
ఎమ్మెల్యేకి ఎస్పీ క్షమాపణ చెప్పాలి
నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిపై దురుసుగా వ్యవహరించిన తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
ఇప్పటికైనా ఏర్పేడు ఘటనపై సీబీఐ విచారణ జరిపించి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్నారు. మరణించిన వారి కుటుంబాలను ప్రతిపక్షనేత వైఎస్.జగన్ ఓదార్చి వారిలో మనోధైర్యం నింపారని చెప్పారు. టీడీపీకి చెందిన ఇసుక స్మగ్లర్ల అక్రమ రవాణా వల్లే ఘటనకు కారణమని తెలిపారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం లీగల్సెల్ నగర కన్వీనర్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో గోపాల్రెడ్డి, కృష్ణవేణమ్మ, పునీత, మహేశ్వరరావు, సాయికుమారి, జగదీష్, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.