అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి
Published Wed, Aug 24 2016 12:17 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
తొర్రూరు : అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభు త్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం రాకేష్(35) రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహా లతో గత కొద్దిరోజులుగా పాఠశాలకు వెళ్లకుండ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో తొర్రూరు పట్టణంలో నివాసముంటున్న రాకేష్కు ఇంట్లోనే ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని వెంటనే స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగా రాకేష్ ఆరోగ్యం విషమించడంతో మృతి చెం దాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని రాకేష్ మృతికి అతడి అత్తగారి కుటుంబ సభ్యులే కారణ మని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించి, విచారణ కొనసాగిస్తున్నట్లు సీఐ శ్రీధర్రావు తెలిపారు. మృతుడు రాకేష్కు భార్యతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement