబయ్ ఫ్యాషన్ డిజైనర్ పాయల్ఖండ్వాలా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. రెట్రో లుక్తో ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్ ఈ ఇయర్ పార్టీస్కి పర్ఫెక్ట్ అనిపించకమానదు. బ్లాక్ కలర్ మిడ్ గౌన్ వెస్ట్రన్ పార్టీలకు క్లాస్ లుక్ని తీసుకువస్తుంది. ఈ డ్రెస్ డిజైనర్ అయేషా దీపాల. ఆసియాలోనే మోస్ట్ స్టైలిష్ట్ డ్రెస్ డిజైనర్గా పేరొందిన ఆయేషా దుబాయి డిజైనర్ అయినప్పటికీ భారతీయ వస్త్ర శైలులంటే అమితమైన ఆసక్తి. ప్రపంచవ్యాప్తంగా ఆయేషా డ్రెస్ డిజైన్స్ స్టైలిష్ లుక్స్తో ఆకట్టుకుంటున్నాయి. నటి రెజీనా ధరించిన లాంగ్ ఫ్లోయీ గ్రే డ్రెస్ వెస్ట్రన్ పార్టీలకు మోడ్రన్ లుక్తో ఆకట్టుకుంటుంది. నేటి తరం అమ్మాయిల కలలకు తగిన రూపం ఇస్తున్న స్టైలిస్ట్ డిజైనర్ దీక్షా ఖన్నా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ముదురు నీలం రంగు లెహంగా, ఫుల్ స్లీవ్స్ బోట్నెక్ జాకెట్పై హెవీ ఎంబ్రాయిడరీ ఉంటే వెస్ట్రన్ పార్టీలో గ్రాండ్గా మెరిసిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ అంజుమోడీ డిజైన్ చేసిన బ్రైడల్ కలెక్షన్లో భాగంగా ఈ డ్రెస్ను ఇటీవల లండన్లో ప్రదర్శించారు. ప్లెయిన్ లేత నీలం రంగు లాంగ్ అనార్కలీ గౌన్ పార్టీని మాటల్లో చెప్పలేనంత బ్రైట్గా మార్చేస్తుంది. ప్రఖ్యాత డిజైనర్ దంపతులుగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతున్న శ్యామల్ అండ్ భూమిక డిజైన్ చేసిన డ్రెస్ ఇది. బ్లౌజ్ భాగాన్ని అదే రంగు మెటీరియల్తో తీర్చిదిద్ది ఎంబ్రాయిడరీ చేశారు. -
గ్రీనరీలకన్నా సీనరీలే ఆరోగ్యం!
అందమైన నగరాల్లో నివసించడం గ్రామజీవనం కన్నా ఆరోగ్యకరం అంటున్నారు అధ్యయనకారులు. నగరాల్లో ఉండే ఓ మంచి సీనరీ... గ్రామాలు, పట్టణాల్లోని గ్రీనరీ (పచ్చదనం) కన్నా సానుకూల వాతావరణాన్ని సృష్టించడంతోపాటు... మానసిక, శారీరక శ్రేయస్సును మెరుగు పరిచేందుకు, ఉపయోగపడుతుందని చెప్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని నదులు, పచ్చదనం కన్నా... నగరాల్లో అత్యంత సుందరమైన సీనరీల్లో ఉండే గోధుమ, బూడిద, నీలం రంగులు...వ్యక్తి భావాలను ఆకట్టుకుంటాయని అధ్యయనాలు తేల్చి చెప్తున్నాయి. థేమ్స్ నదిలో రవాణా జరిపే కార్గో ఓడలు, సెంయింట్ పాల్ కేథడ్రాల్ వ్యూ వంటివి... కొండలు, విస్తారమైన అడవుల్లో నడవటం కన్నా.. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. వార్విక్ బిజినెస్ స్కూల్ విద్యావేత్తల సర్వేలో భాగంగా బ్రిటన్ కు చెందిన 212,000 చిత్రాలను చూపించి వాటిపై ప్రజలను రేటింగ్ చేయమని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా ప్రాంతాల్లో నివసించే 1.5 మిలియన్ల జనాభా వారి ఆరోగ్యం గురించి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీన్నిబట్టి పరిశోధకులు అత్యంత సుందరమైన, అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే పచ్చని గ్రామాల్లో ఆరోగ్యం, అనందం అంతగా లేవని తేల్చారు. కేవలం ఓ పచ్చని ప్రాంతం.. సీనరీల్లో ఉండే మంచి అనుభూతిని, ఆనందాన్ని ప్రేరేపించడం లేదని తమ సర్వే ద్వారా