Doubt
-
అన్నీ వింత సందేహాలే...బుర్ర తిరిగిపోతోంది..!
డాక్టర్ గారూ నేను గత ఏడెనిమిది ఏళ్లుగా డిప్రెషన్లో ఉన్నాను. ఎందుకో కారణం తెలియదు. దానివల్ల నా స్టడీస్ కూడా దెబ్బతిన్నాయి. అయినా మా అమ్మానాన్న కోసమైనా బతకాలనుకుని ఇంతవరకు ఉన్నాను. కానీ మళ్లీ ఒక సంవత్సరం నుంచి భయంకరమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా మైండ్లో రోజూ విచిత్రమైన ఆలోచనలు నిరంతరం వస్తూ నన్ను బాధపెడుతున్నాయి. ఈ చెట్లు ఎలా వచ్చాయి? భూమ్మీదకు మనుషులు ఎలా వచ్చారు? గాలిని చూడగలమా? ఆత్మలు ఉన్నాయా? నీళ్లు ఎందుకు తాగాలి, అన్నం ఎందుకు తినాలి... ఇలాంటి విచిత్రమైన ఆలోచనలు వచ్చి నరకయాతను అనుభవిస్తున్నాను. ఇవన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి, ఇలా రాకూడదని నేనెంత ప్రయత్నం చేసినా అవి ఆగడం లేదు. మాది చాలా బీదకుటుంబం. నన్ను ఎలాగైనా ఇందులోంచి బయట పడేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. - విక్రం, పులివెందులమీ మెయిల్ చదివాను. మీరు ఎన్నో అనవసరమైన ఆలోచనలతో సతమతం అవుతూ, వాటినుంచి బయట పడలేక మనోవేదనకు గురవుతున్నట్లు అర్థం అయింది. మీకున్న లక్షణాలను ఎగ్జిస్టెన్షియల్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ఈ సమస్యతో బాధపడేవారిలో ఎక్కువగా ఫిలసాఫికల్ డౌట్స్ వస్తాయి. భూమి గుంఢ్రంగా ఎందుకు ఉంది, మనుషులు ఎలా పుట్టారు, సూర్యుడు తూర్పునే ఎందుకు ఉదయించాలి.. లాంటి తాత్వికమైన ప్రశ్నలు వస్తాయి. అయితే సాధారణంగా అందరిలో ఏదో ఒక సమయంలో ఇలాంటి సందేహాలు అప్పుడప్పుడు తలెత్తినా కొంతసేపు ఉండి తగ్గిపోతాయి. మీ విషయంలో మీకు ఇవి ఇష్టం లేకున్నా మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టేలా వస్తున్నాయి. వాటికి సమాధానాలు వెతకలేక మీరు తీవ్రమైన మానసిక క్షోభకు, డిప్రెషన్కూ గురవుతున్నారు. దీనికి మంచి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.మంచి మందులతోపాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా మీ జబ్బు లక్షణాలను పూర్తిగా తగ్గించవచ్చు. మీరు మీ ఉత్తరంలో చికిత్స తీసుకుంటున్నారో లేదో తెలపలేదు. ఒకవేళ మీరు చికిత్సలో లేనట్లయితే మీకు దగ్గరలో కడప ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే మందులు, కౌన్సెలింగ్తో తగ్గిస్తారు. క్రమం తప్పకుండా మందులు వాడి కౌన్సెలింగ్ తీసుకున్నట్లయితే మీ సమస్య వీలైనంత తొందరలో తగ్గి΄ోతుంది. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా, సమస్య తగ్గకుంటే మీ రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వస్తే మీకు తగిన చికిత్స చేసి, మీ సమస్య నుంచి పూర్తిగా బయట పడేలా చేయగలం. మీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదన్న కారణంగా చికిత్స ఆపవద్దు. మీ పరిస్థితిని బట్టి మీకు అవసరమైన సహాయం చేసి, చికిత్స చేయగలం. వెంటనే మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లండి. అన్నీ మంచిగా జరుగుతాయి. ఆల్ ది బెస్ట్. చదవండి: చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలుకంటెంట్ క్వీన్స్ మ్యాజిక్ : ‘యూట్యూబ్ విలేజ్’ వైరల్ స్టోరీ డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
జీవితాన్నే మార్చేసిన ఒక లిఫ్ట్ ఇన్సిడెంట్
నా వయసు 24 సంవత్సరాలు. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ని. నా పనిలో బాగా రాణిస్తున్న తరుణంలో ఒకరోజు లిఫ్ట్లో 15 నిమిషాలు ఒక్కదాన్ని స్ట్రక్ అయ్యాను. అపుడు నాకు విపరీతంగా చెమటలు పట్టి, గుండె ఆగిపోతుందేమో అన్నంత వేగంగా కొట్టుకుని, ఒళ్ళంతా చల్లబడి, ఊపిరి ఆడనంత పరిస్థితి. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనేంత భయం వేసింది. ఇది జరిగి ఒక సంవత్సరం అయినప్పటికీ, దీని తర్వాత నేను లిఫ్ట్ ఎక్కడం మానేసి మెట్లే ఎక్కడం కాకుండా, ఫ్లైట్ ట్రావెల్ని కూడా అవాయిడ్ చేస్తున్నాను. మరల అలాంటి ఎటాక్ వస్తుందేమో అన్న భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంది. అనేక సార్లు వచ్చిన ప్రమోషన్ అవకాశాన్ని కూడా ఈ ట్రావెల్ ఫోబియా వల్ల వదులుకున్నాను. నాకు సహాయం చేయండి. – నందిని, కాకినాడనందినీగారూ! మీకున్న ఈ సమస్యను ప్యానిక్ ఎటాక్ అంటారు. ఇటువంటి సమస్య తరచూ వస్తున్నా లేదా వస్తాయనే భయంతో మీరు లిఫ్ట్, ఫ్లైట్ వంటివి అవాయిడ్ చేస్తుండటాన్ని ప్యానిక్ డిజార్డర్ అంటారు. ఇది చాలా సాధారణ మానసిక కండిషన్. కొంతమంది బాగా జనం ఉన్న ప్రదేశాలలో మరికొంత మంది తలుపులు అన్ని మూసేసిన గదిలో ఉన్నా ఇలా అనేక సందర్భాల్లో ప్యానిక్ అటాక్ రావచ్చు. వీటిని నిర్లక్ష్యం చేసినట్లయితే అకారణంగా కూడా ఈ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ప్యానిక్ అటాక్ని ట్రీట్ చేయడానికి ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’ ‘మైండ్ఫుల్నెస్ ట్రెయినింగ్’ ‘రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్’తో పాటు కొన్ని రకాల మంచి మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. మీ జీవితంలో ఇబ్బంది వల్ల మీరు ఎంతో కోల్పోతున్నట్లు తెలుస్తుంది. కనుక మీరు తొందరలో మంచి మానసిక వైద్యుణ్ణి కలిసి దీని నుండి విముక్తి పొందాలని, మీ పూర్తి సామర్థ్యాన్ని తిరిగి సాధించాలని ఆశిస్తున్నాను. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!) -
Health: సందేహం.. రోగ భయం!
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.ఫలానా చోట సెలూన్కు వెళ్లి గుండు/సేవింగ్ చేయించుకుంటే దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.కోవిడ్ తర్వాత మరింత అధికం..ప్రజల జీవనశైలి కోవిడ్కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్నెట్లో శోధించి, సోషల్ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్ఫుడ్లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు. వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్ డిజార్డర్ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.కర్నూలు నగరం గాం«దీనగర్కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.కర్నూలులోని నంద్యాల చెక్పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు...వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్గా పేర్కొంటారు.హైపోకాండ్రియాసిస్ బాధితుల సంఖ్య పెరిగింది..ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్ మందులతో పాటు కౌన్సెలింగ్ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్ ఎస్. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికోవిడ్ అనంతరం ఆందోళన పెరిగింది..కోవిడ్ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్ ఫిజీషియన్, కర్నూలుఅతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్ అయితే మరో మూడేళ్లు, సూపర్ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్లు, సోషల్ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్ మీడియాలో మరింత అధికమయ్యాయి.ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..! -
Devotion: పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా?
పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్లితే దోషమా? – డి. వరలక్ష్మి, హైదరాబాద్– కావాలని కుళ్లిన కొబ్బరికాయని మనం తేలేదు కాబట్టి భయపడనక్కర్లేదు. మరో కొబ్బరికాయని తేగల అవకాశం అప్పుడుంటే సరే సరి. మరోసారి పూజకి కూర్చున్నప్పుడు ఈ కొబ్బరికాయకి బదులుగా మరో కొబ్బరికాయని కొడితే సరి. పూజ లోపానికీ కొబ్బరికాయ కుళ్లడానికీ సంబంధం లేదు.రాహుకాల దీపం గురించి చెప్పగలరు.. – అప్పారావు, సాలూరు– జాతకంలో రాహుదోషం ఉన్న పక్షంలో ప్రతిదినం వచ్చే రాహుకాలంలో రాహుగ్రహ స్తోత్రాన్ని చదువుతూ దీపాన్ని వెలిగించి 18 గుణకాలలో (36, 54, 72, 90...) ఇలా ఆ స్తోత్రాన్ని రాహుకాలం ఉండే 90 నిమిషాలసేపూ పారాయణం చెయ్యాలి.గృహంలో వాస్తుదోష పరిహారానికి ఏం చెయ్యాలి? – ఆర్. కౌసల్య, చిల్కమర్రి– వాస్తు దోష పరిహారం కోసం గృహప్రవేశం రోజున ‘వాస్తుహోమ’మంటూ ఒకదాన్ని చేస్తారు. దోషం తప్పనిసరిగా ఉన్న పక్షంలో మత్స్యయంత్రం, కూర్మయంత్రం వేస్తారు. ఏది వేసినా ఇంట్లో నిత్యపూజ జరిగితే దోషం ఏమీ చెయ్యదు. ఇది అనుభవపూర్వకంగా పెద్దలు నిరూపించిన సత్యం.ప్రయాణంలో చెప్పులు వేసుకుని స్తోత్రాలు చదివాను. దోషమా? – పార్వతి, హైదరాబాద్– ఇంట్లో దైవమందిరం ముందు ఆచారం తప్పనిసరి. పత్తనే పాదమాచారమ్ (బయటకు వెళ్లాక ఆచారం నాలుగవ వంతే ఆచరించ సాధ్యమౌతుంది) అన్నారు. ఇల్లు దాటాక కూడా చదువుకునేందుకే పుట్టినవి స్తోత్రాలు. ఇంట్లో, గుడిలో తప్ప మరోచోట నియమాలు లేవు.మరణానంతరం నా శరీరాన్ని ఉచితంగా వైద్య కళాశాలకి ఈయదలిచాను. పిల్లలు అంగీకరించడం లేదు..? – ఒక పాఠకురాలు, హైదరాబాద్– మీరు జీవించినంతసేపే మీ శరీరం మీద మీకు హక్కు. మీ పిమ్మట ఆస్తిపాస్తులతోపాటు పార్థివ శరీరమ్మీద అధికారం కూడా పిల్లలకే ఉంటుంది. వాళ్లు అంగీకరించనప్పుడు ఇవ్వడం భావ్యం కాదు. చివరి కాలంలో పిల్లలతో విరోధించడమూ సరికాదు.60 సంవత్సరాలు నిండినా నేను, నా భార్య ప్రతి విషయంలోనూ తూర్పుపడమరలుగానే ఉన్నాం. లలితానామాలతో సయోధ్య కుదురుతుందా? – శ్రీనివాస్, విజయనగరం– ఆలుమగలకు బాధ్యతలు తీరాక పరస్పర నిర్లక్ష్య భావం వస్తుంది. ఎదుటివారు తమను అగౌరవ పరుస్తున్నారనే అభి్రపాయం పెరుగుతుంది. గతాన్ని తవ్వుకుంటూ తప్పుల్ని ఎత్తి చూపించుకోవడాన్ని మానితే, సయోధ్య పెరుగుతుంది. లలితాంబ ఇందులో ఏమీ చేయలేదు.ఇవి చదవండి: సకుటుంబ సమేత.. త్రినేత్ర గణపతి! -
పెట్టుబడులను ఎప్పుడు మార్చుకోవాలి?
మ్యూచువల్ ఫండ్స్ పథకాల మధ్య పెట్టుబడులను ఎటువంటి సందర్భాల్లో మార్చుకోవాలి? – సుఖ్దేవ్ భాటియా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలను రెండు రకాల కారణాల వల్ల మార్చాల్సి రావచ్చు. మొదట మీ లక్ష్యాల్లో మార్పులు చోటు చేసుకున్నప్పుడు పెట్టుబడులను వాటికి అనుగుణంగా సవరించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలను చేరుకున్నప్పుడు కూడా ఈ అవసరం ఏర్పడుతుంది. ఉదాహరణకు మీరు రిటైర్మెంట్ లేదా పిల్లల ఉన్నతవిద్య కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే.. నిర్ణీత కాలవ్యవధికి ముందే మీకు కావాల్సిన మొత్తం సమకూరితే ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏదైనా ఒక పథకంలో కొన్ని కారణాలను చూసి ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. అవన్నీ మారిపోయినట్టయితే పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ మారిపోవడం పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి సరైన కారణం కాబోదు. గతంలో మంచి రాబడులను ఇచ్చిన పథకం కొత్త ఫండ్ మేనేజర్ నిర్వహణలో అంత మంచి పనితీరు చూపించకపోతే అప్పుడు వేరే పథకానికి మారిపోయే ఆలోచన చేయవచ్చు. అలాగే, నిలకడగా మంచి రాబడులను ఇస్తుందన్న కారణంతో ఒక పథకంలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత.. మీరు ఆశించిన విధంగా పనితీరు లేకపోయినా దాని నుంచి తప్పుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా? – శ్రవణ్ ఈక్విటీలు అంతర్గతంగా ఆటుపోట్లతో ఉంటాయి. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. కాకపోతే ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోవడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమల్లో పెట్టాలి. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యలకు రక్షణ కలి్పంచుకోవాలి. అత్యవసర సందర్భాల్లో మార్కెట్లలో చేసిన పెట్టుబడులపై ఆధారపడకూడదు. ఇందుకోసం అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల కాలం వరకు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ విధమైన చర్యలు అమలు చేయాలి. అలాగే, క్రమం తప్పకుండా మార్కెట్లలో సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల పరిస్థితుల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో దిద్దుబాట్లు మంచి పెట్టుబడుల అవకాశాలు అవుతాయి. తక్కువ రేట్లకే కొనుగోళ్లు చేసుకోవచ్చు. ప్రతికూల సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను సమకూర్చుకోవచ్చు. మార్కెట్లలో దిద్దుబాట్లకు భయయపడి, మరింత పడిపోతాయేమోనన్న ఆందోళనతో పెట్టుబడి పెట్టకుండా ఉంటే, మంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఆ సమయంలో తప్పకుండా సిప్ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
'అమ్మవారి మాల' తీసి మరీ.. భార్యను కిరాతకంగా..
గుంటూరు: భార్యపై అనుమానం పెంచుకుని ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఓ భర్త ఉదంతం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, సీఐ రాంబాబు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు చెందిన రమావత్ బోడియ్యనాయక్, భుక్యా సుజాత(28) దంపతులు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల క్రితం వీరు గుంటూరు నగర శివారుల్లోని చౌడవరం పరిధిలోని చండ్రరాజేశ్వరరావు నగర్కు వలస వచ్చారు. ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. బోడయ్య ఆటోడ్రైవర్గా పనిచేస్తుండగా, సుజాత మిర్చియార్డులో కూలి పనులు చేస్తుండేది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భార్యపై అనుమానంతో బోడయ్య ఆమెను ఎప్పుడూ కొడుతూ ఉండేవాడు. నెల రోజుల క్రితం బోడయ్య అమ్మవారి మాల ధరించాడు. సుజాతపై మరింత అనుమానం పెంచుకున్న బోడయ్య మంగళవారం మళ్లీ ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో రాత్రి సమయంలో బోడయ్య తాను ధరించిన మాలను తీసి ఇంటికి వచ్చాడు. ఫలితంగా భార్యాభర్తల మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన బోడయ్య సుజాత మెడకు చున్నీ చుట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం బంధువులకు ఫోన్ చేసి తన భార్యను హత్య చేసినట్లు చెప్పి ఆటోతో సహా పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహానికి జీజీహెచ్లో పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇవి కూడా చదవండి: మనస్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణయం! -
అనుమానం అనేది వ్యాధా? నయం చేయలేమా?
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. (చదవడం: ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు. ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్షిప్ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది ∙ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. (చదవండి: చిన్నారుల్లో బ్రాంకియోలైటిస్ వస్తే...? ముఖ్యంగా అలాంటి పిల్లలు..) -
వీడియోకాన్పై ఆడిట్ సందేహాలు
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది. కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది. దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది. -
దాడికి కుట్ర చేసిందెవరు ?..సందేహాస్పదంగా ఎన్ఐఏ అఫిడవిట్
-
అనుమానిస్తున్నారని వేరేలా చూడకండి.. అది కూడా ఓ లాంటి జబ్బే..!
డాక్టర్ మాధవ్ యూనివర్సిటీలో మాథ్స్ ప్రొఫెసర్. ఇల్లు, కాలేజీ, లైబ్రరీ తప్ప మరో లోకం తెలియదు. ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తన భార్యను నిరంతరం అనుమానిస్తుంటాడు. ఆమె మొబైల్ ఫోన్, మెయిల్స్, వాట్సప్ చాట్స్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటాడు. దాంతో ఇంట్లో రోజూ గొడవలే. ఇరువైపుల పెద్దలు సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. అతను తన ప్రవర్తనను మార్చుకోవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. దాంతో మాధవ్ భార్య విడాకులు కోరుకుంటోంది. యూనివర్సిటీలో మాధవ్ టాలెంట్పై అందరికీ అపారమైన గౌరవం. క్లాస్ మొదలుపెట్టాడంటే స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూడకుండా వింటారు. తన ఆధ్వర్యంలో పదిమంది పీహెచ్డీ అందుకున్నారు. ప్రస్తుతం రెండు ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పదిమంది రీసెర్చ్ స్కాలర్స్తో పనిచేయిస్తున్నాడు. కానీ అతనితో పనిచేయడమంటే నరకమని అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే అతను ఎవ్వరినీ నమ్మడు. రీసెర్చ్ పేపర్స్ తీసుకెళ్తారేమోనని నిత్యం అనుమానిస్తుంటాడు. ఆయన ఎవ్వరితో కలవడని, రీసెర్చ్ స్కాలర్స్నే కాదు సహోద్యోగులను కూడా ఏ మాత్రం నమ్మడని చెప్పారు. అందరినీ అనుమానించే మాధవ్ తన కారు డ్రైవర్ను మాత్రం గుడ్డిగా నమ్మేస్తాడు. అదెందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు. వ్యక్తిత్వంలోనూ రుగ్మతలుంటాయి ప్రొఫెసర్ మాధవ్ లాంటి వ్యక్తులు జీవితంలో ఎదురైనప్పుడు ‘అనుమానపు పక్షి’ అని ముద్ర వేసి అందరూ తప్పుకుంటారు. కానీ అలా అనుమానించడం కూడా ఒక మానసిక రుగ్మతేనని, దానికి చికిత్స ఉందని గుర్తించరు. మాధవ్కు ఉన్న సమస్యను పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ (పీపీడీ) అంటారు. అయితే ఇది డిప్రెషన్, యాంగ్జయిటీ లాంటి మానసిక రుగ్మత కాదు, వ్యక్తిత్వ రుగ్మత. అంటే అనుమానించడం అతని మనస్తత్వంలో భాగంగా ఉంటుంది. అందువల్లనే దీన్ని గుర్తించడం కష్టం. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు, ఎదురైన అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, స్నేహాలు వ్యక్తిత్వ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో కొందరికి ఎదురైన అనుభవాలు వారి వ్యక్తిత్వంలో లోపాలు తీసుకొస్తాయి. ఆ వ్యక్తిత్వ లోపాలు తీవ్రమైనప్పుడు వ్యక్తిత్వ రుగ్మతలుగా మారతాయి. అలాంటి వ్యక్తిత్వ రుగ్మతలు పది రకాలున్నట్లు గుర్తించారు. అందులో పీపీడీ ఒకటి. అందరినీ అనుమానించడం దీని ప్రధాన లక్షణం. బాల్యంలో ఏర్పడిన గాయాలే కారణం పీపీడీ ఎందుకు వస్తుందనేది తెలియదు. ఆనువంశింకంగా వచ్చే జీన్స్తో పాటు, పుట్టి పెరిగిన పరిసరాలు ఇందుకు కారణమవుతాయని గుర్తించారు. ముఖ్యంగా బాల్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం, నిరంతరం అనుమానించడం లేదా శారీరక, లైంగిక వేధింపులకు గురవ్వడం, తన భావోద్వేగాలను ఎవ్వరూ పట్టించుకోకపోవడం, ఒంటరిగా ఉండాల్సి రావడం, సోషల్ యాంగ్జయిటీ, హైపర్ సెన్సిటివిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఇలా బాల్యంలో ఎదురైన అనుభవాలు, ఏర్పరచిన గాయాలు మనస్తత్వంలో లోపాలుగా మారి 18 ఏళ్ల వయస్సు తర్వాత వ్యక్తిత్వ రుగ్మతలుగా బయటపడతాయి. దాదాపు 0.5 నుంచి 4.5 శాతం మందిలో ఈ రుగ్మత ఉంటుంది. స్కిజోఫ్రీనియా లేదా డెల్యూజనల్ డిజార్డర్ ఉన్నవారి బంధువుల్లో పీపీడీ కనిపిస్తుందని ఆధారాలున్నాయి. పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు.. అందరూ తనకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తుంటారని భావించడం, అందరినీ అనుమానించడం ఎవ్వరినీ తేలిగ్గా నమ్మరు. స్నేహితులు, సహచరులు, భాగస్వామి... ప్రతివారినీ అనుమానంగా చూస్తారు ఎలాంటి ఆధారాలు లేకుండానే, జీవిత భాగస్వామి నమ్మకద్రోహం చేస్తున్నారని అనుమానిస్తుంటారు వారి అనుమానాస్పద ధోరణిని సమర్థించుకునేందుకు ఆధారాలను వెతుకుతూ ఉంటారు ఈ తరహా వ్యక్తిత్వం ఉన్నవారు రిలేషన్షిప్ను సరిగా నెరపలేరు ఏదైనా అంశంలో ఫెయిల్ అయినప్పుడు చాలా సెన్సెటివ్గా ఫీలవుతూ తాము అవమానానికి గురైనట్లు భావిస్తుంటారు. తీవ్రంగా పగబడతారు తాను ఏదైనా చెప్తే తనకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారనే భయంతో ఇతరులతో సమాచారం పంచుకోవడాన్ని ఇష్టపడరు విశ్రాంతి తీసుకోవడం కష్టంగా ఉంటుంది ∙ శత్రుత్వం, మొండితనం, వాగ్వివాదం కలిగి ఉంటారు ∙కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకోవాలి ∙పీపీడీని నిరోధించడం సాధ్యం కానప్పటికీ, దాన్ని గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా ఆలోచనలను నియంత్రించుకుని సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు పీపీడీ ఉన్నవారు సాధారణంగా చికిత్సకు అంగీకరించరు. కాబట్టి కుటుంబసభ్యులే ఒప్పించి చికిత్స ఇప్పించాల్సి ఉంటుంది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ లేదా డయలెక్టిక్ బిహేవియర్ థెరపీ వంటివి కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ను పెంచుకోవడానికి సహాయపడతాయి సైకోథెరపీ ద్వారా ఇతరులను అర్థం చేసుకోవడం, నమ్మకం పెంచుకోవడం, సరైన సంబంధాలను పెంచుకోవడం సాధ్యమవుతుంది పీపీడీకి దీర్ఘకాలిక చికిత్స అవసరం ఉంటుంది. అదంతా ఫీజు కోసమేనని థెరపిస్ట్ ఉద్దేశాలను కూడా అనుమానించే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులే బాధ్యత తీసుకుని థెరపీకి తీసుకురావాల్సి ఉంటుంది. -సైకాలజిస్ట్ విశేష్ -
వాట్సాప్ కాల్ చేయమంది, అంతలోనే..
పనాజీ/ఛండీగఢ్: బీజేపీ నేత, సోషల్ మీడియా సెలబ్రిటీ సోనాలి ఫోగట్ మరణంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 42 ఏళ్ల సోనాలి ఫోగట్ గోవా టూర్లో ఉండగా గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అయితే.. చనిపోవడానికి ముందు అక్కడి పరిస్థితులపై ఫోన్ కాల్ ద్వారా సోనాలి అనుమానాలు వ్యక్తం చేసిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గోవా పోలీసులు మాత్రం పూర్తిస్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రానందునా అసహజ మరణం కిందే కేసు బుక్ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి గోవాలో ఆస్పత్రికి తీసుకెళ్లే టైంకి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే గుండెపోటుతో ఆమె మరణించిందన్న కోణంపై ఆమె కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఆమెకు ఎలాంటి అనారోగ్యం లేదని, ఎలాంటి మందులు వాడడం లేదని సోనాలి ఫోగట్ సోదరి రమణ్ చెబుతోంది. మీడియాతో.. సోనాలి సోదరి రమణ్ ‘‘గుండెపోటుతో సోనాలి ఫోగట్ మరణించారనడం నమ్మశక్యంగా లేదు. మా కుటుంబం ఈ వాదనను అంగీకరించదు. ఆమె ఫిట్గా ఉండేది. ఎలాంటి జబ్బులు లేవు. మందులు కూడా వాడడం లేదు. చనిపోవడానికి ముందు ఆమె నాకు ఫోన్ చేసింది. మా అమ్మతోనూ మాట్లాడింది. భోజనం చేశాక.. ఏదోలా ఉందని చెప్పింది. అక్కడేదో జరుగుతోందని, అనుమానాస్పదంగా ఉందని, నార్మల్ కాల్ కాకుండా.. వాట్సాప్ కాల్లో మాట్లాడదాం అని చెప్పింది. కానీ, మళ్లీ కాల్ చేయలేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. ఉదయానికి ఆమె మరణించిందని తోటి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మాకు అనుమానాలు ఉన్నాయి. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని హర్యానా, గోవా ప్రభుత్వాలను ఆమె డిమాండ్ చేశారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్, ఆప్ నేతలతో ఆమె ఫోన్లో మాట్లాడారు. అయితే గోవా పోలీస్ చీఫ్ జస్పాల్ సింగ్ మాత్రం ఈ మరణంలో ఎలాంటి అనుమానాలు తమకు కలగడం లేదని, పోస్ట్మార్టం నివేదికే విషయాన్ని నిర్ధారిస్తుందని అంటున్నారు. అంతేకాదు.. ఆమె పోస్ట్మార్టంను వీడియోగ్రఫీ చేయాలని గోవా పోలీసులు భావిస్తున్నారు. 2016లో సోనాలి భర్త సంజయ్ ఫోగట్ అనుమానాస్పద రీతిలోనే ఓ ఫామ్హౌజ్లో మృతి చెందగా.. ఆ మిస్టరీ ఈనాటికీ వీడలేదు. చనిపోయే ముందు కొన్నిగంటల వ్యవధిలో ఆమె హుషారుగా ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు, వీడియోలు సైతం పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Sonaliiphogat (@sonali_phogat_official) హర్యానా టీవీ సెలబ్రిటీ అయిన సోనాలి ఫోగట్ బీజేపీలో చేరిన తర్వాత కూడా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిష్ణోయ్ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అయితే బిష్ణోయ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఇటీవలె బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నికలో సోనాలి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇదీ చదవండి: చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం -
అనుమానం పెనుభూతమై! భార్య పై పాశవిక దాడి
కళ్యాణదుర్గం: అనుమానం పెనుభూతమైంది. పదకొండేళ్లుగా ఎలాంటి కలహాలు లేని కాపురంలో చిచ్చు రేపింది. చివరకు ఇల్లాలిని బలిగొంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం మల్లికార్జునపల్లికి చెందిన నాగార్జున, సరస్వతి(32) దంపతులు. 11 ఏళ్ల క్రితం వివాహమైన వీరికి 8 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కుటుంబం సాఫీగా సాగిపోతున్న తరుణంలో భార్య ప్రవర్తనపై నాగార్జునకు అనుమానం మొదలైంది. రోజులు గడిచే కొద్దీ నాగార్జున ఆలోచనలు మారుతూ వచ్చాయి. ఎలాగైనా భార్యను హతమార్చాలని నిర్ణయించుకుని... ఆదివారం రాత్రి గాఢ నిద్రలో ఉన్న సరస్వతి తలపై గుండ్రాయి వేసేందుకు ప్రయతి్నంచాడు. ఆ సమయంలో పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే సరస్వతి తలపై గుండ్రాయి వేసి, నాగార్జున పారిపోయాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సరస్వతిని కుటుంబసభ్యులు వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐ తేజమూర్తి ఆస్పత్రికి చేరుకుని సరస్వతిని పరిశీలించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నాగార్జున కోసం గాలింపు చేపట్టారు. భర్తపై హత్యాయత్నం ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తపై భార్య హత్యాయత్నం చేసింది. సీఐ తేజమూర్తి తెలిపిన మేరకు... కళ్యాణదుర్గం మండలం మల్లాపురానికి చెందిన శివయ్య అలియాస్ శివారెడ్డి, మమత దంపతులు. అదే గ్రామానికి చెందిన కర్రెన్నతో కొంత కాలంగా మమత వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయంగా భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు సిద్ధమైంది. ఆదివారం రాత్రి నిద్రిస్తున్న భర్త గొంతు కత్తితో కోసేందుకు సిద్ధం కాగా, అదే సమయంలో శివయ్య నిద్రలేచాడు. దీంతో ఇద్దరూ పారిపోయారు. శివయ్య గొంతుపై చిన్న గాటు పడడంతో ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై శివయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. (చదవండి: కల్తీ మద్యం తాగి 18 మంది కూలీలు మృతి) -
ధీమాగా బీమా ఇలా..!
ఆరోగ్య బీమా అవసరాన్ని గతంతో పోలిస్తే నేడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. డిజిటల్ వేదికలు విస్తృతం కావడం, స్మార్ట్ఫోన్ల వినియోగం ఊపందుకోవడం హెల్త్ ఇన్సూరెన్స్పై అవగాహన పెరగడానికి సాయపడుతున్నాయి. కరోనా మహమ్మారి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాన్ని తెలిసేలా చేసింది. కానీ, ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో చాలా మందికి రకరకాల సందేహాలున్నాయి. బీమా పాలసీని తీసుకునేందుకు ఇవి అడ్డుపడొచ్చు. అలాగే, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ పనిచేసే విధానం, క్లెయిమ్కు సంబంధించి కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. వీటిని తొలగించుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకునేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారు. ఇలాంటి కొన్ని అపోహలు, వాటికి సంబంధించి వాస్తవాలను నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ ప్రొడక్ట్స్, క్లెయిమ్స్ డైరెక్టర్ బబతోష్ మిశ్రా వెల్లడించారు. ఆస్పత్రిలో చేరి కనీసం 24 గంటల పాటు చికిత్స తీసుకుంటేనే బీమా క్లెయిమ్కు అర్హత లభిస్తుందన్నది అపోహే. కానీ వాస్తవం వేరు. ఆధునిక పరిశోధన ఆధారిత ఔషధాలు, అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి రావడంతో చాలా చికిత్సలకు నేడు 24 గంటల పాటు ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఏర్పడడం లేదు. వీటిని డే కేర్ ట్రీట్మెంట్స్గా (రోజులో వచ్చి తీసుకుని వెళ్లే వీలున్నవి) చెబుతారు. కీమోథెరపీ, రేడియోథెరపీ, క్యాటరాక్ట్ ఆపరేషన్, కిడ్నీల్లో రాళ్లు తొలగించే సర్జరీ ఇలాంటివన్నీ డేకేర్ ట్రీట్మెంట్స్ కిందకు వస్తాయి. డేకేర్ ట్రీట్మెంట్స్లో చాలా వాటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో కవరేజీ లభిస్తోంది. కేన్సర్కు సంబంధించి ఓరల్ కీమోథెరపీకి అన్ని రకాల ఇండెమ్నిటీ హెల్త్ ప్లాన్లలో కవరేజీ ఉంటోంది. క్లెయిమ్ మొత్తం వస్తుందనుకోవద్దు నియంత్రణ సంస్థ అనుమతి మేరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు వేటికి చెల్లింపులు చేయవో తెలియజేస్తూ ఒక జాబితా నిర్వహిస్తుంటాయి. పీపీఈ కిట్, మాస్క్, బ్యాండేజ్, నెబ్యులైజర్ తదితర ఇలా చెల్లింపులు చేయని వాటి జాబితాను బీమా సంస్థలు పాలసీ వర్డింగ్స్లో ప్రత్యేకంగా పేర్కొంటాయి. అందుకుని ఆస్పత్రిలో అయ్యే బిల్లు మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయని అనుకోవద్దు. అయితే, వీటికి కూడా చెల్లింపులు చేసే రైడర్లను కొన్ని బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. రైడర్ను జోడించుకుని, కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా డిస్పోజబుల్స్కు సైతం క్లెయిమ్ తీసుకోవచ్చు. ఇక పాలసీల్లో మరికొన్ని ఇతర పరిమితులు కూడా ఉంటాయి. కోపేమెంట్, రూమ్రెంట్, డాక్టర్ కన్సల్టేషన్ చార్జీల పరంగా చెల్లింపుల పరిమితులు ఉంటాయి. అంటే వీటికి సంబంధించి బీమా సంస్థలు పాలసీ నియమ, నిబంధనల్లో పేర్కొన్న మేరకే చెల్లింపులు చేస్తుంటాయి. కనుక క్లెయిమ్ మొత్తం వస్తుందని అనుకోవద్దు. చెల్లింపుల్లో పరిమితులు ఉంటాయి. ఉదాహరణకు సింగిల్ రూమ్ అని పాలసీ డాక్యుమెంట్లో ఉంటే.. హాస్పిటల్లో సాధారణ సింగిల్ రూమ్లో చేరినప్పుడే చికిత్సకు అయ్యే వ్యయాలపై పూర్తి చెల్లింపులు పొందడానికి ఉంటుంది. డీలక్స్ రూమ్/సూట్లో చేరితే అది పరిమితికి మించినది అవుతుంది. దీంతో క్లెయిమ్లో కొంత మేర కోత పడుతుంది. దీన్నే రూమ్ రెంట్ క్యాప్ అని కూడా అంటారు. వీటిపై పాలసీదారులు ముందే తగిన అవగాహనతో ఉండాలి. అందుకని కచ్చితంగా పాలసీ డాక్యుమెంట్ను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. లేదంటే బీమా సంస్థ కస్టమర్ కేర్ లేదా ఏజెంట్ను సంప్రదించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ అన్నది పేషెంట్ కోలుకున్న తర్వాత నిర్ణీత కాలం పాటు అతనికి బీమా సంస్థ కొత్త పాలసీని ఆఫర్ చేయకపోవడం. కానీ, దీన్ని బీమా సంస్థలు కచ్చితంగా ఎత్తివేయాలని పాలసీదారులు భావిస్తుంటారు. అంతేకాదు, బీమా సంస్థలు ఆరోగ్యవంతులు, ఆస్పత్రి అవసరం ఏర్పడని వారికే పాలసీని ఆఫర్ చేస్తాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ వెనుక ఉన్న తార్కికత ఏమిటంటే.. ఒక ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకున్న తర్వాత ఏవైనా కొత్త సమస్యలు ఏర్పడతాయేమో అంచనా వేసేందుకు కావాల్సిన సమయంగా అర్థం చేసుకోవాలి. కరోనా చికిత్స లేదా సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పాలసీదారులు మరింత కవరేజీకి అర్హత సాధిస్తారు. వీటిని ముందస్తు నుంచి ఉన్న సమస్యలుగా బీమా సంస్థలు పరిగణించవు. అలాగే క్లెయిమ్ సమయంలో అస్పష్టతను కూడా తగ్గిస్తుంది. ఎక్కడైనా క్యాష్లెస్ బీమా క్లెయిమ్ ప్రక్రియను మరింత సులభతరం, పారదర్శకం, సౌకర్యంగా మార్చడంపై బీమా సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. క్లెయిమ్ను క్యాష్లెస్ (పాలసీదారు చెల్లించాల్సిన అవసరం లేకుండా) లేదా రీయింబర్స్మెంట్ విధానంలో దాఖలు చేసుకోవచ్చు. కానీ, నగదు రహిత చికిత్స సేవలు పొందాలంటే మీరు చేరే హాస్పిటల్.. బీమా సంస్థ క్యాష్లెస్ హాస్పిటల్ నెట్వర్క్లో భాగమై ఉండాలి. ఇలా కాకుండా పాలసీదారు చికిత్స తీసుకుని అందుకు సంబంధించిన మొత్తం వారే చెల్లించి తర్వాత బీమా సంస్థ వద్ద క్లెయిమ్ దాఖలు చేసుకోవచ్చు. ఇందుకోసం అన్ని రకాల పత్రాలను సమర్పించాలి. అప్పుడే బీమా సంస్థ క్లెయిమ్ను ప్రాసెస్ చేయగలదు. క్యాష్లెస్ అన్నది సౌకర్యమైనది. దీనివల్ల ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చికిత్సకు అయ్యే వ్యయాలను పాలసీదారు సొంతంగా సమకూర్చుకునే ఇబ్బంది తప్పుతుంది. పైగా డిశ్చార్జ్ ప్రక్రియ క్యాష్లెస్ విధానంలో సులభంగా పూర్తవుతుంది. బీమా వ్యాపారం అన్నది ప్రజల నిధులతో కూడుకున్నదని అర్థం చేసుకోవాలి. ప్రజల డిపాజిట్లకు సంరక్షకుడిగా బీమా సంస్థ అన్ని రకాల నిజమైన క్లెయిమ్లను గౌరవించాల్సి ఉంటుంది. బీమా సంస్థలు పాలసీ డాక్యుమెంట్ను అర్థం చేసుకునేందుకు వీలుగా సులభ పరిభాషతో రూపొందిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ కొనుగోలుకు ముందు శ్రద్ధగా వీటిని చదవడం వల్ల.. క్లెయిమ్ల సమయంలో అనవసర తలనొప్పులను రాకుండా ముందే జాగ్రత్త పడొచ్చు. అధిక కవరేజీ కోసం హెల్త్ చెకప్ పాలసీ జారీ చేసే ముందు అన్ని బీమా సంస్థలూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరడం లేదు. పెద్ద వయసులో ఉన్నారని లేదా అధిక కవరేజీ కోరుతున్నారని వైద్య పరీక్షలు కచ్చితంగా చేయించుకోవాలనేమీ లేదు. ఉదాహరణకు ప్రముఖ హెల్త్ ప్లాన్లు అన్నింటికీ ముందస్తు వైద్య పరీక్షలు అవసరం లేదు. కొన్ని ప్రత్యేక కేసుల్లోనే నిర్ధేశిత వైద్య పరీక్షలను బీమా సంస్థలు కోరుతుంటాయి. దరఖాస్తుదారులకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే లేదా గతంలో ఏవైనా ఎదుర్కోని ఉంటే ప్రస్తుత ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరతాయి. ఇందుకు అయ్యే వ్యయాలను బీమా సంస్థలు పూర్తిగా భరిస్తుంటాయి. -
Agnipath Scheme: అనుమానాలు, వివరణలు
అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... ► 17.5 నుంచి 21 ఏళ్ల వారిని సైన్యంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 75% మందిని వెనక్కు పంపుతారు. పెన్షనూ ఉండదు. అప్పుడు భవిష్యత్ అగమ్యగోచరం కాదా? అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రిటైరయేప్పుడు సేవానిధి ప్యాకేజీ కింద ఆదాయ పన్ను మినహాయింపుతో రూ.11.71 లక్షలిస్తారు. దానికి తోడు వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. పన్నెండో తరగతితో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. సైన్యంలో అనుభవంతో తేలిగ్గా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. పైగా రక్షణ శాఖ నియామకాలతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ నియామకాల్లోనూ వారికి 10 శాతం కోటా ఉంటుంది. పలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ ప్రాధాన్యముంటుంది. ► కేవలం నాలుగేళ్ల సర్వీస్ కోసం ఎవరైనా ఎందుకు అంతగా కష్టపడతారు? అగ్నిపథ్ ఒక అవకాశాల నిధి. దేశంలో 14 లక్షల మంది సైనికులున్నారు. వీరిలో ఏటా 60 వేల మంది రిటైరవుతారు. అగ్నిపథ్లో భాగంగా ఖాళీల కంటే 75 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. అంటే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఆర్మీ శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవితాన్ని నచ్చినట్టుగా మలచుకునే అవకాశముంటుంది. ► నాలుగేళ్లకే ఉద్యోగం కోల్పోతే యువత అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదముంది. ఒక్కసారి యూనిఫాం ధరిస్తే అలా ఎప్పటికీ మారరు. నియమబద్ధమైన జీవితం గడుపుతారు. ► రిటైర్డ్ సైనికాధికారులు తదితరులతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. వారితో రెండేళ్లు విస్తృతంగా సంప్రదింపులు జరిపాకే తీసుకువచ్చాం. దీనితో ఎన్నో లాభాలంటూ మాజీ అధికారులు స్వాగతించారు. ► బలగాల సామర్థ్యాన్ని పథకం దెబ్బ తీస్తుంది. స్వల్పకాలిక సర్వీసు కోసం సైన్యంలో నియామకాలు చేపడుతున్న దేశాలెన్నో ఉన్నాయి. భారత్ కూడా అలాగే ముందుకెళ్లాలి. ప్రతి 100 మందిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పర్మనెంట్ అవుతారు. వారు దేశ రక్షణకు కోటగోడలా మారతారు. ► 21 ఏళ్ల వయసులో మానసిక పరిపక్వత ఉండదు. నమ్మకంగా పని చేయలేరు. ఎన్నో దేశాలు యువ రక్తాన్నే సైన్యంలోకి తీసుకుంటున్నాయి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు గనుక ఈ ఏడాదికి వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాం. యువత, అనుభవజ్ఞులు సగం సగం ఉండేలా చూస్తాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భర్త పోస్టులకు మరో మహిళ లైక్లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య..
గాంధీనగర్: సోషల్ మీడియా పుణ్యామా అని.. ప్రతి ఒక్కరు తాము చేస్తున్న ప్రతి పనిని... సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తున్నారు. వాటికి వచ్చే లైక్లు, కామెంట్లను చూసి మురిసిపోతున్నారు. ఒక్కొసారి లైక్లు, కామెంట్లు రాకపోతే కొంత మంది కుంగుబాటుకు గురైతే.. మరికొందరు తమ విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. కాగా, ఇలాంటి కోవకు చెందిన ఒక సంఘటన గుజరాత్లోని వడోదరలో చోటుచేసుకుంది. అక్టోబరు 22న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. వడోదరలోని సదరు దంపతులకు సోషల్ మీడియాలో వేర్వేరు అకౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. కొంతకాలంగా భర్త పోస్ట్లకు వేరే మహిళ లైక్లు చేయడాన్ని భార్య గమనించింది. దీంతో భర్త ఖాతాపై ఒక కన్నేసి ఉంచింది. భర్త.. ఏ పోస్టు చేసిన వెంటనే ఆ మహిళ లైక్లు కొట్టడం చేయసాగింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య... తన భర్త ఫోన్లను లాక్కుని కిందపడేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. భర్త.. ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా కొట్టాడు. ఈ క్రమంలో ఆమె అభయం అనే పోలీసు హెల్ప్లైన్కు ఫోన్ చేసి భర్తపై ఫిర్యాదు చేసింది. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ దంపతులిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి కట్టుకున్న భార్యపై చేయిచేసుకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని కౌన్సిలింగ్ నిర్వాహకులు బాధిత మహిళ భర్తను హెచ్చరించారు. చదవండి: వ్యభిచారానికి ఒప్పుకోలేదని సొంత చెల్లిని హతమార్చిన అక్క -
మంత్రగాడనే అనుమానంతో గిరిజన వృద్ధుడిని..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం): మంత్రగాడనే అనుమానంతో ఓ గిరిజన వృద్ధుడిని హత్య చేసి గోదావరిలో పూడ్చిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, మంగళవారం పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం కే మారేడుబాకలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. కే మారేడుబాక గ్రామానికి చెందిన కుంజా భీమయ్య(65) మే 12 నుంచి కనిపించడం లేదు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు 13న దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మారేడుబాక గ్రామానికి చెందిన తెల్లం శ్రీను, కుంజా లక్ష్మీనారాయణ, తెల్లం రాజారావు అలియాస్ రాజ్కుమార్, మిడియం శ్రీను అనే నలుగురు స్టేషన్కు వచ్చి నేరం ఒప్పుకున్నారు. భీమయ్య మంత్రాలు, చేతబడులు చేస్తుంటాడని.. తెల్లం శ్రీను భార్యకు నాలుక మీద పుండ్లు అయ్యాయని, లక్ష్మీనారాయణ పెద్ద కొడుకు రెండు నెలల క్రితం డెంగీ జ్వరంతో చనిపోయాడని, రాజ్కుమార్ తల్లికి చాలా రోజుల నుంచి కాళ్లు, చేతుల వాపులు ఉన్నాయని, మిడియం శ్రీను తండ్రి ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడని.. వీటన్నింటికీ భీమయ్య కారణమనే కోపంతో మే 12వ తేదీ అర్ధరాత్రి ఉరి వేసి చంపామని తెలిపారు. మృతదేహాన్ని నర్సాపురం గ్రామ శివారులో గల గోదావరి ఒడ్డున పూడ్చిపెట్టామని సీఐకి వివరించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకొని గోదావరి ఒడ్డుకు వెళ్లి తహసీల్దార్ రవికుమార్ సమక్షంలో శవాన్ని బయటకు తీశారు. కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేనంతగా ఉండటంతో వెంటనే పంచనామా నిర్వహించి పోస్టుమార్టం జరిపి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
ఆక్సిజన్ అవసరంపై అనుమానాలు.. సమాధానాలు ఇవిగో..
