
న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి
మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవ్యవస్థలోనూ మార్పులు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అభిప్రాయపడ్డారు
దేశ వ్యాప్తంగా 97శాతం జిల్లా కోర్టులను కంప్యూటరీకరించామని, రూ.88 కోట్లతో పక్కాభవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జస్టిస్ లోకూర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి.లాహోటి ‘భారత న్యాయవ్యవస్థ -ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తూ న్యాయ వ్యవస్థలో నైపుణ్యం కొరవడిందని, సామాన్యులకు న్యాయం అందించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలె మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై న్యాయమూర్తులు అందించిన సల హాలను పరిగణనలోకి తీసుకుంటామని, కేసుల పరిష్కారంలో ఈ సూచనలను ఆచరిస్తామని చెప్పారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, ఎస్పీ రమారాజేశ్వరి పాల్గొన్నారు.
అంతకు ముందు ఆయన హైకోర్టు సీ బ్లాక్లో మధ్యవర్తిత్వం, రాజీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు.