judicial system
-
న్యాయ వ్యవస్థకు తాడు మీద నడక
రణవీర్ అలహాబాదియా కేసు ఎంత సంక్లిష్టమో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేసిన తీరు తేటతెల్లం చేస్తోంది. ఈ విచారణ... నైతిక ఆగ్రహానికీ, రాజ్యాంగ ఔచిత్యానికీ నడుమ తాడు మీద చేసిన నడకను తలపిస్తోంది. వాదప్రతివాదాలు విన్న తర్వాత యూ ట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ రణవీర్కు ఊరట కల్పిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్త ర్వులు జారీ చేసింది. రణవీర్ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ వ్యక్తి. ‘ఇండియా గాట్ లేటెంట్’ అనే వెబ్ టాలెంట్ షోలో అతను చేసిన వ్యాఖ్యలపై అనేక ఎఫ్ఐఆర్లు దాఖలు అయ్యాయి. ఆ వ్యాఖ్యలు సరదా కోసమే చేసినప్పటికీ వాటిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. మీడియా సంస్థలు, రాజకీయ నేతలు గగ్గోలు పెట్టడం అగ్నికి ఆజ్యం పోసి నట్లయింది. రణవీర్ భాష ఎంత అసహ్యకరంగా ఉంది అన్నది న్యాయపరంగా ప్రధాన ప్రశ్న కాదు, అది భారతీయ చట్టాల ప్రకారం నేరపూరిత అపరాధం అవుతుందా అవ్వదా అన్నదే ముఖ్యం. ఆయన న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ న్యాయస్థానంలో చేసిన ఈ వాదన ఎంతైనా సమంజసం. వారికీ రాజ్యాంగ రక్షణ అవసరంకానీ కోర్టు ఇలాంటి సూక్ష్మ అంశాలను పట్టించుకునే మూడ్లో లేదు. భాష ‘డర్టీ’గా, ‘పర్వర్టెడ్’గా ఉందంటూ విచారణ ఆసాంతం ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తన ఏహ్యభావం వ్యక్తం చేసింది. ఒక దశలో న్యాయమూర్తి కల్పించుకుని, ‘‘ఇలాంటి భాషను మీరు సమర్థిస్తున్నారా?’’ అని చంద్రచూడ్ను ప్రశ్నించారు. నిజానికి డిఫెన్స్ లాయర్ పాత్ర... అత్యంత తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్ననిందితుడికి సైతం న్యాయవ్యవస్థ ద్వారా చట్టపరమైన రక్షణ లభించేట్లు చూడటమే!సుప్రీంకోర్టు సమాజ నైతికతకు సంరక్షకురాలు కాదు. భావ ప్రకటన స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి రాజ్యాంగ హక్కులను కాపాడటమే దాని ప్రాథమిక విధి. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడం అంటే జనామోదం పొందిన భావప్రకటనను పరిరక్షించడం అనుకోకూడదు. అప్రియమైన, జనాదరణ లేని భావప్రకటన చేసి నప్పుడు అలాంటి వారికి రాజ్యాంగపరమైన రక్షణ అవసరం అవుతుంది.అభినవ్ చంద్రచూడ్ ఈ విచారణ సందర్భంగా న్యాయ సూత్రాల మీదకు కోర్టు దృష్టిని మరల్చారు. అపూర్వ అరోరా వెబ్ సిరీస్ (కాలేజ్ రొమాన్స్) కేసును ఉదహరిస్తూ, అసభ్యత మాత్రమే అశ్లీలత అవ్వదన్న సుప్రీం తీర్పును ఆయన ప్రస్తావించారు. ఒకరి భావప్రకటన ఇతరుల లైంగిక వాంఛలను ప్రేరేపించడానికి ఉద్దేశించి నదా, హద్దులు దాటి నేరపూరితమైన అశ్లీలతకు అది కారణమైందా అనే అంశాల ప్రాతిపదికగా దాన్ని పరీక్షకు పెట్టాలని ఈ తీర్పు చెబుతోంది. న్యాయస్థానం దీన్ని పట్టించుకున్నట్లు లేదు. ‘‘ఇది అశ్లీలత కాకుంటే, మరేది అశ్లీలత అవుతుంది?’’ అని ప్రశ్నించింది. కోర్టులు నైతిక శూన్యంలో పని చేయాలని అనడం లేదు. అలా అని వాటి నైతిక పరమైన ఏహ్యత... న్యాయ తర్కాన్ని కప్పివేయకూడదు. అరోరా కేసు ‘‘మీరు ఏదనుకుంటే అది మాట్లాడేందుకు లైసెన్స్ ఇచ్చిందా?’’ అని కోర్టు ప్రశ్నించడం గమనార్హం. తన వ్యక్తిగత మర్యాద భావన నుంచి వాక్ స్వాతంత్య్ర సంరక్షణను వేరు చేయడానికి కోర్టు విముఖంగా ఉన్నట్లు ఈ ప్రశ్న సంకేతాలు ఇచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలతో కేసు ఎదుర్కొంటున్న ‘యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్’ రణవీర్ అలహాబాదియా పితృస్వామ్య కథనంరణవీర్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నట్లు ఆయన న్యాయవాది చంద్రచూడ్ కోర్టు దృష్టికి తీసుకురాగా, జస్టిస్ సూర్య కాంత్ చేసిన వ్యాఖ్య ప్రస్తుత హియరింగ్లో అత్యంత కలవరం కలిగించిన అంశం! ఈ తరహాలో చౌకబారు ప్రచారం పొందాలని మీరు ప్రయత్నించినట్లే, బెదిరింపుల ద్వరా చౌకబారు ప్రచారం సంపాదించాలని ప్రయత్నించే వారు కూడా ఉంటారు అని ఆయన వ్యాఖ్యానించారు. రణవీర్ మాటలు ఎంత అభ్యంతర కరమైనవి అన్నది పక్కనపెడితే, చంపేస్తామనే బెదిరింపులు వాటికి పర్యవ సానం కారాదు. రణవీర్ వ్యాఖ్యలు తన తల్లిదండ్రులకు అవమానం కలిగించా యని విచారణలో కోర్టు పదేపదే ప్రస్తావించింది. భారతీయ సాంస్కృతిక నియమాలను ఈ పితృస్వామ్య నెరేటివ్ ప్రతిఫలిస్తుంది. రాజ్యాంగంలో దీనికి చోటు లేదు. న్యాయస్థానాలు నైతికతకు పున రావాస కేంద్రాలు కావు. రణవీర్ నేరం చేశాడా లేదా అన్నదానికి... అతడు తన కుటుంబాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేశాడన్నది సంబంధం లేని విషయం. సామాజిక తిరస్కారాన్ని చట్టపరమైన నేరారోపణతో ముడిపెట్టడం అనేది కోర్టులు దాటకూడని ప్రమాదకమైన రేఖ. కోర్టు చిట్టచివరకు రణవీర్కు మధ్యంతర ఉపశమనం మంజూరు చేసింది. ప్రతివాదులకు నోటీసు జారీచేసి వారి సమాధానం కోరింది. ఇది సరైన నిర్ణయం. రణవీర్ వ్యాఖ్యలకు అభ్యంతరకర స్వభావం ఉన్నప్పటికీ, వాటిని నేరంగా గుర్తించడానికి అది చాలదు.‘ఇండియా గాట్ లేటెంట్’ వెబ్ షో వివాదం, పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన ఈ కార్యక్రమ స్వభావం సందర్భపరమైన ఒక ముఖ్యమైన అంశం లేవనెత్తింది. రణవీర్ వ్యాఖ్యల క్లిప్ అసందర్భంగా లీక్ అయ్యింది. ఆ విషయం కోర్టుకూ తెలిసినట్లే ఉంది. అయినా విచారణలో ఈ ఎరుక ప్రభావం కనిపించలేదు. భావప్రకటన స్వేచ్ఛ కేసుల్లో సంద ర్భానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మూక ప్రేరేపిత నైతిక భయాందోళనల నుంచి కోర్టులు వాక్ స్వేచ్ఛను పరిరక్షించాలి. న్యాయస్థానాలు తమ విచారణలో ఎంత సంయమనం పాటించాల్సి ఉంటుందో గుర్తు చేసేందుకు రణవీర్ కేసు చక్కటి ఉదా హరణగా నిలుస్తుంది. న్యాయమూర్తులు కూడా మనుషులే. అందరి లానే వారికీ అసహ్యం, కోపం, అనైతికత పట్ల ఏహ్యభావం ఉంటాయి. కాని వారి వృత్తి... భావోద్వేగాలకు లోనై తీర్పులు చెప్పేది కాదు. రాగద్వేషాలకు అతీతంగా నిష్పక్షపాతంగా న్యాయాన్ని పరిరక్షించాలి. జనాభిప్రాయం వేరేలా ఉన్నప్పుడు ఈ విధి కష్టతరంగానే ఉంటుంది. కత్తి మీద సాములా వారు తమ విద్యుక్త ధర్మం నిర్వర్తించాల్సి వస్తుంది. విచారణ జరగాల్సిన తీరువ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడానికి రాజ్యాంగానికి లోబడి అంతిమంగా తాను ఏం చేయాలో అదే మన సర్వోన్నత న్యాయ స్థానం చేసింది. మధ్యంతర ఉపశమనం మంజూరు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే, ఈ క్రమంలో అది వ్యవహరించిన తీరు ప్రజలకు అస్పష్ట సంకేతాలు పంపింది. న్యాయవ్యవస్థ నిన్ను కాపాడు తుంది... కానీ ఆ పని నిన్ను అవమానానికి గురి చేసిన తర్వాతే,అసంతృప్తితోనే నీ హక్కులను గౌరవిస్తున్నట్లు నీకు స్పష్టం చేసిన తర్వాతే, నీ మీద తన నైతిక ఆధిక్యతను రుజువు చేసుకున్న తర్వాత మాత్రమే జరుగుతుందని చెప్పకనే చెప్పింది. రాజ్యాంగబద్ధ న్యాయస్థానాలు పని చేయాల్సిన తీరు ఇది కాదు. జనామోదం కొరవడిన వారికీ, అభ్యంతకరమైన వారికీ, ఆఖరుకు పెర్వర్ట్ అయిన వారికీ ప్రజాస్వామ్యంలో భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని కాపాడేందుకే సుప్రీం కోర్టు ఉన్నది. అసభ్యత నుంచి సమాజాన్ని శుద్ధి చేయడం తన బాధ్యత కాదనీ, తనకు దీపస్తంభంలా నిలవాల్సింది చట్టమే కాని నైతికత కానేకాదనీ న్యాయ స్థానం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకుంటూ ఈ కేసు విచా రణ కొనసాగిస్తుందని ఆశిద్దాం.సంజయ్ హెగ్డే వ్యాసకర్త సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
DY Chandrachud: న్యాయ వ్యవస్థకు ప్రజా విశ్వాసమే కీలకం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థకు, న్యాయమూర్తులకు ప్రజా విశ్వాసమే అత్యంత కీలకమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. ప్రజల నమ్మకం చూరగొనేలా పని చేయాలని న్యాయమూర్తులకు సూచించారు. ప్రజలు నేరుగా ఎన్నుకోనప్పటికీ, ప్రజా తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ న్యాయమూర్తులపై గురుతర బాధ్యత ఉందని చెప్పారు. జడ్జిగా విశ్వసనీయత, తగిన గుర్తింపు పొందాలంటే ప్రజల ఆమోదం, నమ్మకం చాలా ముఖ్యమని అన్నారు. భూటాన్లోని ‘జేఎస్డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా కోర్టులు పరిష్కరిస్తుంటాయని పేర్కొన్నారు. అందుకే వారి విశ్వాసం పొందడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. ఏ దేశంలోనైనా ప్రజల మద్దతుతో న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అక్కడ రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన సజావుగా సాగుతుందని వివరించారు. ప్రజాభిప్రాయం అనేది న్యాయ వ్యవస్థలో అంతర్గత తనిఖీగా తోడ్పడుతుందని సూచించారు. న్యాయ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేవలం న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్లు ప్రజలకు కనిపించాలని స్పష్టంచేరు. భారత్లోని కోర్టుల్లో ప్రవేశపెట్టిన సాంకేతిక విధానాలను జస్టిస్ చంద్రచూడ్ ప్రస్తావించారు. వర్చువల్ విచారణ, కోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం, కేసుల ఈ–ఫైలింగ్, ఆన్లైన్ కేసు సమాచార వ్యవస్థ, కృత్రిమ మేధ(ఏఐ)తో కోర్టు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం వంటి విధానాలు తీసుకొచ్చామని వెల్లడించారు. ఇవి సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. సామాన్య ప్రజల కోసం సుప్రీంకోర్టు ప్రక్రియలను మరింత సులభతరం చేశామని చెప్పారు. -
పవన్కూ కోర్టులో మొట్టికాయలు తప్పవా?