ప్రశ్న: కోవిడ్ భయంతో చాలామంది ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఉంచుకుంటున్నారు.. ఇది కరెక్టేనా? ఈ విషయంలో అనవసర భయాలు ఎక్కువయ్యాయని వైద్యులంటున్నారు.. ఏమిటవి? జవాబు: వైరస్ సోకగానే భయపడకూడదు. ఏదో అయిపోతుందని చాలామంది భయపడుతున్నారు. అనవసరంగా భయపడటం వల్లనే ప్రాణాంతకంగా మారుతోంది. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తే శరీరంలోని లెవెల్స్ను పరిగణనలోకి తీసుకొని ఉపయోగించాలి. అంతేకానీ వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్సిజన్ పెట్టుకోవడం సరికాదు. మార్కెట్లో కొరత ఉందని ఆక్సిజన్ సిలిండర్లు ముందుగా కొనుగోలు చేసుకొని ఉంచుకోవడం సరికాదు. దీనివల్ల నిజంగా అవసరమైన వారికి దొరకక పోవచ్చు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల ఏమిటి ఉపయోగం? మనిషిని బోర్లా పడుకోబెట్టి మసాజ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ల ద్వారా ఆక్సిజన్ను శరీరంలోని అన్ని భాగాలకు పంపించే ప్రయత్నాన్ని ఆక్సిజన్ థెరపీ అంటారు. మనిషికి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఆయాసం రావడం, చెమటలు రావడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో యోగా, ఇతర ఎక్సర్సైజ్లు తెలిసినవారు కొన్ని జాగ్రత్తలతో ఆక్సిజన్ థెరపీ ఇస్తారు. దీనివల్ల ఎంతవరకు ఆక్సిజన్ సమకూరుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ ఆపద సమయంలో సొంత ప్రయోగాలు మానుకోవడం మంచిది. ఫస్ట్ వేవ్ లో కన్నా, సెకండ్ వేవ్లో ఆక్సిజన్ తగ్గుదల కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక్కరోజులోనే సీరియస్ అవుతోందని కూడా వినిపిస్తోంది.. నిజమేనా? సెకండ్ వేవ్లో వైరస్ జన్యుమార్పిడి వల్ల రూపాంతరం చెందింది. దీనివల్లే కావొచ్చు.. ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో రోగుల శరీరంలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోందనే మాట నిజం. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుండటంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఫస్ట్ వేవ్లో భయం ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం ఇంతగా కనిపించలేదు. హ్యాపీ హైపోక్సియా అంటే ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నట్టుగా తెలియదట.. నిజమేనా? కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పటికీ తెలియదు. శ్వాస తీసుకోవడంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో అంతా బాగానే ఉందనుకుంటారు. దీనినే హ్యాపీ హైపోక్సియా అంటారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. మిగతా వారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు శ్వాస సరిగా ఆడక పోవడం, దమ్ము రావడం, కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ తెలియక పోవడం వల్ల.. ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారొచ్చు. అయితే కేవలం 4% రోగుల్లో మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కర్పూరం, తదితరాలు కలిపి వాసన పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? కర్పూరం తదితరాలతో ఆక్సిజన్ మెరుగుపడుతుందనే అంశం ఇప్పటివరకు సైంటిఫిక్గా నిర్ధారణ కాలేదు. ప్రజలకు కోవిడ్పై సరైన అవగాహన లేకపోవడంతో భయపడుతున్నారు. ఈ సమయంలో ఎవరే చిన్న విషయం చెప్పినా నమ్ముతున్నారు. ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు. నిజానికి కోవిడ్ పాజిటివ్ బాధితులందరికీ ఆక్సిజన్ అవసరం లేదని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చెçబుతున్నారు. కానీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొందరు చెప్పడం లేదు. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఆక్సిజన్ పెట్టాలని, రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యుల కంటే ముందే రోగి బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందకుండాపోతోంది. అసలు ఎవరికి ఆక్సిజన్ అవసరం? ఏ స్థాయిలో అవసరం..? రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ను పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరిశీలిస్తాం. ఎస్పీఓ2 (ఆక్సిజన్) సాధారణంగా 95 నుంచి 100 మధ్య ఉండాలి. దీనిని ఆక్సిజన్ సాచురేషన్గా పిలుస్తాం. ఇది 95 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సిలిండర్ ద్వారా 1నుంచి 15 లీటర్ల ఆక్సిజన్ ఇవ్వొచ్చు. అంతకంటే ఎక్కువగా అవసరం ఉంటే పరికరాల ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. 15 లీటర్ల కన్నా ఎక్కువ అవసరముంటే నాజల్ క్యాన్లా అనే పరికరం ద్వారా ఇవ్వొచ్చు. దాదాపు 100 శాతం ఇవ్వొచ్చు. నెబులైజర్తో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంత? ఎంతమాత్రం వాస్తవం కాదు. నెబులైజర్ అనేది పూర్తిగా ఆస్తమా రోగులకు, అయాసంతో బాధపడే వారికి.. ఊపిరితిత్తుల్లో గొట్టాలు తెరుచుకోవడానికి, లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గడానికివాడే పరికరం. నెబులైజర్ శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉపయోగించే పరికరం. అంతేకానీ దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయనేది ఎక్కడా లేదు. అస్తమా రోగులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి? అస్తమా రోగులు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు సాధారణంగా వాడే మందులు క్రమం తప్పకుండా వాడుతూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ముందే కొని పెట్టుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగమే. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ నుంచి బయటపడిన రోగులకు ఆక్సిజన్ అవసరం ఉంటే ఈ పరికరం ఉపయోగపడుతుంది. సాధారణంగా 8 నుంచి 10 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఈ పరికరం సరిపోతుంది. అయితే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే ప్రెషర్ దీని ద్వారా రాదు. ఇది ఇంట్లో తప్పనిసరిగా ఆక్సిజన్ వాడాల్సిన వారికి మాత్రమే ఉపయోగకరం. న్యూమోనియా, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు మాత్రమే అవసరం. ఏదైనా వైద్యుల సలహా మేరకు ఉపయోగించాల్సి ఉంటుంది. అరచేయి మీద అక్యుప్రెషర్ చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి అంటున్నారు.. వాస్తవమేనా? అవాస్తవం. ఇది అపోహా మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ అనేవి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే తగ్గుతాయి. యోగ, ఫిజియోథెరపీ, శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా మాత్రమే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. Corona: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయా? ఈ టెక్నిక్ ఫాలో అవండి -
ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో తేడా ఏంటి ?
సాక్షి, హైదరాబాద్: ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్టులను పాయింట్ ఆఫ్ కేర్ అంటారు. అంటే వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకోవచ్చు. అదే ఆర్టీపీసీఆర్కు పెద్ద ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఉండాలి. ట్రూనాట్ అనేది ఒక చిప్ బేస్డ్ టెస్టింగ్. మన శరీరంలో ఎక్కువ జీన్లు ఉంటాయి. అయితే ఇది కొన్ని జీన్లను మాత్రమే కనుక్కుంటుంది. వీటిలో వైరస్ ఉందో లేదో మాత్రమే గుర్తిస్తుంది. తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది. అదే ఆర్టీపీసీఆర్లో ఎక్కువ జీన్లను గుర్తించే అవకాశం ఉంటుంది. కేసులు ఎక్కువవుతున్నాయి కాబట్టి, తక్కువ సమయంలో రిజల్ట్ వస్తుంది కాబట్టి, అలాగే ఎక్కడైనా టెస్టు చేసేందుకు అవకాశం ఉందన్న ఉద్దేశంతో ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులకు అనుమతి ఇచ్చారు. గొంతులో ద్రవం తీసి కిట్పై వేస్తే 10 నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది. ఇందులో పాజిటివ్ వస్తే తిరిగి ఆర్టీపీసీఆర్కు వెళ్లి నిర్ధారించుకోవచ్చు. ఆర్టీపీసీఆర్నే గోల్డెన్ స్టాండర్డ్ టెస్టుగా చెప్పుకోవాలి. -డాక్టర్ ఆవుల రేణుకాదేవి, ప్రొఫెసర్, మైక్రోబయాలజీ, కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజి కరోనా నిర్ధారణ అయిన వెంటనే డీడైమర్, హెచ్ఆర్సీ టెస్టులు చేసుకోవచ్చా? కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత 5–7 రోజుల మధ్య డీడైమర్, హెచ్ఆర్సీటీ థొరాక్స్ వంటి టెస్టులు చేయించుకోమని సలహా ఇస్తాం. వైరస్ ప్రభావంతో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. డీడైమర్ లెవల్స్ పెరుగుతుంటే దాని ప్రభావం రక్తం మీద పడుతోందని అర్థం. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా వైద్యుల సూచనల మేరకు బ్లడ్ థిన్నర్స్ వాడాలి. ఇక కోవిడ్ వల్ల ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురవుతున్న విషయం తెలిసిందే. నిమోనియా శాతం తెలుసుకోవడానికే హెచ్ఆర్సీటీ థొరాక్స్ టెస్టు. దీనిద్వారా ఊపిరితిత్తులపై వైరస్ ప్రభావం పడిందా లేదా అని తెలుసుకోవచ్చు.-డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్సీ, బాలాపూర్ ( చదవండి: డోసుల మధ్య ఎంత విరామం అవసరం? తేడా వస్తే ? ) -
మా డౌట్లు తొలగించండి
లక్నో: కోవాగ్జిన్పై వస్తున్న సందేహాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చెప్పారు. భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన∙కోవాగ్జిన్ టీకాకు కేంద్రప్రభుత్వ అనుమతి లభించడంపై కాంగ్రెస్ సహా పలువురు ప్రశ్నించడం తెల్సిందే. తానుగానీ, తన పార్టీగానీ శాస్త్రవేత్తలను ఎప్పుడూ ప్రశ్నించమని, కానీ ఏవైనా సందేహాలు తలెత్తినప్పుడు ప్రభుత్వమే వాటికి సరైన సమాధానాలివ్వాలని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆదివారం అనుమతినిచ్చింది. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఫేజ్ 3 ట్రయల్స్ పూర్తి కాకుండా వాడుకకు అనుమతినివ్వడం రిస్క్ అని విమర్శించాయి. వ్యాక్సినేషన్ అనేది లక్షలాది మంది జీవితాలతో కూడిన విషయమన్నారు. పేదలకు వ్యాక్సిన్ అందించే తేదీని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్నేత శశిధరూర్ సైతం వ్యాక్సిన్ అనుమతులను విమర్శించారు. -
భార్యపై అనుమానంతో చిన్నారి ఉసురు తీశాడు..
సి.బెళగల్: భార్యపై అనుమానం అతడిని ఉన్మాదిలా మార్చింది. తనకు పుట్టలేదంటూ 18 నెలల చిన్నారిని కిరాతకంగా చంపాడు. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం చింతమానుపల్లెలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డికి, కర్ణాటకకు చెందిన సరితకు ఏడేళ్ల కిందట వివాహమైంది. వీరికి యశ్వంత్ (5), సందీప్రెడ్డి (18 నెలలు) అనే ఇద్దరు కుమారులున్నారు. ► గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాట విని నాగేశ్వరరెడ్డి తన భార్యపై అనుమానం పెంచుకుని చిన్న కుమారుడు తనకు పుట్టలేదని భావించాడు. ► ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి ముందు కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగా.. తల్లి పక్కన నిద్రిస్తున్న సందీప్రెడ్డిని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ► చిన్నారి ఏడుపు విన్న కుటుంబ సభ్యులు లేచేసరికి తలుపులు వేసి లోపల గడియ పెట్టుకుని అతి కిరాతకంగా చిన్నారి గొంతు కోశాడు. అనంతరం తలుపులు తీసి బయటకు పరుగుదీశాడు. ► అప్పటికే రక్తపు మడుగులో ఉన్న చిన్నారి కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచాడు. తర్వాత నాగేశ్వరరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్టు కోడుమూరు సీఐ పార్థసారథి, ఎస్ఐ రాజకుళ్లాయప్ప చెప్పారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
నేను ఇలా చెయ్యడం సముచితమేనా?
ఆయన ఓ సాధువు. ఆయన దగ్గర బోలెడంత మంది శిష్యులున్నారు. ఓ రోజు ఆయన వద్దకు ఓ పాత శిష్యుడు వచ్చాడు. గురువుగారికి నమస్కరించాడు. అవీ ఇవీ మాట్లాడుకున్నాక అతను ‘‘గురువుగారూ నాకో సందేహం. మనసెప్పుడూ గందరగోళంగా ఉంటోంది’’ అన్నాడు శిష్యుడు.‘‘ఎందుకు?’’ గురువుగారు ప్రశ్నించారు.‘‘నేను మీ దగ్గరున్న రోజుల్లో పద్ధతి ప్రకారమే ధ్యానపద్ధతులు నేర్చుకున్నాను. అంకితభావంతోనే అనుసరించాను. ఆ ధ్యానపద్ధతులు నాకు తగిన ప్రశాంతతనే ఇచ్చాయి. మంచి ఆలోచనలు చేయగలుగుతున్నాను కూడా. ఇది అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను’’ అన్నాడు ఆ పాత శిష్యుడు. ‘‘అటువంటప్పుడు సంతోషమేగా... మరెందుకు గందరగోళం?’’ అన్నాడు గురువు.‘‘నేను ధ్యానంలో లేనప్పుడు పూర్తి మంచి వాడిగా ఉంటున్నానో లేదో అనే సందేహం కలుగుతోంది. ఆ విషయం నాకే తెలుస్తోంది. కొన్నిసార్లు సరిగ్గా లేనని అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఒకటి రెండు తప్పులు కూడా చేస్తున్నాను. ధ్యానం తెలిసిన నేను ఇలా చేయడం సముచితమేనా. అది ఆలోచించినప్పుడు నా మనసు కలవరపడుతోంది’’ అన్నాడు శిష్యుడు.అతను చెప్పిన మాటలన్నీ విన్న గురువుగారు ఓ నవ్వు నవ్వారు.‘‘ఆహా, నువ్వు ధ్యానమూ చేస్తున్నావు. తప్పులూ చేస్తున్నావు. అంతేగా నీ మాట’’ అన్నాడు గురువు.‘‘అవును గురువుగారూ...’’ అది తప్పు కదా అని అడిగాడు గురువు.‘‘కాదు. నువ్వు రోజూ ధ్యానం చెయ్యి. తప్పులూ చెయ్యి. ఇలాగే చేస్తూ ఉండు. ఏదో రోజు ఈ రెండింట్లో ఏదో ఒకటి ఆగిపోతుంది’’ అన్నాడు గురువు.‘‘అయ్యో.. గురువుగారూ అలా అంటే ఎలాగండీ... ఒకవేళ తప్పులకు బదులు ధ్యానం ఆగిపోతే..?’’ అని ప్రశ్నార్థకంగా చూశాడు శిష్యుడు గురువు వంక.‘‘అదీ మంచిదేగా....నీ నైజమేంటో నీ సహజత్వమేదో తెలిసొస్తుంది కదా’’ అన్నాడు గురువు. అర్థమైందన్నట్లుగా చిరునవ్వుతో తల పంకిస్తూ గురువుగారికి నమస్కరించాడతను. – యామిజాల జగదీశ్ -
ప్రేమ జంటపై దాడి : జ్యోతి మృతిపై అనుమానాలు
-
‘జ్యోతి మృతిపై అనుమానాలున్నాయి’
సాక్షి, గుంటూరు : రాజధానిలో ప్రేమ జంటపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జ్యోతి మృతి చెందగా.. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే జ్యోతి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె సోదరుడు ప్రభాకర్. మీడియాతో మాట్లాడిన ప్రభాకర్.. ‘రెండేళ్ల క్రితమే వీరిద్దరి విషయం శ్రీనివాస్ తండ్రితో మాట్లాడను. తర్వాత వారు ఊరు వదిలి వెళ్లిపోయారు. కానీ శ్రీనివాస్ రహస్యంగా జ్యోతిని కలుస్తుండేవాడు’ అని తెలిపాడు. అంతేకాక ‘హత్య జరిగిన రోజు కూడా శ్రీనివాస్ వేరే అమ్మాయితో పదేపదే ఫోన్ చేయించి.. జ్యోతిని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఎనిమిదిన్నర వరకు జ్యోతి ఫోన్ రింగయ్యింది. తొమ్మిది తర్వాత స్విచ్ఛాఫ్ వచ్చింది. దుండగులు వీరి మీద దాడి చేశారంటున్నారు. అయితే శ్రీనివాస్కు చాలా చిన్న దెబ్బలే తగిలాయి. కానీ జ్యోతి మాత్రం చనిపోయింది. వీటన్నింటిని చూస్తుంటే పథకం ప్రకారమే దాడి జరిగినట్లు అనిపిస్తుంది. పోలీసులు ఆ కోణంలో విచారణ జరపాల’ని ప్రభాకర్ కోరాడు. -
పంచభూతాధికారి
ఎంతో ఎత్తులో ఉన్న నక్షత్రాలని లెక్కించడం ఎంత కష్టమో.. ఎంతో దగ్గరగానూ ఎదురుగానూ ఉన్నా కూడా ఓ చెరువులోని నీటి బిందువుల్ని ఎలా లెక్కించడం కష్టమో.. అలాగే తనకి తానే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని చేస్తున్నా ఓ రోజులో ఎన్నిమార్లు గాలిని పీల్చి విడిచామో చెప్పడం ఎంత కష్టమో.. అదే తీరుగా సాయి గురించి ఎన్ని విశేషాలనీ లీలలనీ విన్నా ఆయన తత్త్వమేమిటో వాటి అంతరార్థమేమిటో సంపూర్ణంగా చెప్పగలగడం అసాధ్యం. పరిచయం ఏ మాత్రమూ లేనివాణ్ణి పిలిచి మరీ దక్షిణ అడుగుతాడు. దక్షిణ ఇయ్యబోయిన పరిచయస్తుడ్ని ఇయ్యవద్దంటాడు. ఎవరైనా తమంత తాము దక్షిణనీయబోతే ఇంతమాత్రమే చాలంటాడు. మరికొందరు దక్షిణనిస్తూంటే ‘ఇంతకాదు. అంత ఇస్తావా? ఇయ్యగలవా?’ అంటాడు. తీరా దక్షిణని ఇచ్చాక దాన్ని వాళ్లకీ పంచేస్తాడు పోనీ! అందరికీ సమానంగానా? అంటే అదీ కాదు. ఒకరికి కొంత, మరొకరికి ఇంకోకొంత, ఆ వేరొకరికి ఊహించనంత. ఇదేమి దక్షిణ విధానమో? పోనీ! ప్రవర్తనని చూద్దామా? ఒకసారి చెప్పలేనంత ప్రేమతో ఓ తండ్రి లాలించినట్లుంటాడు. ఇంకొకసారి రాళ్లతో కొట్టడానికి పరుగెత్తివస్తూ రాతిని విసురుతాడు. ఆకాశం దద్దరిల్లేలా అరుస్తాడు. ఇంకొకసారి కంటితడి పెట్టుకుంటాడు. ఇదేమి ప్రవర్తన విధానమో? ఒకర్ని కావాలని తన వద్దకి రావలసిందిగా కబుర్లు పంపుతూనే ఉంటాడు. కావాలని దర్శిద్దామని షిర్డీకి వచ్చిన కొందరికి దర్శనమే ఈయడు. పైగా ‘తన వద్దకి అతడ్ని తేవద్దు. అతనిని రానీయవద్దు’ అంటాడు. ఇదేమి దర్శన అనుగ్రహ విధానమో?ఒకరోజున అసలు భిక్షానికే వెళ్లాడు. మరొకరోజున 4 నుంచి 8 మార్లు భిక్షాటన చేస్తాడు. ఆ తెచ్చిన రొట్టెలని కుక్కలకీ ఇతర జంతువులకీ ఇస్తాడు. ‘మా ఇంటికి ఆతి«థ్యానికి రండి’ అని పిలిస్తే సరేనంటాడు. ఏ పశువూ లేదా జంతువూ లేదా కీటకరూపంలో తిని– భోజనం బాగుందని వంటకం వివరాలతో సహా చెప్తాడు. ఇదేమి భిక్షాటన విధానమో? మరి ఎందుకు కొలవాలి? ఇంత అయోమయంగానూ లోఅర్థం తెలియకుండానూ ఉన్న సాయి చరిత్రని ఎందుకు తెలుసుకోవాలి? సంపూర్ణ ఆనందాన్ని పొందకుండానూ పొందవీల్లేని స్థితిలోనూ, ఈ సాయి చరిత్ర ఉన్నప్పుడు ‘ఆయన్ని ఎందుకు కొలవాలి?’ అనే సందేహం ఎందరికో కలుగుతుంది కదా! ఏ భయంతోనో వ్యతిరేకించినా, దుర్విమర్శ చేసినా, ఏమైనా కీడు జరుగుతుందేమో అనే ఆందోళనతోనూ సాయి చరిత్ర పారాయణం చేయడం ఎందుకు? అనే ఆలోచన కూడా కలుగుతుంది ఎవరికైనా. సమాధానం ఒక్కటే. ఇలా పైన అనుకున్న తీరుగా ఊహించుకున్నది నిజమే అయ్యుంటే ప్రతి సంవత్సరంలోని రోజుకీ మరో రోజుకీ భక్తజనుల సంఖ్య ఎందుకు పెరిగిపోతోంది? సాయిదేవాలయాల సంఖ్య కూడా ఎందుకు ఎదిగిపోతోంది? ప్రతిసాయి భక్తుడూ అనుకోకుండా మరొకర్ని సాయి భక్తునిగా చేసెయ్యగలుగుతున్నాడు? డబ్బిచ్చి.. ప్రలోభపెట్టి కాకుండా వీరు సాయి గురించి చెప్పగానే అవతలివారు కూడా తాను మాత్రమే కాకుండా సకుటుంబంగా షిర్డీకి ఎందుకు వెళ్లొస్తున్నారు?కారణం ఒక్కటే! ఒక కత్తిని గరుకునేలమీద ఎంత రాస్తే మరెంతగా రాస్తే (నూరితే) అంతగా అది పదునెక్కిపోతుందో అలా అర్థం కాలేదనుకుంటున్న సాయి చరిత్రని ఎన్నిమార్లు చదువుతూ ఎన్నిమార్లు వింటూ ఎన్నిమార్లు సాయిదర్శనాన్ని చేస్తూ ఉంటే అంతగానూ సాయికి దగ్గరైపోతూ ఎవరి అనుభవానికి వాళ్లకి పైననుకున్న అసందర్భ ప్రవర్తనలన్నింటికీ లో–విశేషాలు వాళ్ల వాళ్ల స్థాయికి అర్థమైపోతూ ఉంటాయి. అవన్నీ అసందర్భాలు అయోమయాలూ అనిపించవు.పంచదార తియ్యగా ఉంటుందని చెప్తాం. మరి బెల్లం కూడా అదే తీపిదనంతో ఉంటుందా? అంటే కొద్ది తేడా ఉందని చెప్తాం. వివరించవలసిందని చెప్తే.. కుదరడం లేదని చెప్పేస్తాం. ఇదీ అంతే! ఎవరి అనుభవం వారిదే! నదికి వెళ్లేటప్పుడు మనం ఎంత పరిమాణం గల జలపాత్రని తీసుకెడితే అన్ని నీళ్లని మాత్రమే తెచ్చుకోగలిగినట్లుగా, ఎవరెంత భక్తితో సాయిని సేవిస్తారో వారికి అంతలోతుగానూ లో–అర్థం స్పష్టంగా తెలిసి, వారు మరింత దగ్గరైపోతారు సాయికి.ఒక్కమాటలో చెప్పాలంటే నేడు మహాభక్తులైన అందరూ కూడా సాయిని నమ్మనివారూ. ఎవరి బలవంతం మీదనో మొదట్లో షిర్డీకి వచ్చినవాళ్లేనూ అనేది నిర్వివాదాంశం.‘ఇదంతా ఎందుకు? అంటే ‘సాయి పంచభూతాలకీ అధికారి ఎలా అవుతాడు? కాగలడు?’ అని వాదం చెయ్య బుద్ధి వేస్తుంది అందరికీ. అయితే ‘కొన్ని స్పష్టమైన స్వయమైన అనుభవాలని పొందాక అది నిజమే సుమా!’ అని అనిపించకమానదని తెలియజెప్పడానికీ! కాబట్టి సాయి చరిత్రని చదవండి. చదువుతూ ఉండండి. చదువుతూనే ఉండండి! ఈ నేపథ్యంలో ఆయన పంచభూతాల మీదా ఎలా అధికారం కలవాడయ్యడో చూద్దాం! పృథ్వి మీద అధికారం ‘నెలకి ఇంత!’ అని ఈ తీరుగా జీతాన్ని నిర్ణయించిన పక్షంలో ప్రతి సేవకుడూ యజమానికి అనుగుణంగా పనిచేస్తాడనేది అనుభవంలో కనిపించే అంశం. అలా సేవకుడొకడు తనకంటూ వచ్చినప్పుడూ పని చేస్తున్నప్పుడూ ఈ జీతాన్నిచ్చే వ్యక్తీ.. పని చేయించుకుంటున్న వ్యక్తీ ఓ అధికారి ఔతాడు. ఇది నిజం కదా!మరి సాయి ‘పంచభూతాలకీ అధికారి’ అని చెప్పుకోబోతున్నాం కదా! ఈ పంచభూతాలనీ ‘ఈయన ఏ తీరుగా పోషిస్తున్నాడని ఆ పంచభూతాలూ ఈయన కింద సేవకులుగా ఉండాలి?’ అనేది గట్టి సంశయం కదా! ఇలా ఆలోచించినప్పుడే యదార్థం తెలుస్తుంది. తత్త్వం అర్థమవుతుంది కూడా! ముందుగా పృథ్వి(భూమి)ని ఎలా తనకి సేవ చేయించుకుని ఆ పృథ్వికి అధికారి అయ్యాడో, భూమికి స్వాధీనం(స్వ+అధీనం – తన చెప్పుచేతల్లో ఉంచుకోవడం) చేసుకున్నాడో తెలుసుకుని ఎలా అది సాధ్యమయిందో ఆ తర్వాత తెలుసుకుందాం. పచ్చికుండల్లో నీళ్లు సాయి ఒక ప్రత్యేకమైన తోటని(వెండీ అని దాని పేరు) ఎంతో ఇష్టంగా పెంచుతూండేవాడు. ప్రతిరోజూ స్వయంగా తానే పచ్చికుండలలో నీళ్లు నింపుకుని ఆ నీటితో ఈ తోటలోని మొక్కలకి నీళ్లని పోస్తూండేవాడు. ఇదేదో అభూతకల్పనలతో నిండిన చరిత్ర కాదు. అందరూ ప్రతినిత్యం గమనించిన కళ్లకి కనిపించిన యదార్థం. కుండ అనేదాన్ని మట్టితో చేస్తారు. ఆ పచ్చికుండని ఆములో పెట్టి బాగా కాల్చిన తర్వాత అది గట్టిపడి కొద్ది బరువైన పదార్థాన్ని మోయగల స్థితికి వస్తుంది. అదే మరి పచ్చికుండ అయితే దానిలో నీళ్లు నింపి పైకి ఎత్తబోయేసరికే ఆ నీటి బరువుకి విచ్చిపోతుంది. పైగా సాయి ఆ కుండని తన భుజానికెత్తుకుని రెండు మూడు మార్లు నీళ్లు నింపి మొక్కలని తడిపి తిరిగి వస్తూండేవాడు. ఇది ఎక్కడైనా సాధ్యమా?ఆ పృథ్వి (కుండ ఏ మట్టితో చేయబడిందో ఆ పృథ్వి) తనకి వశమై ఉంది కాబట్టే కుండ విచ్చిపోకుండానూ తోట ఎండిపోకుండా నీరు పోసేందుకు సాధనంగానూ ఉపయోగపడింది. సాయికి తెలియకుండా.. సాయిని శ్రమకి గురి చేయరాదనే ఉద్దేశంతో ఎందరు ప్రయత్నించినా అలా పచ్చికుండతో నీళ్లు పట్టడం భుజానికెత్తుకోవడం తోటవరకూ వెళ్లగలగడం మొక్కలకి పోయడమనేది సాధ్యం కాలేదు ఏ ఒక్కరికీ. అంటే సాయికొక్కనికే పృథ్వి సహకరించిందని కదా అర్థం! ఎందుకు సహకరించిందో తెలుసుకునే ముందు మరో వృత్తాంతాన్ని కూడా చూద్దాం! నేలమాళిగలో 12 ఏళ్లు సాయి తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అయితే అకస్మాత్తుగా సాయి 16 ఏండ్ల యువకునిగా ఓ వేపచెట్టు కింద కనిపించాడు. ఎప్పుడూ తపఃసమాధిలో ఉంటూండటం, అల్లాహ్ హో మాలిక్! అంటూ అనేక పర్యయాలు అంటూండటం, ఏ సౌకర్యాన్నీ కావాలని ఎవరినీ కోరకపోవడం పైగా ఎవరైనా వచ్చి తమ అనారోగ్యాన్ని వివరించి చెప్పుకుంటే కొంతదూరం వెళ్లి ఏదో చెట్టు ఆకు పసరు తెచ్చి ఇయ్యడం, అవతలివారిని ఆరోగ్యవంతుల్ని చేయడం... ఆయనలోని గొప్పదనం అర్థమవుతూ ఎవరింటికి తీసుకుపోదలిచి ప్రార్థించినా వెళ్లకపోవడమనే ఇన్నింటినీ గమనించిన జనులంతా ఆయన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఖండోబా దేవాలయంలో ఒకనికి పూనకం వస్తే ఈ బాలుడ్ని గురించి అడిగారు అక్కడి వారంతా. ఆ పూనకం వచ్చిన వ్యక్తి ఓ గునపాన్ని (గడ్డపార) తెమ్మనీ ఓ స్థలాన్ని చూపించి అక్కడ తవ్వవలసిందనీ చెప్పాడు. తవ్వి చూస్తే ఓ పెద్ద రాయి కనిపించింది. దాన్ని తొలిగించి చూడవలసిందన్నాడు. అలా చూస్తే ఓ పెద్ద భూగృహం, ఇంకా వెలుగుతూనే ఉన్న 4 దీపాలు, కర్ర బల్లలూ, జపమాలలూ, జపం చేసుకునేందుకు వీలైన ఓ చిన్న వేదిక వంటి ఎత్తు స్థలం కనిపించింది. ఇది అందరూ చూస్తూండగా బయటపడిన యదార్థం ఈ సొరంగంలోనే ఆ బాలుడు ఒకటి కాదు రెండు కాదు 12 ఏండ్ల పాటు తపస్సు చేసి సిద్ధుడయ్యాడని చెప్పాడు పూనకం వచ్చిన వ్యక్తి. ఇప్పుడాలోచిద్దాం! పృథ్వికి అంటే నేలకి ప్రతి వస్తువునీ తనలో కప్పేసుకునే గుణం ఉంటుంది. అందుకే ఏ వస్తువునైనా కొన్నినాళ్ల పాటు నేలమీదనే విడిచేస్తే క్రమంగా కప్పబడిపోతుంది. మరి ఇది పృథ్వి కుండే సహజలక్షణమవుతుంటే ఎలా ఆ భూమిసొరంగంలో ఒకటి కాదు రెండు కాదు అది కూడా నెలలు కాదు సంవత్సరాలు. ఆ సంవత్సరాలు కూడా ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరాల పాటు ఆ సొరంగంలో ఉండిపోవడం సాయికి ఎలా సాధ్యమయింది? పోనీ ఏ సొరంగానికి ఏదైనా ఓ మార్గముందేమో అనుకునే వీలులేదు. దానికి కారణం ఆ పూనకం వచ్చిన వ్యక్తి తాను మైమరచిన స్థితిలో ఓ ప్రదేశాన్ని చూసి తవ్వవలసిందన్నప్పుడు గదా తవ్వి చూసి ఈ సొరంగ విషయాన్ని అర్థం చేసుకోగలిగారు అందరూ! కాబట్టి ఆ సొరంగమనేది ఎటూ ప్రవేశంలేని ఎవరూ ప్రవేశించలేని నేలమాళిగే తప్ప రాకపోకలకి వీలైనది కానేకాదు గదా! ఇక తగినంత గాలి లేని పక్షంలో ఏ దీపం వెలుగదనేది మనకి తెలిసిన అనుభవ సత్యమవుతూంటే అకస్మాత్తుగా హఠాత్తుగా తవ్వి చూస్తే అక్కడ నాలుగు దీపాలు వెలుగూ కనిపించడమా? ఇక భూమికి ఉండే మరో గుణం. ఎంతటి వస్తువునైనా నల్లబడిపోయేలా చేయడం. దానికి కారణం గాలి ఏ మాత్రమూ తగలని కారణంగా వేడిమి పుట్టడం. భూమిలో నల్లని బొగ్గు ఇంకా నల్లబడిన రాక్షసిబొగ్గు ఇంకా నల్లబడి లోహాలూ... ఇలా ఇన్ని లభించడానికి కారణం విపరీతమైన వేడిమి మాత్రమే. పెద్ద బండరాయి కప్పబడిన భూమి సొరంగంలో అంతకాలం ఉండడమనేది సాధ్యమా? కొన్ని గంటలయ్యేసరికి నీళ్లు మరికొన్ని గంటలయ్యేసరికి తిండీ ఇంకాకొన్ని గంటలయ్యేసరికి తగినంత గాలీ వెలుతురూ ఆవశ్యకమా? కాదా? ఎలా ఉండగలిగాడు సాయి? అదికూడా 12 ఏళ్ల పాటు. పోనీ! ఇదంతా అసత్యం ఓ కట్టుకథ అంటూ కొట్టిపారేద్దామా? అంటే అందరి సమక్షంలో గదా ఆ భూమి సొరంగం తెరవబడింది. ‘తత్ర గంధవతీ పృథ్వి’ అని భూమి లక్షణం. భూమికి వాసన ఉండటమనేది సహజ లక్షణమని దీనర్థం. ఇది నిజమని నిరూపిస్తూ వాన చినుకు పడగానే ఓ చక్కని వాసన నేల నుండి మనకి వస్తుంది గదా! ఆ వాసనే భూమి నుండి మొక్కని రప్పించగల శక్తి ఉన్న పదార్థం కదా! మరి ఇన్ని సంవత్సరాల పాటు మూసివేయబడ్డ నేలలో ఏ విధమైన దుర్వాసనా ఎందుకు రాలేదు? మనమే మన ఇంటిని ఓ వారం పాటు పూర్తిగా గాలి చొరకుండా మూసి ఉంచితే వచ్చే ఓ తీరు మాగుడు వాసన 12 ఏళ్ల పాటు గాలీ వెలుతురూ లేని భూ సొరంగం నుండి ఎందుకు రాలేదు? ఇలా అనేక ఆశ్చర్యకర అంశాలు మనకి కనిపిస్తాయి. సరే ఇంతకీ సాయికి పృ«థ్వి ఎందుకు సహకరించి పైతీరు ఇబ్బందులు లేకుండా ఆయనని అధికారిగా భావించి ఎందుకు తన సహజధర్మం నుండి పక్కకి వచ్చి సాయికి అధీనురాలు అయింది! లేదా కావలసివచ్చింది? గమనిద్దాం! ఇదీ కారణం! భూమి అని మనందరం పిలుస్తాం కానీ, సంప్రదాయం హిందూ ధార్మిక వ్యవస్థా ఆ భూమిని భూమాత అని, పుడమి తల్లి అని పిలుస్తుంది. తల్లి ఎలా తన సంతానానికి సకాలంలో అన్నాన్ని పెట్టి రక్షిస్తుందో, పెద్దగా వరదలోస్తే ఎలా సముద్రం వైపు పరుగెత్తేలా చేస్తూ కొంత నీటిని తానే స్వయంగా తాగేసి తన మీద ఉన్న ప్రాణులకీ అప్రాణులకీ కూడా నష్టాన్ని కలిగించకుండా చూస్తుందో అంతటి ఉత్తమురాలు భూమి(భూదేవి). అంతే కాదు. పెద్దపెద్ద మానులున్న వృక్షాల భారాన్ని భరిస్తుంది. అసలు వృక్షాలు అంతంత పెద్దగా ఎదగడానికి తాను నీరు తాగి ఆ నీటిని ఒకప్పటి ఆ మొక్కలకి అందించి ఆ మొక్కల్ని చెట్లుగానూ ఆ చెట్లని పెద్దపెద్ద వృక్షాలుగానూ ఎదిగేలా చేసింది కూడా ఈ పృథ్వియే. ఇలా చేసే లక్షణాలున్న పృథ్వి పనిని ఎవరైనా గానీ చేస్తే ఆ పృథ్వి తాను చేస్తున్న పనినే చేస్తూ తనకి పరోక్షంగా సహకరిస్తున్నాడు ఫలానా వ్యక్తి అనే భావంతో తప్పక ఆ పృథ్వి. ఆ వ్యక్తికి సహకరిస్తుంది. లోకమంతా ‘ఈ వ్యక్తి అధీనంలోనే భూమి ఉంది’ అనేంత అభిప్రాయాన్ని కలిగిస్తుంది జనులకి. ఇంతకీ సాయి ఆ పృథ్వి చేసిన ఏ పనుల్నీ చేశాడట? భూమిమీద ఏ 84 లక్షల జీవరాశులున్నాయో ఆ జీవరాశులన్నింటికీ ఆహారాన్ని అందేలా చేయాలనుకుంటూ కేవలం అనుకోవడమే కాకుండా షిర్డీకి వచ్చిన వ్యక్తులకి అన్నాన్నీ క్రిమికీటకాలకి తీపి పదార్థాలనీ పక్షులూ మొదలైన వాటికి తిండి గింజలనీ భూమి మీద మొక్కలకి నీటినీ, కుక్కలూ మొదలైన జంతువులకి తాను భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారపదార్థాలనీ చేపలూ మొదలైన వాటికి వాటి ఆహారాన్నీ ఇలా భూమి ఏ తీరుగా అన్నాన్నీ అందిస్తూ ఉంటుందో ఆ పనినే సాయి చేశాడు. చేస్తూ ఉన్నాడు ప్రతిరోజూ. ఆ కారణంగా భూమి పరమానందాన్ని పొందింది. శ్రీమద్రామాయణంలో జటాయువు రెక్కల్ని రావణుడు నరికేస్తే... ఇంకా దాన్ని బాగా హింసిస్తే చావుబతుకుల స్థితికొచ్చేసింది ఆ పక్షి. ఆ సందర్భంలో సీతమ్మ జటాయువుని కౌగిలించుకుందంటాడు వాల్మీకి.సీతమ్మ భూమికూతురు. భూమి నుండి ఓషధులు మొక్కల రూపంలో పుడతాయి. ఆ మాటకొస్తే మన్ను పుట్టమన్ను ఇసుకతో కూడిన మన్ను నీటి అడుగున ఉండే బురద ఒండ్రుమన్ను... ఇవి కూడా ఔషధాలే. సీతమ్మ భూమికి కూతురై ఔషధి లాంటిది కాబట్టే ఆమె కౌగిలించుకున్న కారణంగా అంతగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న జటాయువు కూడా రామలక్ష్మణులొచ్చేంతవరకూ జీవించి సీతాపహరణ విషయాన్ని చెప్పగలిగాడు. సాయి కూడా భూమి నుంచి ఏ మొక్క ఏ వ్యాధికి ఔషధమో గమనించి భూదేవి చేస్తున్న పనిని తాను కూడా నిస్వార్థంగా చేస్తున్నప్పుడు భూదేవి సాయికి ఎందుకు సహకరించదు? స్వాధీనురాలు కాకుండా ఉంటుంది? భూదేవి తట్టుకోలేనిది పాపుల భారాన్ని. అందుకే శ్రీహరిని వేడుకుంటూ పాపభారాన్ని తగ్గించవలసిందని ప్రార్థిస్తుంది. సాయి కూడా కొందర్ని అసహ్యించుకుంటూ కొందరికి జ్ఞానబోధ చేస్తూ కొందరికి దర్శనాన్నే ఈయక... ఎవరి తప్పుని వారు వారికి వారు తెలుసుకునేలా చేస్తూ పాపి అయినవారిలోని పాపగుణాన్ని ఆలోచనల్నీ తొలగిస్తూ ఉండటంతో భూదేవి ఆయనకి స్వాధీనురాలయింది. దేవతలు ఎప్పుడూ సజాతీయులు(తమ వంటి గుణలే ఉన్నవారు) అయినవాళ్లకి సహకరిస్తూ ఉంటారు తప్ప హోదా ప్రధానమని అనుకోరు.ఈ క్రమంలో పంచభూతాల్లో రెండు మూడు నాలుగూ ఐదూ అయిన నీరు తేజస్సు వాయువూ ఆకాశమూ కూడా ఎందుకు సాయికి అధీనులైపోయాయో గమనించుకుందాం! – సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
నాదో విన్నపం మహర్షీ!
‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది. కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు. ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీ తనయుడైన గణపతి రూపం మదిలో మెదిలింది. తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది, ఆయనను ప్రార్థించాడు. వెను వెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ‘ధన్యోస్మి వినాయకా’ అని వేదవ్యాసుడు నమస్కరించగా, ‘‘వేదపారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు. మహాభారతాన్ని తాను చెబుతుంటే, గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు. గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే, ‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడా ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే రాయాలి సుమా..’’ అన్నాడు.అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు. సరే ననక తప్పదు అనుకుని, ‘నాకూ మంచిదే ఆ మహాగ్రం«థమెన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’ అని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా, నిరంతరాయంగా సాగిపోతోంది. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్నీ వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు. తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా. అందుకే దేనికైనా సమఉజ్జీలు ఉండాలంటారు. – డి.వి.ఆర్. -
ఆధార్–మొబైల్ అనుసంధానమెందుకు?
న్యూఢిల్లీ: ఆధార్తో మొబైల్ నంబర్ని తప్పనిసరిగా అనుసంధానించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. మొబైల్ వినియోగదారుల గుర్తింపును తప్పనిసరిగా ధ్రువీకరించాలని గతంలో తామిచ్చిన ఉత్తర్వులను ఆయుధంగా వాడుకుని, ఆధార్ అనుసంధానతను తెరపైకి తెచ్చారంది. ఆధార్ చట్టబద్ధతపై కొనసాగుతున్న విచారణలో భాగంగా బుధవారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఆధార్–మొబైల్ తప్పనిసరి అనుసంధానంపై తామేమీ ఆదేశించలేదని స్పష్టం చేసింది. -
అనుమానమే ఆయువు తీసింది!
-
కుమారుడి బర్త్డే నాడే ఘటన..భార్యను కత్తితో..
అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈక్రమంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. ఇది భరించలేని ఆమె అతనిపై కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత అతడి నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. అయినా అనుమానం తీరని అతను ఆమెను కత్తితో నరికి చంపాడు. ఫలితంగా ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. కర్నూలు,బనగానపల్లె: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం పట్టణంలోని తెలుగుపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సుమారు 12 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన నాగన్న, మునెమ్మ దంపతుల కుమార్తె ఎం.మహేశ్వరి(35)ని పట్టణంలోని తెలుగుపేటకు చెందిన బాలనాగమ్మ కుమారుడు లింగమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం పాటు వీరి సంసారం సాఫీగా జరిగింది. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్న లింగమూర్తి ఆమెను వేధించేవాడు. ఈక్రమంలో అతడిపై మహేశ్వరి తల్లిదండ్రులు 2014లో అలంపూర్ పోలీసు స్టేషన్లో అదనపు కట్నం వేధింపుల కేసు పెట్టారు. అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఇదే కాలనీలో అద్దె ఇంట్లో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. అయితే అమె గురించి ఇరుగుపొరుగు వారు రకరకాలు చెబుతుండడంతో మనస్థాపం చెందిన భర్త ఉదయం ఇంటికి వద్దకు వెళ్లి ఆమె మెడపై నరికి చంపాడు. అనంతరం మృతదేహాన్ని బయటకు తెచ్చి అక్కడే కూర్చున్నాడు. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాకేష్ ఘటన స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్చార్జ్ సీఐ కంబగిరిరాముడు అక్కడికి వచ్చి వివరాలు సేకరించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా కుమారుడు శివకుమార్ పుట్టినరోజు నాడే తల్లి హత్యకు గురికావడంతో కాలనీలో విషాదం నెలకొంది. -
ఆధార్పై అనుమానాలొద్దు!
న్యూఢిల్లీ: కేవలం రూ.500కే దేశంలో ఎవరి ఆధార్ సమాచారమైనా ఆన్లైన్లో దొరుకుతోందంటూ ‘ద ట్రిబ్యూన్’ పత్రిక ఇటీవల బయటపెట్టి సంచలనం సృష్టించింది. అలాగే కొన్ని ప్రభుత్వ విభాగాల వెబ్సైట్ల నుంచే 13 కోట్ల మంది ఆధార్ సమాచారం బట్టబయలైందంటూ కూడా గతంలో వార్తలొచ్చాయి. అసలు ఆధార్ రాజ్యాంగ బద్ధమేనా కాదా అనే దానిపై సుప్రీంకోర్టు ఐదురుగు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆధార్పై సామాన్యుల సందేహాలను నివృత్తి చేసేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 11 ‘తరచుగా అడిగే ప్రశ్నలు’ (ఎఫ్ఏక్యూ), వాటికి సమాధానాలను విడుదల చేసింది. ప్రశ్న: నా ఆధార్ సమాచారంలో బయోమెట్రిక్స్, బ్యాంక్ ఖాతా, పాన్, మొబైల్, ఈ–మెయిల్ తదితర వివరాలన్నీ ఉన్నాయి? నేను ఏమేం చేస్తానో యూఐడీఏఐ గమనిస్తూ ఉంటుందా? జవాబు: తప్పు. యూఐడీఏఐ దగ్గర బ్యాంకు ఖాతాలు, పాన్, మ్యూచ్వల్ ఫండ్లలో పెట్టుబడులు, ఆస్తులు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యులు, కులం తదితర వివరాలేవీ ఉండవు. ప్రశ్న: కానీ నాకు బ్యాంక్ ఖాతా, పాన్ కార్డు, షేర్ మార్కెట్, మ్యూచ్వల్ ఫండ్లలో పెట్టుబడులు, మొబైల్ కనెక్షన్..ఇలా ఏది కావాలన్నా ఆధార్ అంటున్నారుగా. ఆయా సంస్థలకు నా ఆధార్ నంబర్ ఇస్తే ఆ సమాచారం యూఐడీఏఐకి రాదా? జవాబు: కచ్చితంగా రాదు. మీరు ఆయా సంస్థలకు ఆధార్ సంఖ్య ఇచ్చినప్పుడు అవి మీరు వారికిస్తున్న బయోమెట్రిక్స్, మీ పేరు తదితరాలను మాత్రమే యూఐడీఏఐకి ధ్రువీకరణ కోసం పంపుతాయి. ఇతర వివరాలేవీ రావు. ఆధార్ నంబర్తో వేలిముద్రలు, పేరు సరిపోలితే ధ్రువీకరణ అయిపోతుంది. ప్రశ్న: ఎవరికైనా నా ఆధార్ నంబర్ తెలిస్తే, వాళ్లు నా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయగలరు కదా? జవాబు: పూర్తిగా అవాస్తవం. కేవలం మీ ఏటీఎం కార్డు నంబర్ తెలిసినంత మాత్రాన ఎవరైనా మీ ఖాతాలోని డబ్బును ఏటీఎం ద్వారా డ్రా చేయగలరా? అలాగే ఇది కూడా అసాధ్యం. ప్రశ్న: బ్యాంకు ఖాతాలకు ఆధార్ను అనుసంధానించుకోవాలని ఎందుకు చెబుతున్నారు? జవాబు: మీ భద్రత కోసమే. నేరస్తులు, అవినీతిపరుల బ్యాంకు ఖాతాలను తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఆధార్తో అనుసంధానమై ఉన్న ఖాతాల నుంచి ఎవరైనా అక్రమంగా డబ్బు తీస్తే వారి గురించి అన్ని వివరాలు ఇట్టే తెలిసిపోతాయి. కాబట్టి మీ ఖాతాలకు మరింత భద్రత సమకూరుతుంది. ప్రశ్న: మరి మొబైల్ నంబర్లకు ఆధార్ ఎందుకు? జవాబు: ఇది కూడా మీ భద్రత కోసమే. దేశ భద్రత కోసం కూడా. నేరస్తులు, మోసగాళ్లు వినియోగిస్తున్న సిమ్ కనెక్షన్లను తొలగించడం కోసమే అనుసంధానం చేసుకోమంటున్నాం. చాలాసార్లు నేరగాళ్లు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్లు సంపాదించి నేరాలకు పాల్పడుతున్నారు. ఆధార్తో అనుసంధానించడం వల్ల దీన్ని నివారించవచ్చు. ప్రశ్న: మొబైల్ కంపెనీలు నా వేలిముద్రలను సేవ్ చేసుకుని తర్వాత వాటిని వేరే పనుల కోసం వాడుకునే అవకాశం ఉంది కదా! జవాబు: ఆధార్ ధ్రువీకరణ సమయంలో మీరిచ్చే వేలిముద్రలను మొబైల్ కంపెనీలే కాదు, ఎవ్వరూ సేవ్ చేసుకోలేరు. సెన్సర్పై మీ వేలిముద్ర పెట్టగానే, ఆ సమాచారం ఎన్క్రిప్ట్ అయ్యి, సరిపోల్చడం కోసం యూఐడీఏఐకి వస్తుంది. ఆధార్ చట్టం–2016 ప్రకారం ఏవేనీ సంస్థలు మీ వేలిముద్రలను సేవ్ చేయడం శిక్షార్హమైన నేరం. ప్రశ్న: ఎన్ఆర్ఐలకు కూడా ఆధార్ ఉండాల్సిందేనా? జవాబు: లేదు. ఆధార్లో భారత్లో నివసిస్తున్న వారికి మాత్రమే. ఆధార్ను పొందేందుకు ఎన్ఆర్ఐలు అసలు అర్హులే కాదు. ఎన్ఆర్ఐలకు ఆధార్ లేకపోయినా అన్ని రకాల సేవలూ లభిస్తాయి. ప్రశ్న: పేదవారికి అత్యవసరమైన పింఛను, రేషన్ సరకులు తదితరాలను కూడా ఆధార్ లేని కారణంగా నిలిపేస్తున్నారు కదా? జవాబు: కచ్చితంగా లేదు. ఎవరైనా ఆధార్ కార్డు ఇంకా తీసుకోకపోతే, అలాంటి వారికి ఆధార్ సంఖ్య వచ్చే వరకు ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగానే సంక్షేమ పథకాల ప్రయోజనాలు కల్పించాల్సిందేనని చట్టంలో స్పష్టంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వ సిబ్బంది ఎవరైనా ఆధార్ కచ్చితంగా కావాల్సిందేనని ఇబ్బంది పెడుతుంటే అలాంటి వారిపై పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: కొన్ని సంస్థలు ఈ–ఆధార్ను ఒప్పుకోవడం లేదు. ఒరిజినల్ ఆధార్ కార్డు కావాల్సిందేనని అవి పట్టుబడుతున్నాయి. ఎందుకు? జవాబు: ఈ–ఆధార్ కూడా ఒరిజినల్ ఆధార్తో సమానమే. రెండింటిలో ఏదైనా ఒకటే. అన్ని సంస్థలూ రెండింటిలో దేన్నయినా అంగీకరించాల్సిందే. ఇంకా మాట్లాడితే ఒరిజినల్ ఆధార్ కన్నా ఈ–ఆధార్కే వారు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఈ–ఆధార్ను ఒప్పుకోకపోతే వెంటనే పై అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రశ్న: సామాన్యులకు ఆధార్తో ప్రయోజనమేంటి? జవాబు: ఆధార్ అంటే 119 కోట్ల మంది భారతీయుల విశ్వసనీయమైన గుర్తింపు. ఇతర ఏ గుర్తింపు కార్డుకూ లేని విశ్వసనీయత ఆధార్కు ఉంది. పల్లెల నుంచి పట్టణాల్లోని మురికి వాడల వరకు ఎవ్వరినైనా అడగండి వారు ఆధార్ను ఎలా ఉపయోగిస్తున్నారో. బ్యాంకు ఖాతాకు, ఉద్యోగానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను నేరుగా బ్యాంకు ఖాతాల్లో పొందేందుకు, రైళ్లలో ప్రయాణానికి ఇలా దేనికయినా సరే, గుర్తింపు కార్డుగా మొదటి ప్రాధాన్యత ఉన్నది ఆధార్కే. ప్రశ్న: ఆధార్ సమాచారం లీక్ అయ్యిందంటూ మీడియాలో వార్తలు చూశాం. నిజం కాదంటారా? జవాబు: ఆధార్ గత ఏడేళ్ల నుంచి ఉంది. ఎప్పుడూ సమాచారం లీక్ కాలేదు. ఆధార్ కార్డుదారుల సమాచారం భద్రంగా, సురక్షితంగాఉంది. ఆధార్ సమాచారం లీకయిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవం. మేం ఆధార్ సమాచార భద్రత కోసం అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాం. యూఐడీఏఐ -
ఆళవందార్ పిలుపు
చాలాకాలం తరువాత మరొక పరిణామం జరిగింది. యాదవప్రకాశుడి తల్లి వరదరాజస్వామి భక్తురాలు. తరచు ఆలయానికి వస్తూ ఉండేది. కాంచీ పూర్ణుల వారిని కలిసేది. వారి చెంత రామానుజులను కూడా చూసేది. వారి ఉపదేశాలను విని విశిష్టాద్వైతం పట్ల ఆకర్షితురాలైనారామె. తన కుమారుడికి రామానుజుడికి మధ్య జరిగిన సంఘటనలు తనకుకూడా కొంత తెలుసు గనుక తల్లి వారిని చూసిన ప్రతిసారీ ఎక్కడో పొరబాటు జరిగిందని అనుకునేవారు. కాంచీపూర్ణులు రామానుజుల సమక్షంలో జరిగిన వేదాంత చర్చలను తదితర విషయాలను తన కుమారుడు యాదవప్రకాశునితో ఆమె అడపా దడపా చర్చించేది. రామానుజులు శ్రీరంగం వెళ్లి వచ్చిన తరువాత ఆచార్యత్వాన్ని స్వీకరించడం, శిష్యగణాలను సమకూర్చుకుని భగవద్విషయం పరివ్యాప్తిలో ముందంజ వేయడం అంతా యాదవప్రకాశులు తెలుసుకుంటూనే ఉన్నారు. రాను రాను తన అద్వైత సిద్ధాంతం విషయంలో సందేహాలు తనను చుట్టుముడుతున్నాయి. తన గురుకులంలో ఉన్నకాలంలో రామానుజుడు ఉపనిషన్మంత్రాలకు ఇచ్చిన వ్యాఖ్యానం అర్థమవుతూ వస్తున్నది. అది ఎంత సమంజసమైందో అనుకుంటూ ఉండేవారు. తన పాండిత్యం తనకు ప్రశాంతత ఇవ్వడం లేదని, ఇంకా ఏదో అన్వేషించవలసి ఉందని ఆయన మనసు పదేపదే హెచ్చరిస్తూ ఉండేది. సరిగ్గా అదే సందర్భంలో తల్లికి కూడా తన తనయుడు యాదవప్రకాశుడు రామానుజమతంలో ప్రవేశిస్తే బాగుండేదనే ఆలోచన వచ్చింది. తానూ నిజమే అనుకున్నాడు. రామానుజునితో తాను వ్యవహరించిన తీరు, అకృత్యాలు గుర్తు చేసుకుంటూ తనను ఆయన ఆదరిస్తాడా అనే సందేహించారు. తన పాపాలకు పరిష్కారం తీర్థయాత్రలేమో అనుకుంటూ ఓ రాత్రి నిద్రించారాయన. కలలో వరదరాజు కనిపించి ‘‘ఏ యాత్రలూ అవసరం లేదు. నీవొక్కసారి రామానుజుడికి ప్రదక్షిణ చేస్తేచాలు’’ అని ఆదేశించారు. దిగ్గున లేచి కూర్చున్నారు. అనునిత్యం వరదరాజ పెరుమాళ్తో సంభాషించే కాంచీ పూర్ణులను అడిగి సందేహాలు తీర్చుకుందామనుకున్నారు. కలగన్న విషయం చెప్పి ఒకసారి వరదునితోమాట్లాడి తన సందేహాన్ని నివృత్తి చేయమని వేడుకున్నారు. సరేనన్నారు. ఆ రాత్రి వరదుడితో ఆ విషయం చర్చించినపుడు ‘‘రాత్రి నేను ఆదేశించిన తరువాత కూడా యాదవప్రకాశుడు సందేహిస్తున్నాడా. రామానుజుడిని ఆశ్రయించడమే ఆయనకు మిగిలిన మార్గం’’ అని స్పష్టం చేశారు. అది తెలిసిన వెంటనే యాదవప్రకాశుడు రామానుజుని చేరి పాదాలపైబడబోయినాడు. అంతలోనే అది గమనించిన రామానుజులు వారించి వారిని ఆలింగనం చేసుకుని సగౌరవంగా స్వాగతించారు. వరదుని ఆజ్ఞ ప్రకారం రామానుజునికి ప్రదక్షిణ చేసిశిష్యునిగా స్వీకరించమని ప్రార్థించారు. మరోసారి యాదవప్రకాశునికి ఉపనయనాది పంచసంస్కారములుగావించి గోవింద దాసు అని నామకరణం చేశారు. అచిరకాలంలోనే యాదవప్రకాశులు 11 అధ్యాయాలతో యతిధర్మసముచ్ఛయమనే గ్రంథాన్ని రచించారు. ఆతరువాత ఎంతో కాలం ఆయన జీవించలేదు. ఆ విధంగా గురువునే శిష్యుడు చేసుకున్న గురువు రామానుజుడు. వరదరాజస్వామికి ఆ కాలంలో అత్యంత సన్నిహితుడైన భక్తుడు కాంచీపూర్ణులు (తిరుక్కచ్చినంబి) వైశ్యకులానికి చెందిన వాడు. కాని ఆయన ఆచార్యత్వానికి, భక్తికి కులం అడ్డురాలేదు. ఆయన జగద్గురువు రామానుజాచార్యకే గురువు. వేయేళ్ల కిందట భక్తికి, భగవంతునితో సాన్నిహిత్యానికి ఆయన పెట్టింది పేరు. ఆయన నిజమైన అర్చకత్వానికి మంచి ఉదాహరణ. నిబద్ధతకు చిరునామా. కంచి వరదరాజస్వామి పెరుమాళ్కు ఎంతటి భక్తుడంటే పెరుమాళ్ కు వింజామర వీస్తూ సేవలు చేస్తూ ఆ స్వామితో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయనకు స్వామినుంచి సమాధానాలు లభిస్తూ ఉండేవి కూడా. అంతటి అత్యంత సన్నిహితుడు. శ్రీ వైష్ణవ అద్వైత సిద్ధాంత పాండిత్యంతో పాటు, ఆ పెరుమాళ్ల పట్ల ఆయనకు అపరిమితమైన ప్రేమ అభిమానం, అనురాగం ఉట్టిపడేది. అర్చకుడు స్వామికి అత్యంత సన్నిహితుడుగా ఉండాలి. భక్తుల బాధలు స్వామికి నివేదించే శక్తి ఉండాలి. భగవంతుని దయను భక్తుడి కోసం సాధించి ఆయన అందించవలసి ఉంటుంది. ఆ పనిచేసే కాంచీ పూర్ణుడే అంతటికి నిజమైన అర్చకుడు, ఆచార్యుడు. రామానుజుడంటే ఆయనకు అమితమైన ప్రేమ. రామానుజుని జిజ్ఞాస. విజ్ఞానం, విద్యార్థిగా ఆయన క్రమశిక్షణ. వినయం, విధేయత, కళలూ, కాంతులు, గురువంటే నిండైన అభిమానం, అహంకార రాహిత్యం, ఈరా‡్ష్యసూయలు తెలియకపోవడం వంటి అత్యుత్తమ లక్షణాలను ఆయన గమనించారు. యాదవప్రకాశుల వద్ద చదువుకుంటు న్నప్పుడు కొన్ని ఉపనిషద్వాక్యాల పైన వారిద్దరి మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు, రామానుజుని భిన్నమైన అన్వయాల గురించి తెలుసు. ఛాందోగ్యంలో ‘‘సర్వం ఖల్విదం బ్రహ్మ’’ అంటే ‘‘ఈ సమస్తమూ పరమాత్మే కద’’ అనే పరిమిత అర్థాన్ని, ‘‘ఈ కుర్చీ బల్ల నీవు, నేను ఈ ప్రదేశం ఇలా సమస్తం పరమాత్ముడే’’ అన్న వివరణను రామానుజుడి ఆమోదయోగ్యం కాలేదు. దానిని ఖండిస్తూ ప్రతిగా రామానుజుడు ‘‘ప్రతి అంశంలోనూ ప్రాధాన్యతను అనుసరించి పరిశీలిస్తే పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని అంటాం. అందులో పరమాత్మకు ప్రాధాన్యత ఉందని గమనించాలి. ‘‘ఈ కూరంతా ఉప్పే’’ అని ఎవరైనా అంటే ఉప్పు మరీ ఎక్కువగా ఉందని అర్థం వస్తుంది. కాని మొత్తం ఉప్పే ఉందనీ మరే పదార్థం లేదనీ అర్థం చెబుతామా? లేదుకదా. అంతర్లీనంగా ఉన్న మూలభావాన్ని గ్రహించాలికాని ప్రతిపదార్థం చెప్పి అదే అర్థం అంటే ఎలా?’’ అని రామానుజుడు ఎంత సమంజసంగా వాదించాడో అని కాంచీ పూర్ణులు దాని గురించే చాలా ఆలోచించేవాడు. అదే విధంగా ‘‘నేహనాస్తి కించన’’ అనే బృహదారణ్యకోపనిషద్ వాక్యానికి పరమాత్మకన్న వేరైన వస్తువే లేదనే అర్థం బదులు పరమాత్మ అంతర్యామిగా లేని వస్తువు ఉండదంటే సరైన అర్థం అవుతుందని రామానుజుడి వివరణ. ఇది ధర్మసూక్ష్మం, సరైన వ్యాఖ్యానం. ఇంత అర్థ సూక్ష్మాన్ని అవగాహన చేసుకోవడం, దానికి పోలికలు ఊహించడం, విన్నవాడు అవుననే విధంగా సహేతుకంగా వివరించడం, తరువాత గురువుగారిముందే తన వాదాన్ని వినిపించడం వెనుక ఎంత అంతర్మథనం, నిబద్ధత, సాహసం అవసరం అని కాంచీ పూర్ణులు ఆలోచిస్తూ ఉండేవారు. పెద్దాయనను ఎదిరించే ఏమవుతుందోనని భయపడటం, ఆ మనకెందుకు అని వదిలేయడం, సర్దుకు పోవడం, లేదా గురువుగారి పరోక్షంలో సహాధ్యాయుల మధ్య నిందించడం లేదా విమర్శించడం చాలా మంది శిష్యులు చేస్తూ ఉంటాం. అది నీతి కాదు, అనుసరించవలసిన రీతి కాదు. నమ్మిన సిద్ధాంతాన్ని, సమంజసమైన వ్యాఖ్యానాన్ని చెప్పడానికి వెనుకాడలేదు. గురువుగారు ఏమనుకున్నా సరే మొగమాటం లేకుండా అదేసమయంలో వినయం కోల్పోకుండా, ఆయన వివరణలో లోపాలను ఎత్తిచూపగలగడం ఒక అపురూపమైన లక్షణం, వ్యక్తిత్వం, నాయకత్వగుణం. కనుక కాంచీపూర్ణులు రామానుజుని మనసులోనే ప్రశంసిస్తూ ఉంటారు. కొన్నేళ్లకిందటే ఆ రామానుజుడిని చూడటానికి యామునాచార్యులు తన శిష్యులు పెరియనంబి అరైయార్ వెంటరాగా శ్రీరంగం నుంచి కంచికి వెళ్లారు. కాంచీ పూర్ణుడితో మాట్లాడుతూ, ‘‘రామానుజాచార్యుడని విన్నాను ఎవరతను నేనో సారి చూడాలి’’ అని వరదరాజాలయంలో అడిగారు. తాతగారైన నాథమునులు భవిష్యదాచార్యుల గురించి చెప్పినప్పటి నుంచి అతనెవరా అని ఎదురుచూస్తున్నారాయన. అప్పుడు లక్ష్మణాచార్యుల పేరుతో రామానుజులు యాదవప్రకాశుని శిష్యబృందంలో ఉన్నారు. వరదరాజపెరుమాళ్ దర్శనం చేసుకుని అక్కడే మంటపంలో నిలబడినప్పుడు, యాదవప్రకాశులు తన శిష్యబృందంతో అక్కడికి వచ్చారు. అప్పుడు కాంచీ పూర్ణులు ఆ బందంలో రామానుజుడిని చూపించారు. నమ్మాళ్వార్ల వారు నాథమునులకు ఇచ్చిన భవిష్యదాచార్యుల విగ్రహం నాథముని నుంచి వారి శిష్యుడు ఉయ్యక్కొండారులకు అందింది. ఆయన తన శిష్యుడు మణక్కాల్ నంబికి, వారినుంచి యామునాచార్యులకు లభించింది. ఈ మూర్తి జీవం పోసుకునేది ఎప్పుడు. ఆ జీవం శ్రీ వైష్ణవాన్ని ఉజ్జీవింపచేయడం ఎప్పుడు అని ఆ విగ్రహాన్నే చూస్తూ కాలంగడుపుతున్నాడు. వయసు మీరుతున్నది. కాలం గడిచిపోతున్నది. దూరం నుంచి చూసినా, రామానుజుని శరీర లక్షణాలు, కళలు, ప్రమాణాలు తాతగారిచ్చిన విగ్రహ రూపు రేఖలతో పోలి ఉన్నాయనిపిస్తున్నది. తన తపస్సు ఫలించిందనుకున్నారు. వేలసంవత్సరాల ముందే రూపొందిన ఆ విగ్రహం ప్రాణంపోసుకుని నడుస్తున్నదా అన్నట్టున్నాడు రామానుజుడు. తనకు వయసు మీద బడుతున్నకొద్దీ యామునాచార్యులవారికి భవిష్యదాచార్యులను శ్రీరంగానికి రప్పించాలన్న తపన, ఎప్పుడొస్తాడో అంటూ మనసు ఉద్విగ్నం అవుతున్నది. రామానుజుని ప్రతిభావిశేషాలు వింటూ ఉంటే అతనిలో ఆచార్య లక్షణాలు కనిపిస్తున్నాయి. గురువుకే ఉపనిషద్వాక్యాలకు అర్థం చెప్పేవాడు, గురువుగారు తరమలేని బ్రహ్మరాక్షసిని తరిమిన వాడు రామానుజుడు. అవన్నీ తెలిసిన తరువాత తన భావన సరైనదే అని నిశ్చయమైంది. ఇతనే అయదల్హనిల్ (అంటే సిద్ధాంత ప్రవర్తకుల్లో శ్రేష్ఠుడు) అని నిర్ధారించుకున్నారు. కాని యాదవప్రకాశుని శిష్యరికంలో ఉన్న వ్యక్తిని బయటకు రప్పించడం బాగుండదని అప్పుడనుకున్నాడు . యాదవ ప్రకాశుడికి ఆయన దూరం అయిన విషయం తన శిష్యుడైన కాంచీ పూర్ణుని ఆశ్రయించిన విషయం తరువాత తెలిసింది. కథ తిరగ వలసిన మలుపు తిరిగింది. వార్ధక్యం పెరిగి ఆరోగ్యం పూర్తిగా తరిగిపోకముందే ఆ యువ వైష్ణవాచార్యుడిని చూడాలనుకున్నారు. శిష్యుడు పెరియనంబి పిలిచి ‘‘నీవు కాంచీపురానికి వెళ్లి వీలయినంత త్వరగా రామానుజులను తోడ్కొని రా నాయనా’’ అని ఆదేశించారు. శ్రీరంగం నుంచి మహాపూర్ణులు వస్తున్నారని ఒక శిష్యుడు కాంచీపూర్ణులవారికి తెలియజేశారు. కాంచీ పూర్ణులు మహాపూర్ణులు యామునాచార్యుల శిష్యులు. వారిలో మహాపూర్ణులు (పెరియనంబి) ఆయనకు ప్రియశిష్యుడు. తన సహాధ్యాయికి ఎదురు వెళ్లారు. స్వాగతం చెప్పారు. పెరియనంబి పరుగు పరుగున చేరుకున్నారు.ఎదురొచ్చిన కాంచీ పూర్ణుని పలకరించారు. పరస్పర నమస్కారాలు ముగిశాయి. యామునాచార్యుల ఆదేశం వివరించారు. క్షీణిస్తున్న ఆరోగ్యం గురించి చెప్పారు. గురువుగారి ఆరోగ్యం తెలియగానే కాంచీపూర్ణులు పరితపించారు. దుఃఖం ఆగలేదు. ఎలాగో కన్నీళ్లు ఆపుకుని కర్తవ్యం నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. మహాపూర్ణులు కాంచీ పూర్ణులు గర్భాలయప్రాంగణం దాటి మండపానికి వచ్చారు. రామానుజుడు దేవాలయ బావినుంచి నీళ్లు తోడి బిందెలో నింపి, భుజాన పెట్టుకుని నడుస్తున్నాడు. కాంచీపూర్ణులు చూపగా మహాపూర్ణులు గమనించారు. స్వాభావికానవధికాతిశయ యేశితత్వం నారాయణత్వయీ నమష్యతి వైదికాః కః బ్రహ్మా శివః శతమఖః పరమస్వరాడితి ఏతే కపియస్య మహిమార్ణవ విపషస్తే అన్న శ్లోకాన్ని గొంతెత్తి పాడారు మహాపూర్ణుల వారు. రామానుజుల దృష్టి వెంటనే అటు మళ్లింది. మొత్తం శ్లోకం విన్నారు. ఆ నారాయణ స్తుతి ఆయన్ను ఆనంద పరవశుడిని చేసింది. ఆ భావం మనసును కదిలించింది. మహాపూర్ణుల దగ్గరకు వచ్చి, ‘‘ఎవరిదీ రచన? మీరెవరు? ఎక్కడ నుండి మీ రాక?’’ అని రామానుజులు అడిగారు. ‘‘యామునాచార్యవర్యులు గాక మరెవరు వ్రాయగలరు నాయనా ఈ అద్భుత శ్లోకాన్ని. ఇటువంటి శ్లోక రత్నభాండాగారమే ఆయన వాజ్ఞ్మయం కుమారా. నేను ఆ మహానుభావుడి శిష్యుడను మహాపూర్ణుడంటారు. శ్రీరంగం నుంచి వస్తున్నాను. నీ గురించి విన్నాను, ఆసూరి కేశవుని ప్రియపుత్రుడవని, శ్రీశైల పూర్ణుని మేనల్లుడవనీ వరదుని తిరుమంజన సేవకు జలసేవచేస్తున్నావని తెలుసు నాయనా. నీయందు యామునుల వారికి అపూర్వమైన అభిమానం ఉంది నాయనా’’ అని వివరించారు. ఆమాట వినగానే రామానుజుడు ‘‘యామునులంత పెద్దవారికి నేను తెలుసా.. ’’ అని ఆశ్చర్యానంద చకితుడైనాడు. తనగురించి తెలుసుకోవడమే కాదు, తనను రమ్మన్నారని తెలిసి పొంగిపోయాడు. కంచి వరదునికి నమస్కరించి, పెరుమాళ్ వద్ద సెలవు తీసుకుని, కాంచీపూర్ణునికి నమస్కరించి ఇంటికి వెళ్లి తల్లి అనుజ్ఞను అభ్యర్థించినాడు. ‘‘అళవందార్ (యామునాచార్య) రమ్మన్నారా, అంతకన్న భాగ్యమేముంది నాయనా, వెళ్లిరా, శీఘ్రంగా వెళ్లి క్షేమంగా రా రామానుజా’’ అని దీవించింది. తల్లికి సాష్టాంగదండప్రణామం చేసి, ‘‘పదండి స్వామీ వెళదాం’’ అని మహాపూర్ణులతో కలిసి కాంచీపురం నుంచి బయలుదేరారు. ఎప్పుడెప్పుడు యామునా చార్యులతో కలుద్దామా అని పరితపిస్తూ పరుగువంటి నడకతో వీలైనంత వేగంగా నడిచారు. శ్రీరంగానికి చేరుకున్నారు. -
ఆధ్యాత్మిక పరిణతి!
ఆత్మీయం ఆధ్యాత్మికత అంటే అందరికీ అనేక సందేహాలు, భావనలు ఉంటాయి. అయితే ఈ పని చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు. అందుకని ఈ పని చేయను. శక్తి లేక కాదు. ఈ గొలుసు ఎవరిదీ అని అడిగి ఇచ్చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. జేబులో వేసుకుంటే సంతోషించడు. ఆయన ఎక్కడున్నాడు? ఉన్నాడన్నది మన నమ్మకం. అంతే. ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడో అదే చేస్తాం. ఏది చేస్తే ఇంటిలోని వాళ్లు బాధపడతారో అది చేయం. ఏది చేస్తే పెద్దలు సంతోషిస్తారో అది చేస్తాను. అదే ఆధ్యాత్మికత. అది క్రమక్రమంగా పరిణతి చెందాలి. పరిణతి చెందడమంటే... దేవుడున్నాడని నమ్మింది నిజమైతే, ఆయన మనకు ఇన్ని శక్తులిచ్చాడన్నది నిజమైతే దేవుడున్నాడని అందరూ అనుకునే ఆలయానికి వెళ్లకుండా ఉండగలమా? ఆయనకు ఓ పండు నైవేద్యం పెట్టకుండా ఉండగలమా? ఆయనని అందరిలో చూడకుండా ఉండగలమా? భగవంతుడి ప్రీతికోసం ఆర్తుల సేవ చేయకుండా ఉండగలమా? డబ్బుంటే ఏదైనా ఓ గుడిలో అన్నదానం చేయకుండా ఉండగలమా? మనకు ఎప్పుడు అవకాశం వచ్చినా, భగవంతుడి కోసం, పదిమందిని సంతోష పెట్టడం కోసం బతకడం రావాలి. ఆధ్యాత్మిక పరిణతి అంటే అదే! -
సిరుల మాగాణిలోనే.. చివరి మజిలీ
- కౌలు రైతు అనుమానాస్పద మృతి - ఆత్మహత్య చేసుకున్నట్టు సందేహాలు - పీడలా మారిన అప్పులే కారణమంటున్న కుటుంబ సభ్యులు - ఓదూరులో విషాదం ఆరుగాలం శ్రమించి.. చెమట చుక్కలు చిందించి.. సిరులు పండించిన చేనే.. ఆ అన్నదాతకు ఆఖరి మజిలీ అయింది. కౌలుసాగులో దక్కుతున్నది గోరంత.. పెరుగుతున్న అప్పులు కొండంత కావడం.. అవి తీరే దారి కానరాకపోవడం వంటి కారణాలు అతడి మనసును కలచివేశాయి. మరోదారి లేదనుకున్నాడో ఏమో కానీ.. సుమారు 20 రోజుల కిందట అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. అంతకుముందు కూడా అలాగే వెళ్లి.. తిరిగి వచ్చేస్తుండడంతో.. ఈసారి కూడా అలాగే జరుగుతుందని, ఇంటికి తిరిగి వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూశారు. కానీ, అలా వెళ్లడమే అతడి చివరి ప్రయాణమని వారు ఊహించలేకపోయారు. రామచంద్రపురం రూరల్ : ప్రశాంతంగా ఉన్న ఓదూరు గ్రామంలో ఆదివారం ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రామానికి చెందిన రైతు ముమ్మిడివరపు సతీష్ (35) తాను కౌలుకు చేస్తున్న పొలంలోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం గ్రామస్తుల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. సతీష్ ఐదేళ్లుగా ఎనిమిదెకరాల్లో కౌలుకు వరిసాగు చేస్తున్నాడు. భూమి యజమానులు అంగీకరించరన్న ఉద్దేశంతో కౌలు రైతు గుర్తింపు కార్డును అతడు తీసుకోలేదు. దీంతో బ్యాంకు రుణం పొందే అవకాశం అతడికి లేకుండా పోయింది. సాగు అవసరాల కోసం ఈ ఐదేళ్లలో ప్రైవేటు వ్యక్తులవద్ద రూ.2 వడ్డీకి సుమారు రూ.5 లక్షల వరకూ అప్పు చేశాడు. ఇందులో ఇంకా లక్ష రూపాయలకు పైగా అప్పు మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అతడు గత నెల 14న అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. గతంలో కూడా ఇలాగే ఇంటి నుంచి వెళ్లిన అతడు తిరిగి వచ్చేశాడు. ఈసారి కూడా అలాగే వచ్చేస్తాడని కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా సతీష్ సాగు చేస్తున్న పంటచేనులో ఎముకల గూడుగా మారిన ఓ అస్తిపంజరాన్ని గ్రామంలో టముకు వేసే తొగరపు పెద్దబ్బులు గుర్తించి, సంబంధిత రైతు కాకర శ్రీరామకృష్ణచౌదరికి సమాచారం అందించాడు. దీంతో ఆయన వీఆర్ఓ వెంకటరెడ్డికి విషయం తెలిపాడు. వీఆర్ఓ నుంచి సమాచారం అందుకున్న రామచంద్రపురం డీఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, సీఐ కొమ్ము శ్రీధర్కుమార్లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలం వద్ద సతీష్ లుంగీ, చొక్కా, చేతి సంచిలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తించారు. దీంతో ఆ అస్తిపంజరం సతీష్దిగా నిర్ధారించారు. అక్కడి ఆధారాలనుబట్టి సతీష్ తాను కౌలుకు చేస్తున్న చేనులోనే మజా డ్రింకులో పురుగుల మందు కలుపుకొని తాగి, తనువు చాలించినట్టు భావిస్తున్నారు. సంఘటన జరిగి 20 రోజులు పైగా కావడంతో సతీష్ మృతదేహాన్ని నక్కలు పీక్కు తినేశాయి. పుర్రె ఒకచోట, ఎముకల గూడు ఒకచోట ఉండి సంఘటన స్థలంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. మృతునికి తండ్రి సత్యనారాయణ, భార్య అన్నపూర్ణ, 12 ఏళ్ల కవల పిల్లలు రాముడు, లక్ష్మణుడుతోపాటు మరో కుమారుడు విజయ్కుమార్ (7) ఉన్నారు. సతీష్ మరణవార్త తెలిసిన వెంటనే భార్య అన్నపూర్ణ స్పృహ తప్పిపోయింది. దీంతో ఆమెను వేళంగిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. తన భర్తకు లక్ష రూపాయలకు పైగా అప్పులున్నాయని, ఐదేళ్లుగా చేస్తున్న వ్యవసాయంలో నష్టాలు వచ్చాయని ఆమె చెప్పింది. ఈ ఏడాది పంట బాగానే పండినా రేటు తక్కువగా రావడంతో, గతంలో చేసిన అప్పులు అలాగే ఉండిపోయాయని వాపోయింది. గతంలో పెద్ద కుమారులు పుట్టినప్పుడు సతీష్ తమను వదిలి వెళ్లిపోయాడని, చాలాకాలం తర్వాత తిరిగి వచ్చాడని, ఇప్పుడు కూడా అలాగే వెళ్లి ఉంటాడనుకున్నామని, ఇంత దారుణానికి ఒడిగడతాడని ఊహించలేకపోయామని విలపించింది. యజమాని మృతితో ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులకు కలచివేసింది. పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవాడని, చిన్నకుమారుడు విజయ్కుమార్ను ఎప్పుడూ భుజం దించేవాడు కాదని స్థానికులు అంటున్నారు. సతీష్ మరణంపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎముకల గూడును రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?
-
ఇంతకీ రాజీనామా చేశారా.. లేదా?
వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టారు. అయితే, అసలు వీళ్లు తమ పదవులకు రాజీనామాలు చేశారా లేదా అన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియడం లేదు. నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లుగా వదంతులైతే వస్తున్నాయి గానీ, ఎక్కడా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు. వాళ్ల రాజీనామా లేఖలు ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయా, అసెంబ్లీ స్పీకర్ వద్ద ఉన్నాయా అన్న విషయం కూడా తెలియడం లేదు. ఎవరైనా సరే పార్టీ మారినప్పుడు ముందు తామున్న పార్టీ ద్వారా సంక్రమించిన అన్ని పదవులకు రాజీనామా చేయడం పద్ధతి. అలా చేయించకపోగా.. మొత్తం 21 మంది ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పి తమ పార్టీలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు.. వాళ్లలో నలుగురిని ఏకంగా కేబినెట్లోకి తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటివాళ్లు సైతం.. అసలు ఇది ఏ పార్టీ మంత్రివర్గం అని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. సొంత పార్టీలో బోలెడంత మంది సీనియర్లు, ఆశావహులు కూడా ఉన్నప్పటికీ వాళ్లందరినీ కాదని నలుగురు వేరే పార్టీ ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు వాళ్ల రాజీనామాలపై సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెరతీశారు. సాంకేతికంగా వాళ్లు రాజీనామా చేసినట్లు చూపించి, వాటిని స్పీకర్ ఇంకా ఆమోదించనట్లుగా చెబితే సరిపోతుందని చూస్తున్నట్లు తెలుస్తోంది. తామైతే ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసినట్లు వాళ్లు చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించడం, ఆ రాజీనామా లేఖలను తమ వద్దే ఉంచుకోవడం ద్వారా మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు వాళ్ల పదవులను భద్రంగా ఉంచడం అనే వ్యూహాన్ని టీడీపీ నేతలు అమలుచేస్తున్నారని అంటున్నారు. అసలు నిజంగా ఈ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారా లేదా అన్న విషయం కూడా ఇంతవరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన నలుగురు ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, అమర్నాథ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు రాజీనామా చేశారా లేదా అనే విషయాన్ని స్పీకర్ కార్యాలయం కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దాంతో ఈ విషయంలో ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. గతంలో తలసాని శ్రీనివాస యాదవ్ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు చేసింది ఏంటని విమర్శిస్తున్నారు. -
ఆపరేషన్ క్లీన్ మనీ: 9లక్షల ఖాతాలు సందేహాస్పదం
న్యూఢిల్లీ: 'ఆపరేషన్ క్లీన్ మనీ' ప్రక్రియలో ఇటీవల ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా వివరణకు ఇచ్చిన గడువు (ఫిబ్రవరి 15) ముగియడంతో తదుపరి చర్యలకు దిగుతోంది. ఈ మేరకు రద్దయిన నోట్ల డిపాజిట్లపై ఇటీవల గుర్తించిన 18 లక్షల అనుమానాస్పద ఖాతాల్లో దాదాపు సగం ఖాతాలపై ఆదాయపన్ను శాఖ అనుమానాలను వ్యక్తం చేసింది. 9 లక్షల ఖాతాల్లో బ్యాంకు డిపాజిట్లను 'సందేహాస్పదంగా' గుర్తించినట్టు ఐటీ శాఖ ప్రకటించింది. అయితే కొత్త పన్ను అమ్నెస్టీ పథకం మార్చి 31 న ముగిసిన అనంతరం ఈ ఖాతాలపై చర్యకు దిగనునున్నట్టు ప్రకటించింది. ఆపరేషన్ క్లీన్ మనీ లో భాగంగా డీమానిటైజేషన్ 50-రోజుల కాలంలో రూ.5 లక్షలకు పైన అనుమానాస్పద డిపాజిట్లపై ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా 18 లక్షలమందిని ఆరాతీసింది. వీరిలో చాలా మంది ఫిబ్రవరి 12దాకా తమకు సమాధానాలు ఇచ్చినట్టు చెప్పింది. అయితే వీటికి సమాధానం చెప్పని ఖాతాదారులు , సరియైన న్యాయపరమైన వివరణ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని ఐటీ వర్గాలు ప్రకటించాయి. తమ నోటీసులకు ప్రత్యుత్తరం పంపనివారికి లేదా ఐటిఆర్ వెల్లడిపై ఉద్దేశపూర్వకంగా కట్టుకథలు చెప్పేవారిపై కచ్చితంగా చర్య తీసుకోబడుతుందన్నాయి. 2016-17 ఆదాయ రిటర్న్స్ తోనే సరిపోలనీ, లేదా గడచిన సంవత్సరాలలో ఆదాయంలో అసాధారణ పెరుగుదల ఉంటే వాటిని అక్రమ ఆస్తులు, లేదా నల్లధనం కింద పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్ రిజిస్టర్ కాని సుమారు 4.84లక్షల పన్నుచెల్లింపుదారులకు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఎస్ఎంఎస్ లు పంపినట్టు తెలిపింది. అయితే ఎస్ ఎంఎస్ ఇ-మెయిల్ చట్టపరమైన నేపధ్య లేని నేపథ్యంలో, అధికారిక నోటీసులు పంపడానికి, తదుపరి చర్యలు మార్చి 31 వరకు వేచి ఉంటామని తెలిపింది. ఆపై సందేహాస్పద డిపాజిట్లపై చర్యలుంటాయని తెలిపింది. ఆదాయ వెల్లడికి ఉద్దేశించిన పథకం ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం మార్చి 31 వరకు నడుస్తుంది కాబట్టి , ఈ లోపు సంపదను వెల్లడించి పన్నులు చెల్లించాస్తారా లేదా అనేది డిపాజిటర్లు తేల్చుకోవాలని పేర్కొంది. కాగా రద్దయిన నోట్ల డిపాజిట్లపై 18 లక్షల అనుమానాస్పద ఖాతాలను గుర్తించిన ఆదాయపన్ను శాఖ వివరణ ఇవ్వాల్సిందిగా ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా కోరింది. ఇందుకుగానుఫిబ్రవరి 15వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
-
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబానికి కష్టమే వచ్చిందో.. లేదా ఎవరైనా కర్కశత్వం చూపారో గానీ, ఒక తల్లి, ఇద్దరు అభం శుభం ఎరుగని చిన్నారులు రైలు పట్టాల పక్కన మరణించి పడి ఉన్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. స్టేషన్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలిద్దరూ విశ్వభారతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అబ్బాయి నాగరాజు ఒకటో తరగతి చదువుతుండగా, చిన్నబ్బాయి సాయితేజ యూకేజీ చదువుతున్నాడు. వాళ్ల తల్లి గౌరమ్మ పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ సిగ్మా అపార్టుమెంట్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురూ ఎలా, ఎందుకు మరణించారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
మహిళ సజీవ దహనం
మృతిపై అన్నీ అనుమానాలే యాచకురాలై ఉంటుందని పోలీసుల భావన చంపి పడేసి ఉంటారంటున్న స్థానికులు అగనంపూడిలో సంచలనం రేపిన ఘటన వివరాలు సేకరించిన సౌత్ ఏసీపీ, క్లూస్ టీం అగనంపూడి (గాజువాక) :ఓ మహిళ పూరిపాకలో సజీవ దహనమైంది. అయితే సహజంగా మంటలు అంటకుని మరణించిందా..? లేక ఎవరైనా చంపేసి నిప్పు అంటించారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మృతిరాలి వయసు 40 సంవత్సరాలు వరకు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి అగనంపూడిలో జరిగిన ఈ ఘటన బుధవారం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అగనంపూడి నిర్వాసితకాలనీ గల్లవానిపాలెంకు చెందిన రెడ్డిపల్లి దేముడమ్మ అగనంపూడి ఆంజనేయస్వామి ఆలయంలో సేవ చేస్తూ పక్కనే పాకవేసుకొని అరటిపళ్లు, కొబ్బరికాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె రోజూ ఉదయం ఆరు గంటలకు ఆలయానికి వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లిపోతుంది. మంగళవారం కూడా అలాగే వెళ్లిపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో పాక కాలిపోతున్న విషయాన్ని గస్తీ పోలీసులు గుర్తించారు. వెంటనే ఆంజనేయస్వామి ఆలయం అర్చకులు రవికుమార్ను నిద్ర లేపారు. అర్చకులు 3గంటలకు దేముడమ్మకు ఫోన్చేసి పాక కాలిపోతున్న విషయం చెప్పడంతో ఆమె బంధువులు వచ్చి మంటలను ఆర్పేసి వెళ్లిపోయారు. ఉదయం 6గంటలకు వచ్చి ఆమె సామాగ్రి (స్టీల్ బేసిన్లు, డబ్బాలు) లోపల ఏమైనా మిగిలాయా అని వెదుకుతుండగా మహిళ సజీవ దహనమై ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. యాచకురాలిగా అనుమానం రాత్రి 9గంటల సమయంలో ఒక మతిస్థిమితం లేని మహిళ అరుస్తూ కేకలు వేయడం చూశానని అక్కడ బీట్ కాస్తున్న ట్రాఫిక్ పోలీసు చెప్పడంతో మృతురాలు యాచకురాలిగా అనుమానిస్తున్నారు. ఆమె శరీరంపై నైటీ ఉందని కూడా ట్రాఫిక్ పోలీస్ చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ యాచకురాలే పాకలో చలి కాయడానికి మంట వేసి ఉంటుందని స్థానికులు, పోలీసులు అంటున్నారు. అలా అనుకున్నా పాకను మంటలు వ్యాపిస్తుంటే, యాచకురాలు ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయలేదు. నిద్ర మత్తులో ఉన్నా ఆమె ఉన్న పాక పూర్తిగా కాలిబూడిదై పోతున్నా పడుకున్నచోటనే ఎందుకు ఉండిపోయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతిస్థిమితం లేని వారైనా అగ్గి మంటలు వ్యాపిస్తుంటే ఎందుకు కదలకుండా పడుకున్న చోటే ఉండిపోతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సుమారు 40సంవత్సరాల వయసు ఉండడం, నైటీతో ఉండడాన్ని బట్టి ఎవరో మహిళను చంపేసి పాకలోకి తీసుకొచ్చి పడేసి నిప్పంటించి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల కిందట మిస్సింగ్ కేసులేమైనా నమోదయ్యాయా అని విచారిస్తున్నారు. అణువణువూ పరిశీలించిన పోలీసులు సౌత్ ఏసీపీ రామ్మోహన్రావు, దువ్వాడ, స్టీల్ప్లాంట్ సీఐలు ఎన్.కుమార్, మళ్ల మహేష్, ఎస్ఐ జోగారావు, క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్టీం సభ్యులు అణువణువూ పరిశీలించారు. సజీవదహనం కేసు మిస్టరీకి ఏమైనా క్లూ దొరుకుతుందోమేనని పరిసరాలన్నీ పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహం కింద కాలిపోకుండా ఉన్న దుస్తుల ముక్కల ఆధారంగా మహిళ అని నిర్థారించి, ఆమె నైటీ వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. పాక యజమాని, ఆలయ అర్చకులు రవికుమార్, పరిసర ప్రాంతంలోని వారిని విచారించిన పోలీసులు మృత కళేబరాన్ని పోస్టుమార్టం కోసం కేజీహెచ్కు తరలించారు. పుర్రె, ఎముకులు మాత్రమే మిగిలాయి. కింద భాగం మాత్రం చాలావరకు కాలకుండా ఉండిపోయింది. -
అమ్మ మృతిపై అనుమానాలు: ప్రధానికి లేఖ
సుదీర్ఘ కాలం పాటు కమల్హాసన్తో సహజీవనం చేసి, ఇటీవలే విడిపోయిన ప్రముఖ నటి గౌతమి.. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక లేఖ కూడా రాశారు. జయలలిత ఆస్పత్రి పాలు కావడం, అక్కడ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పడం, అంతలోనే ఉన్నట్టుండి మృతి చెందారనడం.. వీటన్నింటిపైనా ఆమె ప్రధానికి రాశారు. అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం అన్ని విషయాలనూ కప్పిపెట్టి ఉంచారని, ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఎంత వీఐపీ, వీవీఐపీ వచ్చినా కూడా ఆమె ముఖాన్ని చూపించలేదని అన్నారు. అమ్మ ఆరోగ్యం పట్ల ఎంతో ఆందోళనతో వచ్చినవాళ్లంతా ఆమెను చూసే అవకాశం లేకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారని గౌతమి అన్నారు. నిజానికి తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా కూడా పలువురికి జయలలిత ఆరోగ్యం, మృతి తదితర విషయాలపై అనుమానాలున్నా, ఎవరూ ఇలా బహిరంగంగా చెప్పలేదు. ఆమె మాత్రం నేరుగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఇటీవలే ఒకసారి ప్రధాని మోదీని కూడా గౌతమి కలిసి వచ్చారు. అందరికీ ప్రేమమూర్తి, తమిళనాడు ప్రభుత్వాధినేత్రి కూడా అయిన ఆమె ఆరోగ్యం విషయంలో ఇంత రహస్యం ఎందుకు పాటించాల్సి వచ్చిందని గౌతమి ప్రశ్నించారు. ఆమె వద్దకు వెళ్లకుండా నియంత్రించిన వాళ్లు ఎవరు, వాళ్లకున్న అధికారం ఏంటన్నారు. ఆమె ఆరోగ్యం చాలా పాడైనప్పుడు ఆమెకు అందించాల్సిన చికిత్సల గురించి నిర్ణయాలు తీసుకున్నవాళ్లు ఎవరని అడిగారు. ప్రజల మదిలో అలజడి రేపుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరిస్తారని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుల గురించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు పౌరులకు ఉంటుందని గౌతమి తెలిపారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటే కుదరదన్నారు. మోదీ తన ఆవేదనను పట్టించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్బీఐ తప్పులో కాలేసిందా?
