విద్యుత్ షాక్‌తో పశువుల కాపరి మృతి | The herders killed with an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్‌తో పశువుల కాపరి మృతి

Published Tue, Mar 15 2016 4:02 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బెన్నూర్‌లో మంగళవారం ఓ పశువుల కాపరి విద్యుదాఘాతంతో చనిపోయాడు.

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బెన్నూర్‌లో మంగళవారం ఓ పశువుల కాపరి విద్యుదాఘాతంతో చనిపోయాడు. గ్రామానికి చెందిన చంద్రప్ప(50) మంగళవారం పశువులను తోలుకుని పొలాల్లోకి వెళ్లాడు. చెట్ల ఆకులు తెంపేందుకు కొడవలి ఉన్న కర్రతో కొడుతుండగా పక్కనే ఉన్న హైటెన్షన్ తీగలకు తాకి, షాక్‌కు గురయ్యాడు. చంద్రప్ప అక్కడికక్కడే చనిపోయాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement