ప్రారంభమైన కృష్ణా బ్రిడ్జిపై వాహన రాకపోకలు
మాగనూర్: మండల పరిధిలోని కృష్ణానదిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. గత జూన్ 23 నుంచి బ్రిడ్జి పై సీసీ రోడ్డు నిర్మాణం కొరకు కర్ణాటక ప్రభుత్వం దాదాపు రెండు నెలల పాటూ వాహన రాకపోకలను నిల్పివేసిన విషయం పాఠకులకు విధితమే. కాగ ఎట్టకేలకు బ్రిడ్జిపై వాహనాలు వెళ్లుటకు మంగళవారం రాత్రి నుంచి అధికారులు అనుమతించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలలుగా నిల్చిపోయిన వ్యాపారాలు పునఃప్రారంభం కానున్నాయి.