ముంబై: డీమానిటైజేషన్ అనంతరం బ్యాంకుల్లో డిపాజిట్లు కచ్చితమైన లెక్క ఎంత ? పెద్దనోట్ల తర్వాత దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ అయిన మొత్తం నగదుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆర్బీఐ లెక్కల ప్రకారం రూ.11.5 లక్షల కోట్లు జమ అయింది. అయితే ఈ గణాంకాలపై ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ అనుమానం వ్యక్తం చేసింది. బహుశా డబుల్ కౌంట్ అయి వుంటుందనే అభిప్రాయపడింది. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్లు , విత్ డ్రా కరెన్సీ తో పాటు , ముఖ్యంగా కొత్త నోట్లు, చెలామణీలో ఉన్ననోట్లను కలిపి డబుల్ లెక్కింపు జరిగి ఉంటుందనే అనుమానాలను లేవనెత్తింది. దీంతో ఏ లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవాలో తెలియక మార్కెట్ వర్గాలు అయెమయంలో పడిపోయాయి. కచ్చితమైన గణాంకాలు ప్రకటించకపో్యినప్పటికీ , దీనిపై ఎస్ బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కొంత వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ప్రకటనపై వ్యాఖ్యానించిడానికి నిరాకరించిన ఆమె డబుల్ లెక్కింపు అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. తమతో ఉన్న పోస్ట్ ఆఫీస్, కో ఆపరేటివ్ ఖాతాల్లో ఇప్పటికే కొత్త నోట్ల డిపాజిట్లు ప్రారంభమైందన్నారు. 10-15 శాతం డబుల్ లెక్కింపు జరిగివుంటుందని ఎస్బీఐ పరిశోధనా విభాగం అంచనావేసినట్టుతెలిపారు. నవంబర్ 10 నాటికి ఎస్బీఐ మొత్తం డిపాజిట్లు విలువ రూ 3.5 లక్షల కోట్లకు చేరింది. కాగా రివ్యూ పాలసీ సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ మొత్తం డిపాజిట్ల విలువ రూ 11.5 లక్షల కోట్ల దాటిందని చెప్పారు. అధిక విలువ కలిగిన బ్యాంకు నోట్లద్వారా రూ 14.95 లక్షల కోట్ల డిపాజిట్ల రూపంలో బ్యాంకులకు తిరిగి వస్తుందని ఊహాగానాలకు దారి తీసిందని పేర్కొన్నారు. నల్లధనం వెలికితీత కోసం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం హడావిడిగా చేసింది కాదనీ, వివరణాత్మక చర్చల తర్వాత మాత్రమే జరిగిందని చెప్పారు.అలాగే వివిధ తరహా నోట్లను ఇప్పటికే రూ.3.81లక్షల కోట్ల విలువైన నోట్లను అందించామనీ, ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ గత మూడు సంవత్సరాల్లో సరఫరా చేసినదాని కంటే ఇది ఎక్కువని చెప్పారు. -
మోదీ మెరుపుదాడి గురి తప్పిందా?
-
మోదీ మెరుపుదాడి గురి తప్పిందా?
ఇది ఎలా జరిగింది? కొత్త కరెన్సీ రహస్యం కొన్ని వర్గాలకు ముందే ఎలా తెలిసింది? (ఇంటర్నెట్ ప్రత్యేక కథనం) హైదరాబాద్ : దేశాన్ని కుదిపేస్తున్న కొత్త కరెన్సీ కథ కొంతమందికి ముందే తెలిసిందా? పై స్థాయి రాజకీయ, వ్యాపారవర్గాలకు అది ముందుగానే లీక్ అయిందా? కొత్త రూకల వ్యవహారం రాజకోట రహస్యమనీ, అది మూడో కంటికి తెలియదనీ, అలా తెలియకూడదనే ఆకస్మిక నిర్ణయం ప్రకటించామనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నా వాస్తవ'చిత్రం' మాత్రం దానికి భిన్నంగా ఉంది. బ్లాక్ మనీపై 'సర్జికల్ స్ట్రైక్' గా అంతా అభివర్ణించిన ఈ చర్య సామాన్యుల పాలిట పిడుగుపాటుగా పరిణమించగా, నల్లబాబులు మాత్రం ముందుగానే ఇల్లు చక్కబెట్టుకున్నారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 1. మరో పక్షం రోజుల్లో కొత్త 2000 నోట్లు రానున్నాయంటూ మొహిత్ గులాటీ నవంబర్ 5 న ట్విటర్ లో పోస్టు చేశారు. 2.) మొహిత్ గులాటీ ట్వీట్ పై స్పందించిన ఇతరుల కామెంట్లు ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొందరు చేసిన సంచలన పోస్టులు ఈ అనుమానాలను ధ్రువపరుస్తున్నాయి. బీజేపీ పంజాబ్ లీగల్ సెల్ కో- కన్వీనర్ సంజీవ్ కాంబోజ్ నోట్ల రద్దుకు మూడు రోజుల ముందే రూ.2,000 నోట్ల కట్టల ఫోటోలను ట్విట్టర్ లో పెట్టారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రస్తావించారు. అదొక్కటే కాదు, మరి కొందరు సైతం ఈ నోట్ల సంగతిని నవంబర్ 5 వ తేదీనాడే ట్విట్టర్ లో పెట్టారు. అది కూడా ఫోటోలతో సహా. మోహిత్ గులాటీ అనే వ్యక్తి పక్షం రోజుల్లో కొత్త రెండు వేల రూపాయల నోట్లు వస్తాయని నవంబర్ 5 నే ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ పోస్టుతో పాటు పింక్ రంగులో ఉన్న నోట్ల కట్టల ఫోటోలను కూడా పోస్టు చేశారు. ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చిందో చెప్పమని మన్ దీప్ ఆశియా అనే వ్యక్తి అడిగితే "భాయ్... కాన్ఫిడెన్షియల్ ... సారీ" అని మోహిత్ బదులిచ్చాడు. ఆర్బీఐ హిందీలిపిలో నోటు విలువను ముద్రించదని దీనిపై మరొకరు సందేహం కూడా వ్యక్తం చేశారు. ఇది నిజమేనా? ఆర్బీఐ నుండి అధికారిక సమాచారమేదీ లేదే? అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే తనకు నోట్ల మార్పిడిలో 786 నంబర్ ఉన్న రెండు వేల నోటు వచ్చిందని కూడా మోహిత్ ట్వీట్ చేసి ఆ నోటు తాలూకు ఫోటో కూడా పెట్టాడు. 3.) కొత్త 2000 నోట్లను చూపించే చిత్రంతో పాటు ఆర్పీఐ త్వరలోనే కొత్త 2000 నోట్లను విడుదల చేయబోతోందని చెబుతూ పంజాబ్ బీజేపీ లీగల్ సెల్ నాయకుడు సంజయ్ కాంభోజ్ చేసిన ట్వీట్ ఇదంతా ఇలా ఉంటే, నవంబర్ 5న బీజేపీ నేత సంజీవ్ కాంభోజ్ కూడా రెండు వేల రూపాయల బండిల్స్ ఫోటోను ట్వీట్ చేశారు. 'రిజర్వ్ బ్యాంక్ టు ఇష్యూ రుపీస్ 2000 కరెన్సీ నోట్ ఇన్ ఇండియా సూన్' అని ట్వీట్ కూడా పెట్టారు. కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడం పరమ రహస్యమే అయితే వీళ్లందరికీ అది ముందుగానే ఎలా తెలిసింది? అది కూడా ప్రధాని ప్రకటన చేసిన నవంబర్ 8 కంటే మూడు రోజుల ముందే! మోహిత్ గులాటీ ట్వీట్ చేసిన ఫోటోను అంకితా రాజేశ్వరి అనే ఆన్ లైన్ జర్నలిస్టు నవంబర్ 6 నాడు 'టైమ్స్ ఆఫ్ ఇండియా సైట్' లోని తన బ్గాగ్ లో ఉంచారు కూడా. Twitter abuzz with new Rs 2,000 banknote from RBI. Leaked photos or a hoax? అన్న శీర్షికతో వ్రాసిన ఈ బ్లాగ్ లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావించారు. గుజరాతీ పత్రికల్లో అక్టోబర్ లోనే వెయ్యి, ఐదొందల నోట్ల రద్దుపై ముందస్తు వార్తాకథనాలు వెలువడిన సంగతి కూడా వెలుగులోకి వచ్చింది. వెయ్యి నోటు రద్దు తప్పిదం సరిదిద్దుకునేందుకేనా? కొత్త కరెన్సీ వ్యవహారం చాలా మందికి ముందే తెలుసని ఇప్పుడిప్పుడే తెలుస్తుండగా, రూ. 1000 నోటు రద్దు వెనుక కూడా పెద్ద కథే ఉందని చెబుతున్నారు. గత డిసెంబర్ లో వెయ్యి నోటు ముద్రణకు సంబంధించి ఒక పెద్ద పొరపాటు జరిగినట్లు తెలుస్తోంది. సుమారు కోటి వెయ్యి నోట్లలో పొరపాటు జరిగినట్లు ఆర్బీఐ వర్గాలు అంటున్నాయి. ఈ నోట్లలో ఎంతో కీలకమైన 'సెక్యూరిటీ త్రెడ్' మిస్ అయింది. ఈ సెక్యూరిటీ త్రెడ్ లో RBI, 1000 ఇంగ్లీషులోను, భారత్ అనే అక్షరాలు దేవనాగరి లిపిలోను ఉంటాయి. తప్పుగా ముద్రితమైన వెయ్యి నోటులో ఈ త్రెడ్ కనిపించదు. హోషంగాబాద్ సెక్యూరిటీ మిల్ నుండి దీనికి కావలసిన పేపర్ సరఫరా అయింది. సెక్యూరిటీ త్రెడ్ ను గుర్తించకుండానే అధికారులు ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ లకు సదరు నోట్లతో సహా మొత్తం 200 మిలియన్ల నోట్లను జనవరి 2016లో పంపించి వేశారు. ఆ తర్వాత ఎప్పుడోగానీ జరిగిన పొరపాటును గుర్తించారు. అలాంటి నోట్లు కనుక వస్తే రిజర్వ్ బ్యాంకుకు జమ కట్టేయమని బ్యాంకులన్నిటికీ ఆదేశాలు అందాయి. 4.) 500, 1000 నోట్లను రద్దు చేస్తారంటూ ఆరు నెలల కిందటే గుజరాతీ పత్రికలో అచ్చయిన కథనం కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ పీ ఎం సి ఐ ఎల్) కు చెందిన నాసిక్ ప్రెస్ లో ఈ తప్పిందం జరిగిందట. ఈ వ్యవహారంపై ది హిందూ దినపత్రిక ముంబై నుండి 2016 జనవరి 1న 'RBI tells banks to replace defective 1,000-rupee notes' శీర్షికతో ఒక వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. ఈ తప్పిదానికి ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారని కూడా తెలుస్తోంది. 5.) 2000 నోట్లు రాబోతున్నాయంటూ అక్టోబర్ 27 న దైనిక్ జాగరణ్ ప్రచురించిన కథనం 2015 మార్చి 31 నాటికి 5,612 మిలియన్ల 1000 డినామినేషన్ నోట్లు సరఫరా లో ఉన్నాయి. దేశంలోని మొత్తం కరెన్సీ విలువలో ఇది 39.3 శాతం. ఈ నోట్ల వల్ల దొంగనోటుకు అసలు నోటుకు తేడా గుర్తించడం కష్టమైపోయింది. అసలు నోటు కూడా దొంగనోటై పోయింది. దీనిపై గత ఏడెనిమిది నెలలుగా ఆర్బీఐ, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. నోట్ల రద్దుతోనే ఈ సమస్య తీరుతుందని నిర్ణయానికి వచ్చారు. తప్పిదం జరిగిందని అంగీకరిస్తే భారత ప్రభుత్వం ప్రతిష్ఠ మసకబారుతుంది. అందుకే నల్లధనంపై యుద్ధంగా ప్రకటించి కాగలకార్యం పూర్తి చేయాలని భావించినట్లుగా తెలుస్తోంది. కేవలం రూ.1000 నోటును రద్దు చేస్తే అనుమానాలు తలెత్తుతాయని భావించి పనిలో పనిగా రూ.500 నోటును కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకే కొన్ని నెలల్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూ.1000 నోటును మళ్లీ విడుదల చేస్తామని ఆర్బీఐ వెల్లడించింది. 6.) వెయ్యి రూపాయల నోటుపై ఉండాల్సిన సెక్యూరిటీ త్రెడ్ వెయ్యి నోటు నల్లధనానికి తావిస్తోందని విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ఏకంగా రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. మళ్లీ వెయ్యి నోటు కూడా వస్తుందని ప్రకటించారు. ఈ చర్యలు మున్ముందు బ్లాక్ మనీకి మరింత వెసులుబాటు కలిగిస్తాయని పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెరసి నల్లధనంపై మోదీ సదుద్దేశంతోనే యుద్ధం ప్రకటించినా కూడా అది గురి తప్పిందేమోనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
'నోట్' దిస్ పాయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనాథ్.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికెళ్లే సరికి.. తన కొడుక్కి సడన్గా జ్వరమొచ్చిందని భార్య చెప్పింది. సరే తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్దాంలే అనుకున్నాడు. కానీ అప్పుడే గుర్తొచ్చింది.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏటీఎంలో ఉన్నా అవేమో పనిచేయట్లేదే అని!! సర్లే తెల్లారాక చూద్దాంలే అని పడుకున్నాడు. తెల్లారాక అసలు విషయం భార్యతో చెప్పాడు. పర్లేదు నా దగ్గర రూ.1,000 నోటుంది అంది భార్య. ఇదీ సమస్యే. ముందైతే ఆసుపత్రికెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తే ఇబ్బందనుకున్నారు. ఆటోలో వెళ్దామని రోడ్డెక్కారు. ఆటో వచ్చింది కానీ, ‘‘సర్ మీ దగ్గర రూ.100 నోటుంటేనే ఎక్కండి. పెద్ద నోట్లయితే వద్దు. ఇప్పటికే ఇద్దరు ప్యాసింజర్లను వదిలేశాను’’ అన్నాడు ఆటో డ్రైవర్. చేసేదేం లేక ఇంటికెళ్లి బైక్ తీసుకొని బయల్దేరారు. తీరా ఆసుపత్రికెళ్లాక.. ‘‘దయచేసి చిల్లర ఇవ్వండి.. పెద్ద నోట్లు తీసుకోబడవు’’ అని బోర్డు చూసి కంగుతిన్నారు. ముందు డాక్టర్ని చూడనిద్దాం. ఫీజు సంగతి తర్వాత చూద్దాంలే అని అనుకుని డాక్టర్ వద్దకెళ్లారు. తీరా పూర్తయ్యాక.. కన్సల్టేషన్ ఫీజు కోసం చేతిలో ఉన్న రూ.1,000 నోటిస్తే.. బోర్డు చూడలేదా? అంటూ నోటు తీసుకోనన్నాడు డాక్టర్. నా దగ్గర ఈ నోటు తప్ప వేరే లేదు. కార్డుంది కావాలంటే స్వైప్ చేయడన్నాడు శ్రీనాథ్. కానీ, డాక్డర్ వద్ద స్వైప్ మిషన్ లేదు. ముందెళ్లి మందులు తీసుకో.. ఆ తర్వాత వచ్చి ఫీజు ఇవ్వమన్నాడు డాక్టరు. సరే అని మందుల షాపుకెళ్తే పెద్ద నోటు మార్చడానికి రూ.100 అదనంగా చార్జీ చేశాడు షాపతను. చేసేదేంలేక చేతి చమురు వదిలించుకొని బైక్ వద్దకెళితే బండిలో పెట్రోల్ నిండుకుంది. దగ్గర్లోని బంకుకెళితే.. చాంతాడంత క్యూ. సరే అని తన వంతొచ్చేదాకా వెరుుట్ చేస్తే.. ఫుల్ ట్యాంక్ తప్ప చిల్లరకు పెట్రోల్ పోయలేమన్నారు. ఇక్కడా చేసేదేం లేక జేబు గుల్ల చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. రూ.1,000తో ఇంట్లోంచే బయటికెళితే.. డాక్టర్ ఫీజు, మందులు, పెట్రోల్, ఎక్స్ట్రా చార్జీలు పోగా.. రూ.100తో ఇంటికి చేరాడు. .. ఇది జరిగిన ఘటన. సామాన్యుడి యాతనకు నిదర్శనం. నిత్యావసరాలన్నిటికీ పాత నోట్లు చెల్లుతాయని చెబుతున్నారు. నిజమా? ఈ నెల 11వ తేదీ వరకూ పాత రూ.500, రూ.1,000 నోట్లు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో చెల్లుతాయని ప్రభుత్వం చెబుతోంది. పైన చెప్పిన వాటిల్లో సామన్యుడికి రోజువారీ అవసరమైంది పెట్రోల్ బంకే. మరి ప్రభుత్వం లేదా చమురు సంస్థలు నేరుగా నడుపుతున్న పెట్రోల్ బంకులు దేశంలో ఎన్నున్నాయి? వాటికి ఎందరు వెళ్లగలరు? ఎంతమందికని వారు చిల్లర ఇవ్వగలరు? నిజానికి పెద్ద నోట్లు రద్దయిన రాత్రి నుంచే పెట్రోల్ బంకుల్లో జనాలు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకులు ఇదే అదనుగా పెట్రోల్ రేట్లను కృత్రిమంగా పెంచేశాయి. ఇంకొన్ని తమ వద్ద చిల్లర లేదంటూ కస్టమర్లను తిరిగి పంపేశాయి. ఇంకొన్ని ఫుల్ ట్యాంక్ అరుుతేనే కొడతామని చెప్పాయి. అవసరం నిమిత్తం కొందరు వాహనదారులు కావాల్సినంత పెట్రోల్ పోయించుకొని రూ.500 నోటు ఇచ్చి చిల్లర లేదనటంతో ఏం చేయలేక వదిలేసి వెళ్లిపోయిన వారూ ఉన్నారు. ఈ రకంగానూ సామాన్యుడి జేబుకే చిల్లు పడింది. టోల్ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి. తగినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. అన్ని వర్గాలకూ అష్టకష్టాలు.. శుభకార్యం కోసమని ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే ఏం చేయాలి? కొత్త నోట్లెలా వస్తారుు? చేతిలోని పెద్ద నోట్లను బ్యాంకుల్లో వేసి, కొత్త నోట్లు తీసుకోవటం పెద్ద కసరత్తే. మరి ఇంట్లో శుభకార్యం కోసమని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసో, స్నేహితుల నుంచి అప్పోసప్పో చేసి ఇంట్లో పెట్టుకున్నవారి పరిస్థితేంటి? చాలామంది పెళ్లిళ్లలకు, శుభకార్యాలకు సరైన రోజులు కావటంతో అడ్వాన్సలు, ఖర్చుల కోసమని భారీగా నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అడ్వాన్స ఇవ్వటానికి వెళితే పెద్ద నోట్లు తీసుకోలేమని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. విహారయాత్రలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వారు చేతిలో ఉన్న పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊరు కాని ఊళ్లో పరిచయస్తులు కూడా లేని ప్రాంతాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు, తినడానికి తిండీ లేక నరకయాతన అనుభవించారు. బ్యాంకు ఖాతాల్లో అయితే ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఖాతాలు లేనివారికి, నగదు అవసరమైన వారికి రోజుకు రూ.4 వేలు మాత్రమే ఎక్స్చేంజ్ చేస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ అవసరమైనవారి సంగతేంటి? నోట్ల మార్పునకు ఈ నెల 24 వరకు పరిమితిని రూ.4 వేలుగా విధించారు. కానీ దేశంలో రోజుకు రూ.4 వేలకన్నా ఎక్కువ ఖర్చుచేసేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల తొలి రోజే దేశంలో 70 శాతం వ్యాపారం పడిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారుు. ఎప్పుడూ ట్రాఫిక్తో, వ్యాపారాలతో కిటకిటలాడే హైదరాబాద్లో రోడ్లు సైతం ఖాళీగా కనిపించారుు. చాలా మంది చేతిలో ఉన్న సొమ్ముతో నిత్యావసర కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో రెస్టారెంట్లు, బార్ షాపులు, వైన్షాపులు, సినిమా థియేటర్లు వెలవెలబోయారుు. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగం, ఆన్లైన్ చెల్లింపుల వంటి ఎలక్ట్రానిక్స్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం, పరిమితి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో వీటిద్వారా జరుగుతున్న జరుగుతున్న లావాదేవీలు 52 శాతమే. అది కూడా అధికారికంగా నమోదైనవి మాత్రమే. గురువారం (ఈ నెల 10) నుంచి డిసెంబర్ 30 వరకు మన చేతిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ఈ సొమ్మునంతా ఒకేసారి క్యాష్ రూపంలో విత్డ్రా చేసుకోవచ్చా? సమాధానం: కుదరదు. ఒక వ్యక్తికి రోజుకు రూ.4 వేలు మాత్రమే నగదు రూపంలో తీసుకునే వీలుంది. మిగిలిన సొమ్మును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నా వ్యక్తిగత అవసరాలకు రూ.4,000 సొమ్ము సరిపోదు. మరిప్పుడేం చేయాలి నేను? డెబిట్, క్రెడిట్, ఆన్లైన్ వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్స్, చెక్, డీడీ రూపంలోనూ వినియోగించుకునే వీలుంది. రూ.4,000లకు పైన సొమ్ము కావాలంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మరి నాకు ఖాతా లేకుంటే? భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఏదైనా బ్యాంకుకు వెళ్లండి. కేవైసీ నిబంధనలను పూర్తి చేసి.. బ్యాంకు ఖాతాను తెరవండి. ఆపైన చెల్లింపులు చేసుకోవచ్చు. ఒకవేళ నాకు కేవలం జన్ధన్ ఖాతా మాత్రమే ఉంటే? జన్ధన్ ఖాతా నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఆయా ఖాతాలో నగదును వేసుకునే వీలుంది. పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎక్కడికి వెళ్లాలి? రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకులు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు అకౌంట్ ఉన్న బ్యాంకుకు కాకుండా ఇతర బ్యాంకుకు వెళ్లవచ్చా? తప్పుకుండా వెళ్లవచ్చు. కానీ, సరైన గుర్తింపు కార్డు, మీ బ్యాంక్ ఖాతా వివరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. నాకు వ్యక్తిగతంగా బ్యాంక్ ఖాతా లేదు. కానీ, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అకౌంట్ ఉంది. మరి నా వద్ద ఉన్న సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయవచ్చా? చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఖాతాలో పాత పెద్ద నోట్లను జమ చేసుకునే వీలుంది. కానీ, మీరు లిఖితపూర్వకంగా రాసిన అనుమతి పత్రాన్ని సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది. నోట్ల మార్పు, నగదు ఉపసంహరణకు వ్యక్తిగతంగా వెళాల్సిందేనా? లేక రిప్రజెంటివ్ను పంపిస్తే సరిపోతుందా? సాధ్యమైనంత వరకూ వ్యక్తిగతంగా వెళ్లటమే ఉత్తమం. వెళ్లలేని పక్షంలో మీ రిప్రజెంటివ్ను పంపించొచ్చు. కానీ, ఖాతాదారుని వివరాలు, గుర్తింపు కార్డుతో పాటూ రిప్రజెంటివ్ గుర్తింపు కార్డు, వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది. ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా క్యాష్ను డిపాజిట్ చేయవచ్చా? నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. పాత రూ.1,000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఉంది? డిసెంబర్ 30 లోగా పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి మార్చుకోవచ్చు. ఒకవేళ ఆ తేదీలోగా మార్చుకోలేని పక్షంలో... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 2017 మార్చి 31వరకూ మార్చుకోవచ్చు. ప్రస్తుతం నేను ఇండియాలో లేను. మరి నేనేం చేయాలి? మీ వద్ద ఇండియన్ కరెన్సీకి ఉండి.. అది కూడా పెద్ద నోట్లు ఉంటే.. వాటిని తీసుకొని ఏదైనా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును ఇచ్చి! లేదా మీకు తెలిసిన వారి బ్యాంక్ ఖాతాలోనూ ఆన్లైన్ ద్వారా మీరే జమ చేయవచ్చు. ఏ గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది? ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసైన్స, పాస్పోర్ట్, ఎన్ఆర్ఈజీఏ కార్డు, లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్దు లేదా పబ్లిక్ సెక్టార్ తమ ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డునూ సమర్పించవచ్చు. నేను ప్రవాస భారతీయుడిని. నాకు దేశంలో ఎన్నారై ఖాతా ఉంది? నా వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎన్నారై ఖాతాలో జమ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, మీ ఎన్నారై ఖాతా అకౌంట్లోనే జమ చేసుకోవాల్సి ఉంటుంది. నేను విదేశీ పర్యాటకుడిని. నా వద్ద రూ.1,000, రూ.500 నోట్లు ఉన్నారుు. మరిప్పుడు నేనేం చేయాలి? అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, ఫారెన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లలో రూ.5 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రి, మందులు, ట్రావెల్ వంటి అత్యవసరాల సేవల నిమిత్తం నగదు అవసరం మరి నేనిప్పుడు ఏం చేయాలి? ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో మీ చేతిలో ఉన్న పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయి. రైల్వే కౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు. మీ దగ్గరున్న పెద్ద నోట్లను అప్పగించండని చెప్పి.. తీరా నా సొమ్మును ఒకేసారి తీసుకునే వీలులేకపోవటమేంటి? నల్లధన ప్రవాహానికి ప్రధాన కారణం నగదు చెల్లింపులే. అందుకే నగదు చెల్లింపులను పూర్తిగా రూపుమాపాలనే ధ్యేయంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా అని మీ దగ్గరున్న సొమ్ము మొత్తాన్ని తీసుకొని ఒకేసారి కొత్త నోట్లను మీకిస్తే.. మిగిలిన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. పెపైచ్చు ప్రజలందరికీ సరిపడేంత కొత్త నోట్లను ముద్రించలేదు. అకౌంట్ ఉన్న బ్యాంక్కు మాత్రమే వెళ్లాలా? నోట్ల మార్పునకు అది కూడా రూ.4 వేల వరకై తే ఏ బ్యాంకుకు వెళ్లినా పర్వాలేదు. కానీ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీకు రూ.4 వేలకు మించి అది కూడా మీ ఖాతాలో జమ చేస్తే చాలనుకుంటే మాత్రం.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్కు గానీ లేదా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్కు గానీ వెళ్లవచ్చు. చెక్ రూపంలో బ్యాంక్లో నగదును డ్రా చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, చెక్ రూపంలో రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారానికి రూ.20 వేలు మించి డ్రా చేయటానికి వీల్లేదు. (ఇందులో ఏటీఎం నుంచి డ్రా చేసిన సొమ్ము కూడా కలుస్తుంది) ఈ నిబంధన ఈనెల 24 వరకూ ఉంటుంది. ఆ తర్వాత పరిమితిని పెంచే అవకాశముంది.) ఏటీఎం నుంచి నగదును డ్రా చేసుకోవచ్చా? ప్రస్తుతమైతే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు కాబట్టి డ్రా చేయలేరు. ఏటీఎంలు పనిచేయటం మొదలెట్టాక.. డ్రా చేసుకునే వీలుంది. కానీ, రోజులో ఒక్కో కార్డుపై రూ.2,000లకు మించి డ్రా చేయటానికి వీల్లేదు. ఈనెల 18వ తేదీ వరకూ ఈ నిబంధన ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒక్కో కార్డుపై రూ.4,000 వరకూ నగదును తీసుకోవచ్చు. నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితర హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్ ఈ వారంలోనే విచారణకొస్తుంది. హైకోర్టులోనూ వ్యాజ్యం సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించే విధంగా ఉందంటూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడి జీవితం స్తంభించిందని, నిత్యావసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ జారీచేసేందుకు అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26(2)ను రద్దు చేయాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ను భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారించాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య అభ్యర్థించినా ధర్మాసనం నిరాకరిస్తూ గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది. పెద్ద నోట్ల నిబంధనలు, వివరాల మరింత సమాచారం కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్బీఐ.ఓఆర్జీ.ఇన్ లేదా 022 22602201/022 22602944 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
క్రాంతి కుమార్ గల్లంతుపై అనుమానాలు
-
ఈ పరిస్థితుల్లో పిల్లలు కలుగుతారా?
సందేహం నా వయసు 25 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 55 కిలోలు. నాకు ఏడాది కిందట పెళ్లయింది. మేనరికం సంబంధం. త్వరలోనే పిల్లలు కావాలనుకుంటున్నాం. అయితే, నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. పరీక్షలు జరిపిస్తే ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యాయని, థైరాయిడ్ సమస్య కూడా ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో పిల్లలు కలుగుతారా? దీనికి తగిన చికిత్స ఉందా? - శ్రావణి, ఆదోని థైరాయిడ్ సమస్యల వల్ల కొందరిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావడం జరుగుతుంది. దానివల్ల అండం సరిగా తయారు కాకపోవడం వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది కావచ్చు. డాక్టర్ని సంప్రదించి థైరాయిడ్ హార్మోన్ మాత్రలు తగిన మోతాదులో క్రమం తప్పకుండా వేసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్ హర్మోన్ కంట్రోల్ కావడంతో పాటు ఇతరత్రా హార్మోన్ల ఇబ్బందులు ఏవీ లేనట్లయితే, పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి, కొద్ది కాలంలోనే గర్భందాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఓవరీస్ ఎన్లార్జ్ కావడం అంటే కొందరిలో కొన్ని హార్మోన్లలో మార్పుల వల్ల ఓవరీలో ఉండే కణజాలం పెరగడం అన్న మాట. దీనినే స్ట్రోమల్ హైపర్ ప్లేసియా అంటారు. మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ హార్మోన్ కొందరు ఆడవాళ్లలోనూ మోతాదుకు మించి విడుదలైనప్పుడు ఇలాంటి సమస్య తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి వారిలో అవాంఛిత రోమాలు పెరగడం, మొటిమలు ఎక్కువగా రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. హార్మోన్ల మార్పు వల్ల అండం తయారు కాకపోవడం, దానివల్ల గర్భందాల్చలేకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఈ సమస్యలకు డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చికిత్స తీసుకోవడం వల్ల పిల్లలు కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ బరువు కూడా ఎత్తుకు తగినంతే ఉంది. మరింత బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. నేను ఇంటర్ చదువుతున్నాను. ఫిట్నెస్ కోసం కొన్నాళ్లుగా స్కిప్పింగ్ చేస్తున్నాను. అయితే, స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ చెబుతున్నారు. స్కిప్పింగ్ వల్ల బ్రెస్ట్ లూజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయా? - అను, ఈ-మెయిల్ స్కిప్పింగ్ చేయడం వల్ల రొమ్ములు సాగడమేమీ ఉండదు. స్కిప్పింగ్ చేసేటప్పుడు రొమ్ములు ఎక్కువగా కదలడం వల్ల కొందరిలో నొప్పిగా ఉండవచ్చు. రొమ్ములో ఎలాస్టిక్ టిష్యూ ఉంటుంది కాబట్టి, స్కిప్పింగ్ చేసినప్పుడు ఊగినా, తర్వాత సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కాకపోతే స్కిప్పింగ్ చేసేటప్పుడు కరెక్ట్ సైజ్ సపోర్టింగ్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడం మంచిది. దానివల్ల స్కిప్పింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా, సౌకర్యవంతంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, శరీరం నాజూకుగా ఉండటానికి స్కిప్పింగ్ మంచి వ్యాయామం. నా వయసు 16 ఏళ్లు. ఎత్తు 5.4 అడుగులు. బరువు 37 కిలోలు. నాకు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. రెండు నెలలకోసారి వస్తున్నాయి. ఒక్కోసారి రెండు నెలలకు పైన కొన్నిరోజుల ఆలస్యం కూడా అవుతోంది. మొహం మీద మొటిమలు విపరీతంగా వస్తున్నాయి. ఈ సమస్యకు ఏమైనా మందులు ఉన్నాయా? - విజయ, నెల్లూరు నీ ఎత్తుకు కనీసం 55-60 కిలోల వరకు బరువు ఉండాలి. నువ్వు కేవలం 37 కిలోల బరువే ఉన్నావు. అంటే దాదాపు 20 కిలోల బరువు తక్కువగా ఉన్నావు. బరువు మరీ తక్కువగా ఉండటం, రక్తహీనత, థైరాయిడ్ లోపాలు వంటి కారణాల వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. పౌష్టికాహార లోపం వల్ల నువ్వు బరువు తక్కువగా ఉండి ఉండవచ్చు. కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల కూడా రక్తహీనత, బరువు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాంటి పరిస్థితిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. కొందరిలో అండాశయంలో నీటిబుడగలు (పాలీసిస్టిక్ ఓవరీస్) ఉండటం వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తుంటాయి. హార్మోన్లలో మార్పుల వల్ల అవాంఛిత రోమాలు, మొటిమలు ఎక్కువగా రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. నీ వయసు 16 ఏళ్లు.. ఇలాంటి యుక్తవయసులో కొందరి శరీర తత్వాన్ని బట్టి మొటిమలు ఎక్కువగా రావచ్చు. ఒకసారి గైనకాలజిస్టును కలుసుకుని అవసరమైన రక్తపరీక్షలు, థైరాయిడ్, పాలీసిస్టిక్ ఓవరీస్ పరీక్షలు, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించుకుని, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని చికిత్స తీసుకుంటే మంచిది. ఆరోగ్యంగా బరువు పెరిగేందుకు పాలు, పండ్లు, ఆకుకూరలు, పప్పులు వంటి పోషకాహారం తీసుకోవడం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
బాలిక అనుమానాస్పద మృతి
కొత్తపేట : పదహారేళ్ల బాలిక అనుమానాస్పదlస్థితిలో మరణించినట్టు కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఏఎస్సై ఎ.గరగారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక కౌశిక రోడ్డు వంతెన వద్ద బాలిక కిందపడి, కొట్టుకుంటుండగా స్థానిక యువకులు గమనించారు. వెంటనే ఆమెను సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మరణించింది. ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్లో బావ అని ఉన్న నంబరుకు కాల్ చేసి, సమాచారం తెలిపారు. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెది రావులపాలెం మండలం దేవరపల్లి శివారు మెరకపాలెం. ప్రస్తుతం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి చొల్లంగి శ్రీనివాసరావు, తల్లి కలిసి ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు పిఠాపురం వెళ్లారు. కాగా సమాచారం అందుకున్న ఆమె తండ్రి కొత్తపేటకు చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో ఉపాధ్యాయుడి మృతి
తొర్రూరు : అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభు త్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కడెం రాకేష్(35) రాయపర్తి మండలం సన్నూరు గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ కలహా లతో గత కొద్దిరోజులుగా పాఠశాలకు వెళ్లకుండ ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో తొర్రూరు పట్టణంలో నివాసముంటున్న రాకేష్కు ఇంట్లోనే ఆకస్మికంగా గుండెపోటు వచ్చిందని వెంటనే స్థానిక ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం అందిస్తుండగా రాకేష్ ఆరోగ్యం విషమించడంతో మృతి చెం దాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి వద్దకు చేరుకొని రాకేష్ మృతికి అతడి అత్తగారి కుటుంబ సభ్యులే కారణ మని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించి, విచారణ కొనసాగిస్తున్నట్లు సీఐ శ్రీధర్రావు తెలిపారు. మృతుడు రాకేష్కు భార్యతోపాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
-
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
పలువురు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టారంటూ సూసైడ్ నోట్ ప్రేమ వ్యవహారం విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే సందేహాలు భూపాలపల్లి : సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్ఎస్ఏ)లో పనిచేసే ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన భూపాలపల్లి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ సీహెచ్ రఘునందన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో నివాసం ఉంటూ కేటీకే 5వ ఇంక్లైన్లో విధులు నిర్వర్తించే ఏకారి శంకర్కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సత్యనారాయణ(23) ఉన్నారు. సత్యనారాయణ గతేడాది పీజీ పూర్తి చేశాడు. వారం క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ట్యూటర్గా చేరాడు. గత శుక్రవారం రాత్రి 7 గంటలకు కళాశాలకు వెళ్తున్నట్లుగా ఇంట్లో చెప్పి, బ్యాగ్తో బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి సెల్ఫోన్కు కాల్ చేశారు. అయినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. ఈ క్రమంలో మండలంలోని కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో పూర్తిగా కాలిపోయి ఉన్న ఓ మృతదేహం ఉన్నట్లుగా శంకర్ కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అది సత్యనారాయణ మృతదేహంగా గుర్తించారు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘునందన్రావు తెలిపారు. బ్యాగ్లో సూసైడ్ నోట్.. సత్యనారాయణ మృతదేహం సమీపంలో ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగు పడి ఉంది. అందులోని ఒక నోట్బుక్లో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంది. తనను పలువురు వాహనాలు మార్చుతూ, ఎక్కడెక్కడో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని అందులో రాశాడు. లేఖలోని వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఓ అమ్మాయితో పరిచయం.. సింగరేణియన్ సన్స్ అసోసియేషన్ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొనే సత్యనారాయణను ఎవరూ బెదిరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. సత్యనారాయణకు ఓ అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. గత శుక్రవారం ఉదయం ఇంట్లోని డబ్బులు తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు సత్యనారాయణను మందలించినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
స్నేహితులతో పాకాలకు వెళ్లిన కుమారస్వామి ఫిట్స్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్పించిన మిత్రులు వైద్యం ప్రారంభించేలోగా కన్నుమూత ఖానాపురం : అనుమానాస్పద స్థితి లో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్సై కుమారస్వామిలు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మం డలం మచ్చాపురానికి చెందిన నమిండ్ల సాంబయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నమిండ్ల కుమారస్వామి(28) ఓ దినపత్రికలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నాడు. వరంగల్లోని లేబర్కాలనీకి చెందిన ఆరూరి రవి, జన్ను అరుణ్, జన్ను మహేష్, జన్ను అరుణ్కుమార్లతో కలిసి పాకాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాడు. పాకాలకు చేరుకొని అక్కడ మిత్రులంతా ఈత కొడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో కుమారస్వామికి ఫిట్స్ వచ్చిందంటూ తోటి స్నేహితులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు సెలైన్ బాటిల్ ఎక్కించే ప్రయత్నం చే శారు. అయితే అప్పటికే కుమారస్వామి మృతి చెందాడు. పాకాలకు వెళ్లిన తమ కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆస్పత్రిలోని కుమారుడి మృతదేహాన్నిచూసి గుండెలవిసేలా ఏడ్చారు. అయితే మృతుడు కుమారస్వామితో కలిసి పాకాలకు వెళ్లినస్నేహితులు పరారవడం గమనార్హం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఖానాపురం పోలీ స్స్టేçÙన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు చేశా రు. అనంతరం నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కుమారస్వామి మృతదేహాన్ని పోలీసులు పరిశీ లించారు. మృతుడికి భార్య మహేశ్వరీ ఉంది. ‘మా అబ్బాయిని పాకాలకు తీసుకెళ్లిన వ్యక్తులే ఏదో చేసి ఉంటారు. వాడికి ఇప్పటిదాకా ఎన్నడూ ఫిట్స్ రాలేదు. ఇప్పుడు ఫిట్స్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. కారకులైన వారిని పోలీసులు పట్టుకోవాలి’ అని కుమారస్వామి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పెళ్లయిన నెలకే..
