స్వచ్చభారత్ చాంపియన్లో కలెక్టర్
ముకరంపుర : స్వచ్చభారత్లో భాగంగా మరుగుదోడ్ల నిర్మాణంలో విశేషకృషి చేసిన కలెక్టర్లకు గురువారం ఢిల్లీలో జరిగిన స్వచ్చభారత్ చాంపియన్కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 20 మంది కలెక్టర్లకు ఆహ్వానం అందగా అందులో తెలంగాణ నుంచి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఉన్నారు. మరుగుదోడ్ల నిర్మాణం ప్రగతి సాధనలో కలెక్టర్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలో డిసెంబర్ 31లోగా స్వచ్చ కరీంనగర్ డిక్లేర్ చేసేందుకు కలెక్టర్ కృషి చేసేందుకు ముందుకు పోతున్నారు.