తిరుపతి: సనాతన ధర్మాన్ని ముందు ఉంచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి ఊగిపోయారు. గురువారం సాయంత్రం వారాహి డిక్లరేషన్ సభలో ఏకంగా న్యాయవ్యవస్థపైనే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకవైపు తిరుమల లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్లపై విచారణ నడుస్తున్న వేళ.. పవన్ తాజా వ్యాఖ్యలు కచ్చితంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.‘‘నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. సనాతన ధర్మం పాటించే వాళ్ల పట్ల చట్టాలు నిర్ధాక్షిణ్యంగా పని చేస్తున్నాయి. సనాతన ధర్మాన్ని దూషించేవారిని కోర్టులే రక్షిస్తున్నాయి. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్లకు కంచాలు అన్నట్లు ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆకులు కూడా పోయాయి.. చేతుల్లో పెట్టి నాకేసుకోమంటున్నారు... సనాతన ధర్మం వైరస్లాంటిదని, నాశనం చేస్తానని ఓ యువనేత అన్నారు. ఇలాంటి మాటలు ఇస్లాం గురించి అంటే తక్షణం కోర్టులు స్పందించేవి. వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించేవి. సనాతన ధర్మాన్ని తిట్టినా.. శ్రీరాముడిని, సరస్వతి దేవిని తిట్టినా.. దాడి చేసినా ఏ ఒక్కకోర్టు మాట్లాడదు. అలాంటి వారిని ఏమైనా అనాలంటే కోర్టులు భయపడతాయి. ఇది న్యాయానికి ఉదాహరణ... నాకు ఏదో అన్యాయం జరిగిందని నేను బయటకు రాలేదు. జనసేన అధ్యక్షుడిగానో, ఏపీ డిప్యూటీ సీఎంగానో ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మ విరోధులతో గొడవ పడడానికే వచ్చా. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా?. లడ్డూ విషయంలో కోర్టులు తీర్పులు ఇచ్చే ముందు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్ అన్నారు.ఈమధ్యకాలంలో కోర్టులు ఈ తరహా వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించడం లేదు. తమ తీర్పును రాజకీయాలకు ముడిపెట్టి స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా పరిగణించి సుప్రీం కోర్టు మందలించింది. అలాగే లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయం కోసం చేసిన ప్రచారంపైనా మండిపడింది. ఇవేకావు.. బాధ్యతగల పదవుల్లో ఉంటూ ఈ తరహా వ్యాఖ్యలు చేసిన వాళ్లపట్ల న్యాయస్థానాలు అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది.. పవన్ నేరుగా కోర్టులపైనే బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. మరి వీటిని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఉంటుందా?. మొట్టికాయలు వేయకుండా ఉంటుందా?. ::లోకేష్ఇదీ చదవండి: చివరి నిమిషంలో లడ్డూ పిటిషన్ల విచారణ వాయిదా -
Justice D.Y. Chandrachud: న్యాయప్రక్రియతో జనం విసుగెత్తిపోయారు
న్యూఢిల్లీ: దేశంలో కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు, సుదీర్ఘంగా సాగే న్యాయ వ్యవస్థ ప్రక్రియతో ప్రజలు విసుగెత్తిపోయారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్లు చక్కటి ప్రత్యామ్నాయ వేదికలని చెప్పారు. వాటిని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. శనివారం సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ వారోత్సవంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివాదాలను, కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకొనే అవకాశం ఉందని, ఇరుపక్షాల అంగీకారంతో రాజీ పడొచ్చని వెల్లడించారు. న్యాయస్థానాల్లో న్యాయం చేకూర్చే ప్రక్రియ కక్షిదారులకు ఒక శిక్షగా మారిపోయిందని, ఇది నిజంగా న్యాయమూర్తులకు ఆందోళన కలిగించే విషయమని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఆకాంక్షించారు. -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
నల్ల కోటు... రాజకీయం!
కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ రాజ్యానికి మూలస్తంభాలు. ఇందులో న్యాయ వ్యవస్థ మిగిలిన రెండింటికంటే విశిష్టమైనది. ఎందుకంటే మొత్తం మూడు వ్యవస్థల పరిధులనూ, పరిమితులనూ నిర్ణయించగల, నిర్దేశించగల స్థానం ఆ ఒక్క వ్యవస్థకు మాత్రమే వుంది. ఇతర రెండు వ్యవస్థలతో పోలిస్తే ఇప్పటికీ న్యాయ వ్యవస్థపై ప్రజలకు కొద్దో గొప్పో విశ్వనీయత వుంది. దానికి విఘాతం కలిగించే పరిణామాలు అడపా దడపా చోటుచేసుకుంటున్న సంగతి కూడా కాదనలేనిది. 175 ఏళ్ల చరిత్ర కలిగిన కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి, ఆ పదవికి రాజీనామా ఇచ్చిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వైనం అటువంటిదే. తన రాజకీయ రంగ ప్రవేశంపై జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ తనను రోజూ దుమ్మెత్తిపోయటం, అసభ్య పదజాలంతో దూషించటం ఆయన తట్టుకోలేకపోయారట. కనుక నల్లకోటు, న్యాయదండం విడిచిపెట్టి ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమే ఆయనకు పరిష్కారంగా తోచింది! అలా అసభ్య పదజాలంతో దూషించే నేతలకు చదువు సక్రమంగా లేదన్న జస్టిస్ గంగోపాధ్యాయ విమర్శలో నిజం వుండొచ్చు. కానీ ఆయన చదువుసంధ్యలూ, విజ్ఞతా ఏమయ్యాయి? తాను వెలువరించే తీర్పులకు పూలు తప్ప రాళ్లు పడవని ఎలా అనుకున్నారు? తృణమూల్ సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణల విషయంలో జస్టిస్ గంగోపాధ్యాయ కఠినంగా వ్యవహరించారన్న పేరు వుంది. మొత్తం 14 ఉదంతాల్లో ఆయన సీబీఐ దర్యాప్తు జరపాలని ఆదేశించారు. అందులో ఉపాధ్యాయ నియామకాల కోసం పెద్దయెత్తున ముడుపులు చేతులు మారాయన్న స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్సెస్సీ) కేసు ప్రధానమైనది. ఆయన ఉత్తర్వుల కారణంగా 2022లో ఉన్నత విద్యాశాఖమంత్రిగా వున్న పార్థా ఛటర్జీతోపాటు దళారులు, డబ్బులిచ్చి ఉద్యో గాల్లోకొచ్చిన కొందరు టీచర్లు అరెస్టయ్యారు. నిజానికి ఆ కేసులో జస్టిస్ గంగోపాధ్యాయ ఇచ్చిన ఆదేశాలు ఆయనకు పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. అవినీతిపై నిప్పులు కక్కే యోధుడిగా, సీఎం పదవికి అన్నివిధాలా అర్హతగల వ్యక్తిగా లోక్సభ కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌధురి అప్పట్లో కీర్తించారు. వామపక్షాలు సైతం ఆయన తీర్పులను ప్రశంసించాయి. కానీ అవి జస్టిస్ గంగో పాధ్యాయ చెవికి సోకినట్టు లేదు. ‘న్యాయమూర్తులుగా తమ తీర్పులు నచ్చకపోతే విమర్శించవచ్చు, అప్పీల్కు పోవచ్చు. కానీ దూషిస్తారా?’ అని ఆయన ప్రశ్నించటం సబబే. కానీ ఆయన చేయాల్సిందేమిటి? దూషణలకు జవాబుగా ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకోవటమా? ఇందువల్ల ఆయనకుగానీ, మొత్తంగా వ్యవస్థకుగానీ విశ్వసనీయత పెరుగుతుందా? నిరుడు జస్టిస్ గంగో పాధ్యాయ తృణమూల్ను విమర్శిస్తూ స్థానిక చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దాన్ని తీవ్రంగా తప్పుబట్టి మందలించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి పదవిలో వుంటూ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేయటం జస్టిస్ గంగోపాధ్యాయతోనే మొదలు కాలేదు. 1967లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావుతోపాటు జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ బహరూల్ ఇస్లాం, జస్టిస్ ఫాతిమా, జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన్ గొగోయ్ వరకూ ఎందరో వున్నారు. జస్టిస్ బహరూల్ ఇస్లాం 1983లో అప్పటి బిహార్ పీసీసీ(ఐ) అధ్యక్షుడు జగన్నాథ్ మిశ్రాపై వచ్చిన ఫోర్జరీ, నేరపూరిత ప్రవర్తన ఆరోపణలనుంచి ఆయన్ను విముక్తి చేసిన నెల రోజులకే అస్సాంలో ఎంపీగా పోటీచేసే అవకాశం వచ్చింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. రిటైర్మెంట్ అనంతరం లా కమిషన్, మానవహక్కుల సంఘం, కంపెనీ లా బోర్డు, వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ వంటి సంస్థలకు నేతృత్వం వహించే అవకాశం ఎటూ వుంటుంది. అది కూడా సరికాదని అభ్యంతరం చెప్పేవారున్నారు. రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించటం, అంతకు వారంరోజుల ముందు ఆ పార్టీ నేతలను సంప్రదించినట్టు చెప్పటం జస్టిస్ గంగోపాధ్యాయ విజ్ఞతపై సందేహాలు రేకెత్తిస్తుంది. ఈ వారంరోజుల్లో కేసులేమీ చూడలేదన్నంత మాత్రాన ఈ సందేహాలు సమసిపోవు. మిమ్మల్ని ముందుగా బీజేపీ నేతలే సంప్రదించారా అన్న ప్రశ్నకు ఆయన లౌక్యంగా ‘మేమిద్దరం ఒకరినొకరం సంప్రదించుకున్నాం’ అని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ నీతివంతమైన పాలన గురించి ఎవరికీ భ్రమల్లేవు. నాలుగైదేళ్ల క్రితం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే తమ పార్టీలో అవినీతి నేతలు మితిమీరుతున్నారనీ, వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ హెచ్చరించిన సంగతి అందరికీ గుర్తుంది. ఇలాంటి పరిస్థితి వున్నది గనుకే జస్టిస్ గంగోపాధ్యాయ వెలువరించిన తీర్పులను అనేకులు ప్రశంసించారు. తన రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంతో ఆ తీర్పులపై సందేహాలు తలెత్తటానికి ఆయనే కార కులయ్యారు. బీజేపీ నేతలు స్వర్గీయ అరుణ్ జైట్లీ, ప్రస్తుత కేంద్రమంత్రి నితీన్ గడ్కరి వంటివారు పదవీ విరమణ తర్వాత జడ్జీలు ఏ పదవీ తీసుకోరాదని అభిప్రాయపడ్డారు. అసలు సీవీసీ పదవికున్నట్టే జడ్జీలకు సైతం రిటైరయ్యాక పదవులు చేపట్టరాదన్న ఆంక్షలుండాలని చాలామంది చెబుతారు. అలా కాకపోయినా కనీసం రెండేళ్లపాటు ఏ పదవీ తీసుకోకుండా వుండటం శ్రేయస్కరం. రాజకీయాలకు అతీతంగా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగల స్థితిలో వుందనే సంకేతం మన దేశ గౌరవాన్ని మరింత పెంచుతుందని అందరూ గుర్తించాలి. -
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి పెంచేలా ఎల్లో గ్యాంగ్ నానాయాగీ
అవినీతి ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు ఆదేశాలతో జైలుకు వెళ్లారు. ఇది కక్ష సాధింపు చర్య అంటూ టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుండి స్పందన లేకపోయినా.. అర కొరగా టీడీపీ కార్యకర్తలు.. బాబు కుటుంబ సభ్యులు తాము పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఎల్లో బ్యాచ్ నిరసనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబును న్యాయవ్యవస్థ జైలుకు పంపింది. మరి బాబు కుటుంబం, టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? అని నిపుణులు నిలదీస్తున్నారు. 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగిన స్కిల్ స్కాంలో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. జీవితంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా.. ఏనాడూ కోర్టు గుమ్మం కూడా ఎక్కకుండా స్టేలు తెచ్చుకుని తనపై అసలు విచారణలే జరక్కుండా చేసుకుంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ కాలక్షేపం చేస్తూ వచ్చారు. అయితే స్కిల్ స్కాంలో మాత్రం ఆయనకు ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీన్ని చంద్రబాబు నాయుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తన అవినీతిపై ఎన్నో కేసులు ఉన్నా ఏ ఒక్క కేసులోనూ అరెస్ట్ కాకుండా తప్పించుకున్న తాను.. ఇపుడు జైలుకెళ్లాల్సి రావడం ఏంటి? అని ఆయన కుత కుతలాడిపోతున్నారు. చంద్రబాబు ఇలా జైలుకెళ్లి అలా బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తారని బాబు బంధువులు, టీడీపీ నేతలు అనుకున్నారు. అసలు అరెస్టే కారని అంతకు ముందు అనుకున్నారు. అయితే తమ అంచనాలు తప్పేయడంతో జైలుకెళ్లిన తర్వాత టీడీపీ నేతల్లో కొద్ది పాటి కంగారు మొదలైంది. న్యాయ విచారణలో చంద్రబాబు దోషిగా తేలితే తాను నిప్పు నిప్పు అని ఇంతకాలం అంటూ వస్తోన్న నినాదానికి కాలం చెల్లినట్లే అవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బాబు అరెస్ట్ పైనా.. ఆయన్ను జైలుకు పంపడంపైనా నానా యాగీ చేయాలని టీడీపీ నేతలు డిసైడ్ అయ్యారు స్కిల్ స్కాం కేసులోనూ తనపై విచారణ జరపకుండా కేసునే క్వాష్ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్లు వేశారు. మరో వైపు ముందస్తు బెయిల్కూ పిటిషన్లు వేసుకున్నారు. బెయిల్ రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకోవడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రతిష్ఠ మరింతగా మసకబారుతుందని భయపడ్డ టీడీపీ నాయకత్వం బాబు అరెస్ట్కు నిరసనగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది. న్యాయానికి సంకెళ్లు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తే ప్రజల నుంచి స్పందన రాలేదు. అక్కడక్కడా పార్టీ శ్రేణులో కార్యక్రమం చేశామంటే చేశాం అన్నట్లు మమ అనిపించేశారు. అయితే ఈ నిరసనలు ఎవరిపైనా? అని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ అండ్ కో నినాదాలు చేస్తోంది. అయితే చంద్రబాబు నాయుడి కేసులో మొత్తం దర్యాప్తు చేసి అక్కడ అవినీతి జరిగిందని కనిపెట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థలే. ఆ తర్వాత దోపిడీకి సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సాక్ష్యాధారాలతో చంద్రబాబును జైలుకు పింపింది ఏసీబీ న్యాయస్థానం. ఇపుడు చంద్రబాబు తరపున ఆందోళనలు చేస్తోన్న వారు కేంద్ర దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారా? లేక ఆయన్ను జైలుకు పంపిన ఏసీబీ కోర్టు తీర్పుకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారా? అని వారు నిలదీస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ నేతలకు అనుమానాలు ఉన్నా కేంద్రంలోని బీజేపీని ఏమీ అనలేకపోతున్నారు. ఏసీబీ కోర్టు మెజిస్ట్రేట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి దిగజారిన టీడీపీ నేతలు ఎవరిపై నిరసన వ్యక్తం చేయాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు వెనుక ఉన్నది కేంద్రంలోని బీజేపీయే అని చంద్రబాబుకు మద్దతు తెలిపిన సమాజ్ వాది పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఆరోపించాయి. అయిటే టీడీపీ మాత్రం కేంద్రంలోని బీజేపీ పేరు చెబితేనే భయపడిపోతోంది. ఎవ్వరినీ ఏమీ అనలేక ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్పై విష ప్రచారం చేస్తోందని పాలక పక్ష నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలంటే న్యాయ స్థానాలు బెయిల్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు మేథావులు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం వల్ల కానీ.. టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఆందోళనల పేరిట అక్కడక్కడా హడావిళ్లు చేయడం వల్లకానీ చంద్రబాబు నాయుడు విడుదల అయ్యే అవకాశాలు లేనే లేవంటున్నారు న్యాయ రంగ నిపుణులు. బాబు విడుదల కోసం ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తోంది టీడీపీ. న్యాయస్థానాలే చంద్రబాబు విషయంలో నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకీ ఈ విషయం తెలుసు. కాకపోతే ఏమీ తెలీనట్లు ఆయన డ్రామాలు చేయిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. -సీఎన్ఎస్ యాజులు, సీనియర్ జర్నలిస్టు -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