రాజమహేంద్రవరం క్రైం: పెళ్లయిన నెలకే వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంఘటన త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆనంద్నగర్కు చెందిన నూకల లక్ష్మి(24), సిద్ధార్థనగర్కు చెందిన లారీ డ్రైవర్ వీర్రాజు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూలై 3న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. రూ.2 లక్షలు కట్నం, కొంత బంగారం పెళ్లి సమయంలో ఇచ్చారు. కాతేరు పంచాయతీలోని శాంతినగర్లో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. లారీపై బాకీ ఉందంటే, అదనంగా రూ.28 వేలు ఇచ్చా రు. తనకు వేరే సంబంధాలు వస్తున్నాయని, రూ.7 లక్షలు ఇస్తామంటున్నారని, అదనపు కట్నం ఇవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని వీర్రాజు బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో భర్త వేధింపులను తట్టుకోలేక లక్ష్మి మంగళవారం ఇంట్లో శ్లాబ్ హుక్కుకు ఓణీతో ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడింది. అదనపు కట్నం కోసమే వీర్రాజు ఆమెను వేధించి, హతమార్చి ఉంటాడని మృతురాలి తల్లి మచ్చా మహాలక్ష్మి ఆరోపించింది. వివాహం జరిగిన నెల రోజులు కూడా సంతోషంగా లేకుండా, తమ కుమార్తెను వేధించాడని విలపించింది. సంఘటన స్థలానికి సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్, త్రీటౌన్ సీఐ శ్రీరామకోటేశ్వరరావు, ఎస్సై సత్యనారాయణ పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
భార్య చంపిందంటున్న తల్లిదండ్రులు విచారణ చేపట్టిన పోలీసులు వేములవాడ : పట్టణంలోని కోరుట్ల బస్టాండు ప్రాంతంలో నివాసముంటున్న పరోళ్ల మురళీకృష్ణ(28) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సిమెంటు గాజులు, సిమెంటు ఇటుకలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్న మురళీకృష్ణ ఉరఫ్ కృష్ణ ఇక్కడే ఓ షెడ్డు వేసుకుని భార్య మౌనికతో ఉంటున్నాడు. మంగళవారం ఇదే షెడ్డులోని ఓ పైపుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నెల్లూరు జిల్లా కావలి మండలం కమ్మవారిపాలెం నుంచి రమణయ్య– వెంకటరమణమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం వేములవాడకు వలస వచ్చారు. వీరికి మురళీకృష్ణ, శ్రీకాంత్ కుమారులు, కుమార్తె తిరుమల ఉన్నారు. ఇక్కడే సిమెంటు ఇటుకలు, గాజుల పోసుకుంటూ జీవిస్తున్నారు. మూడేళ్ల క్రితం నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పొట్టిపల్లికి చెందిన మౌనికతో మురళీకృష్ణకు వివాహం జరిపించారు. ఆ వెంటనే మరో సిమెంటు తయారీ కేంద్రాన్ని సపరేటుగా పెట్టించారు. రెండేళ్లుగా వీరి కాపురం సజావుగా సాగింది. ఏడాదిగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌనిక తాలూకూ బంగారం అంశంలో గొడవలు జరిగేవనీ, ఈక్రమంలోనే మురళీకృష్ణ మరణించాడని చెబుతున్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై సైదారావు, ఏఎస్సై సురేశ్ పరిశీలించారు. గదిలోని రక్తపు మరకలు, వేలాడుతున్న తాడు పరిశీలించారు. మృతదేహం కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి ఉండడంతో హతా?.. ఆమ్మహత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకుంటే రెండు చేతులకు ఎలా కట్టేసుకుంటాడని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యే చంపింది... తన కుమారుడిని భార్య మౌనికే చంపేసిందని తల్లిదండ్రులు రమణయ్య, వెంకటరమణమ్మ ఆరోపిస్తున్నారు. కొద్ది రోజులుగా మౌనిక తన కుమారున్ని ఇబ్బందులు పెడుతోందని, ఇటీవలే బంగారం విషయంలో గొడవ పడిందని చెప్పారు. ఈ గొడవ కారణంగానే చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. పుట్టింటింకి వెళుతున్నట్లు చెప్పి భర్తను హత్యచేసి వెళ్లిందని పోలీసులకు వివరించారు. -
దాని వల్ల పెళ్లికి ప్రాబ్లమా?
సందేహం నా వయసు 23. నాకు పీరియడ్స్ టైమ్లో బాగా కడుపునొప్పి ఉంటుంది. దానికి కారణమేంటో మీ శీర్షిక ద్వారా తెలుసుకున్నాను. కానీ నాకు రెండు రోజులకు మించి బ్లీడింగ్ అవ్వదు. అప్పుడు కూడా అంతంత మాత్రమే. మా ఫ్రెండ్స్కేమో అయిదు రోజులు అవుతుందట. దానివల్ల నాకు పిల్లలు పుట్టడానికి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? ఈ మధ్య చాలా భయంగా ఉంటోంది. ఎందుకంటే, మా ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కాబట్టి నా అనుమానానికి సమాధానం చెప్పండి ప్లీజ్. - రాధిక, వరంగల్ ఆడవారిలో ఊఏ, ఔఏ, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, థైరాయిడ్ వంటి అనేక రకాల హార్మోన్లు సక్రమంగా విడుదలవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి శరీరతత్వాన్ని బట్టి మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు దాదాపు 50ఝ నుంచి 80ఝ వరకు బ్లీడింగ్ అవుతుంది. కొందరిలో అధిక బరువు, పాలిసిస్టిక్ ఓవరీస్, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి, గర్భాశయం, అండాశయాల సైజు చిన్నగా ఉండటం వంటి ఎన్నో సమస్యల వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బ్లీడింగ్ కొద్దిగానే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవే సమస్యలు ఉన్నప్పటికీ... కొందరిలో అధికంగానూ బ్లీడింగ్ అవ్వొచ్చు. హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భాశయంలోని పొర సరిగా పెరగకపోవడం వల్ల కూడా బ్లీడింగ్ కొద్దిగా అవ్వొచ్చు. కొంతమందిలో రెండు రోజులే అయినా, బ్లీడింగ్ బాగా అయ్యి ఆగిపోతుంది. దానివల్ల ఇబ్బంది లేదు. మీరు బరువు ఎంత ఉన్నారో రాయలేదు. బరువు మరీ తక్కువ ఉండడం వల్ల కూడా కొందరిలో బ్లీడింగ్ తక్కువ అవ్వొచ్చు. ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి, సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇఆ్క, హార్మోన్ల పరీక్షలు, స్కానింగ్ వంటివి చేయించుకొని చికిత్స తీసుకోవచ్చు. అధిక బరువు ఉంటే పరిమిత ఆహారం, వ్యాయామాలు చేసి తగ్గడం వల్ల ఉపయోగం ఉంటుంది. పైన చెప్పిన సమస్యలు ఉండడం వల్ల బ్లీడింగ్ కొద్దిగా అవుతుంటే... పెళ్లైన తర్వాత సాధారణంగా గర్భం దాల్చడానికి ఇబ్బంది అవ్వొచ్చు. కాబట్టి ముందుగానే జాగ్రత్తగా సమస్యకు తగ్గ చికిత్స తీసుకుంటే, తర్వాత ఇబ్బంది ఉండకపోవచ్చు. నా వయసు 33. పెళ్లై సంవత్సరం అయింది (లేట్ మ్యారేజ్). మావారు నాకన్నా ఒక్క సంవత్సరం పెద్దవారు. కొన్ని కుటుంబ ఆర్థిక కారణాల వల్ల నాకు పెళ్లి ఆలస్యంగా జరిగింది. నాలుగు నెలల క్రితం పీరియడ్ ఆలస్యంకావడంతో ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. పాజిటివ్ అని వచ్చింది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నారు. మూడు నెలల వరకు ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ ఈ మధ్య కడుపులో బాగా నొప్పిగా ఉంటోంది. తరచూ వేడి చేస్తోంది. దాంతో అబార్షన్ అవుతుందేమోనని భయంగా ఉంది. ముప్ఫై దాటితే ప్రెగ్నెన్సీ కష్టమంటారు. అలాంటిది నేను ఈ వయసుకు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల లేనిపోని అనుమానాలు కలుగుతున్నాయి. నా నొప్పికి గల కారణాలను చెప్పగలరు. - స్వప్న, ఒంగోలు మీరు డాక్టర్ దగ్గర ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేయించుకున్న తర్వాత నెలనెలా చెకప్కు వెళ్లినట్టు లేరు. సాధారణంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గర నెలనెలా చెకప్ చేయించుకోవాలి. మొదటి గర్భంలో అనేక కారణాల వల్ల 10-15 శాతం మందిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. అబార్షన్ అయ్యే వారిలో 30 ఏళ్ల వయసు పైబడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అంతే కానీ తప్పనిసరిగా సమస్యలు ఉంటాయని ఏమీ లేదు. మొదటి రెండు నెలలలో స్కానింగ్ చేయించుకుంటే, గర్భాశయంలో పిండం ఏర్పడిందా లేదా, దానిలో గుండె కొట్టుకోవడం (హార్ట్ బీట్) మొదలైందా లేదా అనే విషయాలు తెలుస్తాయి. తర్వాత మూడో నెల చివరిలో.. అంటే 12 వారాల సమయంలో గర్భంలోని పిండంలో చిన్న చిన్న చేతులు, కాళ్లు, తల, శరీరం ఏర్పడి శిశువు ఆకృతి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎన్టీ స్కాన్ చేయించుకుంటే, శిశువులో కొన్ని శారీరక లోపాలు, జన్యులోపాలు ఉంటే, వాటిని గుర్తించే వీలుంటుంది. మొదటి నాలుగు నెలలలో మూత్రంలో, యోనిలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని వల్ల కడుపు నొప్పి రావచ్చు. కడుపులో ఎసిడిటీ, అజీర్తి, గ్యాస్ ఏర్పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ వంటి సమస్యలు, అండాశయాలలో పెద్ద పెద్ద సిస్ట్లు పెరగటం వంటి ఎన్నో సమస్యల వల్ల కడుపులో నొప్పి రావచ్చు. మీరు అబార్షన్ అవుతుందేమోనని భయపడుతూ ఇంట్లో కూర్చుంటే ఎలా? మీరు ముందు గైనకాలజిస్ట్ను సంప్రదించి, అవసరమైన రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకుంటే.. సమస్య ఏమిటో తెలుసుకొని దానికి తగిన చికిత్సను డాక్టర్లు అందిస్తారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
ప్రియురాలితో కలిసి భర్తే హత్య చేశాడని పుట్టింటి వారి ఆరోపణ ఆమె ఒంటిపై పలు రక్తపు గాయాలు పోలీసుల అదుపులో నిందితులు సీతానగరం : మండలంలోని బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావుపేటలో బొడ్డు దుర్గ (28) అనే వివాహిత అత్తవారింట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో సోమవారం రాత్రి మృతి చెందింది. ఆమె ఒంటిపై రక్తపు గాయాలున్నాయి. దుర్గను భర్త బొడ్డు నరేష్, అతడి ప్రియురాలు మేరీ కలిపి హత్య చేశారని దుర్గ పుట్టింటి వారు ఆరోపించారు. కాగా దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నరేష్ కూలి పనులు చేస్తుంటాడు. కొన్నేళ్ల క్రితం అతడు పనుల కోసం కపిలేశ్వరపురం వెళ్లగా, అక్కడ పరిచయమైన దుర్గను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నరేష్ ఎస్సీ కాగా, దుర్గ బీసీ. బొబ్బిల్లంకలో నివాసం ఉంటున్న ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె మహిమాన్విత, అయిదేళ్ల కుమారుడు మణిదీప్ ఉన్నారు. న రేష్ ఇదే గ్రామానికి చెందిన మేరీ అనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, వారిద్దరూ కలిసి దుర్గను హత్య చేశాడని కపిలేశ్వరపురం నుంచి వచ్చిన దుర్గ తల్లి మాతా వెంకయమ్మ, పెదనాన్న కొడుకులు లోవరాజు, శ్రావణకుమార్లు తెలిపారు. రెండు నెలల క్రితం దుర్గ చేతిని ఆమె భర్త నరేష్ విరగ్గొట్టగా, సిమెంట్ కట్టు కట్టించుకుందని చెప్పారు. సోమవారం రాత్రి నరేష్, తన ప్రియురాలు మేరీతో కలిసి దుర్గను వారి ఇంట్లోనే హత్య చేసి Ðð ళ్లిపోయి, ఉరిపోసుకున్నట్టుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. స్థానికుల కథనం.. నరేష్ కొంతకాలంగా మేరీతో వివాహేతర సంబంధం సాగిస్తున నేపథ్యంలో నరేష్, దుర్గ దంపతులు తరచూ గొడవపడేవారిని బొబ్బిల్లంక వాసులు తెలిపారు. సోమవారం రాత్రి భర్త తన ప్రియరాలి ఇంటివద్ద ఉండటంతో దుర్గ వెళ్లి వేసి తలుపులు కొడుతూ భర్త నరేష్ను బయటకు రావాలని పిలిచిందని చెప్పారు. నరేష్ బయటకు రాకపోవడంతో ఆమె తిరిగి తన ఇంటికి వెళ్లిపోయిందని చెప్పారు. రాత్రి 11.30 గంటల సమయంలో ప్రియురాలితో కలిసి నరేష్ తన ఇంటికి వచ్చి భార్యను హత్య చేసి, ఇంటి వెనుక ఉన్న ద్వారం నుంచి తిరిగి ప్రియురాలి ఇంటికి Ðð ళ్లిపోయాడని స్థానికులు వివరించారు. మృతురాలి కుమారుడు మణిదీప్ కేకలు వేయడంతో మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చానని మృతురాలి మావయ్య సోమయ్య తెలిపాడు. మృతురాలు దుర్గ మెడపై చేతిగోళ్ల గాయాలున్నాయి. గొంతుకలో గుచ్చుకున్న గాయాల నుంచి రక్తం బయటకు వచ్చి ఆమె ధరించిన నైటీ తడిసిపోయి ఉంది. ముక్కు నుంచి రక్తం కారింది. నోటి నుంచి నురగా బయటకు వచ్చింది. ఆమె మెడపై ఉరి వేసుకున్న ఆన వాళ్లు మాత్రం లేవు. నరేష్, అతడి ప్రియురాలు మేరీలను సీతానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై పవన్కుమార్ తెలిపారు. -
మామిడితోటలో వ్యక్తి మృతదేహం లభ్యం
హత్యగా అనుమానిస్తున్న పోలీసులు మహేశ్వరం: మామిడితోటలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుండగులు హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన మహేశ్వరంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికులు, మహేశ్వరం సీఐ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్ ఎదురుగా ఉన్న ఓ మామిడితోటలో ఆదివారం దుర్వాసన రావడంతో కార్మికులు పరిశీలించారు. ఓ కుళ్లిపోయిన మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని వేరే ప్రాంతంలో హత్య చేసి రాత్రివేళలో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసి వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 15 రోజుల క్రితం హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
ఆ యువకుడు పాకిస్థానీనా..?
జర్మనీలో ఉగ్రవాదదాడికి పాల్పడిన యువకుడు (17) ఏ దేశానికి చెందినవాడన్న విషయంపై అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆగంతకుడిని అఫ్ఘానిస్థాన్కు చెందిన శరణార్థిగా పోలీసులు మొదట భావించారు. అయితే ఈ యువకుడు పాకిస్థాన్కు చెందినవాడిగా బుధవారం సందేహం వ్యక్తం చేశారు. జర్మనీలో దాడికి పాల్పడింది తామేనని, ఉగ్రవాదిని తమ ఫైటర్గా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా ఈ ఉగ్రవాది ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఉగ్రవాది రెండేళ్ల క్రితం జర్మనీకి శరణార్థిగా వచ్చాడు. జర్మనీలోకి సులువుగా ప్రవేశించేందుకోసం అఫ్ఘాన్ జాతీయుడిగా ఆ యువకుడు చెప్పిఉంటాడని భద్రతాధికారులు భావిస్తున్నారు. అతని గదిలో పాకిస్థాన్కు చెందిన డాక్యుమెంట్, ఐఎస్ జెండా లభ్యమయ్యాయి. వీడియోలో ఉగ్రవాది తన పేరును మహ్మద్ రియాద్గా చెప్పుకున్నా, జర్మనీలోకి అతను వచ్చినపుడు రిజిస్టర్ అయిన వివరాలతో ఈ పేరు మ్యాచ్ కాలేదు. ఉగ్రవాది నివసించిన ప్రాంతంలోని స్థానికులు అతడి పేరును రియాజ్గా చెప్పారు. సోమవారం అర్ధరాత్రి రైలు ట్రూచిన్జెన్ నుంచి వువర్జ్బర్గ్ వెళ్తుండగా ఓ యువకుడు కత్తి, గొడ్డలితో ప్రయాణికులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జర్మనీ భద్రత సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి యువకుడిని కాల్చి చంపాయి. బాంబులు, తుపాకీలతో దాడులు చేసే ఐఎస్ ఉగ్రవాదులు ఇటీవల విభిన్న మార్గాల్లో దాడులకు పాల్పడుతున్నారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఇటీవల ఐఎస్ ఉగ్రవాదులు జనసమూహంపై ట్రక్ నడిపారు. ఈ దాడిలో 84 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. -
చందానగర్లో విషాదఛాయలు
ఆస్ట్రేలియాలో మృతి చెందిన సుప్రజ 27న గృహప్రవేశానికి రావాల్సి ఉండగానే దారుణం చందానగర్: ఆస్ట్రేలియాలో సుప్రజ అనే మహిళ బిడ్డతో సహా అనుమానాస్పదస్పద స్థితిలో మృతి చెందడంతో ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న చందానగర్ రాజేందర్రెడ్డినగర్ కాలనీలో శుక్రవారం విషాదచాయలు అలుముకున్నాయి. మెదక్ జిల్లా ఆర్డినెస్ ఫ్యాక్టరీ రిటైర్డ్ ఉద్యోగి మంగిడి శంకరయ్య తన కుమార్తె సుప్రజకు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శ్రీనివాస్తో 2009లో వివాహం చేశాడు. వీరికి ఐదేళ్ల కుమార్తె సహస్ర, నాలుగు నెలల కుమారుడు ఉన్నారు. సాప్ట్వేర్ ఉద్యోగాల నిమిత్తం ఏడాదిన్నర క్రితం వారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లారు.నాలుగు నెలల క్రితం బాబు జన్మించడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులు గంగాధర్, ఇందిర అక్కడికి వెళ్లి నెల రోజుల క్రితమే తిరిగి వచ్చారు. కాగా శంకరయ్య ఇటీవలే రాజేందర్రెడ్డినగర్లో కొత్తగా ఇళ్లు కట్టుకోవడంతో ఈ నెల 27న గృహా ప్రవేశానికి వారిరువు రావాల్సి ఉందని అంతలోనే దారుణం జరిగిందని తల్లిదండ్రులు బోరునా విలపించారు. తమ సమీప బంధువైన అల్లుడు శ్రీనివాస్ చాలా సౌమ్యుడని శంకరయ్య తెలిపారు. కాగా మృతి విషయంపై సమచారం అందడంతో శ్రీనివాస్ తండ్రి గంగాధర్ హుటాహుటిన ఆస్ట్రేలియాకు తరలివెళ్లారు. వారు శుక్రవారం రాత్రి ఆయన అక్కడికి చేరుకునే అవకాశం ఉందని, ఆ తరువాతే పూర్తి వివరాలు తెలుస్తాయని బంధువులు పేర్కొన్నారు. అన్యోన్యంగా ఉండేవారు: తండ్రి శంకరయ్య తన ఇద్దరు కుమార్తెలని, అల్లుళ్ల్లు ఇద్దరూ మంచివారని, వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి తండ్రి శంకరయ్య తెలిపారు. తమ గృహ ప్రవేశానికి ఈ నెల 27న బయలుదేరాల్సి ఉందని అంతలోనే ఘోరం చోటు చేసుకుందన్నారు. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదని తమ వియ్యంకుడు గంగాధర్ అక్కడికి చేరుకున్న తర్వాతే అసలు విషయం తెలుస్తోందన్నారు. పూర్తి సహకారం: కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సుప్రజ తల్లిదండ్రులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పరామర్శించారు. సుప్రజ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకుచ్చేందుకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సుప్రజ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. -
సాదా బైనామాపై పలు సందేహాలు
కొత్తగూడెం : సాదా బైనామాపై సవాలక్ష సందేహాలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడేందుకు.. మరికొందరు ఎలాగైనా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సైతం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు పహాణీలోకి ఎక్కకపోవడం.. పట్టాదారు పాస్పుస్తకాలు సైతం లేకపోవడం తో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భూములను పహాణీలో ఎక్కించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో మై దాన ప్రాంత పరి స్థితులు వేరే ఉండగా.. ఏజెన్సీలో మా త్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1969 తర్వాత గిరిజనేతరు లు క్రయవిక్రయాలు చేస్తే అవి చట్టవిరుద్ధం కావడంతో.. 1970 తర్వాత గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూ ములను క్రమబద్ధీకరించుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అసలు అధికారులు విచారణ ఏ ప్రాతిపదికన చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడమే.. మైదాన ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో గతంలో అమ్మిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొంద రు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తమకున్న భూమిలో కొంత మేరకు మాత్రమే అమ్మిన వారు.. కొనుగోలు చేసిన వారు ఎంత మేరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై గందరగోళం నెల కొంది. మరికొన్ని చోట్ల అమ్మకం చేసిన వ్యక్తు లు కొనుగోలుదారుల వద్ద నుంచి ఎంతో కొం త రాబట్టుకునేందుకు అబ్జెక్షన్ దరఖాస్తులు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్ర స్తుతం మైదాన ప్రాంతంలో దీనిపైనే ప్రధాన చర్చ జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏజెన్సీ ప్రాంతంలో దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1969 తర్వాత గిరిజనేతరుల భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధించడంతో ఇప్పటికే వారి వద్ద నుంచి కొనుగోలు చేసి.. సాగు చేసుకుంటున్న రైతులు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులున్నాయి. ప్రహాసనమేనా.. సాదా బైనామా ప్రక్రియ ప్రహాసనంలా మారనుందనే ప్రశ్నకు రెవెన్యూ వర్గాలు అవుననే సమాధామిస్తున్నాయి. సాధారణంగా పహాణీ లో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుం టే.. కనీసం 6 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాకు సిద్ధం కావడంతో 2,01,762 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం డివిజన్లో అత్యధికంగా 1,28,769, కొత్తగూడెం డివిజన్లో 52,119, పాల్వంచ డివిజన్లో 19,337, భద్రాచలం డివిజన్లో 1,537 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో రెవెన్యూ శాఖ సతమతమవుతుండటం.. ఉన్న పనులే సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొనడంతో.. ప్రస్తు తం సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎన్నేళ్లు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలెన్నో... ⇔ అధికారులు విచారణ సమయంలో అమ్మకం, కొనుగోలుదారుల వాంగ్మూలం స్వీకరిస్తారా? ⇔ హద్దులు లేని అగ్రిమెంట్లను ఏ ప్రాతిపదికన చేస్తారు? ⇔ అమ్మకందారులు మరణిస్తే వారి వారసుల వాంగ్మూలం సేకరిస్తారా? ⇔ పంపకాలు జరగని వారసత్వ భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారు? ⇔ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ ఏజెన్సీలో నకిలీ డాక్యుమెంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా? ⇔అమ్మకందారులు స్థానికంగా లేనిపక్షంలో వారి వాంగ్మూలం సేకరణ పరిస్థితి ఏమిటి? ⇔ సాదా బైనామాకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారా? ⇔ వివాదంలో ఉన్న భూముల అడ్డదారి క్రమబద్ధీకరణ నిలిచేనా? ⇔ డాక్యుమెంట్ రాత సమయంలో సాక్షుల సంతకాలు లేకుంటే వాటి పరిస్థితి ఏమిటి? -
శాంతం.. అభయం... అమరం అంతా ఓంకారమే!
పిప్పలాద మహర్షి దగ్గరకు బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసతో వెళ్లిన ఆరుగురు ఋషులలో అయిదోవాడు శిబిదేశానికి చెందిన సత్యకాముడు. అప్పటిదాకా గురువుగారు చెప్పిన సమాధానాలు, తీర్చిన సందేహాలు అన్నీ శ్రద్ధగా విన్నాడు. గార్గ్యుడు అడిగిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి (మెలకువ, కలలు, గాఢనిద్ర) దశలకు పిప్పలాదుడు చెప్పిన వివరణ ప్రకారం గాఢనిద్రలో అన్నీ ఆత్మలో లీనమై పోతాయి. అయితే అలా జరిగినట్టు ఆ ప్రాణికి తెలియదు. ప్రాణుల్లో శ్రేష్ఠుడైన మానవుడు ధ్యానసాధనతో మెలకువలోనే ఆత్మలో లీనమయ్యే స్థితికి చేరుకోవచ్చునేమో అనిపించిన సత్యకాముడు మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ‘‘గురుదేవా! మనుష్యుడు బతికి ఉన్నంతవరకు ఓంకారాన్ని నిష్ఠతో ధ్యానిస్తే ఏ లోకానికి వెళతాడు?’’ ఆ ప్రశ్నకు పిప్పలాదుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘సత్యకామా! ఓంకారం పరమూ, అపరమూ అయిన బ్రహ్మస్వరూపం. ఈ రెండిటిలో మొదటిది పైస్థాయికి చెందుతుంది. రెండవది సాధారణమైంది. విజ్ఞుడైన సాధకుడు పై రెండు మార్గాలలో దేనిని స్వీకరిస్తే, ఆ స్థితిని పొందుతాడు. ఓంకారాన్ని ఏకమాత్ర (లఘువు)గా ఏకాగ్రతతో ధ్యానించేవానికి జ్ఞానోదయం అవుతుంది. అయితే వెంటనే మనుష్యలోకానికి తిరిగి వచ్చేస్తాడు. ఋగ్వేద అధిదేవతలు అతణ్ణి భూలోకానికి తీసుకు వస్తారు. జ్ఞానోదయమై తిరిగి వచ్చిన ఆ మానవుడు తపస్సు, బ్రహ్మచర్యం, శ్రద్ధ మొదలైన సద్గుణాల సంపదతో మహిమాన్వితుడు అవుతాడు. ఓంకారాన్ని రెండు మాత్రలుగా (దీర్ఘం)దీక్షతో ధ్యానం చేసినవాడు మనస్సుతో లీనమవుతాడు. యుజుర్వేద మంత్ర దేవతలు ఆ సాధకుణ్ణి చంద్రలోకానికి తీసుకుపోతారు. అతడు ఆ లోకంలో సుఖసంపదలను అనుభవించి తిరిగి భూలోకానికి వస్తాడు. ఓంకారాన్ని మూడుమాత్రలుగా (సుదీర్ఘంగా) దీక్షగా పరమపురుష ధ్యానం చేసినవాడు సూర్యలోకానికి చేరుకుంటాడు. పాము కుబుసం రూపంలో పాతచర్మాన్ని విడిచిపెట్టినట్టు పాపాల నుంచి బయటపడతాడు. సామవేదాధిదేవతలు అతణ్ణిబ్రహ్మలోకానికి తీసుకుపోతారు. బ్రహ్మలోకానికి వెళ్లిన జీవుడు పరాత్పరుడు, అన్ని ప్రాణుల్లో ఉండేవాడు, సర్వశ్రేష్ఠుడు అయిన పరమ పురుషుణ్ణి దర్శిస్తాడు. నాయనా! నేను చెప్పినట్టు ఓంకారాన్ని మూడు దశల్లో ఒకటి, రెండు, మూడు మాత్రల్లో ధ్యానించేవాడు. ఆయా ఫలితాలను పొందినా అవి తాత్కాలికమే. మళ్లీ భూమికి రాక తప్పదు. ఒకదశ నుండి మరొక దశకు అవిచ్ఛిన్నమైన అనుసంధానంలో ధ్యానం చేస్తూ, బాహ్య, అభ్యంతర, మధ్యమ స్థితులను సమానంగా నిర్వహించేవిధంగా ఓంకారాన్ని ధ్యానం చేసే విద్వాంసుడు దేనికీ చలించడు. పతనం కాడు. సత్యకామా! ఋగ్వేద పద్ధతిలో ఓంకారధ్యానం చేసినవాడు ఇహలోకాన్ని, యజుర్వేద పద్ధతిలో చేసినవాడు అంతరిక్షలోకాలనూ, సామవేదపద్ధతిలో చేసినవాడు విజ్ఞులు చేరుకునే బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. ఈ సత్యాన్ని అన్వేషించే మహాత్ములు ఓంకారంతోనే శాంతమూ, అజరమూ, అమరమూ, అభయమూ, పరమపదమూ అయిన యోగస్థితిని పొందుతున్నారు’’. అలా పిప్పలాద మహర్షి చెప్పిన ఓంకార ధ్యానక్రమం మానవజాతికి సాధన మార్గంలో పరబ్రహ్మలో లీనమై అవిచ్ఛిన్నమైన యోగస్థితిని పొంది ఇహలోకంలో జీవించే జీవన్ముక్తిని, ప్రశాంతతను ప్రసాదిస్తుందని సత్యకాముడు, మిగిలినవారు అర్థం చేసుకున్నారు. పరిమిత ధ్యానం, మెలకువ, కల, గాఢనిద్ర, చావుపుట్టుకల వలె వస్తూపోతూ ఉండే ఫలితాన్ని ఇస్తుంది. అపరిమిత ధ్యానం ఎడతెగని జ్ఞానాన్ని ఇస్తుందని తెలుసుకున్నారు. చివరిగా సుకేశుడు అడిగిన ఆరోప్రశ్న ‘‘పదహారు కళలతో ఉన్న పురుషుడు ఎవడు?’’ దీనికి సమాధానం వచ్చేవారం చూద్దాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఆలస్యంగా మెచ్యూర్ అయితే..?
సందేహం నా వయసు 22. నాకు మరో మూడు నెలల్లో పెళ్లి జరగబోతోంది. అయితే నన్నొక సందేహం బాగా భయపెడుతోంది. నేను చాలా ఆలస్యంగా మెచ్యూర్ అయ్యాను. అంటే... పందొమ్మిదో యేడు దాటిన తర్వాత అయ్యాను. అంటే అయ్యి ఇప్పటికి రెండున్నరేళ్లు అవుతోంది. మరి నా శరీరం, నా అవయవాలు అన్నీ పెళ్లికి తగినట్టుగా ఎదిగి ఉంటాయా? లేక ఆలస్యంగా మెచ్యూర్ అవ్వడం వల్ల అప్పుడే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులేమైనా వస్తాయా? నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చా చేసుకోకూడదా? సలహా ఇవ్వండి. - విజయశ్రీ, గుడివాడ సాధారణంగా మెదడులో స్రవించే హార్మోన్స్ ఆడపిల్లల అండాశయాలు, గర్భాశయం పైన ప్రభావం చూపడం వల్ల పీరియడ్స్ మొదలై రజస్వల అవుతారు. ఇది 12-16 సంవత్సరాల వయసు లోపల జరుగుతుంది. మారుతున్న ఆధునిక కాలంలో జీవనశైలిలో మార్పులు, ఆహారంలో జంక్ఫుడ్ మోతాదు పెరగడం, వ్యాయామం లేకపోవడం, ఎక్కువగా టీవీలు, ఫోన్లలో కాలక్షేపం వంటివెన్నో మార్పుల వల్ల మెదడు త్వరగా ప్రేరేపణకు గురై 10-11 ఏళ్లకే చాలామంది పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు. ఇలాంటి కాలంలో మీరు 19 ఏళ్లకి మెచ్యూర్ అయ్యారంటే చాలా ఆలస్యంగా అయినట్లే. మీ బరువు, ఎత్తు రాయలేదు. కొందరు మరీ బలహీనంగా, బక్కచిక్కినట్లు ఉండటం వల్ల... లేదా హార్మోన్లలో తేడా వల్ల... జన్యుపరమైన కారణాల వల్ల ఆలస్యంగా మెచ్యూరై ఉండొచ్చు. ఇప్పుడు మీకు నెల నెలా పీరియడ్స్ క్రమంగా వస్తున్నాయా లేదా రాయలేదు. నెల నెలా సక్రమంగా వస్తుంటే, మీ శరీరంలో పెద్దగా సమస్య లేనట్లే. సాధారణంగా రజస్వల కావడానికి రెండేళ్ల ముందు నుంచే శరీరంలో మార్పులు వస్తాయి. అంటే చంకల్లోను, జననాంగాల వద్ద వెంట్రుకలు రావడం, రొమ్ములు పెరగడం, కొద్దిగా ఎత్తు పెరగడం, బరువు పెరగడం వంటి మార్పులు మొదలై, తర్వాత రెండేళ్ల లోపల శరీరం పెళ్లికి, పిల్లలకు సన్నద్ధం అవు తుంది. మీరు మెచ్యూర్ అయి నాలుగేళ్లు అయింది కాబట్టి, మీ శరీరంలో పెళ్లికి, పిల్లలకి తగ్గట్టుగా అన్ని మార్పులూ వచ్చే ఉండొచ్చు. ఒకవేళ పీరియడ్స్ సరిగా రానట్లయితే ఒకసారి గైనకాలజిస్ట్ను సంప్రదించి థైరాయిడ్, ప్రొలాక్టిన్ హార్మోన్, CBP, ESR వంటి రక్తపరీక్షలు, స్కానింగ్ చేయించుకొని గర్భాశయ పరిమాణం ఎలా ఉంది, అండాశయాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నది చూసుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోండి. నా వయసు 30. ఎత్తు ఐదున్నర అంగుళాలు. బరువు 75 కిలోలు. నాకు ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నాయి. ఆ విషయం నేను గమనించుకోలేదు. దాంతో కుడివైపు ఓవరీలోని నీటి బుడగ ఒకటి పగిలిపోయింది. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో ఆ ఓవరీని తొలగించారు. అయితే రెండో ఓవరీలో కూడా నాకు బుడగలు ఉన్నాయి. కానీ ఇంకా చిన్నగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు డాక్టర్. కానీ నాకు చాలా భయంగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ అలా అవ్వకుండా ఉంటుందో చెప్పండి ప్లీజ్. - వి.సుభాషిణి, కరీంనగర్ గర్భాశయానికి ఇరువైపుల ఉండే అండాశయాలలో నెలనెలా అండం తయారవ డానికి వీలుగా, అండాశయంలో చిన్న ఫాలికల్స్ ఉంటాయి. ఇవి కొందరిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలా ఎక్కువగా నీటి బుడగల్లాగా అండాశయం మొత్తం ఉంటాయి. వీటిని POLYCYSTIC OVARIES అంటారు. ఈ నీటి బుడగలు పగలడం ఏమీ ఉండదు. కొందరిలో ఈ ఫాలికల్స్ కొద్ది కొద్దిగా పెరుగుతూ వాటిలో నీరు ఎక్కువగా చేరి నీటిగడ్డలాగా (POLYCYSTIC OVARIES) మారుతుంది. ఇవి అయిదు సెంటీమీటర్ల కంటే ఎక్కువగా పెరిగినప్పుడు కడుపు లోపల అది పగిలి, దాని నుంచి బ్లీడింగ్ అవ్వడం, విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. అప్పుడు ఈ CYST ని తీసేస్తారు. అవసరమైతే మొత్తం అండాశయాన్ని తీసేయడం జరుగుతుంది. మీ విషయలో అదే జరిగివుంటుంది. మీకు ఇప్పుడు ఒక్కటే అండాశయం ఉంది. అందులోనూ నీటి బుడగలు ఉన్నాయంటే అది పాలిసిస్టిక్ ఓవరీ అన్నమాట. వీటిలో మళ్లీ ఇ్గఖీ తయారవుతుందా లేదా అన్నది చెప్పడం కష్టం. మీ ఎత్తుకు మీరు 10 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. అధిక బరువు వల్ల కూడా నీటి బుడగలు పెరగడం జరుగుతుంది. అందుకే మీరు బరువు తగ్గడానికి వ్యాయామం చేయండి. పరిమితమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో low dose pills కొంతకాలం వాడటం వల్ల సిస్ట్లు పెరిగే అవకాశం తగ్గుతుంది. మీకు పెళ్లి అయ్యిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా అన్నది రాయలేదు. ఎందుకంటే పిల్లలు లేకపోతే, దానికి తగ్గ చికిత్స కూడా తీసుకోవలసి ఉంటుంది. - డా.వేనాటి శోభ -
ఆ వైరస్ సోకింది... చనిపోతానా?!
సందేహం నా వయసు 22. ఇంకా పెళ్లి కాలేదు. నాకు అప్పుడప్పుడూ పిరుదుల్లో మంటలాగా వస్తోంది. కంటిన్యుయస్గా రావడం లేదు. వచ్చి ఆగుతోంది. తగ్గిపోయిందిలే అనుకుంటే మళ్లీ వస్తోంది. మంటతో పాటు దురద కూడా ఉంటోంది. బాగా నడిచినప్పుడు ఎక్కువగా అలా అవుతోంది. ఒక్కోసారి మోషన్కి వెళ్లాక కూడా నొప్పి, దురద వస్తాయి. మోషన్లో బ్లడ్ కానీ, వెళ్లేటప్పుడు నొప్పి కానీ లేవు. ఎందుకిలా వస్తోందో అర్థం కావడం లేదు. నెల రోజుల్నుంచీ యూరిన్ ఇన్ఫెక్షన్కి యాంటీ బయొటిక్స్ వాడుతున్నాను. వాటివల్ల ఇలా అవుతోందా? ఇప్పుడు నేనేం చేయాలి? - లోహిత, మెయిల్ మీరు ఎంత బరువు ఉన్నారు, చదువు కుంటున్నారా లేక ఉద్యోగం చేస్తున్నారా అనేవేవీ రాయలేదు. ఎందుకు అడుగుతున్నానంటే... ఉద్యోగరీత్యా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. అధిక బరువు ఉన్నవారు ఇలా గంటల తరబడి కూర్చునే ఉంటే... ఒక్కోసారి పిరుదుల్లోని నరాలు ఒత్తుకుని, మంటగా తిమ్మిరిగా అనిపించవచ్చు. మరికొంత మందికి కూర్చునే ఉండటం వల్ల గాలి ఆడక చెమట పట్టడం, పిరుదుల చర్మంపై మంటగా ఉండటం జరగవచ్చు. కొన్నిసార్లు వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మంట, దురద వచ్చే అవకాశం ఉంటుంది. నెల నుంచి యాంటీ బయొటిక్స్ వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడి, మంట దురద వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. మోషన్కి వెళ్లాక మంట, దురద వస్తున్నాయి అంటున్నారు కాబట్టి మోషన్లో నులి పురుగులేమైనా ఉండవచ్చు. లేదా మోషన్ ఫ్రీగా రాకపోవడం వల్ల కూడా అలా జరగవచ్చు. పరీక్ష చేస్తేనే ఏదైనా చెప్పగలం. కాబట్టి మీరు ఓసారి డాక్టర్ని సంప్రదిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ మరేదైనా సమస్య కానీ ఉందేమో చూస్తారు. కడుపులో నులి పురుగులు ఉన్నాయా అనేది కూడా పరీక్షించి చికిత్స చేస్తారు. నాకు పెళ్లై మూడు నెలలు అవుతోంది. ఈ మధ్యనే నాకు హెర్పిస్ సింప్లెక్స్ 2 ఉందని తేలింది. రేపు నేను బిడ్డని కంటే ఈ వ్యాధి తనకి కూడా సోకుతుందా? ఈ వ్యాధి భవిష్యత్తులో క్యాన్సర్గా మారే అవకాశం ఉందా? నేనింకా ఎన్నేళ్లు బతుకుతాను? అసలు నేనేం ట్రీట్మెంట్ తీసుకోవాలి? - రమ, మెయిల్ కేవలం వైరల్ ఇన్ఫెక్షన్కే చావుదాకా ఎందుకు ఆలోచిస్తున్నారు? హెర్పిస్ సింప్లెక్స్ 2 అనేది హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 2 వల్ల వస్తుంది. దీనివల్ల జననేంద్రియాల వద్ద, తొడల వద్ద చిన్న చిన్న నీటి పొక్కులు వస్తాయి. వాటివల్ల అక్కడ దురద, మంట ఉంటాయి. మూత్రం పోసినప్పుడు మంట ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ సాధారణంగా కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. దీన్ని నిర్ధారించడానికి క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు అవసరమైతే HSV2 Igg, Igm antibodies రక్తపరీక్షలు చేయాలి. అలాగే నీటిపొక్కుల నుంచి Swab తీసి మైక్రోస్కోపిక్ టెస్ట్కి పంపించవచ్చు. మీకు HSV2 నిర్ధారణ అయ్యింది కాబట్టి మీరు, మీవారు కూడా డాక్టర్ పర్యవేక్షణలో acyclovir, valacyclovir అనే యాంటీ వైరల్ మందులు, క్రీములు వాడి చూడండి. పొక్కులు పూర్తిగా తగ్గిపోయేవరకు కలయికకు దూరంగా ఉండండి. కొందరిలో ఈ పొక్కులు వాటికవే మాడిపోతాయి. అయితే ఈ వైరస్ చాలావరకూ నరాల్లో దాగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, మానసిక ఆందోళన, ఒత్తిడి వంటివి కలిగినప్పుడు మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చికిత్స కరెక్ట్గా తీసుకోవాలి. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదు. క్యాన్సర్గా మారే అవకాశాలూ లేవు. ఓసారి ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకంగా మూడు వారాల్లో HSV యాంటీ బాడీస్ తయారవుతాయి. వీటివల్ల మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పైన చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో మళ్లీ వచ్చినా... తీవ్రత తక్కువగా ఉంటుంది. గర్భం దాల్చినా బిడ్డకు సోకే అవకాశాలు ఉండవు. గర్భంతో ఉన్నప్పుడు కనుక HSV2 ఇన్ఫెక్షన్ వస్తే... అది వ్యాధి తీవ్రతను బట్టి బిడ్డకు సోకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనవసరంగా ఆలోచించి భయపడకుండా మీరు, మీవారు మంచి చికిత్స తీసుకోండి. - డా.వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్,హైదరాబాద్ -
కుటుంబ నియంత్రణ... ఆడవాళ్లే పాటించాలా?