తెలిసినట్లు బిజినెస్ స్కూల్ పీహెచ్ డి విద్యార్థి ఛనూకి తెలిపారు. వాతావరణంలోని అందాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. కేవలం పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంవల్ల ఉపయోగం ఉండదన్నారు. స్థానికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ప్రణాళికా బద్ధంగా పార్కులు, హౌసింగ్, రహదారులు వంటి నిర్మాణాలు చేపట్టాలని... పర్యావరణాన్ని అందంగా తీర్చి దిద్దడంవల్ల ఆరోగ్యంగా ఉండగల్గుతారని సర్వేలు సూచిస్తున్నట్లు తెలిపారు. తాము జరిపిన సర్వే ద్వారా సీనరీలు ఆరోగ్యం మధ్య చూసిన సంబంధం, ప్రయోజనకర ప్రభావాలు... హరిత ప్రదేశాల్లో కనిపించడం లేదని బిజినెస్ స్కూల్ కు చెందిన బిహావియరల్ సైన్స్ ల్యాబ్ సహదర్శకుడు, అసోసియేట్ ప్రొఫెసర్ సూజీ మాట్ వెల్లడించారు. గతంలో మనం నమ్మే పచ్చదనం ఆరోగ్యానికి శ్రేయస్కరం అన్న నమ్మకాన్ని వదిలి... దైనందిన జీవితంలో పర్యావరణ ప్రాముఖ్యతకే ప్రాధాన్యతను ఇవ్వవచ్చని తమ సర్వే ఫలితాలద్వారా తెలుస్తోందంటున్నారు. -
ఎనభైల్లోనూ తళుకులీనే అందం...
తళుకులీనే అందం... అర్థ శతాబ్ది దాటినా ప్రఖ్యాతి తగ్గని రూపం.. గోల్డ్ ఫింగర్ బాండ్ గర్ల్ షిల్లీ ఈటన్... ఇప్పుడు మరోసారి అభిమానులముందు బంగారు బొమ్మలా ప్రత్యక్షమైంది. ఎనభై ఏళ్ళకు చేరుతున్నా... అదే ఆత్మవిశ్వాసంతో ఉన్న ఆమె... గ్లామర్ కు వయసుతో సంబంధం లేదంటోంది. అప్పట్లో గోల్డ్ ఫింగర్ సినిమాలో తన పాత్రకోసం బంగారు రంగులో కనిపించిన ఆ గ్లామర్ క్వీన్... ఇప్పుడు ప్రత్యేక ఫొటో షూట్ లో బంగారు శిల్పంగామారి.. మరోసారి తన అనుభవాలను నెమరువేసుకుంది. 78ఏళ్ళ మిస్ ఈటన్... గోల్డ్ పింగ్మెంట్ పౌడర్ ను ఒళ్ళంతా పూసుకొని.. హొయలొలికించే సౌందర్య లావణ్యాన్ని ప్రదర్శిస్తూ రెండు గంటలపాటు ఫొటో షూట్ కు హాజరైంది. 1964 లో గోల్ఢ్ పింగర్ సినిమా చిత్రీకరణ సమయంలో ఈటన్ కు 27 ఏళ్ళ వయసు. అప్పట్లో ప్రముఖ ఇంగ్లీషు పత్రిక లైఫ్ కవర్ పేజ్ పై తళుకులీనే అందాలను ప్రదర్శించిన ఈటన్.. ఇప్పుడు మరోసారి అదే పోజులో దర్శనమిచ్చింది. ఒంటిపై వస్త్రాలు సైతం లేకుండా మరోసారి బంగారు రంగు పూతను వేసుకొని వివిధ భంగిమల్లో కనిపించింది. '' నాకు ఛాలెంజింగ్ గా ఉండటం అంటే ఎంతో ఇష్టం. అందుకే వృద్ధాప్యంలోనూ వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించాను'' అంటుంది ఈటన్. జరిగిన ఏభై ఏళ్ళలో పలుమార్లు.. ప్రముఖ పత్రికలు తనను పోజులకోసం అడిగాయని, కానీ తాను దానికి అంగీకరించలేదని అంటుందీ బాండ్ లేడీగా మారిన బాండ్ గర్ల్... వచ్చే జనవరిలో తన 79వ పుట్టిన రోజని, వయసువల్ల శరీరానికి ముడతలు వచ్చినా.. ఆత్మ విశ్వాసంలో ఎటువంటి మార్పు లేదని చెప్తుందీ బంగారు బొమ్మ. నటీమణులను కళా దృష్టితోనే చూడాలని, వారిని కించపరిచేందుకు ప్రయత్నించకూడదని సూచిస్తున్న ఈ ఓల్డేజ్ సౌందర్యరాసి.. కొత్తగా వచ్చే సినిమాల్లో విమర్శలకు గురౌతున్న బాండ్ గాల్స్ కు మనో ధైర్యం కలిగించేందుకు, స్ఫూర్తిగా నిలిచేందుకు తాను మరోసారి ఈ రూపంలో దర్శనమిచ్చినట్లు ఈటన్ చెప్తోంది. -
విలయానికి వారం
-
అందమైన భామలు
-
‘టాప్’గేర్!