కొలీజియం కాక.. కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య ముదురుతున్న వివాదం
సుప్రీంకోర్టు కొలీజియం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదంగా మారిన అంశం. కొలీజియం వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల్లో తమ పాత్ర లేకపోవడం ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొలీజియం వ్యవస్థే రాజ్యాంగ విరుద్ధమంటూ పలువురు కేంద్ర మంత్రులు బాహాటంగా గళం విప్పుతున్నారు. కొలీజియం సభ్యులేమో సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకానికి తాము సిపార్సులు మాత్రమే చేస్తామని, తుది నిర్ణయం కేంద్రానిదేనని అంటున్నారు. ఏమిటీ కొలీజియం...? సుప్రీంకోర్టు న్యాయమూర్తుతో పాటు దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలను సిఫార్సు చేయడానికి ఉద్దేశించినదే కొలీజియం వ్యవస్థ. సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. న్యాయమూర్తుల నియామకం, బదిలీల విషయంలో కొలీజియంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మెజార్టీ సభ్యులదే తుది నిర్ణయం. అయితే ప్రధాన న్యాయమూర్తిని తప్పనిసరిగా సంప్రదించి, ఆయన అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొలీజియం తన సిఫార్సులను కేంద్రానికి పంపుతుంది. ఇక హైకోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులు సభ్యులు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు పంపుతుంది. ముఖ్యమంత్రి వాటిని కేంద్ర న్యాయ శాఖ మంత్రికి పంపిస్తారు. వాస్తవానికి రాజ్యాంగంలో కొలీజియం ప్రస్తావన లేదు. కొలీజియం చేసే సిఫార్సులపై కేంద్రం తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఒకే పేరును కొలీజియం రెండోసారి సిఫార్సు చేస్తే కేంద్రం ఆమోదించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ఏం చెబుతోంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమించాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సీజేఐ మినహా మిగతా నియామకాల్లో సీజేఐ అభిప్రాయం తెలుసుకోవాలి. ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో సీజేఐ, గవర్నర్, హైకోర్టు సీజేలను సంప్రదించాలి. ఏమిటీ వివాదం? 1950 నుంచి 1973 వరకూ కేంద్రం, సీజేఐ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతో న్యాయమూర్తులను నియమించే విధానముండేది. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని సీజేఐగా నియమించడం ఆనవాయితీగా కొనసాగింది. 1973లో మాత్రం ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి జస్టిస్ ఎ.ఎన్.రేను సీజేఐగా అప్పటి ప్రభుత్వం నియమించింది. తర్వాత మరో సీజేఐ నియామకంలోనూ ఇలాగే జరగడం కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య వివాదానికి దారితీసింది. న్యాయమూర్తుల నియామకంలో కార్యనిర్వాహక వ్యవస్థ కంటే న్యాయ వ్యవస్థకే ఎక్కువ అధికారాలుంటాయని ఫస్ట్ జడ్జెస్ కేసు (1981), సెకండ్ జడ్జెస్ కేసు (1993), థర్డ్ జడ్జెస్ కేసు (1998)ల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎలా ఏర్పాటైంది? పార్లమెంట్ చట్టంగానీ, రాజ్యాంగ విధివిధానాలు గానీ లేకుండానే మన దేశంలో 1993లో కొలీజియం వ్యవస్థ మొదలైంది. న్యాయమూర్తుల నియామకంలో ఆర్టికల్ 124(2)లో ఉన్న ‘సంప్రదింపుల అనంతరం’ అర్థాన్ని ‘సమ్మతించిన తర్వాత’గా మారుస్తూ తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. తద్వారా న్యాయమూర్తుల నియామకం, బదిలీల అధికారం సీజేఐ నేతృత్వంలోని వ్యవస్థ అయిన కొలీజియానికి దక్కింది. ప్రత్యామ్నాయముందా? కొలీజియంకు ప్రత్యామ్నాయంగా నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్జేఏసీ)ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇది స్వతంత్ర కమిషన్.దీనికి సీజేఐ చైర్పర్సన్గా ఉంటారు. మరో ఇద్దరు అత్యంత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ మంత్రి ఎక్స్–ఆఫీషియో సభ్యులుగా ఉంటారు. పౌర సమాజం నుంచి ఇద్దరు ప్రముఖులను సభ్యులుగా సీజేఐ, ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ నామినేట్ చేయాలి. ఈ ఇద్దరిలో కనీసం ఒకరు ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ లేదా మహిళ అయి ఉండాలి. రాజ్యాంగ (99వ సవరణ) చట్టం–2014, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్స్మెంట్ కమిషన్ చట్టం (2014) ద్వారా ఎన్ఏజేసీని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత బిల్లులు 2014లోనే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందాయి. కానీ ఈ బిల్లుల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్జేఏసీని కోర్టు కొట్టేసింది. అయితే న్యాయమూర్తుల ఎంపికకు కొలీజియం స్థానంలో కేంద్రం మరో వ్యవస్థను తీసుకొస్తే అభ్యంతరం లేదని ఇటీవలే స్పష్టం చేసింది. కొలీజియంలో ప్రభుత్వ నామినీలు సీజేఐకి కేంద్ర న్యాయ మంత్రి రిజిజు లేఖ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్లు, జడ్జిలను నియమించే కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వం నామినేట్ చేసేవారికి సైతం చోటుండాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు పునరుద్ఘాటించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఆయన తాజాగా లేఖ రాశారు. ‘‘జడ్జిల నియామకంలో పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం అవసరం. అందుకే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలి’’ అని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. కొలీజియం వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని కిరణ్ రిజిజు ఇటీవల విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కొలీజియమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీజేఐకి ఆయన లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయ వ్యవస్థకు విషగుళిక: జైరామ్ రమేశ్ న్యాయ వ్యవస్థను పూర్తిగా ఆక్రమించుకొనేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ సోమవారం ఆక్షేపించారు. న్యాయ వ్యవస్థను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. సీజేఐకి రిజిజు లేఖను తప్పు పట్టారు. మంత్రి సూచన న్యాయ వ్యవస్థకు విషగుళిక అన్నారు. అయితే కొలీజియంలో సంస్కరణలు అవసరమేనని జైరాం అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
సముచిత న్యాయానికి...
నిత్య జీవనంలో న్యాయపరమైన సమస్య ఏదైనా వస్తే తమ దగ్గరి వాళ్లకి చెప్పుకొని, ఉపశమనం పొందుతుంటారు. అన్యాయం చేసినవారిని తిట్టుకుంటూ విలువైన సమయాన్ని, డబ్బును పోగొట్టుకుంటుంటారు. కానీ, న్యాయవ్యవస్థను సంప్రదించాలంటే మాత్రం భయపడతారు. లాయర్లకు బోలెడంత డబ్బు ఫీజుగా ఇచ్చుకోలేమనో, కోర్టు చుట్టూ తిరగలేమనో అనుకుంటారు. నేడు అంటే నవంబర్ 9న నేషనల్ లీగల్ సర్వీస్ డే. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవడం అవసరం. పూర్ణకు పెళ్లయ్యి ఏడాదిన్నర అవుతోంది. ఆర్నెల్లుగా పుట్టింట్లోనే ఉంటోంది. తండ్రి కట్నంగా ఇస్తానన్న డబ్బు తీసుకునే ఇంటికి రావాలని అత్తింట్లో షరతు పెట్టారు, కూలి పనులు చేసే తండ్రి అంత డబ్బు ఇచ్చుకోలేడు. తనకు న్యాయం జరిగేదెలాగో పూర్ణకు తెలియడం లేదు. నీతు ఇంజనీరింగ్ చదువుతోంది. నెల రోజులుగా తెలియని వారు తన గురించి అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. ఇంట్లో పెద్దలకు చెబితే తననే తప్పు పడతారేమో, పోలీసులను సంప్రదిస్తే ఇంటి పరువు పోతుందేమో అని భయం. ఎవరి నుంచి ఎలాంటి సాయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ‘ప్రతి మనిషికి న్యాయపరమైన అవసరం ప్రతి దశలోనూ ఉంటుంది. అందుకు ముందుగా పోలీసులు సంప్రదించలేకపోవచ్చు. కానీ, న్యాయపరమైన సలహా తీసుకుంటే మాత్రం సరైన పరిష్కారం లభిస్తుంది’ అంటారు అడ్వకేట్ రాజేశ్వరి. ‘పెద్ద పెద్ద నేరాలు జరిగితే తప్ప అలాంటి చోటుకి మనకేం పని అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తారు. అంతేకాదు, న్యాయం పొందాలంటే చేతిలో దండిగా డబ్బు ఉండాలని కూడా భావిస్తారు. అయితే అవన్నీ పొరపాటు భావనలేనని, ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కి వెళ్లినట్టే ఏదైనా న్యాయపరమైన అవసరం ఏర్పడితే లీగల్ సర్వీస్ సెల్ని సంప్రదించవచ్చు’ అనేది న్యాయ నిపుణుల మాట. ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి, బ్యాంకు లోన్కు నిరాకరించినా అందుకు తగిన న్యాయ సలహా తీసుకోవడం అవసరం. వినియోగదారుడు ఏదైనా వస్తువును కొని మోసపోయినా అందుకు సంబంధించిన న్యాయం పొందడానికి అవగాహన తప్పనిసరి. గ్రామాల్లో పది మంది మహిళా సంఘ సభ్యులు కలిసి ఏదైనా కార్యక్రమం చేపట్టాలన్నా న్యాయపరమైన అవసరం ఉంటుంది. మన నిత్యజీవితంలో ప్రతి చిన్న విషయానికి ‘న్యాయం’అవసరం గుర్తించాలి. అంతేకాదు ప్రతీ చిన్న విషయానికి డబ్బు చెల్లిస్తేనే న్యాయం పొందుతామనే ఆలోచనను దూరం పెట్టాలి. సరైన పరిష్కారానికి.. సమస్య వచ్చినప్పుడు స్థానికంగా మండల లేదా జిల్లా లేదా రాష్ట్ర స్థాయిల్లో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీని సంప్రదించి, సలహా తీసుకోవచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ప్యానెల్లో సివిల్, క్రిమినల్.. ఇలా ఒక్కో విభాగానికి ఒక్కో లాయర్ ఉంటారు. రాష్ట్రస్థాయి లీగల్ ప్యానెల్లో హైకోర్టు జడ్జి కూడా ఉంటారు. వీరిలో ఎవరిని సంప్రదించినా పరిష్కారం ఎక్కడ లభిస్తుందో అందుకు సంబంధించిన సమాచారం తప్పక తెలుస్తుంది. ఏ కేసులు ఎంత వరకు పరిష్కారం అవుతున్నాయనే విషయంలోనూ ఈ సెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. వీటితోపాటు మధ్యవర్తిగా సమస్యలను పరిష్కరించే లోక్ అదాలత్ అనే మీడియేషన్ టెక్నిక్ కూడా అందుబాటులో ఉంది. మహిళలు.. పిల్లలు అత్యాచారం, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక–శారీరక హింస, లైంగిక వేధింపులు మొదలైన వాటి నుంచి మహిళలు న్యాయ పొందడానికి లీగల్ సర్వీస్ సెల్ను ఆశ్రయించవచ్చు. అంతేకాదు సైబర్ బుల్లీయింగ్, మహిళా సాధికారతకు అవరోధం కలిగించే అంశాలేవైనా న్యాయపరమైన సలహా తీసుకోవచ్చు. కాలేజీలు.. పాఠశాలలు ఇటీవల యువతలో బాగా వినిపిస్తున్న మాట మాదకద్రవ్యాల వినియోగం. కాలేజీల్లో లీగల్ అడ్వైజ్ సెషన్స్ ఏర్పాటు చేయడానికి యాజమాన్యాలు ముందుకు రావాలి. లీగల్ సర్వీస్ అథారిటీ కూడా లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలను చేపడుతుంది. వీటికి హాజరై అందుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పారా లీగల్ వాలెంటీర్లు వీళ్లు పూర్తిస్థాయి లాయర్లు కాదు. న్యాయ సమాచారం తెలుసుకుని, జనాలకు స్వచ్ఛందంగా అందిస్తుంటారు. జనాల మధ్యన తిరుగుతూ, ఎవరికైనా న్యాయపరమైన సాయం చేసేవారుంటారు. ఎవరైనా ఆసక్తి గలవారు ‘న్యాయం’ కు సంబంధించిన సమాచారం తెలుసుకొని, ప్రజలకు స్వచ్ఛందంగా అవగాహన కలిగించవచ్చు. ఇది కూడా సామాజిక సేవలో భాగమే అవుతుంది. – నిర్మలారెడ్డి ఉచితంగా న్యాయ సేవ పేద పౌరుల కేటగిరీ కిందకు వచ్చే ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సేవలను అందుకోవడానికి అర్హులు. 9–9–1995 నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 అమల్లోకి వచ్చింది. ఇందులో అర్హులైన వ్యక్తులు తమ తరపున కేసులను దాఖలు చేయడానికి లేదా ఏదైనా కోర్టులో తమకు వ్యతిరేకంగా దాఖలైన కేసులలో తమను తాము రక్షించుకోవడానికి న్యాయ సేవలను ఉచితంగా పొందవచ్చు. ఉచిత న్యాయ సహాయం గురించి, దీనితోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీలు అందించే అనేక సేవలను ప్రజలకు తెలియజేయడానికి ప్రతియేటా ప్రచారాలు నిర్వహిస్తారు. చట్టపరమైన సహాయం కోరుకునే వ్యక్తి న్యాయ సేవల కోసం ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లోనూ సంప్రదించవచ్చు. అవగాహన తప్పనిసరి ఈ నవంబర్ నెల అంతా స్కూల్స్, కాలేజీల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. చదువుకునే విద్యార్థులకు న్యాయవ్యవస్థకు సంబంధించిన ప్రాథమికాంశాల పట్ల అవగాహన ఉండాలనేది మా థీమ్. అమ్మాయిలకైతే శారీరక, మానసిక, లైంగిక హింసలు, గృహహింస, ఆస్తి హక్కుల గురించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. వీటికి సంబంధించిన విషయాల మీద లీగల్ సర్వీస్ అథారిటీ కూడా మండల, గ్రామ, జిల్లా స్థాయిల్లోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంటుంది. – రాజేశ్వరి, అడ్వకేట్ -
ట్రయలనే శిక్ష ఏపాటిది?
అఖిల భారత జిల్లా న్యాయ సేవల అథారిటీస్ ప్రథమ సమావేశంలో భారత ప్రధాని మాట్లాడుతూ చాలామంది విచారణలో ఉన్న ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడం గురించి ఆందోళన వెలి బుచ్చారు. వారి విడుదల కోసం న్యాయ సేవల అధికార సంస్థలు కృషి చేయాలని అన్నారు. న్యాయం వారికి సులభంగా అందుబాటులోకి రావాలనీ, అలా వస్తే వాళ్ల జీవించే హక్కు కుదుటపడుతుందనీ ప్రధాని అన్నారు. తీవ్రమైన నేరాలు చేయని వ్యక్తులూ, ఇదివరకే 1/3 వంతు శిక్షా కాలాన్ని అనుభవించినవాళ్లూ జెలు నుంచి బయటకు రావడానికి వారిపైన ఉన్న కేసులను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 5వ తేదీన ప్రభుత్వానికి సూచించింది. అంతకుముందు జూలై 11వ తేదీన సుప్రీంకోర్టు కొత్తగా బెయిల్ చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. కాగ్నిజబుల్ నేరం చేయని ఎంతోమంది వ్యక్తులు జైళ్ళలో ఉన్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అరెస్టు చేయడం అనేది చాలా క్రూరమైన చట్టమనీ, వ్యక్తి స్వేచ్ఛ దానివల్ల పోతుందనీ, అందుకని అత్యవసరమై నప్పుడు మాత్రమే ఈ అరెస్టులను చేయాలనీ సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో 2020లో ప్రకటించిన వివరాల ప్రకారం 4,88,551 మంది జైళ్లలో బెయిల్ రాక ఉండి పోయారు. విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య తగ్గించడం కోసం పోలీస్ కమి షన్, సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసినప్పటికీ ఫలితం లేదు. అరెస్టు చేసే అధికారం ఉందని అరెస్టు చేయడం తగదనీ, అరెస్టు చేయడానికి న్యాయబద్ధత ఉండాలనీ జోగిందర్ కుమార్ కేసు(1994)లో సుప్రీంకోర్టు చెప్పింది. అయినా పోలీసుల పని విధానంలో మార్పు రాలేదు. అరెస్టులను తగ్గించాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో 41వ నిబంధనకు మార్పులను (2009) తీసుకొని వచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ మార్పులు చేసిన నిబంధన పోలీసులకు విశేష అధికారా లను కల్పించింది. ఈ అధికార నియంత్రణ కోసం ఆర్నేష్ కుమార్ కేసులో కొన్ని మార్గదర్శకాలను కోర్టు ఏర్పరిచింది. కానీ ఆ మార్గదర్శకాలను అమలు చేసే మేజిస్ట్రేట్లు ఎంతమంది మన దేశంలో ఉన్నారు? రాజద్రోహ నేరం పేరుతో దేశంలో ఎన్నో అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. హాని కలిగించని ట్వీట్లు చేసిన జర్నలిస్టు మహమ్మద్ జుబేర్ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్యే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానకరమైన ట్వీట్ చేశాడన్న ఆరోపణ మీద ఓ నటుడు నెల రోజులపాటు జైల్లో ఉన్నాడు. ఆయన ఎవరి గురించి అయితే ఆ ట్వీట్ చేశాడో ఆ నాయకుడు ఆ ట్వీట్ని పట్టించుకోలేదు. బర్షశ్రీ బురగొహెయిన్ అనే స్టూడెంట్ ఏదో కవిత రాసినందుకు రెండు నెలలు జైల్లో ఉండిపోయింది. మన జైళ్లలో కూడా చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ అనే విచారణలో ఉన్న ఖైదీకి సకల సౌకర్యాలు జైల్లో లభిస్తాయి. స్టాన్స్వామి అనే ఖైదీ ఒక రూపాయి విలువ చేసే ‘స్ట్రా’ కోసం విలవిల లాడాల్సి వచ్చింది. ఇట్లా ఎన్నో ఉదాహరణలను చెప్పవచ్చు. 2018లో అరెస్టయిన ప్రముఖ కవికి సుప్రీంకోర్టు ఇటీవల మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ఆయనకి 82 సంవత్సరాలు ఉన్నాయనీ, కస్టడీ విచారణ 2018లో జరిగిందనీ, ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలైనా కూడా విచారణ ఇంకా మొదలు కాలేదన్న కారణంగా బెయిల్ మంజూరు చేసినట్టుగా పత్రికల్లో వార్తలు వచ్చాయి. అరెస్టు విషయంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను, మేజిస్ట్రేట్స్ కఠినంగా అమలు చేస్తే ఈ అరెస్టులకు అడ్డుకట్ట ఏర్పడుతుంది. అదే విధంగా రిమాండ్ చేసేటప్పుడు గుడ్డిగా కాకుండా జాగ్రత్తగా రిమాండ్ చేస్తే కూడా ఈ నిర్బంధాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ‘జైలు కాదు బెయిల్’ అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యానం స్లోగన్ మాదిరిగా మారడం శోచనీయం. నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిని అమాయకుడిగా పరిగణించాలన్న నియమం కాస్త అమాయకుడిగా నిరూపణ అయ్యేంతవరకూ నేరస్థుడు అన్న చందంగా మారడం ఓ విషాదం. రిమాండ్ విషయంలో, అదే విధంగా బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీరియస్ నేరాలను, మామూలు నేరాలను వేరువేరుగా చూసే దృష్టి అలవర్చుకోవాలి. ఈ గందరగోళ పరిస్థితి నుంచి బయటపడటానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లోని అన్ని వ్యవస్థలూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. న్యాయమూర్తుల పాత్ర గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మదన్ బి. లోకూర్ మాటలను ఇక్కడ ఉదహరించాలి. ‘‘అరెస్టు విషయంలో ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు పోలీసుల రబ్బర్ స్టాంపు మాదిరిగా వ్యవహరించకూడదు. మీ మనస్సుతో చూడండి. ఓ నా ప్రియమైన న్యాయమూర్తులారా! స్వేచ్ఛ అనేది అత్యంత విలువైనది. అది ఎవరూ కోల్పోకూడదు. దేశ పౌరుల రాజ్యాంగ హక్కులవైపు మీరు నిలబడండి. నాకు తెలుసు. మిమ్మల్ని రాత్రికి రాత్రి బదిలీ చేస్తారన్న భయం కూడా ఉంటుంది. నిద్రలేని రాత్రులు మీకు ఏర్పడవచ్చు. మంచి రోజులు ఏదో ఒక రోజు వస్తాయి. అంతలోపు సంవత్సరాల తరబడి విచారణలో ఉన్న ఖైదీల వైపు చూడండి. అమాయకులు జైళ్లలో ఉండి పోకుండా చూడండి. ఇది సరైనదేనా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి గురించి ఆలో చించండి. ఇది న్యాయమా? అన్యాయమా? ఆలోచించండి. ఇది కష్టమైన ప్రశ్న కాదు.’’ (క్లిక్: రోజురోజుకూ పెరుగుతున్న వ్యత్యాసాలు) ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర న్యాయ శాఖా మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరూ విచారణలో ఉన్న ఖైదీల గురించి ఆందోళనల వ్యక్తపరుస్తున్నారు. ఈ ఆందోళనలను తగ్గించే అవకాశం ఉన్న వ్యక్తులు ట్రయల్ కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే బాధ్యత వారిమీద లేదా? ‘విచారణలో ఉన్న ఖైదీనా, విచారణే అవసరం లేని ఖైదీనా’ తెలియజెప్పమని విచారణలో ఉన్న ఖైదీలు కోరకుండా చూసు కోవాల్సిన బాధ్యత న్యాయమూర్తుల మీదే ఉంది. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) - మంగారి రాజేందర్ మాజీ జిల్లా జడ్జి -
సత్వర న్యాయమే లక్ష్యం: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలోని న్యాయ స్థానాల్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయని, అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు తక్కువ సమయంలో న్యాయం అందేలా న్యాయవాదులు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతే ప్రజాస్వామ్యం మనుగడ కష్టమని, ఆ పరిస్థితి తలెత్తకుండా న్యాయ వ్యవస్థ వనిచేసేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడటం శుభపరిణామం.. అందువల్ల నేను కూడా తెలుగులో మాట్లాడటమే సముచితం’ అంటూ సీజేఐ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. 2013 మే 11న ఈ భవనానికి శంకుస్థాపన చేసినప్పటికీ.. రాష్ట్ర విభజన, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిర్మాణం పూర్తవ్వడానికి ఆలస్యమైందన్నారు. అయితే మళ్లీ తన చేతుల మీదుగానే ఈ భవనం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడకుండా న్యాయ వ్యవస్థకు ప్రత్యేక నిధులు ఇవ్వాలన్న తన ప్రతిపాదనలకు కేంద్రం అంగీకరించకపోయినా.. ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు మద్దతుగా నిలిచారని అభినందించారు. విజయవాడతో, బెజవాడ బార్ అసోíసియేషన్తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. విజయవాడ సిటీ సివిల్ కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన బహుళ కోర్టు సముదాయాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం సమాజంలో మార్పు కోసం అపార అనుభవం గల సీనియర్ న్యాయవాదులు జూనియర్లకు అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఈ సందర్భంగా తన ఉన్నతికి, తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన వల్ల అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడి పోయిందని, అందరూ కష్టపడి పనిచేసి, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం కూడా అవసరమైన నిధులు ఇచ్చి రాష్ట్రానికి సహకరించాలని కోరారు. తన పదవీ కాలంలో 240 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 15 మంది ప్రధాన న్యాయమూర్తులను నియమించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హైకోర్టు న్యాయ మూర్తులను నియమించామని గుర్తు చేశారు. ఈ నియామకాల్లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామన్నారు. రూ.55 కోట్ల అంచనాతో మొదలైన విజయవాడ సిటీ సివిల్ కోర్టు భవన సముదాయం ప్రస్తుతం రూ.100 కోట్లు దాటిందని, ఏపీ ప్రభుత్వ సహకారంతో పనులు పూర్తి చేశామన్నారు. ఈ భవన నిర్మాణం కోసం కృషి చేసిన బెజవాడ బార్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులకు, పెద్దలరికీ ఆయన అభినందనలు తెలిపారు. విశాఖలో పెండింగ్లో ఉన్న కోర్టు సముదాయ భవన నిర్మాణానికి సీఎం సహకారం అందించాలని సీజేఐ కోరారు. భవన సముదాయంలో ఓ విభాగాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఇది అరుదైన ఘట్టం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి 2013లో జస్టిస్ ఎన్వీ రమణ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అదే భవన సముదాయాన్ని ఆయనే ప్రారంభించడం అరుదైన ఘట్టమని సీఎం వైఎస్ జగన్ అన్నారు. జ్యూడీషియరీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. విజయవాడలో అధునాతన భవనంలో కోర్టులు ఏర్పాటవ్వడం ఆనందంగా ఉందన్నారు. బహుళ అంతస్తుల భవనాలలో కోర్టు హాల్స్ ఏర్పాటుతో కేసుల విచారణలో వేగం పెరుగుతుందని, పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కోర్టుల భవన నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నూతన కోర్టు భవన సముదాయాన్ని పరిశీలిస్తున్న సీజేఐ, హైకోర్టు సీజే, సీఎం ఇదిలా ఉండగా, కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ను సన్మానించాలని సభ్యులు చేసిన అభ్యర్థనను సీఎం సున్నితంగా తిరస్కరించారు. న్యాయ వ్యవస్థలో అనుభవజ్ఞులైన జస్టిస్ ఎన్వీ రమణను సత్కరించడం సముచితమని వారికి సూచించారు. వేదికపై ఈ సన్నివేశాన్ని గమనించిన న్యాయవాదులు సీఎం నిరాడంబరతను ప్రశంసించారు. సీఎం తన ప్రసంగంలో ప్రత్యేకంగా న్యాయవాదులకు కృతజ్ఞతలు చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు. సీజేఐని గజమాలతో సత్కరించినప్పుడు వేదికపై సీఎం.. అందరిలో ఒక్కడిగా కలిసిపోయి సూచనలు ఇచ్చిన తీరును కరతాళ ధ్వనులతో అభినందించారు. కాగా, తొలుత కోర్టు ప్రాంగణంలో సీజేఐ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ విజయలక్ష్మి, జస్టిస్ బి.దేవానంద్, జస్టిస్ కృపాసాగర్, జస్టిస్ శ్రీనివాస్, జిల్లా జడ్జి అరుణ సాగరిక, హైకోర్టు న్యాయమూర్తులు, బెజవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047
స్వాతంత్య్రానికి పూర్వం భారత్లో బ్రిటిష్ న్యాయం ఎలా ఉండిందో తెలిసిందే. భగత్సింగ్, సుఖ్దేశ్, రాజ్గురు, తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల్ని విచారించి, శిక్షలు విధించడంలోని వివక్షకు ఆనాటి కోర్టులు ప్రతీకలు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ఆ దుస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రభుత్వాధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. నవ భారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధల చట్రం ఏర్పడింది. మన న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రమైనదంటే.. పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించిన సవరణలను గానీ, మరే ఇతర మార్పు చేర్పులను కానీ చేయకూడదని 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. చదవండి: సామ్రాజ్య భారతి: జననాలు ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్ సిఫారసు చేస్తే దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్ నిర్ణయంలో సదుద్దేశం లేదని నిర్థారణ అయినట్లయితే బర్తరఫ్ అయిన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఎస్.ఆర్.బొమ్మై (1994) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఎన్నికల్లో పౌరుల ఓటు హక్కు వినియోగంపై న్యాయ వ్యవస్థ కల్పించిన ‘నోటా’ అవకాశం ఒక ప్రజాస్వామ్య సంస్కరణ అనే చెప్పాలి. వచ్చే 25 ఏళ్లల్లో మరిన్ని మెరుగైన మార్పులు రాగలవని ఆశించవచ్చు. -
న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచాలి
నాయుడుపేట(తిరుపతి): న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సూచించారు. శనివారం హైకోర్టు నుంచి వర్చువల్ విధానంలో నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనాన్ని ఆయన ప్రారంభించారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ గొప్పతనం, ఔన్నత్యం, గౌరవం ఇనుమడించేలా వ్యవహరించాలని సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కొరత ఉందని, ఈ సమస్యను పరిష్కరించేందుకు త్వరలో చర్యలు చేపడుతామన్నారు. నెల్లూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ.. జిల్లాలో 1,166 కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయలక్ష్మిని న్యాయమూర్తులు, న్యాయవాదులు సన్మానించారు. నాయుడుపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి గీతావాణి తదితరులు పాల్గొన్నారు. -
గొటబయ ప్రభుత్వంపై అవిశ్వాసం
కొలంబో: దేశంలో నెలకొన్న సంక్షోభాలను తక్షణం పరిష్కరించే చర్యలు చేపట్టకుంటే గొటబయ రాజపక్సే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని లంక ప్రధాన ప్రతిపక్షం ఎస్జేబీ పార్టీ ప్రకటించింది. దేశంలో అధ్యక్ష పాలన పోవాలని పార్టీ నేత సజిత్ ప్రేమదాస అభిప్రాయపడ్డారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పంపిణీ జరగాలన్నారు. గొటబయ తొలగాలన్న ప్రజా డిమాండ్ను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. లేదంటే తామే అవిశ్వాసం తెస్తామని హెచ్చరించారు. మరోవైపు అవిశ్వాసానికి మద్దతుగా ఎంపీల సంతకాల సేకరణను ఎస్జేబీ ఆరంభించినట్లు మీడియా వర్గాలు తెలిపాయి. అన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలో గొటబయ ఎస్జేపీని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానాన్ని పార్టీ తిరస్కరించింది. దేశంలో రాజపక్సేల ఆధిపత్యం పోవాలని ఎస్జేబీ కోరుతోంది. గొటబయ రాజీనామా చేయకపోతే అవిశ్వాసం తెస్తామని మరో విపక్షం జేవీపీ నేత విజేత హెరాత్ చెప్పారు. అయితే రాజీనామా డిమాండ్ను గొటబయ తోసిపుచ్చారు. పరిష్కారం దొరకలేదు దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక సంక్షోభపై చర్చ పార్లమెంట్లో మూడు రోజులు చర్చించినా తగిన పరిష్కారం లభించలేదు. పలువురు మంత్రులు రాజీనామా నేపథ్యంలో తక్షణం మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణా మర్గాలు అన్వేషించాలని అధికార కూటమి సభ్యులు కూడా కోరుతున్నారు. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్, చైనా, ఇండియాతో సాయంపై చర్చలు జరుపుతోందని గొటబయ చెబుతున్నారు. ప్రజలు పొదుపుగా వ్యవహరించాలని సూచించారు. దేశంలోని విదేశీ దౌత్యవేత్తలతో విదేశాంగమంత్రి పెరిస్ చర్చలు జరిపారు. మరోవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో పబ్లిక్ రంగ ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు సమ్మె చేశారు. మరోవైపు దేశంలో ఔషధాలు, వైద్య పరికరాల కొరత తీవ్రస్థాయికి చేరింది. -
ఇది శుభపరిణామం: జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, అమరావతి: దేశంలో ప్రస్తుతం సామాన్యుడు సైతం రాజ్యాంగం గురించి చర్చించే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంతో శుభ పరిణామమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. రాజ్యాంగం గురించి, హక్కుల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగం కేవలం గ్రంథాలయాలకు, బహిరంగ సభల్లో ప్రసంగాలకు పరిమితం కాకూడదని, దానిపై చర్చోప చర్చలు జరిగినప్పుడే ప్రజలకు తమ హక్కుల గురించి పూర్తి స్థాయి అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. శనివారం విజయవాడ సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆయనకు పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు జస్టిస్ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. జీవిత సాఫల్య పురస్కారం ద్వారా తాను సాధించాల్సింది, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా ఓ తెలుగువాడిగా శాయశక్తులా తన పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని చెప్పారు. తెలుగువాడి గౌరవాన్ని ఏ మాత్రం తగ్గించకుండా తెలుగువాడి కీర్తిని ఎగురవేస్తానని, ఇది తాను ఇస్తున్న హామీ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోర్టులో జరిగేది కక్షిదారుడికి అర్థం కావాలి ► రాజ్యాంగంపై ప్రజల్లో చర్చ మొదలైన నేపథ్యంలో వారికి వారి హక్కుల గురించి తెలియచేసి చైతన్య పరచాలి. ఇందులో రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావాలి. ► దేశం ఎంత అభివృద్ధి సాధించినా.. నిరక్షరాస్యత, అనారోగ్యం, మౌలిక సదుపాయాల లేమి, ఆర్థిక సమస్యలు, నిరుద్యోగం వంటి సమస్యలు పీడిస్తున్నాయి. ఇవి పరిష్కారం కావాలంటే ప్రజల్లో చైతన్యం అవసరం. ఈ దిశగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ► న్యాయ పాలన అన్నది చాలా ముఖ్యం. అది లేకపోతే అరాచకం పెరిగిపోతుంది. ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. న్యాయ పాలన అమలు కోసం న్యాయమూర్తులు, న్యాయవాదులు కృషి చేయాలి. న్యాయ పాలన గురించి ప్రజలకు తెలిసేలా మేధావి వర్గం పనిచేయాలి. ► కోర్టులు, పోలీసుల దగ్గరకు వెళ్లకూడదన్న నిశ్చిత అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. అయితే హక్కులకు భంగం కలిగినప్పుడు పౌరులు కచ్చితంగా న్యాయ స్థానాలను ఆశ్రయించాలి. అలాంటి పరిస్థితిలో న్యాయ స్థానాలు తప్పక జోక్యం చేసుకుంటాయి. ఇందులో మరో మాటకు తావు లేదు. ► కోర్టులో జరిగేది ప్రతిదీ కక్షిదారునికి అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థపై విశ్వాసం రెట్టింపు అవుతుంది. కోర్టుల్లో మౌలిక వసతులు పెరగాలి. కోర్టు భవనాల నిర్మాణాలు జరగాలి. ఇందు కోసమే జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో జ్యుడిషియల్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సంస్కరణలు అవసరమే ► న్యాయ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయ వ్యవస్థ గురించి అట్టడుగు వర్గాల ప్రజలు కూడా తెలుసుకునేలా సరళీకరణ, భారతీయీకరణ జరగాలి. ► ఓ వ్యక్తి దాఖలు చేసిన కేసులో ఏం వాదనలు జరుగుతున్నాయి.. కోర్టు ఏమంటోంది.. ఏం తీర్పు చెప్పింది.. అన్న విషయాలు అతనికి స్వయంగా అర్థమైనప్పుడే న్యాయ వ్యవస్థ సరళీకరణ అయినట్లుగా భావించాలి. న్యాయ వ్యవస్థ అర్థం కాని బ్రహ్మ పదార్థంలా ఉండకూడదు. ► న్యాయ వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలు అర్థం కానప్పుడు ప్రజలు న్యాయ స్థానాలకు బదులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ప్రత్యామ్నాయాల వైపు వెళ్లడం బెజవాడ ప్రజలకు అలవాటు. ఆ దిశగా వెళ్లొద్దని కోరుతున్నా. పెండింగ్లో 4.60 కోట్ల కేసులు ► ప్రస్తుతం దేశంలో 4.60 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ కేసుల సంఖ్య పెద్దది కాదు. వాయిదాలు వేయకుండా సత్వర పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలి. ఈ దిశగా ప్రభుత్వానికి సైతం పాత్ర ఉంది. ► ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి పనిచేస్తే కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉందదు. అన్ని వ్యవస్థలు తమ పరిధులకు లోబడి పని చేయాలి. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించేలా ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావాలి. ► న్యాయ వ్యవస్థలో మార్పు దిశగా చర్యలు చేపట్టాం. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేస్తున్నాం. అవసరమైన చోట గట్టిగా మాట్లాడుతున్నా. తెలుగు శిథిలం కాకుండా చూడాలి ► తెలుగు భాష శిథిలం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మాతృభాషలో విద్య చాలా అవసరం. మాతృభాషలో ఆలోచనలు చేసినప్పుడే పనుల్లో విజయం సాధ్యమవుతుంది. ► మన విజయానికి మాతృభాషే పునాది. ఆ పునాదిని కూల్చేసే పరిస్థితి రాకూడదు. తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ► అనంతరం నిర్వాహకులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మలను సన్మానించారు. జీవిత సాఫల్యం పురస్కారంతో పాటు ఇచ్చే నగదు బహుమతిని సీజేఐ జస్టిస్ రమణ.. అనాథ బాలల ఆశ్రమాలకు వితరణ కింద అందజేశారు. ► ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు పట్టాభి రామయ్య, సుబ్బరామయ్య నాయుడు, ఎం.రామారావు, డాక్టర్ మోహన్ ప్రసాద్, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నివాసంలో ఏర్పాటు చేసిన విందులో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. విజయవాడ చైతన్యం చూపాలి ► విజయవాడ ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఇక్కడి నుంచి ఎంతో మంది నేతలు జాతీయ స్థాయిలో కీర్తి గడించారు. విజయవాడతో నాకు ఎన్నో గొప్ప స్మృతులు ఉన్నాయి. న్యాయ విద్యను పూర్తి చేసి హైదరాబాద్కు వెళ్లాను. అతికష్టం మీద విజయవాడను వీడాల్సి వచ్చింది. ► అయినప్పటికీ ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి శని, ఆదివారాలు ఇక్కడే గడిపే వాడిని. కళలు, సంస్కృతి, రచనలకు బెజవాడ ఎంతో పేరుగాంచింది. అయితే ఇప్పుడు నేను ఊహించిన విధంగా బెజవాడ లేదు. ఇందుకు నేను విచారిస్తున్నా. మరోసారి జూలు విదిల్చి చైతన్యం చూపాల్సిన సమయం ఆసన్నమైంది. నా ఉన్నతికి కారణమైన ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ మరువను. -
న్యాయవ్యవస్థకూ పరిమితులున్నాయి
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్ సినిమా ఫేం జస్టిస్ కె.చంద్రు తెలిపారు. తనకున్న పరిమితులను న్యాయమూర్తులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజానికి మంచి న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ (ఏపీసీఎల్ఏ)–కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ కె.చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులతో పాటు తన అనుభవాలను కొన్నిటిని వివరించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ కొన్ని సందర్భాలను దాన్లో ప్రస్తావించానని తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్ కార్పస్ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చునని ఈ సందర్భంగా చెప్పారాయన. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్ చంద్రు అభిప్రాయపడ్డారు. ‘‘నేను కోరుకునేది ఒక్కటే. మానవ హక్కుల పరిరక్షణ. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చు’’ అన్నారాయన. అంతకు ముందు ఏపీసీఎల్ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్ కుమార్ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు. లాయర్లు హక్కుల కోసం పనిచేయాలి... అనంతరం విజయవాడ సివిల్ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ)లో ‘మానవ హక్కులు– న్యాయవాదుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్ చంద్రు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరో అతిథి హైకోర్టు డిజిగ్నేటడ్ సీనియర్ అడ్వకేట్ వేములపాటి పట్టాభి మాట్లాడుతూ ఎన్నో కేసులలో తీర్పులతో పాటు గతంలో వాదించిన ఎన్నో కేసులతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జస్టిస్ చంద్రూని రోల్ మోడల్గా తీసుకుని యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలని సూచించారు. విశ్రాంత అదనపు జిల్లా జడ్జి ఎ.పార్థసారథి, ఏపీ ఏజీ ఎస్.శ్రీరామ్, బీబీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పి.రామకృష్ణ, బి.రవి మాట్లాడారు. -
సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికీ న్యాయమూ ర్తులను కించప రుస్తూ పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐకి తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువు నిస్తున్నట్లు తెలిపింది. తద్వారా దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని రుజువు చేసుకోవాలని సీబీఐకి స్పష్టం చేసింది. లేని పక్షంలో సీబీఐ ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేకపోతోందని పేర్కొంటూ, దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తామని మౌఖికంగా చెప్పింది. ఈ మొత్తం కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరుతామంది. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయనున్నారో తెలియ చేస్తూ ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్ను ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతేడాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చానెల్ను బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు.. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు విని పిస్తూ.. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానెల్ను బ్లాక్ చేయడంతో పాటు అతడి పోస్టులను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్ల నుంచి తొలగిం చారని తెలిపారు. యూట్యూబ్ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారు. ఫేస్బుక్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్ వాదనలు వినిపిస్తూ.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ద్వారా వీడియోలను వీక్షిస్తున్నారని.. ఇలా చేయ డం చట్టవిరుద్ధమని తెలిపారు. యూఆర్ఎల్ వివరాలు ఇస్తే 36 గంటల్లో పోస్టులను తొలగిస్తామ న్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు నమోదు చేసిన వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ కంపెనీలపై ఉందం ది. సీబీఐ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్ వాదనలు వినిపిస్తూ.. వీడియోల తొలగిం పునకు గూగుల్కు లేఖ రాశామన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. అతడి అరెస్ట్ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ సాయం కూడా తీసుకుం టున్నామన్నారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తాము ఏమీ చేయడం లేదనడం ఎంత మాత్రం సరికాదన్నారు. -
మౌఖిక ఆదేశాలొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేసుల విచారణ సందర్భాల్లో న్యాయమూర్తులు.. మౌఖిక ఆదేశాలు ఇచ్చే సంస్కృతికి చరమగీతం పాడాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచనచేసింది. ధర్మాసనాల అభిప్రాయాలు కేవలం తీర్పులు, ఉత్తర్వుల ద్వారా వ్యక్తంకావాలని, అప్పుడే జ్యుడీషియల్ రికార్డుల్లో ఆ అభిప్రాయాలు నమోదవుతాయని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. మౌఖిక ఆదేశాలు లెక్కలు మిక్కిలి పెరిగితే న్యాయవ్యవస్థ జవాబుదారీ తనంలోని మూలసూత్రాన్ని కోల్పోతామని, ఇలాంటి పద్ధతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం వ్యాఖ్యానించింది. చీటింగ్, నమ్మకద్రోహం చేశానంటూ తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ గుజరాత్కు చెందిన సలీమ్భాయ్ హమీద్భాయ్ మీనన్ గుజరాత్ హైకోర్టును గతంలో ఆశ్రయించారు. ఈ విషయం హైకోర్టులో పెండింగ్లో ఉండగానే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకూడదంటూ గుజరాత్ హైకోర్టు మౌఖిక ఆదేశాలిచ్చింది. రాష్ట్ర హైకోర్టు మౌఖిక ఆదేశాలివ్వడాన్ని తప్పుబడుతూ సుప్రీం బెంచ్ ఈ సూచనలు చేసింది. ‘రాతపూర్వక ఆదేశాలు మాత్రమే కార్యశీలకమైనవి. అరెస్ట్ చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఇచ్చిన మౌఖిక ఆదేశాలు జ్యుడీషియల్ రికార్డులో భాగం కాబోవు. ఈ పద్ధతిని త్యజించండి. ధర్మాసనం తమ అభిప్రాయాలను తీర్పులు, ఉత్తర్వుల ద్వారానే వ్యక్తపరచాలి. మౌఖిక ఆదేశాలపై న్యాయవ్యవస్థలో విస్తృత చర్చ జరగాల్సి ఉంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. మౌఖిక ఆదేశాలతో అరెస్ట్ను అడ్డుకోవడం సక్రమ పద్ధతికాదని జడ్జీలు అన్నారు. ‘కేసులోని ఇరు పక్షాలు కోర్టు బయట సెటిల్ చేసుకునే అవకాశం కల్పించేందుకు నిందితుడి తరఫు లాయర్లకు మౌఖిక ఆదేశాలు ఇవ్వవచ్చు. అరెస్ట్ నుంచి నిందితుడికి తాత్కాలిక రక్షణగా ఆ ఆదేశాలు ఉపయోగపడాలంటే జడ్జీలు ఉత్తర్వులు ఇవ్వడం తప్పనిసరి. హైకోర్టు నుంచి సంబంధిత ఉత్వర్వు అందకుంటే అరెస్ట్ను పోలీసు అధికారి సైతం ఆపలేడు. అయినా, తీర్పు అనేది నిందితులు, బాధితుల వ్యక్తిగత విషయం కాదు. దేశంలో శాంతిభద్రతలతో ముడిపడిన అంశం. ఎవరి నడతపైనైనా అభిప్రాయాలు వ్యక్తంచేసే జడ్జీలు, ప్రభుత్వాధికారులు తమ నడవడికనూ ఒకసారి ఆత్మశోధన చేసుకోవాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆశారాంకు జైల్లోనే చికిత్స లైంగిక వేధింపుల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురు ఆశారాం బాపూకి జైల్లోనే ఆయుర్వేద చికిత్స అందిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స తీసుకోవడం కోసం రెండు నెలలు శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆశారాం బాపూ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. అతను చేసిన నేరం సాధారణమైనది కాదని, శిక్షను సస్పెండ్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఆశారాం బాపూకి అవసరమైన చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం దృష్టికి తెచ్చింది. దీనిపై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన సుప్రీం బెంచ్ స్పందించింది. ‘‘ఆశారాం బాపూ చేసిన నేరం సాధారణమైనది కాదు. జైల్లోనే మీకు కావల్సిన చికిత్స లభిస్తుంది. అంతేకానీ శిక్షను కొంతకాలమైనా సస్సెండ్ చేయడం కుదరదు’’ అని చెప్పింది. ఆశారాం బాపూ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంత్ వాదిస్తూ అనారోగ్య సమస్యలన్నింటీకి సంపూర్ణమైన చికిత్స అందించడానికి రెండు నెలల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరినప్పటికీ అందుకు సుప్రీం నిరాకరించింది. -
న్యాయమూర్తులు ఆదర్శప్రాయమైన జీవితం గడపాలి
గుంటూరు ఎడ్యుకేషన్: న్యాయమూర్తులు విధి నిర్వహణలో నీతి, నిజాయితీతో పని చేసి ఆదర్శప్రాయ జీవితాన్ని గడపాలని ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. గుంటూరులో వైఎస్సార్ ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ జి.శాంతమూర్తి అధ్యక్షతన ‘సుపరిపాలన సాధనలో న్యాయ వ్యవస్థ పాత్ర’ అంశంపై శనివారం ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు రాజ్యాంగానికి మూల స్తంభాలని, వాటి మధ్య ఘర్షణ ఉండకూడదన్నారు. ఎవరో ఒక వ్యక్తి అవినీతిపరుడు అయినంత మాత్రాన వ్యవస్థ ఎప్పటికీ కళంకం కాదన్నారు. పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. ప్రజలచే ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రి వ్యవస్థలో చోటు చేసుకుంటున్న లోపాలపై ఆధారాలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. -
తీవ్రమైన ఆ ఆరోపణలపై విచారణ జరగాలి
(ప్రవీణ్కుమార్ లెంకల) సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా విధులు నిర్వర్తించే ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలతో కూడిన లేఖ రాసినప్పుడు.. దానిపై విచారణ జరగాలని, ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలి పేర్కొన్నారు. ఆరోపణలపై తగిన విచారణ జరగాల్సి ఉందని, గౌరవ ప్రధాన న్యాయమూర్తి దీనిపై మౌనంగా ఉంటారని తాను భావించడం లేదన్నారు. ఆయన నిర్ణయానికి దీనిని వదిలిపెట్టాలని అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రశ్న: మీరు న్యాయ వ్యవస్థలో పారదర్శకత, జవాబు దారీతనం గురించి ఇటీవల మాట్లాడారు. అమరావతి భూ కుంభకోణంలో ఆరోపణలకు సంబంధించి తాజా పరిణామాలను మీరు ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి: న్యాయ వ్యవస్థలో పారదర్శకత చాలా ముఖ్యం. నేను ఈ వ్యవహారంపై నిన్న (మంగళవారం)నే ఒక టీవీ చానల్ చర్చలో మాట్లాడాను. నా అభిప్రాయం అదే. సుప్రీంకోర్టు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ముఖ్యమంత్రి స్వయంగా రాజ్యాంగ విధులు నిర్వర్తించే వ్యక్తి. రాష్ట్రంలో అత్యున్నత కార్యనిర్వాహక హోదా కలిగిన వ్యక్తి. అలాంటి ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి కాగలిగిన సీనియర్ న్యాయమూర్తిపై పలు ఆరోపణలతో కూడిన లేఖను చీఫ్ జస్టిస్కు రాశారు. రాష్ట్ర హైకోర్టు న్యాయ పాలనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి గల రాజకీయ విరోధులకు ప్రయోజనం చేకూర్చేలా ఒక ప్రణాళికతో ఆ న్యాయమూర్తి వ్యవహరించారని, అపవిత్రమైన భూ వ్యవహారాల్లో కుమ్మక్కయ్యారని ఆరోపణలు చేశారు. ఇది తీవ్రమైన ఆరోపణ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారని నేను అనుకోను. ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎలాంటి విచారణ ఉంటుందో, ఏ చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. ఈ మొత్తం వ్యవహారంపై ఆయన మౌనంగా ఉండలేరు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారం. ఆరోపణలపై తగిన రీతిలో దర్యాప్తు జరపాలి. నాకు అర్థమైనంత వరకు.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుమార్తెలు ఈ వ్యవహారంలో ఉన్నందున ఆరోపణలపై దర్యాప్తు జరగాలి. ప్రశ్న : ప్రభావవంతమైన వ్యక్తులపై ఆరోపణలు ఉన్నప్పుడు దర్యాప్తు ఆపాలా? జస్టిస్ ఏకే గంగూలి : విచారణ ఎలా జరగాలి? ఎవరు జరపాలి? అన్న అంశాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించాల్సి ఉంటుంది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విస్మరించరని నా అభిప్రాయం. ప్రశ్న : హైకోర్టు మీడియాపై గాగ్ ఆర్డర్ జారీ చేయడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : గ్యాగ్ ఆర్డర్ జారీ చేయకూడదు. ఆరోపణలపై ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది. న్యాయస్థానం పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. సిట్టింగ్ న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సాధారణ ప్రజలకు తెలుసుకునే అవసరం ఉంది. న్యాయమూర్తులు ప్రజాస్వామ్యంలో సభ్యులు. ప్రశ్న : తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ముఖ్యమంత్రి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడాన్ని, దానిని ప్రజల ముందు పెట్టడాన్ని ఎలా చూస్తారు? జస్టిస్ ఏకే గంగూలి : ఇలా ఆరోపణలు చేసిన సంఘటన ఇంతకుముందు ఎన్నడూ జరగలేదు. నేను ఎప్పుడూ చూడలేదు. అదే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారు. ప్రశ్న : భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వ్యవహారంలో ఎలాంటి చర్య తీసుకునే అవకాశం ఉంది? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని ఊహించలేను. ఈ దేశ పౌరుడిగా, మాజీ న్యాయమూర్తిగా నేను ఏం ఆశించగలనంటే.. చీఫ్ జస్టిస్ దీనిని పక్కన పెట్టేస్తారని అనుకోవడం లేదు. సాధారణ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా న్యాయమూర్తులు పని చేయాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థ సక్రమంగా నడిచేలా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రశ్న : రాజ్యాంగాన్ని అనుసరించి ఎలాంటి విచారణ ఉండాలి? అది ఏ స్థాయిలో ఉండాలి? జస్టిస్ ఏకే గంగూలి : నేను దానిని చెప్పలేను. రాజ్యాంగ బద్ధంగా వ్యవస్థ నడిచేందుకు ప్రధాన న్యాయమూర్తి తగిన చర్యలు తీసుకుంటారు. విచారణ ఎలా ఉండాలని గానీ, ఉంటుందని గానీ నేను ఇండికేట్ చేయదలుచుకోలేదు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి విచక్షణ అది. ఆయన నిర్ణయానికి వదిలిపెట్టాలి. ప్రశ్న : గతంలో ఇలాంటి æఫిర్యాదులు వచ్చాయా? వస్తే ఎలాంటి విచారణ జరిగింది? జస్టిస్ ఏకే గంగూలి : సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇలాంటి ఫిర్యాదులు రావడం నా దృష్టిలో లేదు. అయితే ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు వచ్చినప్పుడు సిట్టింగ్ న్యాయమూర్తులతో కూడిన కమిటీ విచారణ జరిపింది. కానీ అది ఇలాంటి ఆరోపణ కాదు. -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైనది
-
‘హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ఆయన రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. న్యాయ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాతంతో ఉందని, ఈ ధోరణి వెంటనే మానుకోవాలని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటోందని సభలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని, హైకోర్టు అసాధారణంగా వ్యవహరిస్తోందని, మీడియా, సోషల్ మీడియాపై నిషేధం విధించిందని సభలో ప్రస్తావించారు. (బల్లి దుర్గాప్రసాద్కు వైఎస్సార్ సీపీ ఎంపీల నివాళి) మాజీ అడ్వకేట్ జనరల్పై నమోదైన ఎఫ్ఐఆర్ను రిపోర్టు చేయవద్దని నిషేధం విధించిందని ఎంపీ విజయసాయిరెడ్డి వివరించారు. ఈ చర్యలను సమర్ధించుకునే ఏ ఆధారమూ లేదని, ఈ రకమైన సెన్సార్షిప్ అసాధారణమైందని తెలిపారు. బ్రిటిష్ తరహాలో వ్యవహరిస్తూ.. దీనికి సంబంధించిన మరో కేసు పైన కూడా స్టే విధించారని, గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. మీడియా కవరేజ్, పబ్లిక్ స్క్రూటినీ లేకుండా తప్పించుకోవాలని చూస్తున్నారని తెలిపారు. జ్యుడీషియల్ నుంచి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ కరోనా నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు. (కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ విషెస్) ప్రత్యేక రైళ్లు నడపండి.. అదే విధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపాలని ఎంపీ విజయసాయిరెడ్డి రైల్వే మంత్రి పియూష్ గోయల్కు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో స్పెషల్ మెన్షనింగ్ ద్వారా ఎంపీ కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. వలస కార్మికులు, ప్రయాణికులకు ఉన్న రైళ్లు సరిపోవడం లేదన్నారు. కొత్తగా 80 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినా, అందులో హైదరాబాద్-విశాఖపట్నం, హైదరాబాద్-తిరుపతి మధ్య ఒక్క రైలు కూడా లేదని రైల్వే మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య అత్యధికంగా రాక పోకలు కొనసాగే మార్గాలివేనని తెలిపారు. ప్రత్యేక రైళ్లను వెంటనే ప్రవేశపెట్టి సహకరించాలని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. (ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు) -
హక్కుల కాలరాతే!