సందేహం నా వయసు 32. నాకు చాలాకాలంగా వక్షోజాల్లో గడ్డలు ఉన్నాయి. పట్టుకుంటే చాలా పెద్దగా తగులుతాయి. నెలసరి రావడానికి పది రోజుల ముందు నుంచీ చాలా నొప్పిగా ఉంటాయి. నెలసరి మొదలవగానే తగ్గిపోతాయి. అయితే ఈ మధ్య ఎప్పుడూ నొప్పిగానే అనిపిస్తున్నాయి. కలయిక సమయంలో కూడా కాస్త గట్టిగా ఒత్తినా తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా భయంగా ఉంది. ఈ గడ్డల వల్ల ఏదైనా ప్రమాదమా? అలాగే నాకు చంకల్లో కూడా చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్ గడ్డలో కాదో ఎలా తెలుసుకోవాలి? క్యాన్సర్ గడ్డలకి ఏవైనా ప్రత్యేక లక్షణాలు ఉంటాయా? - పి.రోహిణి, కాకినాడ చాలామందికి వక్షోజాల్లో ఫైబ్రో అడినోమా అనే క్యాన్సర్ కాని గడ్డలు ఉంటాయి. ఇవి చిన్న బఠాణి గింజ అంత సైజు మొదలుకొని నిమ్మకాయంత సైజు వరకు పెరుగుతుంటాయి. ఇవి ముట్టుకుంటే గట్టిగా ఉండి లోపల అటూ ఇటూ కదులుతుంటాయి. వీటివల్ల ప్రమాదముండదు. కాకపోతే సైజు పెరిగేకొలదీ రొమ్ములో నొప్పి, బిగుతుగా ఉండటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. రొమ్ములో వచ్చే అన్ని గడ్డలూ క్యాన్సర్ గడ్డలు కావు. కొన్ని రకాల గడ్డలు చాలా త్వరత్వరగా సైజు పెరుగుతూ లోపల కదలకుండా ఉండి, పైన చర్మం కూడా లోపలికి లాక్కునట్టుగా ఉంటే అవి క్యాన్సర్ గడ్డలు కావచ్చు. కొందరికి చంకల్లో లింఫ్నోడ్స్ ఉంటాయి. అవి సాధారణంగా చేతికి తగలవు. రొమ్ములో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్లగాని, టీబీ వల్లగాని చాలా అరుదుగా క్యాన్సర్ వల్లకానీ ఇవి ఉబ్బి... చిన్న చిన్న గడ్డల్లాగా తగులుతుంటాయి. కాబట్టి మీరు ఓసారి డాక్టర్ను సంప్రదించి పరీక్ష చేయించు కోండి. అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని వాటిలో ఏదైనా సందేహం ఉంటే నిర్ధారణ కోసం ఊూఅఇ లేదా బయాప్పీ చేయించుకోండి. అప్పుడు అవి క్యాన్సర్ గడ్డలా కాదా అనే నిర్ధారణ అయిపోతుంది. దాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు. పీరియడ్స్కి పది నుంచి పదిహేను రోజుల ముందు నుంచీ చాలామందిలో హార్మోన్ల లోపం వల్ల, కొన్ని మినరల్స్ తక్కువ ఉండటం వల్ల రొమ్ముల్లో నీరు చేరి బరువుగా ఉండటం, నొప్పిగా ఉండటం జరుగుతుంది. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ మాస్టాల్జియా అంటారు. మీరు కంగారు పడకుండా, ఇంకా అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి. తగిన పరీక్షలు చేయించుకుని గడ్డలు ఎలాంటివో నిర్ధారించుకుంటే, దానిబట్టి తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 23. ఈ మధ్యనే పెళ్లి అయ్యింది. అప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. దానికోసం మాత్రలు వాడుతున్నాను. అయితే ఈ మాత్రలు ఎక్కువ వాడితే ప్రమాదం, లూప్ వేయించు కొమ్మని నా ఫ్రెండ్ చెప్తోంది. నిజమేనా? ఇంకో విషయం ఏమిటంటే... విదేశాల్లో పురుషులకు కూడా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఉన్నాయని ఆ మధ్య ఇంటర్నెట్లో చదివాను. అది నిజమేనా? అలాంటివి మన దగ్గర లేవా? - వీణాసాగర్, సికింద్రాబాద్ కుటుంబ నియంత్రణ కోసం పురుషులు వాడటానికి మాత్రలు, ఇంజెక్షన్లు ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇప్పటికీ ప్రయోగ దశలోనే ఉన్నాయి. శుక్రకణాలు తయారవ్వకుండా ఉండటానికి, బయటకు విడుదల కాకుండా ఉండటానికి, కదలిక లేకుండా ఉండటానికి రకరకాల హార్మోన్లు, ఇతర కాంబినేషన్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటి కోసం ఎదురు చూడకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోవడం మంచిది. ఇరవై నుంచి ముప్ఫై సంవత్సరాల వారు వేరే ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ రెండు నుంచి మూడేళ్ల పాటు డాక్టర్ పర్యవేక్షణలో వాడవచ్చు. లూప్ సాధారణంగా ఒక కాన్పు అయినవారికే వేస్తారు. అలా వేయడం మంచిది కూడా. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్ని సంప్రదించండి. వారి సూచన మేరకు మాత్రలు వాడండి. ఇప్పుడు వచ్చే అతి తక్కువ మోతాదు హార్మోన్ పిల్స్ వల్ల సమస్యలేమీ ఉండవు. నా వయసు 26. పెళ్లై రెండేళ్లవుతోంది. ఏడు నెలల బాబు ఉన్నాడు. డెలివరీ అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నిజానికి నేను చాలా యాక్టివ్. చకచకా తిరుగుతూ నా పనులన్నీ నేనే చేసేసుకుంటాను. అందరితో కలివిడిగా ఉంటాను. కానీ ఇప్పుడలా లేదు. ఎందుకో తెలియదు కానీ దేని మీదా ఆసక్తి లేదు. ఏ పనీ చేయబుద్ధి కావడం లేదు. ఎవరితోనైనా మాట్లాడటం కూడా నచ్చట్లేదు. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. దిగులుగా అనిపిస్తోంది. ఎందుకు నాలో ఈ మార్పు వచ్చిందో అర్థం కావడం లేదు. మా ఆయన కూడా నేను చాలా మారిపోయాను అంటున్నారు. ఇది డెలివరీ వల్లే అయ్యిందా లేక ఏదైనా మానసిక సమస్యా? - లతాశ్రీ, ఇస్నాపూర్, మెదక్ డెలివరీ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు, మానసిక శారీరక సమస్యలు, ఇంకా మరెన్నో కారణాల వల్ల కొంతమంది డిప్రెషన్లోకి వెళ్లడం జరుగుతుంది. చికాకు, కోపం, టెన్షన్, బాధ, ఏడుపు రావడం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టకపోవడం, దేని మీదా ఆసక్తి లేకపోవడం, త్వరగా అలసిపోవడం, కన్ఫ్యూజన్, మతిమరుపు వంటి ఎన్నో లక్షణాలు రకరకాల తీవ్రతలో ఉంటాయి (అయితే అందరికీ అన్ని లక్షణాలూ ఉండవు). కొంతమందికి కాన్పు తర్వాతి నుంచి రెండు మూడు వారాల వరకు ఉంటాయి. దానినే పోస్ట్పార్టమ్ బేబీ బ్లూస్ అంటారు. కొందరిలో ఆరు నెలల వరకూ లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. దీనిని పోస్ట్పార్టమ్ డిప్రెషన్ అంటారు. దీన్ని అశ్రద్ధ చేస్తే ఇంకా తీవ్రమై చాలాకాలం పాటు కొనసాగుతుంది. కాన్పు తర్వాత ఆక్ట్రోజిన్, ప్రొజెస్టరాన్ హార్మోన్లు ఉన్నట్టుండి తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ లక్షణాలు రావచ్చు. బిడ్డతో నిద్ర లేకపోవడం, బిడ్డ పనులు ఎక్కువ ఉండటం, ఇంట్లో పనులతో అలసిపోవడం, శరీరంలో వచ్చిన మార్పుల వల్ల భర్త తనని పట్టించుకోడేమోనన్న భావన వంటి ఎన్నో కారణాల వల్ల కూడా ఈ లక్షణాలు తలెత్తవచ్చు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో సపోర్ట్ కరువైనప్పుడు కూడా రావచ్చు. వీటి నుంచి బయటపడాలంటే భర్త, ఇతర కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరం. అందరూ మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. కొద్దిరోజుల పాటు బిడ్డకు పాలు పట్టడం ఇతరత్రా పనుల్లో సహాయంగా ఉండాలి. మీరు మీ సమస్యను మీ భర్తతోను, మిగతా వాళ్లతోనూ చర్చించండి. వాళ్ల సహాయం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి. వాకింగ్, ప్రాణాయామం వంటివి అలవర్చుకోండి. తగినంత ఆహారం తీసుకోండి. అప్పటికీ తగ్గకపోతే సైకియాట్రిక్ కౌన్సెలింగ్ తీసుకోవడం మంచిది. అవసరమైతే సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కొంతకాలం మందులు కూడా వాడాల్సి ఉంటుంది. నా వయసు 36 సంవత్సరాలు. నాకు ఇరవై యేళ్లకే పెళ్లయ్యింది. కానీ కొన్ని నెలలు తిరక్కుండానే నా భర్త చనిపోయారు. తర్వాత ఒంటరిగానే ఉండిపోయాను. పెళ్లి చేసుకోవాలని లేదు. అయితే ఈ మధ్య ఎందుకో ఓ బిడ్డ ఉంటే బాగుణ్ను అనిపిస్తోంది. భర్తతో సంబంధం లేకుండా బిడ్డను కనడానికి ఏయే పద్ధతులు ఉన్నాయి? ఎంత ఖర్చవుతుంది? నా వయసు దృష్ట్యా అది వీలవుతుందా? దయచేసి సలహా ఇవ్వండి. - సుమిత్ర, రాజమండ్రి మళ్లీ పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనాలంటే డోనర్ ఐయూఐ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. అంటే మీకు అండం విడుదలయ్యే సమయంలో దాత నుంచి సేకరించిన వీర్యకణాలను గర్భాశయంలోకి పంపడం ద్వారా గర్భం వచ్చే అవకాశాలు ఉంటాయి. వేరే సమస్యలు ఏమీ లేనప్పుడు ఈ పద్ధతిని మూడు నుంచి ఆరుసార్ల వరకూ ప్రయత్నించవచ్చు. తర్వాత కూడా గర్భం రాకపోతే డోనర్ వీర్యకణాలతో టెస్ట్ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ప్రయత్నించవచ్చు. కాని భర్త లేకుండా ఈ పద్ధతుల ద్వారా బిడ్డను కనడానికి మన దేశంలో చట్టరీత్యా అనుమతి లేదు. అయినా జీవితాంతం మీకూ ఓ తోడు కావాలి కాబట్టి మరోసారి పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచించండి. 36 సంవత్సరాలైనా ఫర్వాలేదు. పెళ్లి చేసుకుని, మూడు నుంచి ఆరు నెలల వరకూ సాధారణ గర్భం గురించి ప్రయత్నం చేయవచ్చు. ఫలితం లేకపోతే ఐయూఐ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా కూడా ప్రయత్నించవచ్చు. కాకపోతే 35 యేళ్లు దాటిన తర్వాత పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, జన్యుపరమైన సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. వాటికి తగ్గ పరీక్షలు చేయించుకుంటూ గర్భాన్ని కొనసాగించవచ్చు. ఇవన్నీ ఇష్టం లేకపోతే, ఇంక పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నట్లయితే అనాథ శరణాలయం నుంచి ఎవరైనా ఓ చిన్నబిడ్డను దత్తత తీసుకోండి. ఓ అనాథ బిడ్డకు బతుకునిచ్చినవారు అవుతారు. నా వయసు 23. పెళ్లై రెండేళ్లయ్యింది. రెండు నెలలకే గర్భం దాల్చాను. కవలలు పుట్టారు. నార్మల్ డెలివరీనే. ఆ తర్వాత మళ్లీ నెలసరి మొదలయ్యింది. అయితే సమస్య ఏమిటంటే నాకు మొదట్నుంచీ కూడా పీరియడ్స్ సమస్యలేమీ లేవు. కానీ డెలివరీ అయ్యాక పీరియడ్స్లో మార్పు వచ్చింది. బ్లీడింగ్ విపరీతంగా అవుతోంది. ఇంతకుముందు మూడు రోజులకే తగ్గేది ఇప్పుడు ఐదారు రోజుల తర్వాత గానీ తగ్గట్లేదు. పైగా భరించలేనంత కడుపునొప్పి వస్తోంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి? - యు.మేరీమణి, కడపర్తి కొంతమందికి కాన్పు తర్వాత హార్మోన్లలో మార్పులు వస్తాయి. వాటి వల్ల లేదా హార్మోన్లలో లోపాలు, బరువు పెరగడం వంటి వాటి వల్ల పీరియడ్స్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. బ్లీడింగ్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ప్రతినెలా మూడు రోజుల పాటు ట్రనెక్సమిక్ యాసిడ్, మెఫినమిల్ యాసిడ్ కలిసిన మాత్రలు రోజుకు రెండు నుంచి మూడు వాడి చూడండి. అయినా ఫలితం లేకపోతే గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్ తీయించుకుంటే... గర్భాశయంలో లేదా అండాశయాల్లో నీటి తిత్తుల వంటివి ఉన్నాయేమో తెలుస్తుంది. సమస్యను బట్టి చికిత్స తీసుకోవచ్చు. ఒకవేళ బరువు పెరిగివుంటే తగ్గడానికి ప్రయత్నించండి. థైరాయిడ్ వంటి హార్మోన్లలో మార్పులు ఉంటే వాటికి కూడా తగిన చికిత్స తీసుకోండి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
ఫైబ్రాయిడ్... క్యాన్సర్గా మారుతుందా?
సందేహం నా వయసు 28. పెళ్లైన సంవత్సరానికే గర్భం దాల్చాను. అయితే గర్భం ట్యూబులో రావడంతో ల్యాపరోస్కోపీ చేసి ఒకవైపు ట్యూబ్ తీసేశారు. ఇది జరిగి మూడేళ్లవుతోంది. కానీ ఇంతవరకూ నేను మళ్లీ గర్భం దాల్చలేదు. ఒక ట్యూబ్ తీసేస్తే పిల్లలు పుట్టరా? నేను తల్లినయ్యే అవకాశం ఇక లేదా? దయచేసి నేనేం చేయాలో సలహా ఇవ్వండి. - వి.రమ్యశ్రీ, నకిరేకల్ గర్భాశయానికి ఇరువైపులా ఒక్కో ట్యూబు, ఒక్కో అండాశయం ఉంటాయి. ప్రతినెలా అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. ఒక నెల ఒకవైపు అండాశయం నుంచి, మరో నెల మరొక అండాశయం నుండి విడుదలైన అండం... అటువైపున్న ట్యూబ్లోకి ప్రవేశించి, అక్కడకు గర్భాశయం నుంచి వచ్చిన వీర్యకణాలతో ఫలదీకరణ చెందుతుంది. దాంతో ట్యూబ్లో పిండం ఏర్పడి, అది తిరిగి గర్భాశయంలోకి చేరి, అక్కడ పాతుకుని, గర్భం మొదలవుతుంది. మీకు ఒకవైపు ట్యూబ్ లేదు, ఇంకోవైపు ఉంది కాబట్టి... అటువైపు అండం విడుదలైనప్పుడు గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఆపరేషన్ అయ్యి మూడేళ్లు అయినా ఇంకా గర్భం రాలేదు కాబట్టి.. ఓసారి గైనకాలజిస్టును సంప్రదించండి. ట్యూబ్ ఉన్న అండాశయం నుంచి అండం విడుదల అవుతుందా లేదా తెలుసుకోడానికి ఫాలిక్యులార్ స్టడీ చేసి చూడాల్సి ఉంటుంది. ట్యూబ్ ఉన్నవైపు అండా శయం నుంచి అండం విడుదలయ్యే టప్పుడు భర్తతో కలిస్తే గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం విడుదలవ్వకపోతే... మందులు వాడి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది. అయినా గర్భం రాకపోతే... ఉన్న ట్యూబ్ తెరచుకునే ఉందా లేక మూసుకుని ఉందా తెలుసుకోవడానికి హెచ్ఎస్జీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కంగారు పడకుండా డాక్టర్ను కలిసి, అన్ని పరీక్షలూ చేయించుకుని, తగిన చికిత్స తీసుకోండి. త్వరలోనే తప్పకుండా పండంటి బిడ్డకు తల్లి అవుతారు. నా వయసు 23. నాకిప్పుడు నాలుగో నెల. ఈ మధ్య స్కానింగ్ చేసినప్పుడు నా గర్భాశయంలో ఒక చిన్న ఫైబ్రాయిడ్ ఉందని తెలిసింది. దానివల్ల సమస్య ఏమీ ఉండదని డాక్టర్ చెప్పారు. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. ఫైబ్రాయిడ్లు క్యాన్సర్లుగా మారతాయని ఎక్కడో విన్నాను. అస్తమానం అదే నా బుర్రలో తిరుగుతోంది. నా బిడ్డకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని భయమేస్తోంది. అలాంటివేమీ జరక్కూడదంటే నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - మంజూష, పాలకొల్లు గర్భాశయంలో ఏర్పడే ఫైబ్రస్ టిష్యూ, కండరాలతో కూడిన గడ్డలను ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి క్యాన్సర్గా మారే అవకాశాలు చాలా చాలా అరుదు. కాబట్టి అనవసరంగా ఆందోళన చెందకుండా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తూ సంతోషంగా ఉండండి. గడ్డలు పెద్దవిగా ఉన్నా, ఎక్కువ గడ్డలు ఉన్నా కాన్పు సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గడ్డ చిన్నదే కాబట్టి అసలు కంగారే అవసరం లేదు. దాని కోసం మీరు ప్రత్యేకంగా చేయాల్సింది కూడా ఏమీ లేదు. గర్భంలో శిశువు పెరిగేకొద్దీ గర్భాశయం సాగడం జరుగుతుంది. అందులో ఈ గడ్డ ఇంకా చిన్నగా కనబడుతుంది. చాలా అరుదుగా మాత్రమే గర్భంతో ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కంగారు పడవద్దు. డాక్టర్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా స్కానింగులు చేయించుకోండి. ఆనందంగా ఉండి పండంటి బిడ్డను కనండి. నా వయసు 27. ఎత్తు 4 అంగుళాల 10 సెం.మీ. బరువు 57 కిలోలు. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అయ్యింది. మావారికి నాకు మధ్య పదకొండు సంవత్సరాల వయసు తేడా ఉంది. నాకు వెంటనే పిల్లలు కావాలని అనిపిస్తోంది. కానీ ఇంతవరకూ నేను గర్భం దాల్చలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకుంటే పాప్స్మియర్ పరీక్ష చేసి ఇన్ఫెక్షన్ ఉంది అని తేల్చారు. అది పోవడానికి ఏవో మందులు కూడా ఇచ్చారు. అసలు ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది. అది ఉంటే పిల్లలు పుట్టరా? - లక్ష్మి, మచిలీపట్నం యోని లోపల, గర్భాశయ ముఖ ద్వారం నుంచి ద్రవాన్ని తీసి... దాన్ని పరీక్షకు పంపించి, దానిలోని కణాలు ఎటువంటివో తెలుసుకునే పరీక్షను పాప్స్మియర్ అంటారు. ఇందులో మీకు ఇన్ఫెక్షన్ ఉందని వచ్చింది కాబట్టి దానికి సరైన యాంటి బయొటిక్స్తో కూడిన చికిత్స తీసుకుంటే మీ సమస్య త్వరలోనే తీరిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ల వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు. లేదా ఆడవారిలో మలద్వారం యోని ద్వారానికి దగ్గరగా ఉండటం వల్ల మలద్వారం దగ్గరున్న రోగక్రిములు యోని ద్వారంలోకి ప్రవేశించి, తద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. అయినా మీకు పెళ్లై తొమ్మిది నెలలే అయ్యింది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా చికిత్స తీసుకుని మరో మూడు నెలలు గర్భం కోసం ప్రయత్నం చేయండి. సంవత్సరం దాటినా కూడా గర్భం దాల్చకపోతే, డాక్టర్ను సంప్రదించండి. గర్భం రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుంటే తగిన చికిత్స తీసుకోవచ్చు. నా వయసు 22. బరువు 90 కిలోలు. మెచ్యూర్ అయినప్పట్నుంచీ కూడా నాకు పీరియడ్స్ సరిగ్గా వచ్చేవి కాదు. అయితే గత నెల వచ్చాయి కానీ ఇరవై అయిదు రోజుల పాటు బ్లీడింగ్ అవుతూనే ఉంది. దాంతో డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకున్నాను. హైపో థైరాయిడ్ అని, నా గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయని తేలింది. సెకెండ్ ఒపీనియన్ ఉంటే మంచిదని మరో హాస్పిటల్లో కూడా చేయించుకున్నాను. అక్కడా ఇదే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి? నాకున్నవి పెద్ద సమస్యలా? - విజయలక్ష్మి, కోదాడ మీరు తొంభై కిలోల బరువు ఉన్నారు. అంటే అధిక బరువు ఉన్నారు. దానివల్ల అండాశయంలో నీటి బుడగలు ఏర్పడి, హార్మోన్ల అసమతుల్యత కూడా వచ్చి, పీరియడ్స్ సక్రమంగా రావు. పైగా మీకు హైపో థైరాయిడ్ సమస్య కూడా ఉంది. ఇది ఉంటే థైరాయిడ్ హార్మోన్ చాలా తక్కువ విడుదలవుతుంది. దానివల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రావు. అయితే ప్రతి ఒక్క సమస్యకీ ఏదో ఒక పరిష్కారం ఉన్నట్లే... మీ సమస్యకీ పరిష్కారం ఉంది. కాకపోతే అది మీ చేతుల్లోనే ఉంది. బరువు తగ్గడం వల్ల థైరాయిడ్ సమస్య కొద్దిగా అదుపులోకి వస్తే, మందుల డోసును తగ్గించవచ్చు. అలాగే నీటి బుడగల వల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా కొద్దిగా సరి చేయవచ్చు. క్రమపద్ధతిలో వ్యాయామం, వాకింగ్ చేస్తూ ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోండి. దాంతో బరువు తగ్గుతారు. అలాగే గైనకాలజిస్టును సంప్రదించి, వారి పర్యవేక్షణలో పీసీఓఎస్ ఇంకా పెరగకుండా ఉండటానికి, అలాగే హార్మోన్ల అసమతుల్యతను సరిచేయ డానికి మందుల్ని వాడండి. కచ్చితంగా మీ సమస్య పరిష్కారమవుతుంది. ఇప్పుడు కనుక అశ్రద్ధ చేస్తే సమస్య ఇంకా జటిలమవుతుంది. ఇన్ఫెక్షన్ తగ్గిపోతే పిల్లలు పుట్టడానికి కూడా ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా, ఫంగస్, ప్రొటోజోవా, వైరస్ వల్ల రావొచ్చు. ఇది భారాభర్తల కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరి సంక్రమించనూ వచ్చు. నా వయసు 33. బరువు 55 కిలోలు. నాకు ఇద్దరు పిల్లలు. నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతోంది. గత నెల పదిహేను రోజుల వరకూ అవ్వడంతో డాక్టర్ని సంప్రదించాను. స్కాన్ చేసి గర్భసంచి ఉబ్బింది, 13.5 ఉంది అని చెప్పారు. నేను ప్రతి విషయాన్నీ ఎక్కువ ఆలోచిస్తాను. ఏదైనా చిన్న బాధ కలిగినా పదే పదే తలచుకుని కుమిలి పోతుంటాను. ఈ లక్షణాలు పీరియడ్స్కి ముందు మరీ ఎక్కువవు తున్నాయి. ఈ మనస్తత్వం వల్లే నాకు సమస్య వచ్చిందేమో అనిపిస్తోంది. దీనికి తోడు నాకు సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పరిష్కారం చెప్పండి. - బి.కవిత, వరంగల్ మీకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువవుతోంది, పైగా అది రానురాను ఎక్కువ రోజులు అవుతోందని అంటున్నారు. గర్భాశయం ఉబ్బిందనీ అంటున్నారు. మీరు రాసిన 13.5 అనేది గర్భాశయం పొడవా లేక ఏంటి అనేది సరిగ్గా రాలేదు. నేననుకోవడం గర్భాశయం లోపలి ఎండోమెట్రియం పొర మందంగా తయారయ్యి, 13.5 మిల్లీ మీటర్లకు చేరినట్లుంది. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల జరిగి ఉండొచ్చు. మీరు చెప్పే కంగారు, భయం వంటి లక్షణాలు కూడా చాలామందికి పీరియడ్స్ మొదలయ్యే పది రోజులకు ముందు నుంచే ఎక్కువ అవుతూ ఉంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఇది కూడా పీరియడ్స్ ముందు రక్తంలో అండాశయాల నుంచి విడుదలయ్యే హార్మోన్లలో మార్పుల వల్ల, మినరల్స్ లోపం వల్ల రావొచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో సాయంత్రం primerose oil, minerals కాంబినేషన్తో ఉన్న మాత్రలను మూడు నెలల పాటు వాడుతూ ఉండాలి. అలాగే యోగా, మెడిటేషన్ వంటివి చేయడం వల్ల సిండ్రోమ్ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. ఎండోమెట్రియమ్ పొర 13.5 మి.మీ. మందంగా ఉండటం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతోంది. దీనికి మూడు నెలల పాటు ప్రతి నెలా పదిహేనవ రోజు నుంచి పది రోజుల పాటు medroxyprogesterone మందులు వాడండి. మూడు నెలల తర్వాత ఐదవ రోజు స్కానింగ్ చేసి, ఎండోమెట్రియమ్ పొర మందం ఎంత ఉందో చూసుకోవాలి. 6 మి.మీ. ఉంటే ఫర్వాలేదు. ఇంకా మందంగా కనుక ఉంటే... డీ అండ్ సీ చేసి, పొర ముక్కను బయాప్సీకి పంపించాలి. కారణం తెలిశాక దాన్నిబట్టి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల తేడా వల్ల కూడా బ్లీడింగ్ అధికంగా అవ్వొచ్చు. హార్మోన్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, వాటిలో తేడా ఉంటే తగిన మందులు వాడితే సమస్య నుంచి బయట పడవచ్చు. - డా. వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
క్యాన్సర్ వచ్చి తగ్గింది... పెళ్లి చేసుకోవచ్చా?!
సందేహం నా వయసు 22. ఈ మధ్యనే పాప పుట్టింది. తల్లిపాలే ఇస్తున్నాను. అయితే పాపకి ఓసారి వెక్కిళ్లు వస్తే కొద్దిగా నీళ్లు పట్టించాను. అది చూసి మా అమ్మ కోప్పడింది. చంటిపిల్లలకు ఆరు నెలలు దాటేవరకూ నీళ్లు తాగించ కూడదు అంది. అది నిజమేనా? పాపకు నీళ్లు పట్టించకూడదా? ఏ వయసు వచ్చేవరకూ పట్టించకూడదు? - కవిత, వరంగల్ పిల్లలకు మొదటి ఆరు నెలలు నీటి అవసరం ఉండదు. ఎందుకంటే తల్లి పాలలో, డబ్బా పాలలో 85 శాతం నీరే ఉంటుంది. కాబట్టి మొదటి ఆరు నెలలు మంచినీళ్ల అవసరం ఉండదు. ఒకవేళ విడిగా నీళ్లు కనుక తాగిస్తే... తీసుకున్న ఆహారంలోని మినరల్స్, విటమిన్స్ డైల్యూట్ అయ్యి, బిడ్డకు సరైన పోషకాలు అందవు. పైగా చిన్నపిల్లల కిడ్నీలు మొదటి ఆరు నెలల్లో అధిక నీటిని తట్టుకోలేవు. నీళ్లు ఎక్కువైతే వాళ్లకు water intoxication జరుగుతుంది. డబ్బాపాలలో కూడా దానిపైన ముద్రించిన మోతాదులోనే నీళ్లు కలిపి తాగించాలి. అలా కాకుండా ఎక్కువ కలిస్తే మాత్రం పోషకాలు అందక పిల్లలకు వేరే సమస్యలు ఏర్పడతాయి. నా వయసు 24. నేను చిన్నప్పట్నుంచీ బలపాలు తింటూ ఉంటాను. ఎందుకో తెలీదు కానీ నాకు అవంటే చాలా ఇష్టం. రోజుకి ఒకటైనా తింటాను. ఇది నా క్లోజ్ఫ్రెండ్స్కి తప్ప ఎవరికీ తెలియదు. ఈ మధ్య నా ఫ్రెండ్ నాతో, బలపాలు తింటే పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది, మానెయ్ అంది. ఆ మాట విన్నప్పట్నుంచీ భయమేస్తోంది. మరో ఐదు నెలల్లో నా పెళ్లి. ఒకవేళ నా అలవాటు వల్ల నాకు పిల్లలు పుట్టరా అని కంగారు వచ్చేస్తోంది. కానీ ఎంత కంట్రోల్ చేసుకున్నా తినకుండా ఉండలేకపోతున్నాను. ఇదేమైనా వ్యాధా? నాకు పిల్లలు పుడతారా పుట్టరా? - మౌనిక, ఒంగోలు కొందరికి బలపాలు, చాక్పీసులు, ముగ్గురాళ్లు, బియ్యం తినే అలవాటు ఉంటుంది. దీనినే ‘పైకా’ అంటారు. రక్తంలో కాల్షియం, హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నా, ఐరన్ తక్కువ ఉన్నా, రక్తహీనత ఉన్నా, కొన్ని రకాల మినరల్స్ తక్కువ ఉన్నా ఇలాంటివి తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కొందరి కడుపులో పేగుల్లో నులి పురుగులు ఉంటాయి. అవి రక్తం, తద్వారా విటమిన్స్, మినరల్స్ వంటి వాటిని లాగేసుకోవడం వల్ల బలపాలు, చాక్పీసుల్లాంటివి తినాలనిపిస్తుంది. కాబట్టి మీరోసారి డాక్టర్ని సంప్రదించి రక్తహీనత ఉందేమో పరీక్ష చేయించుకోవడం మంచిది. సీబీపీ లేదా హెమోగ్లోబిన్ శాతం, కాల్షియం టెస్ట్ వంటివి చేయించుకుని... కారణాన్ని బట్టి చికిత్స తీసుకోండి. కాల్షియం, ఐరన్ తక్కువగా ఉంటే... మూడు నెలల పాటు ఆ మాత్రలు వేసుకోవాలి. మలంలో నులి పురుగులు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేయించుకుని, దానికి కూడా చికిత్స తీసుకోవడం మంచిది. తద్వారా బలపాలు, చాక్పీసులు తినే అలవాటు తగ్గుతుంది. ఇవి తినడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అంటూ ఉండదు. కాకపోతే అవి తినడానికి గల కారణం వల్ల... అంటే రక్తహీనత, కాల్షియం లోపం వంటి వాటి వల్ల గర్భంతో ఉన్నప్పుడు సమస్యలు రావచ్చు. కాబట్టి కంగారు పడకుండా ముందు మంచి డాక్టర్ను కలిసి పరీక్షలు, చికిత్స చేయించుకోండి. నా వయసు 28. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 50 కిలోలు. నాకు ఇరవై రెండేళ్లు ఉన్నప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది. ప్రారంభ దశలోనే ఉండటంతో ఆపరేషన్ చేసి గ్లాండ్ను తీసేశారు. శరీరంలో ఇంకెక్కడికీ క్యాన్సర్ పాకలేదని చెప్పారు. ఆ తర్వాత నేను బాగానే ఉన్నాను. డాక్టర్ చెప్పిన థైరాయిడ్ మాత్రలు వాడుతున్నాను. ఏ సమస్యా లేదు కాబట్టి పెళ్లి చేసుకొమ్మని ఇంట్లోవాళ్లు అంటున్నారు. కానీ నాకు భయంగా ఉంది. క్యాన్సర్ వచ్చినవాళ్లకు పిల్లలు పుడతారా? పుడితే వాళ్లకు ఏవైనా సమస్యలు వస్తాయా? ఒకవేళ నాకే భవిష్యత్తులో మళ్లీ ఏమైనా ఇబ్బందులొస్తాయా అనేది అర్థం కావడం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి. - ఎన్.ప్రభావతి, కాశిపూడి మీకు థైరాయిడ్ క్యాన్సర్కి ఆపరేషన్ చేసి, థైరాయిడ్ గ్లాండ్ తీసేసి ఆరు సంవత్సరాలు అయిపోయింది. ఆ క్యాన్సర్ చుట్టుపక్కల పాకలేదు కనుక దానివల్ల ఇంకెప్పటికీ సమస్య రాదు. క్యాన్సర్ ఏ భాగానికి వచ్చింది, అది చుట్టూ పాకిందా, రేడియోథెరపీ ఇచ్చారా, కీమోథెరపీ ఇచ్చారా అనేదాన్ని బట్టి పిల్లలు పుడతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. మీకు థైరాయిడ్కి మాత్రమే వచ్చింది. అదీ తీసేశారు కాబట్టి పిల్లలు పుట్టకపోవడం అనేది ఉండదు. ఎలాగూ మీరు థైరాయిడ్ మాత్రలు వాడుతున్నారు కాబట్టి వాటిని క్రమం తప్పకుండా జీవితాంతం వాడండి. పుట్టబోయే బిడ్డకి మీ సమస్య వల్ల ఏ ఇబ్బందీ రాదు. ఈ ఆరేళ్లలో మీకు ఏ ఇబ్బందీ లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు. ఓసారి మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్ను కలిసి సలహా తీసుకుని, అవసరమైతే థైరాయిడ్ పరీక్షలు చేయించుకుని చక్కగా పెళ్లి చేసుకోండి. ఆనందంగా ఉండండి. నా వయసు 22. నేను ఈ మధ్యనే గర్భం దాల్చాను. మా అత్తగారు జాగ్రత్తలు చెబుతూ నువ్వులు, పైనాపిల్, బొప్పాయి పొరపాటున కూడా తినొద్దు అని చెప్పారు. తింటే గర్భం పోతుందని కూడా అన్నారు. అది నిజమా? బొప్పాయి తింటే గర్భవతులకు మంచిదే అని ఎక్కడో చదివినట్టు గుర్తు. అందుకే మిమ్మల్ని అడగాలనిపించింది. అవి నేను తినొచ్చా తిన కూడదా? గర్భవతులు తినకూడనివి ఏంటి? - సుజిత, సంగారెడ్డి గర్భవతులు బొప్పాయి, పైనాపిల్, నువ్వులు తినకూడదు, వాటివల్ల అబా ర్షన్లు అవుతాయి... అరటిపండు, కొబ్బరి నీళ్లు తీసుకుంటే బిడ్డకి జుట్టు రాదు, జలుబు చేస్తుంది అంటూ పెద్దవారు, పక్కింటివారు చెబుతూ ఉంటారు. కానీ ఇవేవీ నిజాలు కావు. కేవలం అపోహలు. వాస్తవం ఏమిటంటే... బొప్పాయి (పచ్చిది కాదు) బాగా పండిన తర్వాత తింటే... దానిలో ఉండే విటమిన్ ఎ, బి, సి, ఫైబర్లు తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పచ్చి బొప్పాయిలో latex, papain అనే పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. వాటిని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో అబార్షన్లు అయ్యే అవకాశాలు కాస్త ఎక్కువ. అందకని బొప్పాయిని పచ్చిగా కాకుండా పండిన తర్వాత తీసుకోవాలి. కాకపోతే కాస్త మితంగానే తీసుకోవాలి. ఇక పైనాపిల్లో ఉండే బి, సి విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఎంతో మేలు చేస్తాయి. సీ విటమిన్ బిడ్డ ఎముకలు, పళ్లు ఆరోగ్యంగా పెరగ డానికి... బీ విటమిన్ బిడ్డ కణజాలం, నాడీవ్యవస్థ వంటివి అభివృద్ధి చెందడానికి ఉపయోగ పడతాయి. ఫైబర్ వల్ల తల్లిలో జీర్ణశక్తి పెరిగి, మలబద్ధక సమస్య ఏర్పడకుండా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మితంగా తినవచ్చు. మితంగా ఎందుకు అంటే... పైనాపిల్లో ఉండే బ్రోమిలిన్ అనే పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటే కొందరిలో (అతి తక్కువ) అబార్షన్లు అయ్యే అవకాశాలున్నాయి. ఇక నువ్వుల సంగతి. ఇవి తింటే వేడి చేస్తుందనేది అపోహ మాత్రమే. నువ్వుల్లో ఐరన్, కాల్షియం, అమైనో యాసిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఉంటాయి. అవి కూడా తల్లికీ, బిడ్డకీ ఎంతో మేలు చేస్తాయి. కాకపోతే ఏదైనా మితంగానే తినాలి. అతి ఎవరికైనా ప్రమాదమే! కాకపోతే పచ్చళ్లు, నూనె వస్తువులు, కారం, మసాలాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. కొబ్బరినీళ్లు తాగండి. ఎక్కువ చక్కెర లేకుండా పండ్లరసాలూ తీసుకోవచ్చు. అరటిపండ్లు, సపోటాలు వంటి చక్కెర ఎక్కువ ఉన్న పండ్లని బరువు తక్కువగా ఉన్నవారు తీసుకోవచ్చు. అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో షుగర్ వ్యాధి హిస్టరీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. నా వయసు 23. సంవత్సరం క్రితం పెళ్లయ్యింది. అంతకు రెండేళ్ల ముందే నాకు హెచ్ఐవీ ఉందని తెలిసింది. దిగులు పడ్డాను. కానీ అదే సమస్య ఉన్న నా స్నేహితుడొకరు నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చారు. ఇద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాం. మందులు వాడుతున్నాం. నాకో బిడ్డను కనాలని ఉంది. కానీ పుట్టే బిడ్డకు కూడా హెచ్ఐవీ వస్తుందేమోనని భయం. అలా రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? - ఓ సోదరి హెచ్ఐవీ అనేది ఓ వైరస్. ఇది శరీరంలోని రోగ నిరోధక కణాలలో చేరి, అక్కడ వృద్ధి చెందుతూ, ఆ కణాలను నశింపజేస్తాయి. దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి అనేక రకాల ఇన్ఫెక్షన్లు శరీరాన్ని చుట్టుముడతాయి. మనిషిని మెల్లమెల్లగా కృశింపజేస్తాయి. ఈ పరిస్థితినే ఎయిడ్స్ అంటారు. ఈ వ్యాధి అసురక్షిత రక్తమార్పిడి వల్ల, లైంగిక కలయికల వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. హెచ్ఐవీ ఉన్న మహిళ గర్భం దాలిస్తే... మాయ ద్వారా, రక్తం ద్వారా బిడ్డకి వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. తల్లి పాల ద్వారా కూడా బిడ్డకు సంక్ర మిస్తుంది. అయితే ఇప్పుడు మిగతా జబ్బుల లాగానే దీనికి కూడా యాంటి వైరల్ మందుల్ని కనుగొన్నారు. ఇవి దీర్ఘకాలం వాడటం వల్ల హెచ్ఐవీ వైరస్ చాలావరకు నశించిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరిద్దరూ ఓసారి వైరల్ లోడ్ ఎంత ఉందో పరీక్ష చేయించుకోండి. ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని రోజులు మందులు వాడి, తర్వాత గర్భం కోసం ప్రయత్నించండి. అప్పుడు కడుపులో బిడ్డకి హెచ్ఐవీ వైరస్ సంక్రమించే అవకాశాలు తగ్గుతాయి. గర్భం దాల్చిన తర్వాత కూడా డాక్టర్ పర్యవేక్షణలో సక్రమంగా మందులు వాడాలి. దానివల్ల బిడ్డకి వైరస్ తక్కువగా సంక్రమిస్తుంది. కాన్పు సమయంలో తల్లి నుంచి బిడ్డకి యోనిద్వారా వైరస్ ఎక్కువగా సంక్ర మించే అవకాశాలుంటాయి. కాబట్టి వైరల్ లోడ్ తక్కువగా ఉంటే సాధారణ కాన్పుకి ప్రయత్నం చేయవచ్చు. మరీ ఎక్కువగా ఉంటే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేయించేసుకోవాలి. దానివల్ల బిడ్డకి హెచ్ఐవీ సోకే అవకాశాలు తక్కువ. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు కూడా పరీక్ష చేయించి, ఆరు వారాల వరకు హెచ్ఐవీ మందులు వాడటం వల్ల... వైరస్ బిడ్డకు సోకి ఉంటే, అది కాస్తా నాశనమవుతుంది. తల్లిలో వైరల్ లోడ్ ఎక్కువ ఉంటే మాత్రం తల్లిపాలు ఇవ్వకుండా బయటి పాలే ఇవ్వాలి. లేదంటే వైరస్ బిడ్డకు సోకేస్తుంది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
బిడ్డను కనే అదృష్టం లేదా?