ఢీ అంటే ఢీ అనేలా నటనలో పోటీ నాడు. నాకేం తక్కువంటే నాకేం తక్కువనే బ్యూటీ‘ఫుల్’ ఎగ్జిబిషన్ నేడు! సినిమాల్లో ఓకే... కొత్త కాదు గానీ... ఓ యాడ్ కోసం మోడల్, నటి కారా డెలెవింగ్నే టాప్లెస్గా నటించేసిందట. సదరు జ్యువెలరీ 2015 క్యాంపెయిన్లో భాగంగా ఈ ఇరవై రెండేళ్ల స్వీటీ భిన్న భంగిమల్లో పోజులిచ్చింది. ఆ ఫొటోసూట్లోని కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక చెప్పేదేముంది... వెబ్లో షికార్లు చేస్తూ గ్లోబును చుట్టేస్తోంది. ఈ భామ ‘బోల్డ్నెస్’కు ప్రొడక్ట్ యజమానులు తెగు ఖుషీ అయిపోతున్నారు. ‘త్వరలో మరిన్ని... చూస్తూనే ఉండండి’ అంటూ వారూ ఓ ట్వీట్ చేశారు! -
దానిపై ఆలోచనే లేదు
శస్త్ర చికిత్సతో కృత్రిమ అందాల కోసం వెంపర్లాడడం తనకు నచ్చదని, ఆ విషయాన్ని తలచుకుంటేనే తనకు ఎలర్జీ పుడుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొంది. అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్లు శస్త్రచికిత్సతో బరువు తగ్గించుకోవడం వంటి కృత్రిమ అందాలతో మెరసి పోతున్నారన్నది వాస్తవం. సీనియర్ నటీమణులు శ్రీదేవి, భానుప్రియ, రంభ, రమ్య నుంచి నేటితరం ప్రముఖ హీరోయిన్లు నయనతార, సమంత, శ్రుతిహాసన్ వరకు కృత్రిమ అందాలను ఆశ్రయించినవారే. అయితే తను మాత్రం సహజ సిద్ధమైన అందాలతో మెరిసిపోతున్నట్టు కాజల్ పేర్కొన్నారు. ఆమె మాట్లాడుతూ, తాను ఎప్పటికీ శస్త్ర చికిత్సతో అందాన్ని మెరుగుపరచుకునే పని చేయనంది. అలాంటి కృత్రిమ అందాలపై తనకు నమ్మకం లేదని చెప్పింది. అసలు ఆ విషయం గురించి ఆలోచనే తనకు లేదంది. అసలు దాన్ని తలచుకుంటేనే అలర్జీ కలిగేలా ఉందని పేర్కొంది. తన సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి సహజసిద్ధంగా లభించే ప్రకృతి సాధనాలను వాడతానని చెప్పింది. నిత్యం జిమ్కు వెళ్లి కసరత్తులు చేసి స్లిమ్ అయి అందాలను పెంచుకుంటానని తెలిపింది. అయితే ఆమె మాటలు ఇతరులను ఎత్తి పొడిచేలా ఉండడంతో పలువురు హీరోయిన్లు కాజల్పై గుర్రుగా ఉన్నారని కోలీవుడ్ సమాచారం. -
బ్యూటిఫుల్
సిటీవాసుల అందానికి మరింత వన్నె తెచ్చేందుకు ‘సిరో’ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ స్టూడియో అందుబాటులోకి వచ్చింది. ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్, విల్స్ లైఫ్స్టైల్, ఫ్యాషన్ వీక్ వంటి షోలకు మేకప్ అండ్ హెయిర్ స్టైల్ సేవలు అందించిన ఎడ్వర్డ్, జింగ్ ఆధ్వర్యంలో ఫిలింనగర్లో ఏర్పాటుచేసిన ఈ స్టూడియోను సినీ నటి శుభ్రా అయ్యప్ప శుక్రవారం ప్రారంభించింది. సాక్షి, సిటీప్లస్ -
అందం అదిరింది.. అవార్డు వరించింది!