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి వరసలో ఉన్న ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినట్టు కేసు నమోదు కావడమా? భారత న్యాయ వ్యవస్థ ఎక్కడకు వెళ్తోంది? – వినోద్ కె.జోస్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ద కారవాన్ సాక్షి, అమరావతి: అమరావతిలో భూ కుంభకోణంపై రాష్ట్ర ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించకూడదన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయిలో విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు మొత్తం 13మందిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఈ కేసులో హైకోర్టు తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. దేశంలోని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, పాత్రికేయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాల నేతలు హైకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని కుండబద్దలు కొట్టారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని పేర్కొంటూనే.. ఈ ఉత్తర్వులు దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీరిలో దేశంలోనే ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు, న్యాయవాది ప్రశాంత్ భూషణ్తోపాటు జాతీయ స్థాయి ప్రముఖ పాత్రికేయులు రాజ్దీప్ సర్దేశాయి, రాహుల్ శివశంకర్, సిద్ధార్థ్ వరదరాజన్, ఉమా సుధీర్, శ్రీరాం కర్రి, ధన్యా రాజేంద్రన్ తదితరులు ఉన్నారు. వారి స్పందనలు ఇలా ఉన్నాయి. ఆశ్చర్యం.. మీడియాను నియంత్రిస్తూ ఉత్తర్వులా? ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ కుమార్తెలు ఇన్సై డర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని కేసు నమోదైంది. దాంతో ఆ మాజీ అడ్వకేట్ జనరల్ ఆ విషయాన్ని మీడియా ప్రచురించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్చర్యం.. హైకోర్టు ఆ పిటీషన్ విచారించింది. మరింత ఆశ్చర్యం.. వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి. వాళ్లు మీడియాను నియంత్రిస్తారా? – ధన్యా రాజేంద్రన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద న్యూస్ మినిట్ అసాధారణ తీర్పు ఈ తీర్పు అసాధారణం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుమార్తెల భూ కొనుగోళ్ల కుంభకోణంపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం అసాధారణం. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు, బలవంతులు అన్నింటి నుంచి బయట పడతారు. – రాహుల్ శివశంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్, టైమ్స్ గ్రూప్ ఈ ఉత్తర్వులు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయేమో న్యాయస్థానం ఉత్తర్వులను పాటించాల్సిందే. కానీ ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ మూర్తి కుమార్తెలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ను ప్రచురించొద్దన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయోనన్నది విస్మయ పరుస్తోంది. – ఉమా సుధీర్, ఎన్డీటీవీ ప్రజల్లో సందేహాలకు తావిచ్చేట్టుగా ఉంది దేశంలో న్యాయ వ్యవస్థలోని ప్రముఖుల బంధువులపై ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదని ఏపీ హైకోర్టు ఉత్వర్వులు ఇవ్వడం సాధారణ ప్రజలకు పలు సందేహాలు కలిగేందుకు అవకాశం ఇస్తోంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ప్రజాస్వామ్యంలోని నాలుగో స్తంభమైన మీడియా హక్కులను కాలరాసేట్టుగా ఉంది. పత్రికా స్వేచ్ఛపై ఉన్నత న్యాయ వ్యవస్థ ఆంక్షలు విధించడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను బలహీన పరుస్తుంది. ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులను పునఃసమీక్షించాల్సిందిగా కోరుతున్నాం.– కె.శ్రీనివాసరెడ్డి, బల్విందర్ సింగ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించనున్నా రన్నది ముందే తెలుసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిన ఆరోపణలపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వివరాలను మీడియా ప్రచురించొద్దని న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ కేసులో దర్యాప్తు నిలిపివేయాలని కూడా చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి స్థానం లేదు. – సునీల్జైన్, మేనేజింగ్ ఎడిటర్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ఏపీ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగం కల్పించిన వాక్, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నాయి.– ప్రముఖ వార్తా సంస్థ ‘ద వైర్’ కథనం ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టిన వారే అధికారం చలాయిస్తున్నారు ఏపీ భూ కుంభకోణాల ఎఫ్ఐఆర్కు నివాళి. ఈ ఎఫ్ఐఆర్ కొద్ది సేపే జీవించినా సరే ఉపయుక్తకరంగా జీవించింది. రోజూ వేలాది ఎఫ్ఐఆర్లు నమోదు అవుతాయి. కానీ ఈ ఎఫ్ఐఆర్ను తొక్కిపెట్టేశారు. మీడియాలో రిపోర్ట్ చేయనివ్వలేదు. దానిపై దర్యాప్తును అడ్డుకున్నారు. దేనిపై ఎప్పుడు ఎలా దర్యాప్తు చేయాలన్నది నిర్ణయిస్తున్న వారే భారతదేశంలో అసలైన అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. – సిద్ధార్థ్ వరద రాజన్, ఎడిటర్ ఇన్ చీఫ్, ద వైర్ ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంది? ఏసీబీ ఎఫ్ఐఆర్ను మీడియా ప్రచురించకూడదనే ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? కోర్టులంటే గౌరవం ఉంది. కానీ మీడియాపై ఆంక్షలు విధిస్తే ఎలా? అలా అయితే ఉన్నత స్థానాల్లో ఉన్న వారు చేసిన అవినీతిపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చేపట్టిన చర్యలు ప్రజలకు ఎలా తెలుస్తాయి? ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం ఏముంది? – శ్రీరాం కర్రి, రెసిడెంట్ ఎడిటర్, దక్కన్ క్రానికల్ హైకోర్టు ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ అడ్వొకేట్ జనరల్, ఇతర ముఖ్య వ్యక్తులపై ఎఫ్ఐఆర్లో పేర్కొన్న వాస్తవాలను మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం చేయకుండా హైకోర్టు జారీచేసిన ‘నిషేధిత’ ఉత్తర్వు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించే ఆర్టికల్ 19కు, సమాచార హక్కు చట్టానికి విరుద్ధం. హైకోర్టు ఉత్తర్వు సరైన పద్ధతిలో లేదు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛను హరించి వేయడమే. ప్రజలు సమాచారం తెలుసుకోకుండా చేయడం కూడా. ఇది రూమర్లకు దారి తీస్తుంది. – ప్రశాంత్ భూషణ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అయితే ప్రచురించకూడదా? సామాన్యులపై ఎఫ్ఐఆర్ నమోదైతే ఎక్కడలేని హడావుడి చేసి తీవ్ర స్థాయిలో విరుచుకుపడొచ్చు. అదే ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదైతే మాత్రం వాటిని మీడియా ప్రచురించకూడదని ఉత్తర్వులు వస్తాయి. ఈ విషయం ఆశ్చర్యానికి గురిచేసింది.– రాజ్దీప్ సర్దేశాయి, కన్సల్టింగ్ ఎడిటర్, ఇండియా టుడే గ్రూప్ -
చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకు?
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో వేగవంతమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని తీసుకోని.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కొనసాగించాలని చంద్రబాబుకు అంత ఆత్రం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించారని.. కానీ కొందరు చట్టాల్లోని లోసుగులను అడ్డం పెట్టుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన, ప్రజల ప్రాణాలు, పర్యావరణ హక్కులకు భారీగా నష్టం జరిగిన కోర్టులు జోక్యం చేసుకోవచ్చని అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్న కొందరు న్యాయమూర్తులను గతంలో సుప్రీం కోర్టు మందలించిందని గుర్తుచేశారు. శాసన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ చొరబాటుపై చర్చ జరుగుతుందన్నారు. వైజాగ్ వెళ్తానని అనుమతి తీసుకున్న చంద్రబాబు నాయుడు.. మహానాడు అయిపోగానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారని విమర్శించారు. -
ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారు
-
న్యాయవ్యవస్థ కృషి అమోఘం
న్యూఢిల్లీ: లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి ప్రసంగించారు. ‘లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించడంలో భారత సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చురుకైన, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసింది. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విశాఖ మార్గదర్శకాలు మొదలుకొని, సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ పోస్టుల్లో నియమించేందుకు ఉద్దేశించిన పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు వరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశాన్ని ప్రగతిశీల సామాజిక పరివర్తన దిశగా తీసుకెళ్తున్నాయి’అని పేర్కొన్నారు. ‘దేశంలో భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం హర్షణీయం. సామాన్యులకు న్యాయాన్ని సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సంస్కరణలను తెచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థ మరింత పటిష్టం చేశాయి. న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వివిధ లోపాలను గుర్తించి, సరిచేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన నిశ్శబ్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమతూకం సాధించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. సమాచార సాంకేతికాభివృద్ధి కారణంగా తలెత్తిన సమాచార పరిరక్షణ, గోప్యతా హక్కు వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు. ‘లింగపరమైన న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణపై సమకాలీన దృక్పథాలు, మారుతున్న ప్రపంచంలో రాజ్యాంగానికి గతిశీల వ్యాఖ్యానం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమన్వయం, నేటి ఇంటర్నెట్ యుగంలో గోప్యతా హక్కు రక్షణ అనే ఐదు వేర్వేరు అంశాలు ప్రపంచ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటిలోనూ లింగపరమైన న్యాయం అనే అంశమే ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రాధాన్యంగా ఉంది. పెరుగుతున్న ప్రజాకర్షక విధానాలపై గత దశాబ్దంలో రాజ్యాంగ విలువల ప్రాతిపదికన విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామం రాజ్యాంగాల మూలాలపై మరో చర్చకు తెరలేపింది’అని తెలిపారు. ప్రపంచవేగంగా, అనూహ్యంగా ఇటీవలి కాలంలో పరిణామం చెందుతూ వస్తోంది. దీనివల్ల న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తీర్పులను సత్వరం వెలువరించడంలో కోర్టులు చాలా ప్రగతిని సాధించాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే: సీజేఐ పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ‘పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే. పర్యావరణ అంశాలను జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అడ్డుకాజాలవు. భూమిపై మనిషి ఒక బీజంగా మాత్రమే కాదు, పరాన్నజీవిగా మారాడు. భూమికి ఇస్తున్న దానికంటే భూమి నుంచి మనిషి తీసుకునేదే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకే విధమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం’అని సీజేఐ తెలిపారు. ‘దేశంలోని 103 కోట్ల ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆకాంక్ష మేరకు తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో వివిధ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
భయాలున్నా స్వాగతించారు!