సందేహం నా వయసు 31. ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 56 కిలోలు. మూడేళ్ల క్రితం పెళ్లయ్యింది. సంవత్సరానికే గర్భం దాల్చాను. కానీ బిడ్డ పుట్టీ పుట్టగానే చనిపో యాడు. రెండోసారి బిడ్డను కన్నప్పుడు ఐదు రోజులకు చనిపోయాడు. ఎందుకు అని డాక్టర్ని అడిగితే open meningomyelocele సమస్య వల్ల అని చెప్పారు. అసలా సమస్య ఎందుకు వస్తుంది? మళ్లీ గర్భం దాల్చితే కూడా అలాగే అవుతుందా? అలా అవ్వకుండా ముందుగానే ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? - వి.సుహాసిని, కావలి meningomyelocele, meningocele, spina bifida అనే సమస్యలన్నీ కడుపులో బిడ్డ తయారయ్యేటప్పుడు జరిగే లోపాల వల్ల వెన్నుపూసలో ఏర్పడే అవయవ లోపాలు. వెన్ను పూసలో ఎక్కడో ఒక దగ్గర సరిగ్గా మూసుకోక పోవడం వల్ల అక్కడ ఓపెన్గానే ఉండి, వెన్నుపూస లోపల ఉండే స్పైనల్ కార్డ్, స్పైనల్ ఫ్లూయిడ్, దాని నుంచి వచ్చే నరాలు వెన్నుపూస బయటకు వచ్చి కన బడటం జరుగుతుంది. దీనివల్ల నరాలు, స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో పాటు వాటికి ఇన్ఫెక్షన్ సోకి, అది మెదడుకి మిగతా అవ యవాలకి పాకి బిడ్డ చనిపోవడం జరుగుతుంది. ఒకవేళ బిడ్డ బతికినా, వెన్నుపూస నరాలు దెబ్బ తినడం వల్ల కాళ్లు పని చేయకపోవడం, మల మూత్ర విసర్జన సమస్యలు, మెదడులో లోపాలు, బుద్ధి మాంద్యం వంటి ఎన్నో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. జన్యుపరమైన సమ స్యలు, ఫోలిక్ యాసిడ్ లోపం, కొన్ని రకాల మందులు (మూర్ఛకి వాడేవి), మరికొన్ని తెలియని కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయి. నివారించడానికి కారణాలకీ చికిత్స ఉండదు. గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచీ ఫోలిక్ యాసిడ్ మాత్రలు రోజుకొకటి చొప్పున భార్యాభర్తలిద్దరూ వేసుకోవడం మంచిది. గర్భానికి ప్రయత్నించే ముందు మూర్ఛవ్యాధికి సంబంధించి కాని, మరే ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు గానీ మందులు వేసుకోవాల్సి వస్తే... డాక్టర్ని సంప్రదించి, వాళ్లు చెిప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నం చేయాలి. దాని వల్ల చాలావరకు వెన్నుపూస లోపాలను నివారించవచ్చు. కానీ వందశాతం నివారించలేం. బిడ్డ పుట్టిన తర్వాత ఆపరేషన్ చేసి సరిచేసే ప్రయత్నం జరుగుతుంది. కానీ దాని ఫలితం... నరాలు ఎన్ని దెబ్బ తిన్నాయి అన్నదాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి లోపాన్ని ముందే తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. చాలావరకు ఈ లోపాలను ఐదోనెలలోనే టిఫా స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే అరుదుగా మాత్రమే కొందరిలో స్కానింగ్లో మిస్ కావచ్చు. ముందుగానే లోపం గురించి తెలుసుకుంటే... అబార్షన్ చేయించేసుకోవడం ఉత్తమం. బిడ్డ పుట్టాక అవస్థ పడటం కంటే ముందే పాశాన్ని తెంచుకోవడం మంచిది కదా! అలా అని అధైర్య పడకండి. కొన్ని నెలలు ఆగి... మీరిద్దరూ ఫోలిక్ యాసిడ్ మాత్రలు 5ఝజ రోజుకొకటి చొప్పున మూడు నెలల పాటు తీసుకోండి. ఆ తర్వాత గర్భానికి ప్రయ త్నించండి. రెండుసార్లు సమస్య వచ్చి నంత మాత్రాన మళ్లీ రావాలనేం లేదు. కాకపోతే అవకాశాలు కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. గర్భం దాల్చిన తర్వాత కూడా ఫోలిక్ మాత్రలు వాడుతూ, మూడో నెల చివర్లో చివర్లో డబుల్ మార్కర్ టెస్ట్, ఎన్టీ స్కాన్, ఐదో నెలలో ట్రిపుల్ మార్కర్ టెస్ట్, టిఫా స్కాన్ చేయించుకోండి. నా వయసు 22. ఇప్పుడు నేను ఏడో నెల గర్భంతో ఉన్నాను. ఆరోగ్యంగానే ఉన్నాను. కానీ డెలివరీ దగ్గరపడేకొద్దీ భయమేస్తోంది. నొప్పులు తట్టుకోగలనా లేదా అనిపిస్తోంది. మావారేమో, నొప్పులు రాకుండా ఇంజెక్షన్ వచ్చిందట, అది చేయించుకుందువు గాని అంటున్నారు. అది నిజమేనా? అలాంటి ఇంజెక్షన్ ఉందా? చేయిచుకుంటే నొప్పి తెలియదా? - స్వాతి, విజయవాడ కాన్పు సమయంలో నొప్పులు అందరికీ ఒకేలా ఉండవు. నొప్పులు ఎక్కువగా ఉంటాయని ఎవరో చెప్పారనో లేక ఇంటర్నెట్లో వీడియోలు చూసో భయపడాల్సిన అవసరం లేదు. బిడ్డ బరువును బట్టి, బిడ్డ వచ్చే దారిని బట్టి, బిడ్డ పొజిషన్, ఉమ్మనీరు శాతం, తల్లి ఆరోగ్య స్థితి, నొప్పులు వచ్చే తీరు వంటి అనేక అంశాలను బట్టి సాధారణ కాన్పు అయ్యే అవకాశాలను అంచనా వేయడం జరుగుతుంది. ఇవి తొమ్మిదో నెల చివరికి గాని ఒక కొలిక్కి రావు. ఆ సమసయానికి బిడ్డ బరువు ఎక్కువ ఉన్నా, దారి చిన్నగా ఉన్నా, బిడ్డ పొజిషన్ సరిగ్గా లేకపోయినా నొప్పులు వచ్చే వరకూ ఆగకుండా ముందే ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తారు. పైన చెప్పిన అంశాలు మధ్య రకంగా ఉంటే కనుక... నొప్పులు వచ్చిన తర్వాత అవి వచ్చే తీరు, తీవ్రతను బట్టి సాధారణ కాన్పు అయ్యే అవకాశాలు 50-50 శాతం ఉంటాయి. కడుపులో ఉండే శిశువు నొప్పుల ఒత్తిడిని తట్టుకుని, హార్ట్ బీట్ తగ్గకుండా మరీ పెరిగిపోకుండా ఉన్నంత వరకు ప్రయత్నించవచ్చు. నొప్పులు ఎక్కువ తెలియకుండా చేసే ఇంజెక్షన్లు రకరకాలు ఉన్నా, అవి అందరికీ ఒకే రకంగా పని చేస్తాయని చెప్పలేం. వీటిలో భాగంగా epidural analgesia, అంటే వెన్నుపూసలోకి ఇంజెక్షన్ద్వారా నొప్పి తెలియకుండా చేసే మందును పంపుతాం. నొప్పి తీవ్రతను బట్టి, సమయాన్ని బట్టి, మందును మళ్లీ మళ్లీ వెన్నులోకి పంపిం చడం జరుగుతుంది. ఈ మందును తల్లి ఆరోగ్యస్థితి, బీపీ, పల్స్ రేట్ వంటివి బేరీజు వేసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే కొన్నిసార్లు తల్లి ప్రాణాలకు ముప్పు ఏర్పడే పరిస్థితి రావచ్చు. కొందరిలో అయితే ఈ మందు ఇచ్చాక, నొప్పులు తెలియకపోవడం వల్ల, బిడ్డ తల బయటకు వచ్చేటప్పుడు నొప్పి తీయక పోవడం వల్ల ఫోర్సెప్స్ వేసి బిడ్డను బయ టకు తీయవలసి వస్తుంది. దీనివల్ల కింద ఎక్కువగా చీరుకుపోయి, కుట్లు కాస్త ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. ఏ చికిత్సలో అయినా కాస్త మంచి, కాస్త చెడు ఉంటాయి. వాటిని బట్టి నిర్ణయం తీసుకో వాల్సి ఉంటుంది. కొంతమందికి వాళ్ల శరీర తత్వాన్ని బట్టి, బిడ్డ బరువుతో పాటు మరికొన్ని అంశాలను బట్టి నొప్పులు ఎక్కువ లేకుండానే కాన్పు అయిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే భయపడ కుండా... రోజూ ఉదయం, సాయంకాలం కొద్దిగా వాకింగ్, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ వ్యాయామాలు, అలసటగా లేక పోతే చిన్నపాటి వ్యాయామాలు చేయండి. దీనివల్ల తేలికగా ఉంటుంది. నొప్పులను సులువుగా తట్టుకోడానికి శక్తి వసుంది. నా వయసు 24. నా కుడివైపు ఓవరీలో ఏదో సమస్య ఉందని ఈ మధ్యనే ఆపరేషన్ చేసి తీసేశారు. నా అనుమానం ఏమిటంటే... ఒక్క ఓవరీ ఉంటే పిల్లలు పుడతారా? పైగా ఉన్న ఆ ఓవరీలో నీటి బుడగలున్నాయి. మందులు వాడుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం సాధ్యపడేదేనా? - ఎల్.పావని, భీమవరం గర్భాశయానికి ఇరువైపులా ఒక్కొక్క అండాశయం చొప్పున రెండు అండా శయాలు ఉంటాయి. ఏ సమస్యా లేని వారిలో అండాశయాల నుంచి ప్రతి నెలా అండం తయారై విడుదలవుతూ ఉంటుంది (ఒకనెల ఒక వైపు మరో నెల మరోవైపు). హార్మోన్లు సక్రమంగా విడు దలవుతున్నప్పుడు, ఒక అండాశయం లేకపోయినా గర్భం రావడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒక్కోసారి రెండు అండాశయాలున్నా కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల రెండు అండాశయాల నుండీ విడుదల అవ్వక గర్భం రావడానికి ఇబ్బంది కలగవచ్చు. ఇప్పుడు మీకు ఒక అండాశయం ఉంది కానీ దానిలో నీటి బుడగలున్నాయి. మందులు వాడు తున్నారు కాబట్టి హార్మోన్లు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇప్పటినుంచే పిల్లల గురించి బెంగ పడాల్సిన అవసరం లేదు. అయితే మీరు పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా, బరువు ఎంత ఉన్నారు అనేది రాయలేదు. బరువు ఎక్కువ ఉంటే, తగ్గడానికి ప్రయ త్నించండి. ఎందుకంటే బరువు ఎక్కువ ఉన్నా నీటి బుడగలెక్కువయ్యి, హార్మోన్ల అసమతుల్యత పెరిగే అవకాశం ఉంది. ఏమాత్రం అధైర్య పడకుండా పెళ్లి చేసు కోండి. తర్వాత ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు ప్రయత్నించినా గర్భం కనుక రాకపోతే... గైనకాలజిస్టు పర్య వేక్షణలో అండం విడుదల కావడానికి మందులు వాడవచ్చు. నా వయసు 26. ఎత్తు ఐదడుగుల మూడంగుళాలు. బరువు 65 కిలోలు. నాకు థైరాయిడ్ ఉంది. సంవత్సరం నుంచి Eltron 100 mcg వాడుతున్నాను. మందులు మొదలు పెట్టిన కొత్తలో బాగానే ఉంది. కానీ రానురాను పీరియడ్స్ క్రమం తప్పాయి. ఇప్పుడసలు మందులు వేసుకుంటే కానీ నెలసరి రావడం లేదు. దాంతో పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం కుదరడం లేదు. నేనేం చేయాలి? - వి.రజని, కాకినాడ మీ ఎత్తుకి 47 నుంచి 57 కిలోల బరువుంటే సరిపోతుంది. మీరు ఐదు కిలోలు ఎక్కువ ఉన్నారు. ఇలా బరువు ఎక్కువ ఉండటం వల్ల కూడా కొందరిలో థైరాయిడ్ హార్మోన్ తో పాటు మిగతా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి, పీరి యడ్స్ సక్రమంగా రావు. అండాశయాల్లో నీటి బుడగలు వంటివి ఉండటం వల్ల కూడా పీరియడ్స్ సరిగ్గా రాకపోవచ్చు. ఓసారి థైరాయిడ్ ఉండాల్సిన స్థాయిలో ఉందో లేదో పరీక్ష చేయించుకోండి. కంట్రోల్లో లేకపోతే మాత్ర డోస్ పెంచాల్సి వస్తుంది. అలాగే ఓసారి గైన కాలజిస్టును కలిసి స్కాన్ చేయించుకుని... గర్భాశయం, అండాశయాల్లో ఏదైనా సమస్య ఉందేమో తెలుసుకుని, అవస రాన్ని బట్టి చికిత్స తీసుకోండి. ఆపైన పిల్లల కోసం కూడా ప్రయత్నం చేయ వచ్చు. CBP, Sr-FSH, RBS తదితర రక్త పరీక్షలు కూడా చేయించుకుని, ఏదైనా సమస్య ఉంటే చికిత్స తీసుకోండి. ఇవన్నీ చెయ్యించు కుంటూ మితాహారం తీసుకుంటూ, వాకింగ్ తదితర వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గితే మంచి ఫలితాలుంటాయి. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్ మోతీనగర్, హైదరాబాద్ -
డైలమాలో భారత్-పాక్ చర్చలు
న్యూఢిల్లీ: పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్థాన్తో భరత్ చర్చల కార్యక్రమం ముందుకెళ్లడం అనుమానంగానే మారింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం భారత్- పాక్ విదేశీ కార్యదర్శుల స్థాయి సమావేశం జనవరి 14,15 తేదీలలో జరగాల్సి ఉంది. అయితే పఠాన్కోట్లో దాడి జరిపిన ఉగ్రవాదుల మూలాలు పాక్లోనే ఉన్నాయని ఇప్పటికే భారత నిఘావర్గాలు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో చర్చలు డైలమాలో పడ్డాయి. పాక్ అధికార వర్గాలు ఉగ్రవాదంపై స్పష్టమైన వైఖరి పాటించకుండా ఓ వైపు చర్చలు అంటూ స్నేహహస్తం అందిస్తూనే.. మరో వైపు ఉగ్రమూకలకు సహకరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్తో చర్చలు సజావుగా సాగడం సందేహమే అని భారత అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?
మృత్యువు అనంతరం ఆత్మ ఏం చేస్తుంది? మరణించిన ప్రతి జీవీ తప్పనిసరిగా తిరిగి జన్మ ఎత్తుతుందా? మానవ జన్మకు రాని అంటే పునర్జన్మ లేని ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇటువంటి సందేహాలు చాలామందిలో మెదళ్లను తొలిచేస్తూనే ఉంటాయి. ఈ సందేహాలు ఇప్పటి తరానివి కావు... కొన్ని వేల ఏళ్ల క్రితమే సత్యకామ జాబాలి అనే బాలకుడికి వచ్చాయట. కాదు కాదు... తెగ పీడించుకు తినడంతో అనుభవంతో, జ్ఞానంతో తలపండిన పెద్దల ముందుంచాడట తన సందేహాలను. అయితే ఎవరి నుంచీ సంతృప్తికరమైన సమాధానం లభించలేదట. దాంతో సత్యకామ జాబాలి ఈ సంగతేదో మృత్యువునే అడిగి తేల్చుకుందామని కఠోర తపస్సు చేసి మృత్యువును ప్రత్యక్షం చేసుకుని ఆత్రంగా అడిగాడట. అయితే మృత్యువు కూడా మౌనమే వహించిందట. అంటే మృత్యువు కూడా తన పరిధి దాటి తెలుసుకోలేదన్నమాట. ఎందుకంటే దానికే జీవం లేదు కాబట్టి, దానిగుండా ప్రయాణించాల్సిన జీవుడే అంటే మానవుడే దానికి సమాధానం తెలిసినవాడు. అయితే పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మరు కదా మరి! ఇప్పటి రోజులలో అయితే ఈ ప్రశ్న ఎవరినడిగినా ‘‘అదేం ప్రశ్న? మరణించిన తర్వాత ఇక జీవితమేంటి?’’ అంటూ ఆ ప్రశ్న వేసిన వారిని అమాయకులుగా జమకట్టేస్తారు చాలామంది. స్వర్గనరకాలు మన సంగతెలా ఉన్నా, మృత్యువు తర్వాత ఆత్మ భౌతికంగా తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి స్వర్గం లేదా నరకాన్ని చేరుకుంటుందని ఇంచుమించు అన్ని మతాలూ చెబుతాయి. స్వర్గమనేది మరణం తర్వాత కూడా సుఖాలను అనుభవింపజేసేదని, అందుకే బతికినంతకాలం దానధర్మాలూ, పరోపకారాలూ చేసి, బోలెడంత పుణ్యం మూటక ట్టేసుకుని, ఆనక ఇంచక్కా స్వర్గసుఖాలను అనుభవించండని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన నాలుగు మంచిముక్కలూ చెవినేసుకోకుండా విచ్చలవిడిగా పాపాలు చేసేస్తే, నరకానికి పోతారు. అక్కడ వేడి వేడి నూనెలో వేగుతూ, చీమూ నెత్తురూతో నిండి, కుళ్లుకంపు కొట్టే వైతవరణీనదిలో పడి, ఉక్కిరిబిక్కిరవుతూ, ఇనుపశూలాలతో ఒళ్లంతా చిల్లులు పడేలా పొడిపించుకోవలసిందే... అని ఆస్తికులు చెబుతారు. మరణానంతర జీవితం గురించి తెలుసుకునేముందు అసలు మృత్యువంటే ఏమిటో చూద్దాం... ‘‘మృత్యువంటే జీవితానికి క్రీనీడ... జీవితం బొమ్మయితే మృత్యువు బొరుసు. ఈ జీవితాన్ని అనుక్షణం వెన్నంటి ఉండేది మృత్యువు. ఈ జీవితాన్ని కాపాడుకుంటూ పోయేదీ మృత్యువే. మృత్యువు జీవిత ద్వారబంధం దగ్గర కాపలా లేకపోతే రక్షణ ఎక్కడిది? అందుకే మృత్యువును కాదని జీవితాన్ని ప్రత్యేకంగా చూడలేం’’ అంటారు సికిందరాబాద్ తిరుమలగిరిలోని మాస్టర్ యోగాశ్రమ సంచాలకులు, యోగాపై అనేక గ్రంథాలను రాసిన డాక్టర్ వాసిలి వసంత కుమార్. ‘జీవితంలో పోరాడగలవారికే మృత్యుస్పర్శ తెలుస్తుంది. మనల్ని అతలాకుతలం చేసే పరిస్థితుల్లో సైతం మనం జీవితం నుంచి పారిపోకూడదు. పైగా ఎదురొడ్డి నిలవాలి. ఆ నిబ్బరం, ఆ నిలువరింపు ఉంటే మృత్యువు సైతం మనల్ని భయపెట్టలేదు. ఆ మృత్యుదర్శనం సైతం విశ్వరూప సందర్శనంలా మనల్ని అనందపరుస్తుంది’ అని ఆయన తన తాజా పుస్తకం ‘యోగానంద లహరి’లో చెబుతారు. అసలు మృత్యువంటే ఏమిటి? ఈ శరీరాన్ని కాదని అంతరాత్మ స్వేచ్ఛను పొందడమే మృత్యువు కదా! అంతరాత్మ స్వేచ్ఛగా ఏం చేస్తుంది? బాధ్యతగా మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మరో రూపంలోకి పరిణమిస్తుందన్నమాట. మృత్యువు గురించి ఇంకాస్త లోతుగా చెప్పుకోవాలంటే.. మృత్యువు అనేది ఈ శరీరం నుంచి మరో శరీరంలోకి మార్పే. అంటే ఆత్మ అదే. అంతరాత్మ స్పందనలలో మార్పుండదు. అంతెందుకు.. మృత్యువుతో మనం ఈ శరీరాన్ని త్యజిస్తాం కాబట్టి ఆ తర్వాతి జీవితం అంటే పరజన్మ ఎలా ఉంటుందన్న భయం ఉండదు. ఆత్మ- మృత్యువులలో జీవితం బొమ్మ అయితే మృత్యువు బొరుసు. మృత్యువు బొమ్మ అయితే జీవితం బొరుసు. ఈ రెంటిలో ఒకదాని ఉనికి సాధ్యమైనప్పుడు రెండవదాని ఉనికి సాధ్యం కాదు. అంటే రెండవది అగోచరంగా ఉంటుంది. ప్రాణం ఎక్కడి నుండి, ఎలా అందుతుందో తెలుసుకుంటే మృత్యువుపై విజయం సాధించవచ్చని, దానికి ఏమాత్రం భయపడనవసరం లేదని ‘మృత్యువు తర్వాత జీవితం’ ‘యోగానంద లహరి’, ‘యోగసాధన’, ‘భానుమతి’ వంటి పుస్తకాలను రాసిన శ్రీ శార్వరి వంటి సీనియర్ రచయితలు చెబుతారు. మన కంటికి కమ్మిన పొర తొలగిపోతేనే జ్ఞానదృష్టి అలవడుతుందని, అందుకు యోగసాధన అవసరమంటారాయన. ప్రేతాత్మలు... పునర్జన్మలూ... కోరికలు తీరిన ఆత్మ వెంటనే పునర్జన్మ తీసుకుంటుందని, కోరికలు తీరకపోతే ప్రేతాత్మగా మారి, తన కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరులను ఆశ్రయించి, వారి ద్వారా తీర్చుకుంటూ ఉంటుందని చాలా కథలలో, సీరియల్స్లో చదివే ఉంటాం, సినిమాలలో చూసే ఉంటాం. అప్పుడెప్పుడో అంటే ఏఎన్నారూ, ఎన్టీయారూ, శోభన్బాబుల కాలంలో వచ్చిన ‘దేవుడే గెలిచాడు’, ‘శ్రీ రామ రక్ష‘, ‘విశ్వరూపం’, సుమన్, చిరంజీవిల హయాంలోని ‘ఆత్మబంధం’, ‘యముడికి మొగుడు’ ఆ తర్వాతి కాలంలోని ‘ఆ నలుగురు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’, దానికి సీక్వెల్గా వెంకటేష్తో తీసిన ‘నాగవలి’్ల, లారెన్స్ రాఘవేంద్ర తన నటనతో ఒక ఊపు ఊపేసిన ‘కాంచన’, నిన్నమొన్నల్లో వచ్చిన ‘గంగ’, ‘త్రిపుర’ వంటి సినిమాలన్నీ ‘ఆత్మీయై’మెనవే! విఠలాచార్య సినిమాలు, హారర్ చిత్రాలు సరేసరి. శరీరం రోమాంచితమయ్యే అలాంటి సినిమాలు అందులోనూ సెకండ్ షోలు చూసి ఒంటరిగా ఇంటికి రావాలన్నా... వచ్చాక ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయంతో వ ణుకు పుట్టి మెడలో ఆంజనేయస్వామి లాకెట్టో, నుదుటిపై సింధూరమో పెట్టుకుంటే కానీ ఉలికిపాటు తగ్గనివారెందరో! ఇక ‘కథలు, నవలల సంగతి చెప్పనే అక్కరలేదు (ఆత్మకథలు కాదు సుమీ!) క్రైమ్ స్టోరీల్లోకి కూడా ఆత్మలు చొచ్చుకొచ్చేసి, అద్భుతాలు, అంతకుమించి అరాచకాలెన్నో చేసి చూపిస్తుంటాయి. చదివినంతసేపూ థ్రిల్లింగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే... వీటికన్నా దయ్యం సినిమాలే కాస్తంత బెటరనిపిస్తుంది! అసలీ చర్చంతా ఎందుకు, మృత్యువు తర్వాత జీవితం ఉందా లేదా, ఉంటే ఎలాంటి జీవితాన్ననుభవిస్తారనేదే కదా సందేహం..? అది తెలుసుకునేందుకు ఇంకా చా...లా సమయం ఉంది! అనుభవించడానికి బోలెడంత జీవితమూ ఉంది. సఫలం చేసుకోగలిగితే ఇప్పుడే స్వర్గం... లేకపోతే ఇక్కడే నరకం... కాదంటారా? - డి.వి.ఆర్.భాస్కర్ మనిషికి ప్రధానంగా మూడు శరీరాలుంటాయి. అవి 1. ఆత్మ తత్వం గల స్పిరిచ్యువల్ బాడీ, 2. భావోద్వేగాలకు నెలవైన సూక్ష్మశరీరం, 3. కంటికి కనిపించే స్థూల శరీరం లేదా భౌతిక శరీరం. భూలోకంలోని ప్రతి జీవీ మరణించిన తర్వాత ఏదో ఒక సూక్ష్మలోకం చేరుకుంటుంది. కొద్ది ప్రయత్నం, మరికొద్దిగా సాధనతో ఈ లోకాల్ని దర్శించగలం. అనుభవించగలం. పరలోకాలను సందర్శించడం కోసం మరణించనే అవసరం లేదు. ఆత్మ సంస్కారం గల వ్యక్తి కేవలం సంకల్పమాత్రాన భౌతిక శరీరాన్ని వదలకుండానే సూక్ష్మలోకాల్ని అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో దర్శించి రావచ్చు అంటారు యోగ సాధకులు. -
ప్రతిసారీ కొత్తగా కావాలంటే ఎలా?!
సందేహం నా వయసు 32. పెళ్లయ్యి ఎనిమిదేళ్లు అవుతోంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మావారు సెక్స్లో చాలా హుషారుగా ఉంటారు. నాకూ ఇష్టమే. కాకపోతే ఆయన కొత్త కొత్త భంగిమలు కావాలంటారు. ఇంగ్లిష్ ముద్దులు పెట్టమని అడుగుతారు. నా ఛాతిని ప్రెస్ చేయాలని ఆశపడతారు. పైగా నేనే పైకి వచ్చి చేయాలంటారు. నాకవేమీ ఇష్టం ఉండదు. నావల్ల కాదు అని చెబితే ఆయన నిరుత్సాహపడుతుంటారు. నేనేం చేయను? ఆయన కోరినవి చేయడం వల్ల ఏ ఇబ్బందులూ ఉండవా? నేను తనని ఎలా తృప్తి పర్చగలను? - వసుంధర, వైజాగ్ కొందరు ఎప్పుడూ రొటీన్గా కాకుండా, కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు అవతలివాళ్లు కూడా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కాకపోతే బలవంత పెట్టకూడదు. మెల్లగా చెప్పి ఒప్పించాలి. భార్యాభర్తలన్నాక ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరికి కావలసినట్టు ఇంకొకరు నడచుకోవాలి. కొన్నిసార్లు మనకి నచ్చకపోయినా అవతలి వారి కోసం కొన్ని అలవర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. మీవారు కోరకూడని వేమీ కోరలేదు. అవి పెద్ద ఇబ్బందికర మైనవీ కావు. వాటివల్ల ఏ సమస్యలూ కూడా రావు. కాబట్టి మీరు తనని అర్థం చేసుకోండి. తన కోరికలు తీర్చడానికి ప్రయత్నించండి. తద్వారా మీరు ఆయన్ని తృప్తిపర్చగలుగుతారు. భార్య దగ్గర కాకపోతే భర్త తన కోరికలను ఎవరి దగ్గర చెప్పగలడు! కాబట్టి మీరు సిగ్గు, బిడియం వదిలి మీవారిని అనుసరిస్తే ఇద్దరూ సంతోషంగా ఉంటారు. నా వయసు 38. మా వారి వయసు 40. ఇద్దరం ఆరోగ్యంగానే ఉంటాం. అయితే నాకు పొట్ట చాలా పెద్దగా ఉంటుంది. దాంతో సెక్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటోంది. మావారి అంగం పూర్తిగా లోనికి వెళ్లడం లేదు. దాంతో ఆయనకి, నాకు కూడా అసంతృప్తిగా ఉంటోంది. ఇద్దరం తృప్తి పొందడానికి వేరే ఏదైనా పద్ధతి ఉందా? లేదంటే నా పొట్ట తగ్గడానికి ఏదైనా మార్గం ఉందా? - సువర్ణ, తాడిమర్రి భార్యాభర్తల్లో ఎవరికైనా పొట్ట బాగా పెద్దగా ఉన్నప్పుడు, అది అడ్డు పడు తున్నప్పుడు సెక్స్లో ఇబ్బంది, అసంతృప్తి ఉండటం సహజం. అంతేకాక అధిక బరువు వల్ల, సెక్స్ చేసే సమయంలో ఆయాసం, ఇబ్బందిగా ఉండటం, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు కూడా ఉండవచ్చు. మొదట మీరు పొట్ట తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దానికోసం వాకింగ్, యోగా, అబ్డామినల్ వ్యాయామాలు చేస్తూ... మితాహారం తీసుకుంటూ... అవసరమైతే జిమ్, ఏరోబిక్స్ వంటివి కూడా చేస్తూ ఉంటే పొట్ట తగ్గుతుంది. అంత వరకూ వేరే భంగిమల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించండి. అంటే మీరు మోకాళ్ల మీద వంగితే ఆయన వెనక నుంచి అంగ ప్రవేశానికి ప్రయత్నించ వచ్చు. లేదంటే ఆయన కింద, మీరు పైన ఉండి చేయవచ్చు. నా వయసు 25. పెళ్లై సంవత్సరం కావస్తోంది. ఈ మధ్య నీరసంగా ఉంటోందని పరీక్ష చేయించుకుంటే హెచ్.బి.ఎస్.ఎ.జి.పాజిటివ్ అని వచ్చింది. ఇది అంటువ్యాధి అంటున్నారు. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మావారికి శారీరకంగా దగ్గర కావొచ్చా? - నళిని, గణపవరం, గుంటూరు హెచ్.బి.ఎస్.ఎ.జి. పాజిటివ్ అంటే హెపటైటిస్ బి అనే వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. ఇది రక్తం ద్వారా లేదా సెక్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. సరిగ్గా పరీక్ష చెయ్యని రక్తం ఎక్కించడం లేదా ఒకరికి వాడిన సిరెంజులే మరొకరికి వాడటం వల్ల కూడా వ్యాపించవచ్చు. మీకు ఉంది కాబట్టి మీ వారికి కూడా ఉందో లేదో నిర్ధారించు కోవాలి. మీ వారికి కూడా వెంటనే పరీక్ష చెయ్యించండి. ఆయనకి కూడా ఉంటే... ఇద్దరూ ఒకేసారి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును సంప్రదించండి. ఇన్ఫెక్షన్ పాతదా లేక ఇప్పుడు మీ రక్తంలో ఆ వైరస్ యాక్టివ్గా ఉందా అన్నది తెలుసు కోవాలి. దానికోసం హెచ్బీఎస్ వైరల్ లోడ్ టెస్ట్, అలాగే లివర్ పైన ఏమైనా ప్రభావం ఉందా అన్నది తెలుసుకోడానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుని, దాన్నిబట్టి చికిత్స తీసుకోవాలి. మీవారికి లేకపోతే... హెపటైటిస్ వ్యాక్సిన్ మూడు డోసులు ఇప్పించండి. సమస్య తీరేవరకూ కలయిక సమయంలో కండోమ్ తప్పక వాడండి. నా వయసు 22. మరో మూడు నెలల్లో మా మేనమామతో నా పెళ్లి జరగబోతోంది. మేనరికం వల్ల చాలా సమస్యలు వస్తాయని, పిల్లలు లోపాలతో పుడతారని అంటారు. కానీ మేం చాలా పేదవాళ్లం. కాబట్టే ఇలా చేసుకో వాల్సి వస్తోంది. పిల్లలు బాగా పుట్టాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? కలయిక సమయంలో ఏవైనా ప్రత్యేక పద్ధతులు పాటించాలా? మందుల వంటివి వేసుకోవాలా? - లక్ష్మి, కర్నూలు మేనరికం వల్ల అందరు పిల్లల్లోనూ అవయవ లోపాలు ఉండాలనేమీ లేదు. సాధారణంగా బిడ్డ ఏర్పడేటప్పుడు... తల్లిలో ఉండే 46 క్రోమోజోముల నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోమోజోములు సంక్రమిస్తాయి. ఈ క్రోమోజోముల మీద శరీరంలో ఉన్న ప్రతి అవయవం, వాటి పనితీరు, రంగు, రూపునకు సంబంధించిన జన్యువులు ఉంటాయి. ఈ జన్యువుల్లో కొన్ని, కొన్నిసార్లు మార్పు చెంది డిఫెక్టివ్ జీన్సగా మారతాయి. అవి ఒకే కుటుంబంలోని పిల్లలకు సంక్రమిస్తాయి. అదే కుటుంబంలోని వారికి పెళ్లిళ్లు చేయడం వల్ల డిఫెక్టివ్ జీన్స్ రెండు తల్లిదండ్రుల నుంచి బిడ్డకు సంక్రమించినప్పుడు... జన్యుపరమైన సమస్యలు, అవయవ లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదృష్టం కొద్దీ ఒకటే డిఫెక్టివ్ జీన్ సంక్రమిస్తే సమస్యలు రాకపోవచ్చు. పుట్టబోయే బిడ్డలో సమస్యలు వస్తాయా, రావా అనేది గర్భం దాల్చకముందే చెప్పడం కష్టం. అవి రాకుండా చేయడం కూడా మన చేతిలో ఉండదు. ఎందుకంటే కణాల విభజన అనేది లోపల జరిగే ప్రక్రియ. దాన్ని బయటి నుంచి... అంటే మందులు, ఇంజెక్షన్ల ద్వారా అరికట్టలేం. గర్భం దాల్చడానికి మూడు నెలల ముందు నుంచే రోజుకొకటి చొప్పున ఫోలిక్ యాసిడ్ మాత్రలు వాడటం, గర్భం దాల్చిన తర్వాత మూడో నెలలో ఎన్.టి.స్కాన్, డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్, ఐదో నెలలో ఖీఐఊఊఅ స్కాన్, 2డి ఎకో చెయ్యించుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఏవైనా అవయవ లోపాలు, కొన్ని రకాల జన్యు సమస్యలు ఉంటే తెలుసు కోవచ్చు. అంతేకానీ అవి రాకుండా చేయగల ప్రత్యేక మందులు, పద్ధతులు ఏమీ లేవు. నా వయసు 22. మావారూ నేనూ రోజుకి రెండు మూడుసార్లు కలుస్తాం. అయితే ఈ మధ్య ఎందుకో నాకు కోరిక కలగడం లేదు. మావారికేమో ఆ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. ఎక్కువసార్లు కావాలంటారు. కానీ నేను సహకరించలేకపోతున్నాను. ఎంత ప్రయత్నించినా ఫీలింగ్స్ రావడం లేదు. ఏవైనా సెక్స్ వీడియోలు చూస్తే మాత్రం వెంటనే ఫీలింగ్ వస్తోంది. లేకపోతే రావట్లేదు. దాంతో మావారు విసుక్కుంటున్నారు. ఇలా చేస్తే వేరే పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. నాకు కోరికలు పెరగాలంటే ఏం చేయాలి? - ఊరు, పేరు రాయలేదు రోజూ చేసే పనిమీద ఆసక్తి తగ్గడం లేదా ఆలోచనలు వేరే వాటి మీదకు మళ్లడం జరిగినప్పుడో... లేదంటే పని ఒత్తిడి వల్లో సెక్స్మీద ముందు ఉన్నంత కోరిక కలగకపోవచ్చు. మీదింకా చిన్న వయసు. కాబట్టి కోరికలు పెరగడానికి అప్పుడే మందులు వాడాల్సిన అవసరం లేదు. మనసుని ఆహ్లాదంగా ఉంచుకుని, జీవితాన్ని అందంగా ఊహించుకుంటూ, సంతోషంగా ఉండగలిగితే... కోరికలు అవే పుట్టుకొస్తాయి. మీరిద్దరూ ఎక్కువసేపు ఫోర్ప్లే చేయడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఫీలింగ్స్ పెరుగుతాయి. అలానే రోజూ ఒకేలా కాకుండా రకరకాల భంగి మల్లో సెక్స్ చేయడానికి ట్రై చేయండి. ముందు ఈ విషయం గురించి మీవారితో మనసువిప్పి మాట్లాడండి. ఒకరినొకరు అర్థం చేసుకుని సహకరించుకుంటూ సంతోషంగా ఉండండి. నేను బీఎస్సీ రెండో సంవత్సరం చదువు తున్నాను. నా సీనియర్ని ప్రేమించాను. కొద్దిరోజుల క్రితం అనుకోకుండా తనకి శారీరకంగా దగ్గరయ్యాను. ఈ నెల పీరియడ్స్ రాలేదు. పరీక్ష చేయిస్తే గర్భవతినని తేలింది. నాకు చాలా భయంగా ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అబార్షన్ చేయించుకుందామంటే డబ్బులకు ఇబ్బంది. నువ్వులు తిన్నా, బొప్పాయి తిన్నా అబార్షన్ అయిపోతుందని నా ఫ్రెండ్ చెప్పింది. అది నిజమేనా? అవి తింటే నా సమస్య తీరిపోతుందా? - మానస, రాజమండ్రి తప్పు చేసి ఇప్పుడు భయపడితే ఏమి లాభం? నువ్వులు, బొప్పాయి తినడం వల్ల అబార్షన్ కాదు. నువ్వులు, ఇంకా పండిన బొప్పాయిలో విటమిన్స్, ఐరన్, కాల్షియం వంటి పోషక పదార్థాలు ఎన్నో ఉంటాయి. వాటిని మితంగా తినడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. వీటిని తింటూ కాలం వృథా చేసుకోవద్దు. రోజులు పెరిగేకొద్దీ లోపల బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది. మొదట్లో, అంటే రెండు నెలల లోపలే అయితే 98 శాతం మందుల ద్వారా అబార్షన్ అయిపోతుంది. ఆలస్యం అయ్యేకొద్దీ ఆ అవకాశాలు తగ్గుతాయి. తర్వాత డీ అండ్ సీ ద్వారా గర్భాశయాన్ని శుభ్రపర్చాల్సి వస్తుంది. దీనికి ఖర్చు కూడా ఎక్కువ. పైగా ఇన్ఫెక్షన్ల వంటి ఇతర సమస్యలు ఏర్పడి తర్వాతి కాలంలో గర్భం ధరించడానికి ఇబ్బంది కావొచ్చు. కాబట్టి కనీసం ప్రభుత్వాసుపత్రికైనా త్వరగా వెళ్లి డాక్టర్ని సంప్రదించండి. నా వయసు 29. పెళ్లై ఏడేళ్లు అయ్యింది. ఇద్దరు పిల్లలు. రెండు నెలలుగా కలయిక సమయంలో నాకు యోని బాగా నొప్పి పుడుతోంది. చర్మం కూడా కట్ అవుతోంది. మావారికి కూడా అలానే అవుతోంది. పైగా ఆయన అంగం పైన చర్మం పొరలుగా ఊడుతోంది. ఇలా ఎందుకు అవుతోంది? దీనికి పరిష్కారం ఏమిటి? - ఓ సోదరి కలయికలో నొప్పి వస్తోంది, చర్మం కట్ అవుతోంది అంటున్నారు. మీవారికి కూడా అలాగే అవుతోంది కాబట్టి ఇద్దరికీ ఇన్ఫెక్షన్ ఉందన్నమాట. కొన్నిసార్లు దంపతులిద్దరిలో ఒక్కరికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, కలయిక ద్వారా ఇంకొకరికి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మీరు గైనకాలజిస్టును, మీవారు డెర్మటాలజిస్టును కలిసి సమస్య వివరిం చండి. తగిన చికిత్స తీసుకోండి. చికిత్స పూర్తయ్యేవరకూ దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గకుండా కలిస్తే, ఇన్ఫెక్షన్ తిరగబెట్టే ప్రమాదం ఉంది. అలాగే తగ్గిన తర్వాత కూడా ఒక వారం పాటు కండోమ్ వాడటం మంచిది. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
అలా అయితే... నేను పెళ్లికి పనికిరానా?
సందేహం నా వయసు 33. ఇద్దరు పిల్లలు. ఇప్పటికీ నేను, మావారు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటాం. ఆ సమయంలో అంగచూషణను బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక్కోసారి నేను వీర్యం మింగేస్తుంటాను. దానివల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? - సుజీ, ప్రకాశం జిల్లా అంగచూషణ చేసేటప్పుడు ఒక్కోసారి మగవారి అంగం మీద ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీ నోటి ద్వారా లోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే మీ నోటిలో, దంతాల్లో, చిగుళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే... అది మీవారికి సోకే అవకాశమూ ఉంది. సాధారణంగా వీర్యంలో కొద్దిగా చీము కణాలు ఉంటాయి. కొందరిలో హర్పిస్, గనోరియల్, సిఫిలిస్, ఫంగల్ ఇంకా ఇతరత్రా సుఖవ్యాధులకు సంబంధించిన క్రిములు కూడా ఉండవచ్చు. ఆడవారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.... నోటిలో పుండ్లు, పగుళ్లు వంటివి ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్లు వారికి కూడా సోకే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పై కారణాలు లేకుండా కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాంతో నోటిలో పొక్కులు, కురుపులు, పుండ్లు ఏర్పడతాయి. జ్వరంతో పాటు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మగవారిలో హెచ్ఐవీ, హెపటైటిస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా సోకవచ్చు. అందువల్ల అంగచూషణ పూర్తిగా సురక్షితమని చెప్పడానికి లేదు. మీరిద్దరూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, కండోమ్ వాడుకోవడం ఇద్దరికీ మంచిది. నా వయసు 24. ఈమధ్యనే పెళ్లి కుదిరింది. అప్పట్నుంచీ నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నాకు హస్తప్రయోగం అలవాటు ఉంది. అది చేసే సమయంలో కొన్ని రకాల వస్తువులు కూడా వాడేదాన్ని. దానివల్ల నా యోని వదులైపోయి ఉంటుందేమో, కన్నెపొర చిరిగిపోయిందేమో అని అనుమానంగా ఉంది. మొదటి రాత్రి నా భర్తతో కలిసినప్పుడు రక్తం రాకపోతే అతడు నన్ను అనుమానిస్తాడేమోనని కంగారుగా ఉంది. ఇప్పుడేం చేయాలి? - వందన, హైదరాబాద్ హస్తప్రయోగం వల్ల యోని వదులైపోవడం అనేది ఉండదు. కాకపోతే కొన్ని వస్తువులు వాడారు కాబట్టి కన్నెపొర చిరిగే అవకాశం ఉంది. సాధారణంగా కొందరిలో కన్నెపొర చిన్నతనంలో ఆటలాడేటప్పుడు, సైకిల్ తొక్కడం లాంటివి చేసినప్పుడు చిరిగిపోతుంది. మరికొందరి కన్నెపొరకు సాగే గుణం ఉంటుంది. అలాంటివారికి మొదటిసారి కలిసినప్పుడు రక్త రావడం జరగదు. అయినా మొదటిరాత్రి అందరికీ రక్తం రావాలన్న నియమం ఏమీ లేదు. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడకండి. పెళ్లి చేసుకోబోతున్న ఆనందాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, సంతోషంగా ఉండండి. నా వయసు 20. ఇంకా పెళ్లి కాలేదు. నాకు మొదట్నుంచీ నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంది. ఎడమకాలు కూడా బాగా లాగుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారికి పెళ్లయ్యాక చాలా ఇబ్బందులు వస్తాయని, పిల్లలు కూడా సరిగ్గా పుట్టరని నా ఫ్రెండ్ అంటోంది. అది నిజమేనా? నేను పెళ్లి చేసుకోవడానికి పనికిరానా? - పూర్ణిమ, డోర్నకల్ కొంతమందికి నెలసరి సమయంలో ఎలాంటి సమస్యా లేకపోయినా కూడా నొప్పి వస్తుంది. ఆ సమయంలో ప్రొస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఎక్కువ మోతాదులో విడుదలవడం వల్ల, బ్లీడింగ్ బయటకు రావడానికి గర్భాశయంలోని కండరాలు కుదించుకున్నట్లు అయ్యి... పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి, వికారం వంటివి కలుగుతాయి. ఇవి ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు ఉండవచ్చు. ఇలాంటి వారిలో పెళ్లయ్యాక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. వేరే ఏ సమస్యలూ లేనప్పుడు పిల్లలు పుట్టడంలోనూ సమస్యలు ఏర్పడవు. అయితే కొందరిలో మాత్రం గర్భాశయంలో గడ్డలు, ఎండోమెట్రియాసిస్, అడినోమయోసిస్ వంటి కొన్ని సమస్యల కారణంగా పీరియడ్స్ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఆ సమస్యను గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరోసారి గైనకాలజిస్టును సంప్రదించి స్కానింగ్తో పాటు అవసరమైన పరీక్షలన్నీ చేయించుకోండి. సమస్య ఏంటో తెలిశాక తగిన చికిత్స తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏ సమస్యా లేకపోతే కనుక, నొప్పి తగ్గడానికి పీరియడ్స్ సమయంలో రెండు నుంచి మూడు రోజులు మందులు వాడితే సరిపోతుంది. నా వయసు 29. ఇద్దరు పిల్లలు. రెండుసార్లూ నార్మల్ డెలివరీయే. కాకపోతే యోని దగ్గర కుట్లు పడ్డాయి. అప్పట్నుంచీ నా యోని వదులుగా అయిపోయింది. కలయిక సమయంలో అంగప్రవేశం జరిగినట్టు కూడా తెలియడం లేదు. మావారు కూడా విసుక్కుంటున్నారు. మళ్లీ నా యోని బిగుతుగా అవ్వాలంటే ఏం చేయాలి? - సునీత, చాదర్ఘాట్ కొందరి శరీర తత్వాన్ని బట్టి... సాధారణ కాన్పు సమయంలో బిడ్డ బరువు, సైజును బట్టి యోని కండరాలు సాగి, బిడ్డను బయటకు నెట్టుతాయి. కొందరిలో మాత్రం యోని కింది భాగంలో కొద్దిగా కట్ చేసి, బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కుట్లు వేయడం జరుగుతుంది. కొందరికి కాన్పు తర్వాత యోని కండరాలు పూర్తిగా కాకపోయినా, చాలావరకు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. కానీ కొందరిలో, సాగిన యోని కండరాలు వాటి పటుత్వాన్ని కోల్పోతాయి. దానివల్ల యోని వదులవుతుంది. మీకు కలయిక సమయంలో మరీ ఇబ్బందిగా ఉంటే కనుక ఓసారి గైనకాలజిస్టును కలవండి. పెరినియోరఫీ అనే ఆపరేషన్ ద్వారా కండరాలను దగ్గరగా లాగి కుట్టేస్తారు. తద్వారా యోని మళ్లీ బిగుతుగా అయిపోతుంది. నా వయసు 32. పెళ్లై అయిదేళ్లు అయ్యింది. మూడు నెలల క్రితం మావారు అనారోగ్యం బారినపడితే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఆయన చెడ్డవారు కాదు. కాకపోతే కాలేజీలో చదువు కున్నప్పుడు ఎవరో అమ్మాయికి దగ్గరయ్యారట. అలా వచ్చిందేమో అంటున్నారు. ఇన్నాళ్లూ కాపురం చేశాను కాబట్టి నాకూ ఎయిడ్స్ వచ్చి ఉంటుందా? వెంటనే తెలియాలంటే ఏ పరీక్ష చేయించుకోవాలి? ఒకవేళ నాకు వచ్చి ఉండక పోతే ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - పార్వతి, విజయనగరం మీవారికి హెచ్ఐవీ పాజిటివ్ ఉంది అంటే, ఆయన రక్తంలో హెచ్ఐవీ వైరస్ ఉందన్నమాట. ఈ వైరస్ రక్తం ద్వారా లేదా కలయిక ద్వారా మీకు వచ్చివుండే అవకాశాలు చాలానే ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే హెచ్ఐవీ రక్తపరీక్ష చేయించుకోండి. దానివల్ల మీకు హెచ్ఐవీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. అదృష్టం కొద్దీ లేకపోతే... కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ఐవీకి మందులు అందుబాటులో ఉంటున్నాయి. మీవారికి ఆ మందులు ఇప్పించండి. కలయిక సమయంలో మాత్రం తప్పనిసరిగా కండోమ్ వాడండి. అలాగే ఈ పరీక్షలో హెచ్ఐవీ లేదని తేలినా... ఆరు నెలల తర్వాత మరోసారి హెచ్ఐవీ పరీక్ష తప్పకుండా చేయించుకోండి. నా వయసు 18. చదువుకుంటున్నాను. ఎందుకో మొదట్నుంచీ నా వక్షోజాలు చాలా వదులుగా ఉంటాయి. మొన్నీమధ్య ఫ్రెండ్సందరం మాట్లాడుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకమ్మాయి ఒక మాట అంది. జారిపోయినట్టుగా ఉండే వక్షోజాలను చూస్తే మగవాళ్లకు అనుమానం వస్తుందట. అంతకుముందే ఎవరితోనో సంబంధం ఉందని అనుకుంటారట. అది నిజమేనా? రేపు నా భర్త కూడా నన్ను అలానే అనుమానిస్తే నా పరిస్థితి ఏమిటి? పరిష్కారం చెప్పండి. - మీనా, విజయవాడ మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. వక్షోజాలు వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరికి బిగుతుగాను, బలహీనత వల్ల కొందరిలో వదులుగాను ఉంటాయి. అంతేకానీ ఎవరితోనో సంబంధం ఉండటం వల్ల అవి వదులు కావు. అనవసరమైన మాటలు విని కంగారు పడకుండా చదువు మీద శ్రద్ధ పెట్టండి. వక్షోజాల్లో పాలగ్రంథులు, కనెక్టివ్ టిష్యూ, కొవ్వు ఉంటాయి. కొవ్వు సరిపడినంత లేకపోవడం వల్ల కూడా పటుత్వం లేక వక్షోజాలు వదులుగా ఉండ వచ్చు. ఒకవేళ మీరు బరువు తక్కువగా ఉంటే... పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, డ్రైఫ్రూట్స్, పండ్లతో కూడిన పౌష్టికాహారం తీసుకోండి. దానివల్ల అవి మళ్లీ బిగుతుగా తయారయ్యే అవకాశం ఉంది. నా వయసు 25. రెండేళ్లక్రితం పెళ్లయ్యింది. ఇంతవరకూ గర్భం దాల్చలేదు. ఈ మధ్యనే డాక్టర్కి చూపిస్తే... నా గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయన్నారు. ఏవో మందులు వాడమంటే వాడుతున్నాను. అయితే ఎన్నాళ్లు ఇలా వాడాలి, ఎప్పటివి అవి తగ్గుతాయి అని అడిగితే డాక్టర్ కచ్చితంగా చెప్పడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అసలు నాకు పిల్లలు పుడతారా? - వనజ, గుంటూరు గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, అధిక బరువు, జీవనశైలిలో మార్పులు, మానసిక ఒత్తిడి, జన్యుపరమైన మార్పులు... ఇలా ఎన్నో కారణాల వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ (నీటి తిత్తులు) ఏర్పడతాయి. ఇవి పదేళ్ల వయసు నుంచి నలభయ్యేళ్ల వయసు వారి వరకు ఎవరిలోనైనా ఏర్పడవచ్చు. వాటి వల్ల ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, అవాంఛిత రోమాలు, గర్భం దాల్చడంలో ఇబ్బంది, అబార్షన్ అయిపోవడం వంటి సమస్యలు రావొచ్చు. సమస్యను బట్టి చికిత్స ఎంతకాలం అవసరం అనేది తెలుస్తుంది. ఎవరికీ కూడా మందుల వల్ల నీటి బుడగలు తగ్గిపోవు. కాకపోతే ఆరు నెలల పైన వాడటం వల్ల అవి ఇంకా పెరగకుండా చూడొచ్చు. వాటివల్ల వచ్చే హార్మోన్ల అసమతుల్యత కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ఎంత బరువు ఉన్నారో రాయలేదు. నీటి బుడగల వల్ల కొందరిలో అండం సక్రమంగా పెరగదు. కాబట్టి మీరు వ్యాయామం చేస్తూ, నీటి బుడగలు పెరగకుండా మందులు వాడుతూ ఉండాలి. అండం తయారవడానికి మందులు, అవసరమైతే ఇంజెక్షన్లు తీసుకుంటూ ఆరు నుంచి పన్నెండు నెలల వరకూ ప్రయత్నించవచ్చు. అయినా కూడా గర్భం రాకపోతే... లాపరోస్కోపి అనే చిన్న ఆపరేషన్ ద్వారా నీటి బుడగలను తొలగించుకుని, తర్వాత మందులు వాడితే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. - డా॥వేనాటి శోభ -
పక్కింటి మహిళే కిడ్నాప్ సూత్రధారి?