-
క్రోమ్ ఆప్స్...సోషల్ ట్రిక్స్
మనం వాడే వెబ్ బ్రౌజర్ ను బట్టి మన మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రపంచం ఇది... ఎందుకంటే.. దాన్ని బట్టే మనం ఎంత సౌకర్యవంతంగా బతకగలమో తెలిసిపోతుంది కాబట్టి. అవకాశాలున్నప్పుడు వాటిని వాడుకొనే నేర్పు ఎంతుందో అర్థమవుతుంది కాబట్టి! మరి ఇటువంటి సమయంలో అందిపుచ్చుకొనే ఉత్సాహం ఉండాలి కానీ.. వెబ్ విహారానికి ఎన్నోసరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫీచర్లను వాడుకొంటూ చేసే వెబ్ బ్రౌజింగే అద్భుతమైన ఫీలింగ్ను అందిస్తుంది. సౌకర్యాలను వాడుకోవడం మనల్ని ప్రత్యేకమైన వాళ్లమనే గుర్తింపును తెస్తుంది. టెక్శావీలనే పేరును తెచ్చిపెడుతుంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్కు ఎక్స్టెన్షన్లుగా అందుబాటులో ఉన్న అలాంటి ఫీచర్లు ఇవి! ఇన్స్టాగ్రమ్ ఫర్ క్రోమ్: ఫాస్ట్, బ్యూటీఫుల్ అండ్ ఫన్... ఇది ఇన్స్టాగ్రమ్ ట్యాగ్లైన్. మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ను కేవలం స్మార్ట్ఫోన్కు మాత్రమే కాకుండా మీ పీసీ ద్వారా పంచుకోవడానికి అవకాశం ఇస్తుంది ఈ క్రోమ్ఎక్స్టెన్షన్. ఇన్స్టాగ్రమ్లో ఫ్రెండ్స్ పోస్టు చేసే ఫోటోలను బ్రౌజ్ చేయడానికి, లైక్, కామెంట్లు పెట్టడానికి ఈ ఎక్స్టెన్షన్ ద్వారా అవకాశం ఉంటుంది. లాస్ట్పాస్: తికమక పెట్టే గ్రామర్ను ఉపయోగించి ఎంత స్ట్రాంగ్పాస్వర్డ్ తయారు చేసుకొంటే మీ సోషల్నెట్వర్కింగ్ సైట్ అకౌంట్స్ అంత సేఫ్గా ఉన్నట్టని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనం ఇప్పటికీ మొబైల్ నంబర్నో, ఇంట్లో వాళ్ల పేర్లనో సోషల్సైట్ల పాస్వర్డ్స్గా పెట్టుకొంటాం. అంతకు మించి ఆలోచించి మనకోసం అంత ఈజీగా బ్రేక్ కావడానికి అవకాశం లేని పాస్వర్డ్స్ను తయారు చేసి అందిస్తుంది ఈ ఎక్స్టెన్షన్. టంబ్లర్ కోసం ‘పోస్ట్ టు టంబ్లర్’: మీకు బ్లాగింగ్సైట్ టంబ్లర్లో అకౌంట్ ఉందా? అక్కడ తరచూ మీరు ఫీచర్స్ పోస్టు చేస్తూ ఉంటారా.. అలాంటి బ్లాగర్లకు అవసరం ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే... ఏదైనా వెబ్పేజ్లోని కంటెంట్ను ఒకే క్లిక్తో టంబల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవర్నోట్ వెబ్ క్లిప్పర్: ‘ఎవర్నోట్’ అప్లికేషన్తో ఉండే సదుపాయాలు ఏమిటో ఐఫోన్ ను వాడే వారికి బాగా అనుభవం. నిజంగా అది ఒక అద్భుతమైన అప్లికేషన్ అంటూ తేల్చేస్తారు వాళ్లు. మరి అలాంటి యాప్ను పీసీ ద్వారా వాడటానికి అవకాశం ఇస్తుంది ఎవర్నోట్ వెబ్ క్లిప్పర్ ఎక్స్టెన్షన్. వెబ్ బ్రౌజింగ్సమయంలో టెక్ట్స్, లింక్, ఇమేజ్లను ఎవర్నోట్ అకౌంట్లోకి సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ డాటాను ఎప్పుడైనా, ఎక్కడ నుంచినైనా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. యాడ్బ్లాక్ ప్లస్: సిస్టమ్ వైరస్ బారినపడ్డప్పుడు, మాల్వేర్ అటాక్ అయినప్పుడు చాలా ఇబ్బందులే ఉంటాయి. వెబ్ బ్రౌజింగ్ విషయంలో అవాంతరాలను కల్పిస్తూ అనేక యాడ్ పేజెస్ ఓపెన్ అవుతూ ఉంటాయి. మౌస్తో క్లిక్ మనిపించినప్పుడల్లా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతూ చిరాకు పెడుతుంటుంది. మరి అలాంటి సందర్భాల్లో వాటిని బ్లాక్ చేయడానికి అవకాశం ఇస్తుంది ఈ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ విసిగించే సైట్ల యూఆర్ఎల్ను సేవ్ చేశాం అంటే... వాటి తలనొప్పి ఇక ఉండదు. శాశ్వతంగా బ్లాక్ అయిపోతాయి. బఫర్: సోషల్నెట్వర్కింగ్ సైట్లలో పోస్టులను షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్స్టెన్షన్తో. పోస్టును అంతా సెట్ చేసి అది ఫలానా టైమ్లో పబ్లిష్ అయ్యే విధంగా షెడ్యూల్ చేయవచ్చు దీని సాయంతో. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసిన క్రోబ్ బ్రౌజర్ నుంచి ట్విటర్, ఫేస్బుక్ ఇతర సైట్ల ను ఆపరేట్ చేసేటప్పుడు అలా షెడ్యూల్ చేసుకొనే ఆప్షన్ వస్తుంది. అన్ఫ్రెండ్ నోటిఫికేషన్: ఫేస్బుక్లో మన స్నేహితులకు సంబంధించిన అప్డేట్స్ నోటిఫికేషన్స్గా వస్తూ ఉంటాయి. అయితే ఎవరైనా మనల్ని అన్ఫ్రెండ్ చేస్తే మాత్రం అప్డేట్ ఉండదు. ఎందుకో ఫేస్బుక్ నిర్వాహకులు ఆన్ఫ్రెండ్ నోటిఫికేషన్స్గానీ అందుకు సంబంధించిన అప్డేట్స్గానీ పెట్టలేదు. అయితే ఈ లోటును తీరుస్తుంది అన్ఫ్రెండ్నోటిఫికేషన్ ఎక్స్టెన్షన్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొంటే ఫ్రెండ్స్ జాబితా నుంచి ఎవరు జారిపోతున్నారు తెలుసుకోవచ్చు! హోవర్ జూమ్.. కొన్ని వెబ్సైట్లలో ఏదైనా ప్రోడక్ట్ కు సంబంధించిన ఫోటోలపై మౌస్ పాయింటర్ను పెడితే ఆ ఇమేజ్ జూమ్లో కనిపిస్తుంది. రెజల్యూషన్ బాగా ఉంటే ఆ ఫోటోలను హోవర్జూమ్ ద్వారా తీక్షణంగా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి అన్ని సైట్లలోనూ అలాంటి అనుభవం కావాలంటే హోవర్జూమ్ను ఇన్స్టాల్ చేసుకోవడమే. ఈ ఎక్స్టెన్షన్ను ఇన్స్టాల్ చేసుకొంటే వివిధ సోషల్నెట్వర్కింగ్ సైట్లలోని ఫోటోలు పాయింట్ను పెట్టగానే జూమ్లో కనిపిస్తాయి. -
వాహ్.. ఐష్ అనుకున్నారంతా(టా)..!
-
కొత్తందాలతో రా...రమ్మంటున్న నర్సరీలు
-
కళకళలాడుతున్న జూరాలా ప్రాజెక్టు