-
పక్కింటి మహిళే కిడ్నాప్ సూత్రధారి?
ఆడుకోడానికి వెళ్లిన ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ అయ్యి రెండు రోజులు అవుతున్నా, ఇంతవరకు అతడి ఆచూకీ తెలియలేదు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్లో ఉండే నరసింహా దంపతుల కొడుకు నవీన్ (7) కుంట్లూరులో రెండో తరగతి చదువుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటున్న నవీన్ను గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి అపహరించుకుపోయారు. నల్లటి శాంత్రోకారులో వచ్చిన దుండగులు అతడిని అపహరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే, పక్కింటి మహిళే కోపంతో తమ పిల్లాడిని కిడ్నాప్ చేయించి ఉంటుందని బాలుడి బంధువులు అనుమానిస్తున్నారు. మంగళవారం నాడు వాళ్ల అబ్బాయి, నవీన్ ఇద్దరూ అడుకోడానికి బయటకు వెళ్లారని, కానీ కొద్ది సేపటి తర్వాత ఆ అబ్బాయి ఒక్కడే వచ్చాడని.. నవీన్ ఎంతసేపటికీ రాకపోవడంతో ఎక్కడున్నాడని అడిగితే అసలు విషయం తెలిసిందని తప్పిపోయిన నవీన్ బాబాయ్ శంకర్ 'సాక్షి'కి చెప్పారు. ఆమె మీదే తమకు అనుమానం ఉందని మరోసారి ఆయన తెలిపారు. ఇద్దరు వ్యక్తులు నల్లటి కారులో వచ్చి నవీన్ను ఎక్కించుకుని వెళ్లిపోయారని అతడితో పాటు ఉన్న మరో బాలుడు చెప్పాడు. దీనిపై తాము అతడి తల్లిని అడిగితే, తనకేం తెలియదని, తననెందుకు అడుగుతారని దబాయిస్తోందని నవీన్ బాబాయ్ శంకర్ చెప్పారు. తనకు పోలీసులు తెలుసని, ఏమైనా చేసుకోండని అంటోందన్నారు. తమకు కచ్చితంగా ఆమె మీదనే అనుమానం ఉందని ఆయన అంటున్నారు. తొలుత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఆమె మీద అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రవర్తన బాగోలేదని, అందువల్ల ఆమెతో ఇల్లు ఖాళీ చేయించాలని యజమానులకు చెప్పడం వల్ల కోపంతోనే తమ అన్న కొడుకును ఆమె కిడ్నాప్ చేయించి ఉంటుందని శంకర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే అటు కేసు విచారిస్తున్న పోలీసులకు గానీ, నవీన్ తల్లిదండ్రులకు గానీ ఇంతవరకు నవీన్ గురించి ఎలాంటి సమాచారం అందలేదు. -
ఆ రహస్యం బయటపడుతుందా?!
సందేహం గర్భం తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. కొందరికి ప్రాణహాని కూడా ఏర్పడుతుంది. నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. మేమిద్దరం సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మావారు ఆనల్ సెక్స్ కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా ఆయన బలవంతం చేస్తున్నారు. అసలు ఆనల్ సెక్స్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? - మాధురి, భీమవరం ఆనల్ సెక్స్ (మలద్వారం ద్వారా రతి జరపడం) అనేది విపరీత కోరికలకు తార్కాణం. అంటే పర్వెర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్, నొప్పి ఉండవచ్చు. తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగదనేది వాస్తవం. అది మాత్రమే కాక... దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకూ ఆనల్ సెక్స్ జోలికి పోకపోవడమే మంచిది. మీవారికి బహుశా దానివల్ల వచ్చే సమస్యలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనకు అన్నీ వివరించండి. కన్విన్స్ కాకపోతే ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించండి. నా వయసు 20. ఎనిమిది నెలల క్రితం పెళ్లయ్యింది. కలయిక సమయంలో ఇంతవరకూ ఎటువంటి ఇబ్బందీ లేదు. కానీ వారం రోజులుగా సెక్స్ చేసే సమయంలో వైట్ డిశ్చార్జ్ అవుతోంది. దుర్వాసన కూడా వస్తోంది. యోనిలో నొప్పి కూడా అనిపిస్తూ ఉండటం వల్ల ఉత్సాహంగా పాల్గొనలేక పోతున్నాను. దాంతో మావారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాకెందుకిలా అవుతోంది? - సంయుక్త, మెయిల్ సెక్స్ చేసేటప్పుడు వైట్ డిశ్చార్జ్ విడుదల కావడం మామూలే. శృంగార ప్రేరేపణల వల్ల యోనిలో స్రావాలు ఊరతాయి. దానికి మగవారి నుంచి విడుదలయ్యే వీర్యం కూడా కలిసి, వైట్ డిశ్చార్జిలాగా బయటకు వస్తుంది. అయితే దుర్వాసన ఉండదు. మీరు దుర్వాసన, నొప్పి ఉన్నాయంటున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండి ఉండొచ్చు. యోనిలో ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల పెరుగులాగ, దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఒక్కోసారి ఇది కాస్త పసుపుగా కూడా ఉంటుంది. కొందరికి అయితే దురద, కలిసినప్పుడు మంట, నొప్పి కూడా ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే... ఇన్ఫెక్షన్ గర్భాశయంలోకి, పొత్తి కడుపులోకి వ్యాపించి, మామూలప్పుడు కూడా దురద, వాసన, మంటతో కూడిన వైట్ డిశ్చార్జ్ అవుతుంది. పొత్తి కడుపులో నొప్పి, నడుం నొప్పి వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే గైనకాలజిస్టును సంప్రదిస్తే అవసరమైన పరీక్షలు చేస్తారు. కారణాన్ని బట్టి యాంటీ బయొటిక్స్, యాంటీ ఫంగల్ మందులు వాడితే సరిపోతుంది. నా వయసు 27. నేనో అబ్బాయిని ప్రేమించాను. శారీరకంగా కూడా దగ్గరయ్యాను. దాంతో గర్భం వచ్చింది. నా ఫ్రెండ్స్ సహాయంతో ట్యాబ్లెట్స్ వేసుకుని అబార్షన్ చేసుకున్నాను. దురదృష్టంకొద్దీ నేను ప్రేమించిన అబ్బాయి కొన్నాళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడు. తర్వాత నేను వేరే పెళ్లి చేసుకున్నాను. సంతోషంగానే ఉన్నాను కానీ నాకు ఒక్కటే భయం. భవిష్యత్తులో నేను గర్భం దాలిస్తే... నా అబార్షన్ సంగతి బయటపడే అవకాశం ఉందా? - వైష్ణవి, ఊరు రాయలేదు పెళ్లి కాకముందు పెట్టుకునే శారీరక సంబంధాల వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వాటిలో కొన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి సంబంధాల వల్ల హెచ్ఐవీ, హెపటైటిస్, సిఫిలిస్ వంటి సుఖవ్యాధులు కూడా రావొచ్చు. గర్భం ధరించడం, దాన్ని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసే క్రమంలో కొందరికి ఇన్ఫెక్షన్లు వస్తాయి. తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. కొందరికి ప్రాణహాని కూడా ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్లు రావడం వల్ల గర్భాశయం పాడవడం, ట్యూబ్స్ మూసుకుపోవడం వంటి సమస్యలు ఏర్పడి సంతానలేమి కూడా కలగవచ్చు. ఈ శారీరక సమస్య లన్నిటితో పాటు.. తప్పు చేశాము అన్న భావన, పెళ్లయ్యాక భర్తకి గతం తెలిసిపోతుందేమోనన్న భయంతో మనశ్శాంతి దూరమవుతుంది. సంసార జీవితాన్ని సంతోషంగా గడపలేని పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి సంబంధాలు ఎంతమాత్రం మంచివి కావు. ఇక మీ అబార్షన్ విషయానికి వస్తే... మందుల ద్వారా అయ్యింది కాబట్టి బయటపడే అవకాశం లేదు. - డా.వేనాటి శోభ -
అనుమానంతో భార్య గొంతుకోశాడు!
పగిడ్యాలః కర్నూలు జిల్లా ముచ్చుమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురంలో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాలు..పగిడ్యాల మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన మాదవి(29)కి మిడుతూరు గ్రామానికి చెందిన మల్లయ్య(35)తో పదేళ్ల క్రిందట పెళ్లి జరిగింది. అప్పటి నుంచి మల్లయ్య భార్యపై అనుమానం పెంచుకొని చిత్రహింసలకు గురిచేయగా కులపెద్దలు పంచాయతీ నిర్వహించి భార్య ఊరిలోనే కాపురం పెట్టాలని చెప్పడంతో ఏడాది నుంచి భార్యభర్తలు లక్ష్మాపురంలోనే నివాసం ఉంటున్నారు. అయినా మల్లయ్య ప్రవర్తనలో మార్పు రాకపోకపోవడంతో పాటు మరింత అనుమానం పెంచుకొని ఈ రోజు మాదవిపై కొడవలితో విచక్షణరహితంగా దాడి చేసి హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు సంఘటన స్థలానికి చేరుకునేలోగానే రక్తమడుగులో కొట్టుకుంటున్నా భార్యను వదిలి పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తపై హత్యాయత్నం కింద చేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు. -
ఆ సమయంలో నొప్పి ఎందుకు?!
సందేహం నా వయసు 31. నేను కొన్ని నెలల క్రితం వ్యక్తిగత కారణాల వల్ల నాలుగవ నెలలో అబార్షన్ చేయించుకున్నాను. ఆ తర్వాతి నుంచి నా వక్షోజాలు కాస్త బాధ పెడుతున్నాయి. నిజానికి అబార్షన్ అయ్యేవరకూ అవి చాలా నొప్పిగా ఉన్నాయి. అబార్షన్ అయ్యాక నొప్పి తగ్గింది కానీ ఒక్కోసారి చురుక్కు చురుక్కుమంటున్న ఫీలింగ్. నిపుల్స్ కూడా లాగుతున్నట్టు, మండుతున్నట్టు అనిపిస్తోంది. ఇదేమైనా అనారోగ్యమా? క్యాన్సర్ లాంటి వ్యాధుల లక్షణమా? నాకు చాలా భయంగా ఉంది. కలయిక సమయంలో నేను వాటిని ముట్టుకోనివ్వడం లేదని మావారు విసుక్కుంటున్నారు కూడా. ఇప్పుడు నన్నేం చేయమంటారు? - సౌజన్య, భద్రాచలం గర్భం దాల్చిన రెండు మూడు నెలల వరకు చాలామందిలో హార్మోన్ల మార్పుల వల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా ఉండటం అన్నది సాధారణమే. అబార్షన్ తర్వాత కొంతమంది రొమ్ముల్లో పాలు తయారయ్యే అవకాశం కూడా ఉంది. దానివల్ల కొన్ని రోజులు నొప్పిగా ఉంటాయి. తర్వాత పాలు బయటికి వచ్చేస్తాయి. కొందరిలో లోపలే కరిగిపోతాయి. కాబట్టి మీ నొప్పి కొన్ని రోజులు ఉండి తగ్గిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కొందరిలో పీరియడ్స్ వచ్చే పది, పదిహేను రోజుల ముందు నుంచి ప్రొజెస్టరాన్ మరియు ఇతర హార్మోన్లలో మార్పుల వల్ల రొమ్ముల్లో నీరు చేరుతుంది. దానివల్ల రొమ్ములు బరువుగా, నొప్పిగా, సలపరంగా ఉండవచ్చు. కొందరిలో ఫైబ్రో అడినోమా అనే చిన్న చిన్న హాని లేని గడ్డలు ఉండవచ్చు. మరికొందరిలో ఇన్ఫెక్షన్ లేక ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఉండవచ్చు. కాబట్టి ఒక్కసారి డాక్టర్ని సంప్రదించండి. అవసరమైతే అల్ట్రా సౌండ్ బ్రెస్ట్, మామోగ్రామ్ చేయించుకుని, కారణాన్ని బట్టి చికిత్స చేయించుకోవచ్చు. మీ ఇబ్బంది తెలియక మీవారు విసుక్కుంటున్నారేమో. ముందు ఆయనకి విషయం అర్థమయ్యేలా చెప్పండి. నా వయసు 29. ఉద్యోగరీత్యా నేను, మావారు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నాం. నెలకి ఒకసారో రెండుసార్లో కలుస్తాం. ఒక్కోసారి రెండేసి నెలలు కూడా అవుతుంటుంది. అయితే కలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా గడుపుతాం. రోజుకు రెండు మూడుసార్లు కూడా శారీరకంగా కలుస్తాం. అయితే ఈ మధ్య నాకొక సమస్య వచ్చింది. మొదటిసారి సెక్స్ చేస్తున్నప్పుడు ఎందుకో చాలా నొప్పిగా ఉంటోంది. యోని సలుపుతున్నట్టుగా అనిపిస్తోంది. మళ్లీ రెండోసారి అలా ఉండటం లేదు. మొదటిసారే అలా అవుతోంది. దానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఇదేమైనా అనారోగ్యమా? - నీరజ, విజయవాడ ఏ వస్తువు అయినా చాలా రోజులు వాడకపోతే ఎలా బిగుతుగా అయిపోతుందో... యోని కూడా అలాగే అయిపోతుంది. చాలా రోజులు కలవకుండా ఉండటం వల్ల కొందరిలో యోని కండరాలు బిగుసుకున్నట్లు అయిపోతాయి. లోపల తడి కూడా తగ్గిపోతుంది. దాంతో కలయిక సమయంలో మొదట కాస్త నొప్పిగా ఉంటుంది. తర్వాత కండరాలు వదులయ్యి నొప్పి తగ్గుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు. కలిసిన ప్రతిసారీ నొప్పి ఉండటం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరమూ లేదు. నా వయసు 38. ఏడేళ్ల క్రితం నా భర్త చనిపోయారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లని పెంచడానికి నేనేవో తంటాలు పడుతుంటే మా బంధువు ఒకాయన సాయంగా నిలిచారు. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నాకూ తనంటే అభిమానమే. అందుకే ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం. కానీ ఎందుకో ఈ మధ్య కలిసినప్పుడల్లా పొత్తి కడుపులో నొప్పి వస్తోంది. కారణం ఏమై ఉంటుంది? - ఓ సోదరి, నిజామాబాద్ పొత్తి కడుపులో నొప్పి రావడానికి గర్భాశంయలో ఇన్ఫెక్షన్ లేక గడ్డలు ఉండటం, అండాశయంలో గడ్డలు ఉండటం, లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివేవైనా కారణం కావచ్చు. పరీక్ష చేస్తే తప్ప ఆ కారణం ఏమిటో తెలియదు. కాబట్టి ఓసారి గైనకాలజిస్టును కలిసి రక్త, మూత్ర పరీక్షలు, స్కానింగ్ చేయించుకోండి. కారణం తెలిశాక చికిత్స చేయించుకోవచ్చు. అయితే ఒకటి. ఇలాంటి సంబంధాలు అంత మంచివి కావు. ఒకవేళ ఆయనకు మీతో మాత్రమే కాక వేరేవారితో కూడా శారీరక సంబంధం ఉంటే, తద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుంచి ఒకరికి సోకుతాయి. సుఖ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేక ఆయన మంచివారు, మీరు తప్ప ఆయన జీవితంలో ఎవరూ లేరు అనుకుంటే మీ వాళ్లందరినీ ఒప్పించి చక్కగా పెళ్లి చేసుకోండి. అది మీకు అన్నివిధాలా మంచిది. నాకు ఈ మధ్యనే పెళ్లయ్యింది. మేమిద్దరం సెక్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ మావారు ఆనల్ సెక్స్ కావాలని అడుగుతున్నారు. కానీ నాకు ఎందుకో ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా ఆయన బలవంతం చేస్తున్నారు. అసలు ఆనల్ సెక్స్ చేయవచ్చా? దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? - మాధురి, భీమవరం ఆనల్ సెక్స్ (మలద్వారం ద్వారా రతి జరపడం) అనేది విపరీత కోరికలకు తార్కాణం. అంటే పర్వెర్షన్ అన్నమాట. దీనివల్ల మొదట్లో బ్లీడింగ్, నొప్పి ఉండవచ్చు. తర్వాత కాస్త ఫ్రీ అయినా కూడా మగవారికి తప్ప ఆడవారికి పెద్దగా అనుభూతి కలగదనేది వాస్తవం. అది మాత్రమే కాక... దీనివల్ల బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పాటు సుఖవ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకూ ఆనల్ సెక్స్ జోలికి పోకపోవడమే మంచిది. మీవారికి బహుశా దానివల్ల వచ్చే సమస్యలు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి ఆయనకు అన్నీ వివరించండి. కన్విన్స్ కాకపోతే ఓసారి కౌన్సెలింగ్ ఇప్పించండి. డా॥వేనాటి శోభ -
మద్యం తాగినప్పుడు కలిస్తే..!
సందేహం నేను పిల్లలు పుట్టకుండా కాపర్-టి పెట్టించుకుని వారం రోజులయ్యింది. నేను ఎన్ని రోజుల తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చు? - ప్రశాంతి, పెదపూడి సాధారణంగా వేరే ఇతర సమస్య ఏదీ లేనప్పుడు కాపర్-టి వేసిన రోజు నుంచే శృంగారంలో పాల్గొనవచ్చు. కొంతమందికి కాపర్-టి వేసిన తర్వాత ఒకట్రెండు రోజులు కొద్దిగా బ్లీడింగ్ (స్పాటింగ్) కనిపించవచ్చు. అలా కనుక జరిగితే... బ్లీడింగ్ తగ్గేవరకూ ఆగితే మంచిది. ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే కనుక మూడు నుంచి ఐదు రోజుల పాటు యాంటీ బయొటిక్స్ వాడిన తర్వాతే సెక్స్లో పాల్గొనాలి. నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ఓ అబ్బాయి నాతో ఆనల్ సెక్స్ చేశాడు. అప్పట్నుంచీ నాకు చాలా భయం వేస్తోంది. తనకి ఎయిడ్స్ ఉందేమో, నాకూ వచ్చిందేమోనన్న ఆలోచనలతో ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నాకు ఎయిడ్స్ వచ్చిందో లేదో ఎలా తెలుసుకోవాలి? - విజయ, గోదావరి ఖని ఆనల్ సెక్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి ఎయిడ్స్ సోకే అవకాశం ఉంది. ఎయిడ్స్ అనేది హెచ్ఐవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఆ వైరస్ ఒక్కసారి శరీరంలోకి ప్రవేశించాక, రోగ నిరోధక శక్తిని పెంపొందించే కణాలు క్షీణించిపోతాయి. వైరస్ పెరిగిపోతుంది. దాంతో అనేక ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఎయిడ్స్ వైరస్ శరీరంలో ప్రవేశించాక వ్యాధి లక్షణాలు బయటపడటానికి వారి వారి శరీరతత్వాన్ని బట్టి ఆరు నెలల నుంచి ఐదారేళ్లు పడుతుంది. ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. రక్తపరీక్ష చేస్తే వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి మీరు ముందు హెచ్ఐవీ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అయినా ఇలా చిన్న వయసులోనే ఎవరితో పడితే వాళ్లతో శారీరకంగా దగ్గరవడం అంత మంచిది కాదు. ఇప్పుడు చూశారుగా ఎంత టెన్షన్ పడాల్సి వస్తోందో! కాబట్టి ఇక మీదటైనా కాస్త జాగ్రత్తగా ఉండండి. నా వయసు 36. నా భర్త మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పట్నుంచీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ బతుకుతున్నాను. అయితే ఈమధ్య నాకు కోరికలు ఎక్కువవుతున్నాయి. మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోంది. కానీ మా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది, ఆ ఆలోచన మానుకో అని కోప్పడుతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ కోరికల్ని చంపేయడానికి ఏమైనా మందులు ఉంటే చెప్పండి. - రాగిణి, నల్లజర్ల మీ పరిస్థితి నిజంగా ఇబ్బందికరమే. అయితే కోరికలు పెరగడానికి మందులు కనిపెట్టారే తప్ప, తగ్గడానికి ఏవీ కనిపెట్టలేదు. మీ వయసు తక్కువే కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కాకపోతే మీ పిల్లల వయసు, మీ ఇంట్లోవాళ్ల సపోర్ట్ని దృష్టిలో ఉంచుకుని, మీ పరిస్థితులకు తగ్గట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. జాగ్రత్తగా మాట్లాడి ఇంట్లోవాళ్లని ఒప్పించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని, మీ పరిస్థితుల్ని అర్థం చేసుకునే మంచి మనిషిని ఎంచుకుని వివాహం చేసుకోండి. ఇవేమీ సాధ్యం కానప్పుడు మనసును నియంత్రించుకోవడం తప్ప మరో మార్గం లేదు. ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన ఓ హాబీని ఎంచుకుని దానిపై దృష్టి పెట్టండి. అంతకు మించి పరిష్కారం లేదు. నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? - స్వాతి, గుంతకల్లు మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. - డా॥వేనాటి శోభ -
ఆరోగ్యంగానే ఉన్నా...టెస్ట్ ఎందుకు?
సందేహం నా వయసు 24. మరో రెండు నెలల్లో నా పెళ్లి. నా వక్షోజాలు చాలా చిన్నగా ఉంటాయి. వక్షోజాలు పెద్దగా ఉండేవాళ్లనే పురుషులు ఇష్టపడతారని ఎక్కడో చదివాను. మరి నా స్తనాల సైజు పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఇంజెక్షన్ ఉందని విన్నాను. నిజమేనా? - దీపిక, రాజమండ్రి మీ బరువు ఎంతో రాయలేదు. ఛాతీ అనేది శరీర బరువును బట్టి కూడా ఉంటుంది. వక్షోజాల్లో కొవ్వు, పాల గ్రంథులు, కనె క్టివ్ టిష్యూ ఉంటాయి. బరువు తక్కువగా ఉంటే బ్రెస్ట్లో కూడా కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి వక్షోజాల సైజు కూడా తక్కువే ఉంటుంది. మీరు కనుక సన్నగా ఉంటే పాలు, పండ్లు, సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్ వంటి పౌష్టికాహా రాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దానివల్ల శరీరంతో పాటు వక్షోజాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెట్లో దొరికే ఇంజెక్షన్లు, క్రీములు, జెల్స్ తాత్కాలికంగా మార్పును చూపిస్తాయి తప్ప వాడటం మానేయగానే వక్షోజాలు మామూలు సైజుకే వచ్చేస్తాయి. పైగా వాటివల్ల అలర్జీ, దురదలు, బొబ్బలు వంటి దుష్ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ సర్జరీ, సిలికాన్ ఇంప్లాంట్స్ లాంటివి ఉన్నా వాటి వల్ల కూడా దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి అనవసరమైన ప్రయోగాల జోలికి పోకుండా మంచి పౌష్టికాహారం తీసుకుంటూ బ్రెస్ట్ మసాజ్, బ్రెస్ట్ ఎక్సర్సైజులు చేయండి. అంతవరకూ కావాలంటే ప్యాడెడ్ బ్రాలు వాడండి. నా వయసు 30. మా వారికి 35. పెళ్లయ్యి 6 నెలలు అవుతుంది. నాకు పీరియడ్స్ కరెక్టుగానే వస్తాయి. మా ఇద్దరి వయస్సు ఎక్కువగా ఉంది కదా. తొందరగా గర్భం దాల్చితే బాగుంటుంది అను కుంటున్నాం. రోజూ రెగ్యులర్గానే కలుస్తాం. కానీ కలిసిన తర్వాత వీర్యం అంతా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదేమోనని సందేహం. డాక్టర్ని సంప్రదించాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి సలహా ఇవ్వగలరు. - విజయ, గుంటూరు సాధారణంగా, ఎటువంటి సమస్యా లేనప్పుడు, 80 శాతం దంపతులు పెళ్లైన సంవత్సరం లోపే గర్భం దాలుస్తారు. మిగతా 20 శాతం మందిలో 15 శాతం - 2 సంవత్సరాలలో గర్భం దాలు స్తారు. 5 శాతం మందిలోనే సమస్యలు ఉండవచ్చు. మీకు పెళ్లయ్యి 6 నెలలే కాబట్టి, ఇంకా ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. సాధారణంగా కలయిక తర్వాత, భర్త నుంచి విడుద లయ్యే వీర్యం 3-5 ఎం.ఎల్. యోని భాగంలో చేరుతుంది. వీర్యం, దానిలో ఉండే కదిలే వీర్యకణాలు మాత్రమే యోనిలో నుంచి, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్) ద్వారా గర్భా శయంలోకి ప్రవేశిస్తాయి. మిగతా ద్రవం, నీళ్లలా ఉండే వీర్యం బయటకు వస్తుంది. కొంత మందిలో ఎక్కువగా విడుదలైనప్పుడు వెంటనే వస్తుంది, కొందరిలో కొంతసేపటి తర్వాత జెల్లాగా ఏర్పడి మెల్లగా వస్తుంది. దాని వల్ల సమస్య ఏమీలేదు. కలయిక ముందు ఆడవాళ్ల నడుం కింద దిండు పెట్టుకుంటే, యోనిలో వీర్యం ఎక్కువసేపు ఉండి, వీర్యకణాలు ఎక్కువగా సర్విక్లో నుంచి గర్భాశయం లోకి వెళ్తాయి. వీర్యం అయితే మెల్లగా బయటికే వస్తుంది. వెంటనే పైకి లేవ కుండా, 10-15 నిమిషాలు పడుకొనే ఉండటం మంచిది. అలా ఇంకొక ఆర్నెల్లు ప్రయత్నించవచ్చు. లేదు వయసు పెరుగు తోందని ఆందోళనగా ఉంటే, సిగ్గు పడ కుండా డాక్టర్ని కలిసి వేరే సమస్యలున్నా యేమో పరీక్ష చేయించుకుంటే మంచిది. నా వయసు 26. పెళ్లయ్యి మూడేళ్లయింది. పీరియడ్స్ 45 రోజులకొకసారి వస్తాయి. పిల్లలు లేరు. డాక్టర్ని సంప్రదిస్తే రక్తపరీక్షలు, స్కానింగ్ చేసి, అండం తయారవటం లేదని మందులిచ్చారు. ఆరు నెలల నుంచి వాడుతు న్నాను. మూడు నెలల నుంచి ఫాలిక్యులర్ స్టడీ చేసి మందుల వల్ల అండం తయారవుతుందని చెప్పారు. మా ఆయనకు వీర్య పరీక్ష చేయించ మన్నారు. మా ఆయన, నేను ఆరోగ్యంగానే ఉన్నాం. మరి టెస్ట్ ఎందుకు? - నాగశ్రీ, కర్నూలు గర్భం రాకపోవటానికి, 100లో 35 శాతం ఆడవారిలో లోపాలు, 35 శాతం మగవారిలో లోపాలు, 30 శాతం ఇద్దరిలో లోపాలుండవచ్చు. గర్భం దాల్చని ఆడవారిలో 70 శాతం మందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అండం తయారు కాదు. మిగతా 30 శాతంలో ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం, ఇన్ఫెక్షన్లు, ఎండో మెట్రియో సిస్, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు. ఇప్పుడు మీకు మందుల వల్ల అండం విడుదలవుతుంది కాబట్టి, మీ ఆయన వీర్యపరీక్ష తప్పనిసరిగా చేయించాలి. వీర్యకణాలు సరిపడా ఉన్నాయా, వాటి కదలిక సరిగా ఉందా లేదా వంటివాటిని చూడాలి. మగవారు ఆరోగ్యంగా ఉండటానికి, వీర్యకణాలకు సంబంధం లేదు. వారు ఆరోగ్యం గానే ఉన్నా, హార్మోన్ల అసమతుల్యత వల్ల, వీర్యకణాలు వచ్చే దారిలో ఏదైనా అడ్డంకి ఉన్నా, వీర్యకణాల ఉత్పత్తిలో తేడా ఉన్నా ఇబ్బందే. అలాగే ఇన్ఫెక్షన్లు, వీర్యకణాలు తక్కువ ఉండటం, కదలిక తక్కువ ఉండటం లేదా అసలే లేకపోవడం కూడా జరగొచ్చు. కాబట్టి వీర్యపరీక్ష కచ్చితంగా చేయించు కోవాలి. మీరు ఇన్ని పరీక్షలు చేయించు కుని, ఇన్ని మందులు వాడుతున్నప్పుడు మీ ఆయన చిన్న, సులువైన వీర్యపరీక్ష చేయించుకోవడంలో తప్పులేదు కదా. ఒకవేళ, వీర్యకణాలు సరిగా లేనప్పుడు, మీరు ఒక్కరే మందులు వాడినా లాభం లేదు కదా. మందులు ఊరకనే వాడి, డబ్బులు కూడా వృథా! - డా॥వేనాటి శోభ -
స్నేహితుడి ఇంట్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లా రేపల్లెలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. స్నేహితుడి గదిలో ఆమె ఉరి వేసుకుని మరణించింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న తేజస్విని అనే అమ్మాయి గురువారం సాయంత్రం నుంచి కనిపించడంలేదు. దాంతో చుట్టుపక్కల అంతా వెతికిన తల్లిదండ్రులు.. శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఉదయం అక్కడకు సమీపంలోని ఒక ఇంట్లో ఒక యువతి ఉరి వేసుకుని మరణించినట్లు ఆ ఇంటి యజమాని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా.. ఆ మృతదేహం తేజస్వినిదే అని తెలిసింది. తాను ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నానని, తన పేరు నరసింహారావు అని చెప్పిన యువకుడు ఆ ఇంట్లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే అతడి అసలు పేరు నాగరాజు అని పోలీసుల విచారణలో తెలిసింది. అతడు తన పేరు, ఆచూకీ వివరాలు కూడా ఎందుకు రహస్యంగా ఉంచాడో తెలియరాలేదు. అసలు అతడెవరో తమకు గానీ, తమ కుమార్తెకు గానీ తెలియదని తేజస్విని తల్లిదండ్రులు చెబుతున్నారు. మరి ఆమె అక్కడకు ఎందుకు వెళ్లిందో, ఆమె తనకు తానే ఉరేసుకుందా.. లేక ఏమైనా అఘాయిత్యం జరిగిందా అనే విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
తిరిగొచ్చేదాక డౌటే
- ప్రమాదం అంచున ప్రయాణం - ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు - పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణం - అధికారుల నామమాత్రపు తనిఖీలు - గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు నెల్లూరు (రవాణా): అస్తవ్యస్తమైన రోడ్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిబంధనలు అమలు చేయని అధికారులు వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇంటినుంచి పనిమీద వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకుంటారో లేదోనన్న భయం ప్రస్తుతం జనాన్ని వెంటాడుతోంది. మృత్యువు ఎప్పుడు ఏరూపంలో కంబళిస్తుందో ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఓవైపు నిత్యం తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మరో వైపు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా దవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదమే ఇందుకు నిదర్శనం. ఈ ప్రమాదంలో 21 మంది అమాయకులు ప్రాణాలు పొగొట్టుకున్న విషయం తెలిసిందే. వాహనాల మయం జిల్లాలో మొత్తం 5 లక్షలకుపైగా వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. వాటిలో 2.80 లక్షల బైక్లు, 30వేల ఆటోలు, ట్రాక్టర్లు 29,000, లారీలు 19,000, కార్లు 36,000, క్యాబ్లు, మాక్సీక్యాబ్లు 3వేలు, టౌన్ బస్సులు 81, టూరిస్టు, ట్రావెల్స్ 170, మిగిలినవి ఇతర వాహనాలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో 169 కి.మీ మేర జాతీయ రహదారి ఉంది. హైవేతో పాటు ముంబై, బెంగళూరు వెళ్లే ప్రధాన రోడ్లు ఉన్నాయి. అయితే జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పోలీసులు, రవాణా అధికారులు నిత్యం తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా ప్రమాదాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పరిమితికి మించి ప్రయాణం... ప్రధానంగా ఆటోలు, మాక్సీక్యాబ్లు, ప్రైవేటు బస్సులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ప్రధానంగా దూరపు ప్రాంతాలకు మాక్సీక్యాబ్లును ఎక్కువమంది వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనంలో డ్రైవర్తో కలిపి 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇన్నోవాలో ఏడుగురు, తుపాన్ వాహనంలో 10మంది, మాక్సీక్యాబ్లో ఎనిమిదిమంది, టెంపోలో 10 నుంచి 12 మందిని మాత్రమే ఎక్కించుకోవాల్సి ఉంది. అయితే వాహనాన్ని బట్టి 10 నుంచి 25 మందికిపైగా ఎక్కించుకుని రోడ్డెక్కుతున్నారు. ప్రమాదాలకు కారకులవుతున్నారు. అదే ఆటోలో కేవలం ముగ్గుర్ని మాత్రమే ఎక్కించుకోవాలి. కానీ ఆటోలో 10మందికి పైగా ఎక్కించుకుని ప్రయాణం చేస్తున్నారు. అలాగే హైవేపై రాత్రివేళల్లో ఇష్టారీతిన వాహనాలను ఆపడం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్ నామమాత్రంగా మారింది. హైవే నిబంధనలు పట్టించుకోరు హైవేపైకి ఆటో రాకూడదన్న నిబంధన ఉంది. అయితే దాదాపు ఎక్కువ ఆటోలు జాతీయ రహదారిపైనే నిత్యం తిరుగుతుంటాయి. ప్రధానంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకు విద్యార్థులు పరిమితికి మించి ప్రయాణం చేస్తున్నారు. ప్రధానంగా డ్రైవర్ పక్కన ఎవరిని కూర్చోబెట్టకూడదన్న నిబందన ఉన్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల నామమాత్రపు తనిఖీలు మద్యం తాగి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం, సుదూర ప్రాంతాలకు ఒక్కరే డ్రైవింగ్, మితిమీరిన వేగం తదితర కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన రోజు అధికారులు హడావుడి చేసి మిగిలిన రోజులు పట్టించుకోవడం లేదు. దీంతో వాహనదారులు నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతున్నారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా నిత్యం తనిఖీలు చేస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం లేదని పలువురు చెబుతున్నారు. అలాగే ప్రధానంగా జాతీయ రహదారికి మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. కానీ స్పీడుబ్రేకర్లు ఉన్న ప్రాంతంలో ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు వెంటనే వాటిపై దృష్టిపెట్టి ప్రమాదాలను నివారించాల్సిన అవసరముంది. -
హత్య విషయం తెలిసి.. లేటుగా వచ్చారా?
అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ప్రసాద్ రెడ్డిని హత్య చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆయన అనుచరుడు శివను దుండగులు కంప్యూటర్ గదిలో నిర్బంధించారు. ప్రసాద్రెడ్డిపై దాడి జరుగుతుందని ఎస్సై నాగేంద్ర ప్రసాద్కు ఫోన్ చేసినా..10 అడుగుల దూరంలో ఉన్నప్పటికీ ఎస్సై చాలా లేట్గా వచ్చారని ప్రత్యక్ష సాక్షి శివ చెబుతున్నారు. ఎస్సై సకాలంలో స్పందించి ఉంటే హత్య జరిగేది కాదని ప్రసాద్ రెడ్డి కుటుంబీకులు కూడా అంటున్నారు. ప్రసాద్రెడ్డిని హత్య చేయడానికి ముందురోజు ఆయన సోదరుడు మహానందరెడ్డిని కూడా హత్య చేయడానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మట్టి రవాణా వ్యవహారంలో అనంతపురం నుంచి రాప్తాడుకు మహానందరెడ్డి మూడుసార్లు వచ్చేలా ఎస్సై ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ సమయంలో ప్రత్యర్ధులు మహానందరెడ్డిని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్రెడ్డి హత్య కేసును ఓ కొలిక్కి తీసుకురావాల్సిన పోలీసులు.. హత్య జరిగిన తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై దృష్టిపెట్టారు. రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో ప్రసాద్రెడ్డిని ఆయన ప్రత్యర్ధులు నరికి చంపిన సంగతి తెలిసిందే. దీంతో మనస్తాపం చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు కొంత విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు...ఇప్పటిదాకా నలుగుర్ని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఇటుకులపల్లి, కూడేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఓ పోలీసు ఉన్నతాధికారి ఒత్తిడితోనే అనంత పోలీసులు ప్రసాద్రెడ్డి హత్య కేసును పక్కనపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. -
నాణ్యతకు తిలోదకాలు..!
భైంసా/బాసర : పుష్కరాల పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. ఫలితంగా ఈ పనులు పుష్కర కాలమైనా నిలుస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పుష్కరాలు రావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనులకు నిధులు విడుదల చేసి ప్రత్యేక అధికారులనూ నియమించింది. జిల్లాలో ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించినా బాసరలో సాగుతున్న అభివృద్ధి పనులపై పర్యవేక్షణ లోపించడంతో ఇంజినీరిం గ్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు దక్కించుకున్నది ఒకరైతే.. పనులు చేస్తున్నది మరొకరు అయినా పట్టించుకోవడం లేదు. బాసర గోదావరి నదిలో వాహనాలు వెళ్లే వంతెన నుంచి శివాలయం వరకు 490 మీటర్ల మేర స్నానఘట్టాల నిర్మాణ పనులు సాగుతున్నాయి. సుమారు అర కిలోమీటరు మేరకు నిర్మించే స్నానఘట్టాలకు ప్రభుత్వం రూ.10.70 కోట్లు మంజూరు చేసింది. టెండర్లు దక్కించుకున్న తర్వాత స్థానికంగా ఓ ప్రజాప్రతినిధి సోదరుడే ఈ పనులు చేపడుతున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు నాణ్యతగా చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. స్నానఘట్టాల నిర్మాణానికి పక్కనే గోదావరి నదిలోని ఇసుకను వాడేస్తున్నారు. ఇసుక తవ్వకాల కోసం తాత్కాలికంగా రోడ్డు వేశారు. ఇసుక తవ్వడంతో గోదావరి నదిలో గోతులు ఏర్పడ్డాయి. గోతుల్లో తవ్విన ఇసుక పక్కనే స్నానఘట్టాల నిర్మాణాలకు వినియోగించే ఇసుక ఒకేలా ఉంది. నిర్మాణాలకు వాడుతున్న ఇసుకను స్థానికంగా తవ్వారని నిర్ధారణకు వచ్చినా ఆ విషయాన్ని మాత్రం అధికారులు కప్పిపుచ్చుతున్నారు. మట్టి కలిసి ఉంది.. బాసర గోదావరి నది ఇప్పటి వరకు ఎండిపోలేదు. మొదటిసారి ఎడారిలా కనిపిస్తున్న గోదావరిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇసుకలో పై పొర అంత నల్లమట్టితో కలిసి ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతానికి ఇరువైపులా నల్లరేగడి నేలలు ఉన్నాయి. వర్షాకాలంలో నల్లరేగడి నేలల్లో కురిసిన వర్షపు నీరంతా గోదావరి నదిలోనే కలుస్తుంది. నల్లమట్టి ఇసుకలో కలిసిపోయింది. నల్లని మట్టితో కూడిన ఇసుకను సిమెంట్ పనుల్లో వినియోగిస్తే త్వరగానే పగుళ్లు వస్తాయని నిర్మాణరంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. పక్కనే ఉన్న నల్లమట్టితో కూడిన ఈ ఇసుక వినియోగం తగ్గిస్తే నిర్మాణాలకు ఢోకా ఉండదని అంటున్నారు. క్యూరింగ్ కరువే... గోదావరి నది ఎండిపోవడంతో భక్తుల పుణ్యస్నానాల కోసం అధికారులు శివాలయం స్నానఘట్టాల నుంచి గోదావరి నది మధ్యలో ఆరు బోర్లు వేయించారు. బోరుమోటార్ల నుంచి వచ్చే నీరంతా స్నానఘట్టాల వద్ద వదిలేస్తున్నారు. ఇలా నిలిచే నీటిలోనే పుణ్యస్నానాలు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. బాసరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఇలా బోర్లు తవ్వించి నీటిని మళ్లిస్తున్నారు. పక్కనే కొద్దిదూరంలో వంతెన నుంచి శివాలయం వరకు నిర్మిస్తున్న స్నానఘట్టాల పనులన్ని సిమెంట్, కాంక్రిట్ ఇసుకతో చేసేవే. ఈ పనులకు నీటి క్యూరింగ్ ఎంతో అవసరం. ఎదురుగానే ఎండిపోయి ఎడారిలా కనిపిస్తున్న గోదావరి నదిలో నీరైతే లేదు. కోట్ల రూపాయలు వెచ్చించి చేపడుతున్న నిర్మాణాలకు నీటిని ఎలా సమకూరుస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే ప్రారంభమైన పనులకు ప్రధానంగా క్యూరింగ్ సమస్య వెంటాడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ప్రత్యామ్నాయం ఆలోచించడం లేదు. క్యూరింగ్లేని సిమెంట్ నిర్మాణాలు తక్కువకాలంలోనే పగుళ్లు తేలే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురిస్తే.. స్నానఘట్టాల వద్ద కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నల్లమట్టిని తవ్విదానిపైనే మొరంవేసి చదును చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే మున్ముందు నల్లమట్టిలోపలికి కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా కూరుకుపోతే పైన చేపట్టే నిర్మాణాలు పగుళ్లుతేలి కనిపిస్తాయి. గోదావరి నీటి ఉధృతికి నిర్మించే స్నానఘట్టాలు చెక్కుచెదరకుండా చర్యలు చేపట్టాలి. నల్లరేగడి భూములకు తాకి ఉన్న నది ఓడ్డుకు ఆనుకుని చేపడుతున్న స్నానఘట్టాల కోసం కొద్దిమేర మట్టిని తవ్వి మొరంవేసి చదును చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.