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఇచ్చిన క్లిష్ట తీర్పులపై భయాందోళనలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దేశ ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శనివారం దేశరాజధానిలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సులో ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’ అంశంపై ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయి. తీర్పు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలు ముందుగా వ్యక్తమయ్యాయి. వాటిని పట్టించుకోకుండా దేశంలోని వంద కోట్ల మంది ప్రజలు న్యాయస్థానం తీర్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు’ అని అన్నారు. ఎంతో సున్నితమైన ‘అయోధ్య’, ‘ట్రిపుల్ తలాక్’ కేసు సహా వివిధ అంశాలపై ఇటీవలి కాలంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లింగ సమానత్వం లేకుండా ఏ దేశం, ఏ సమాజం కూడా పరిపూర్ణంగా అభివృద్ధి చెందజాలవన్నారు. తమ ప్రభుత్వం సైన్యంలో మహిళలకు సమాన అవకాశాలను కల్పించేందుకు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య సమతూకం ఉండేలా దేశ న్యాయవ్యవస్థ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ‘ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేథ, ఇంటర్నెట్ వంటి వాటిని ప్రజలందరికీ మరింత వేగంగా న్యాయం అందించేందుకు ఉపయోగించుకోవాలి. మారుతున్న కాలంలో సమాచార పరిరక్షణ, సైబర్ నేరాలు న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. రాజ్యాంగానికి మూడు ప్రధానాంగాలైన న్యాయ, శాసనసభ కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిలో పనిచేస్తూ దేశం ఎదుర్కొన్న ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించాయి. ఇలాంటి సత్సంప్రదాయాన్ని నెలకొల్పుకున్నందుకు మనం గర్వపడాలి’ అని ప్రధాని చెప్పారు. పనికిరాని చట్టాలను రద్దు చేయడంతో పాటు సమాజ వికాసానికి అవసరమైన చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. ఈ కోర్టుల విధానం ద్వారా అన్ని కోర్టులను అనుసంధానించేందుకు, కోర్టు ప్రక్రియను సరళతరం చేసేందుకు నేషనల్ జ్యుడిషియర్ డేటాను నెలకొల్పుతామన్నారు. ఈ ప్రపంచ స్థాయి సదస్సులో 20కి పైగా దేశాల జడ్జీలు హాజరయ్యారు. సదస్సులో సీజేఐ జస్టిస్ బాబ్డే, సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్రం మంత్రి రవిశంకర్æ, అటార్నీజనరల్ వేణుగోపాల్ తదితరులు ప్రసంగించారు. మన న్యాయవ్యవస్థకు 2వేల ఏళ్ల చరిత్ర: సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే మాట్లాడుతూ..‘మొఘల్, డచ్, పోర్చుగీస్, ఇంగ్లిష్ సంస్కృతుల సమ్మేళనమే భారత్ అని పేర్కొన్నారు. దేశంలో సాధారణ న్యాయ వ్యవస్థ 2 వేల ఏళ్లపాటు పరిణామం చెందుతూ వచ్చింది. ఏళ్ల క్రితమే వ్యవస్థీకృతమైన చట్టాలు, న్యాయవ్యవస్థ ఉండేవి. న్యాయాధికారుల సమక్షంలో బహిరంగంగానే విచారణ జరిగేది’అని తెలిపారు. అప్పట్లోని పరిస్థితులను సీజేఐ ప్రస్తావిస్తూ..ఒక వ్యక్తి దోషిత్వం నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేని సందర్భాల్లో ‘కోడి కాలేయం’ పరీక్ష ద్వారా నిర్ధారించేవారు. తీర్పునిచ్చే గ్రామ పెద్ద.. కోడి కాలేయాన్ని బయటకు తీసి, పరీక్షించేవాడు. దానిని బట్టి అప్పటికప్పుడు దోషి ఎవరనేది ధ్రువీకరించే సంప్రదాయం ఈశాన్య రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఉండేది. అలాగే, ఎవరైనా వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పులి దంతాన్ని పట్టుకునే రివాజు ఉండేది. ఇలాంటివి మన సంప్రదాయాల్లో భిన్నత్వానికి ఉదాహరణలు’ అని తెలిపారు. ‘పెరుగుతున్న సాంకేతికత ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. ఫలితంగా నిర్ణయాల ప్రభావం సంబంధిత న్యాయస్థానం పరిధికి వెలుపలా ఉంటోంది’ అని అన్నారు. చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టాలి జస్టిస్ లావు నాగేశ్వరరావు చట్టాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టేలా పరిణామం చెందుతూ ఉండాలని సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. సదస్సులో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ‘చట్టాలు పరిణామం చెందడం అతి ముఖ్యమైన అంశం. దేశ ప్రగతి, సామాజిక పరిస్థితులను ఈ చట్టాలు ప్రతిబింబింపజేస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు పరిణామం చెందనిపక్షంలో అది అన్యాయానికి దారితీస్తుంది’ అని ఆయన అన్నారు. ‘సమాజం, చట్టం మధ్య వారధిలా న్యాయమూర్తి పాత్ర ఉండాలి. వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా న్యాయస్థానాలు చట్టాలకు భాష్యాన్ని చెప్పాలి. ఇలాంటి సందర్భాల్లో న్యాయస్థానాలు జాగ్రత్త వహించాలి. ఇలాంటి సందర్భాల్లో రాజ్యాంగ లక్ష్యాలు, ఉద్దేశాలు ఓడిపోకూడదు..’ అని పేర్కొన్నారు. డెబ్బై ఏళ్లుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నిష్పాక్షికంగా, స్వతంత్రంగా న్యాయం వైపు నిలబడ్డారని పేర్కొన్నారు. ఆన్లైన్ డేటాకూ రక్షణ ఉండాలి వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. దీని వల్ల ఫోన్ సంభాషణలేకాదు, ఆన్లైన్ డేటాకు రక్షణ కల్పించాలి. జాతి అభివృద్ధి, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టాలు మారాలి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న వివిధ న్యాయరీతులను అర్థం చేసుకుని, పాటించడం ద్వారా న్యాయ సమస్యలను మరింత సమర్థంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఎంతో కీలకమైన ప్రాథమిక విలువలు, లక్ష్యాలను సాధించేలా జడ్జీలు తీర్పులిచ్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. గత 70 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు, చట్ట పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు జడ్జీలిచ్చిన తీర్పులే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడాయి. జనాకర్షక నిర్ణయాలతో రాజ్యాంగ హక్కులు ప్రభావితం జస్టిస్ ఎన్.వి.రమణ జనాకర్షక నిర్ణయాలు రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేస్తాయని, న్యాయస్థానాలు ఈ సందర్భంలో సముచిత నిర్ణయం తీసుకుంటూ రాజ్యాంగ విలువలు కాపాడాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఈ భూమిపై శాంతి ఉండాలంటే మన జాతి, మన తెగ, మన తరగతి, మన దేశం వంటి వాటిపై మన విధేయతను అధిగమించాలని, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉండాలని మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన సూక్తిని జస్టిస్ రమణ ఉటంకించారు. ‘మహిళలు ప్రపంచ జనాభాలో సగం ఉన్నారు. మొత్తం ప్రపంచ పనిగంటల్లో మూడింట రెండో వంతు వారిదే. ప్రపంచ ఆదాయంలో పదో వంతు పొందుతారు. కానీ ప్రపంచ సంపదలో 0.01 శాతం కంటే తక్కువ సంపదను వారు కలిగి ఉన్నారు. చాలా దేశాలు తమ రాజ్యాంగం ద్వారా గానీ, మరో విధానంలో గానీ లింగ సమానత్వాన్ని, మహిళల గౌరవాన్ని గుర్తించాలి. నిత్యం వివక్షకు గురవుతున్న మహిళల అభ్యున్నతిని.. చట్టంలో ఉన్నతమైన ప్రకటనలు చేయడం వల్ల ఉద్దరించలేమని మనం అందరం గ్రహించాం. లింగ సమానత్వాన్ని కాపాడేందుకు న్యాయ వ్యవస్థకు తగినతం అవకాశాలు ఉన్నాయి. అందువల్ల లింగ సమానత్వం కాపాడడంలో ఎలాంటి రాజీ ఉండరాదని మనం గ్రహించాలి..’ అని పేర్కొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణకు మనం తీసుకునే చర్యలు కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్తు తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించే గొప్ప పనిగా మనం గ్రహించాలి’ అని అన్నారు. అంతర్జాతీయ సంస్థల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందుతు న్నందున ఈ టెక్నాలజీలో వ్యక్తమవుతున్న జాతీయ, అంతర్జాతీయ ఆందోళనలకు తగిన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారు. -
సిట్టింగ్ జడ్జిపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో అవినీతిని సహించేది లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చెప్పారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో ఓ ప్రైవేట్ మెడికల్ కళా శాల పట్ల ఉదారంగా వ్యవహరించిన కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాపై విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతించారు. శుక్లా తీరుపై మాజీ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా సూచన మేరకు ప్రాథమిక విచారణ జరిపామని, అవినీతిపై ఆధారాలు లభించాయని దర్యాప్తు సంస్థ పేర్కొంది. శుక్లాపై ఉన్న అవినీతి ఆరోపణలు తీవ్రంగా పరిగణించాల్సి ఉందన్న కమిటీ నివేదిక ఆధారంగా గొగోయ్ విచారణకు అనుమతించారు. దర్యాప్తు జరిపేందుకు వీలుగా అనుమతి కోరుతూ ప్రాథమిక విచారణపై ఒక సంక్షిప్త నివేదికను కూడా సీబీఐ అందజేసింది.‘శుక్లా అవినీతి దర్యాప్తు అంశంపై మీ లేఖలో జోడించిన గమనికను పరిగణించడం జరిగింది. విచారణకు అనుమతి మంజూరు చేస్తున్నాం’అని గొగోయ్ చెప్పారు. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిపై కేసు నమోదు చేయడానికి అనుమతి ఇవ్వడం ఇదే మొదటిసారి. కొన్ని నెలల తరువాత జస్టిస్ శుక్లా కేసు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అప్పటిదాకా శుక్లాను న్యాయవ్యవస్థకు దూరంగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. -
పీపీఏలపై సమీక్ష అనవసరం
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)పై సమీక్ష అవసరం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. విద్యుత్ ధరలపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని ఒక రిసార్ట్లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. తమ హయాంలో విద్యుత్ ధరలు నిర్ణయించడంలో పెద్ద కుంభకోణం జరిగిందని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. సంప్రదాయేతర ఇంధనాన్ని ఐదు శాతానికి మించి తీసుకోకూడదని చెబుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అలాంటిదేమీ లేదన్నారు. కాలుష్యం తగ్గించేందుకే పునరుత్పాదక ఇంధనం వైపు వెళ్లామని, 2021 నాటికి సాంప్రదాయేతర ఇంధన వినియోగం 20 శాతానికి చేరాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించిందని తెలిపారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై సమస్యలు వస్తుండడంతో అన్ని దేశాలు సౌర, పవన విద్యుత్ వైపు వెళ్తున్నాయన్నారు. సాంప్రదాయేతర ఇంధనం వల్ల నష్టం లేదన్నారు. పవన్ విద్యుత్ ధరలపై తమిళనాడుతో పోల్చుతున్నారని, కానీ అక్కడ గాలి వేగం ఎక్కువగా ఉంటుందని అందుకే అక్కడ ధర తక్కువగా ఉందని చెప్పారు. గాలి వేగాన్ని బట్టి పవన్ విద్యుత్ ధరలను నిర్ణయిస్తారని తెలిపారు. సోలార్ విద్యుత్ను యూనిట్ రూ.6.90కు ఎక్కడా తీసుకోలేదన్నారు. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు తమ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎలాంటి క్విడ్ ప్రోకోలు లేవని చంద్రబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్కు రెండు పవర్ ప్లాంట్లు ఉన్నాయని, కర్ణాటకలో వాటికి లాభం చేకూర్చుకుని ఇక్కడ అవినీతి అంటూ హడావిడి చేస్తున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెబుతున్న జ్యుడీషియల్ కమిషన్ సాధ్యం కాదని తెలిపారు. హైకోర్టు నుంచి సిట్టింగ్ జడ్జి ఎలా వస్తారని, కార్యనిర్వాహక వ్యవస్థలో తాము జోక్యం చేసుకోమని న్యాయ వ్యవస్థ ఎప్పుడో చెప్పిందన్నారు. అయినా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు రిటైర్డ్ జడ్జి చైర్మన్గా ఉంటారని, వారి సిఫారసుల ప్రకారమే ధరలు నిర్ణయిస్తారన్నారు. పీపీఏల విషయంలో ప్రభుత్వం పాత్ర నామమాత్రమన్నారు. 221 పీపీఏల్లో ఎక్కువ ఐదుగురికే ఇచ్చామంటున్నారని ఇందులో తమ పాత్ర ఏదీ లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. తాము ఒప్పందాలు చేసుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి అంశంలోనూ తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సున్నా వడ్డీ రుణాలకు వైఎస్సార్ పేరు పెట్టి దాన్ని ఇప్పుడే తెచ్చినట్లు చెప్పారని, తాము చిల్లిగవ్వ దానికి ఇవ్వలేదని అసెంబ్లీలో సవాల్ విసిరారని, తాను రెడ్హ్యాండెడ్గా దానిపై వాస్తవాలు బయటపెడితే పారిపోయారని విమర్శించారు. -
న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు సహజమే!
సాక్షి, హైదరాబాద్: న్యాయవ్యవస్థకు ఆటుపోట్లు, సంక్షోభాలు కొత్త కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని, న్యాయవ్యవస్థ మరింత బలోపేతమైందని ఆయన తెలిపారు. మరింతగా ప్రజల విశ్వాసాన్ని చూరగొందన్నారు. పెత్తనం చెలాయించేందుకు కొందరు వ్యక్తులు న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్నారని, ఇటువంటి వాటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టు భవనం నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా హైకోర్టులో శనివారం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ ఎవరికీ భయపడ దని, విమర్శలను చూసి వెనుకడుగు వేయదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో న్యాయ మూర్తుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, ఈ ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. పోస్టుల భర్తీకి పేర్లను సిఫారసు చేయాలని హైకోర్టు కొలీజియంను కోరారు. హైకోర్టు కొలీజియం నుంచి సిఫారసులు వస్తే, వీలైనంత త్వరగా ఆ పేర్లకు ఆమోదముద్ర వేస్తామన్నారు. తాను హైకోర్టు నియామకాలను చూసే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున.. ఈ రెండు హైకోర్టుల్లో వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు చేయాల్సిందంతా చేస్తానని తెలిపారు. ఈ విషయంలో సీజేఐతో ప్రత్యేకంగా మాట్లాడ తానని భరోసా ఇచ్చారు. ఈ హైకోర్టు ఎంతోమంది దిగ్గజాలను న్యాయవ్యవస్థకు అందించిందన్నారు. తన వంటి న్యాయమూర్తులు ఎంతో మంది ఈ హైకోర్టు భవనం నీడలో ఎదిగారన్నారు. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణతోపాటు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రామయ్యగారి సుభాష్రెడ్డి ముఖ్య అతిథు లుగా హాజరయ్యారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్, ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్తోపాటుగా పలువురు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన విశ్రాంత న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హైకోర్టు గొప్ప అనుభూతినిచ్చింది ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ, 1983 నుంచి 2013లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు ఈ హైకోర్టు భనవంలో తన ప్రస్థానం కొనసాగిందన్నారు. ఎన్నో కొత్త విష యాలను ఈ హైకోర్టు తనకు నేర్పిందన్నారు. తన సీనియర్ అయ్యపురెడ్డి తనకు అవకాశం ఇవ్వడం వల్లే తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నానని జస్టిస్ రమణ తెలిపారు. ఆయనకు సదా రుణపడి ఉంటానన్నారు. ఈ హైకోర్టుతో తనకు భావోద్వేగ జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయని.. ఎన్నో గొప్ప అనుభూతులను ఈ హైకోర్టు మిగిల్చిందన్నారు. న్యాయవ్యవస్థకు ఎంతో మంది దిగ్గజాలను, ఉద్దం డులను, మేధావులను, నిపుణులను ఈ హైకోర్టు అందించిందని తెలిపారు. వారు న్యాయవ్యవస్థకు అందించిన సేవలను ఎప్పటికీ మర్చిపోకూ డదన్నారు. 14 మంది సుప్రీంకోర్టు జడ్జీలను, 16 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఈ హైకోర్టు అందించిందని ఆయన తెలిపారు. పెండింగ్ కేసులే సవాల్ న్యాయవ్యవస్థకు పెండింగ్ కేసుల సంఖ్య ఓ సవాలుగా మారిందన్నారు. దేశవ్యాప్తంగా కింది కోర్టుల్లో 2.84 కోట్ల పెండింగ్ కేసులున్నాయని, మిగిలిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కేసులు సత్వర విచారణకు నోచుకోక పోవడం వల్ల అండర్ట్రయిల్ ఖైదీలు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. తగినంత మంది న్యాయ మూర్తులు లేకపోవడం, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోవడం వంటి అనేక కారణాల వల్ల పెండింగ్ కేసుల సంఖ్య పెరి గిపోతోందన్నారు. జిల్లా కోర్టులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియో గించుకోలే కపోతున్నాయని, అనేక కోర్టులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. చెప్పలేని ఆనందమిది: జస్టిస్ లావు నాగేశ్వరరావు జస్టిస్ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూశతాబ్ది ఉత్స వాల సందర్భంగా తాను హైకోర్టు ప్రాం గణంలోకి అడుగుపెడుతుంటే చెప్పలేని ఆనందం కలుగు తోందన్నారు. అసలు ఈ వృత్తిలో కొన సాగాలా? వద్దా? అన్న అనిశ్చితిలో ఉన్నప్పుడు ఈ హైకోర్టులోని ఎంతోమంది మిత్రులు తనను ప్రోత్సహిం చా రని, సుప్రీంకోర్టుకు ప్రాక్టీస్ను మారుస్తు న్నప్పుడు కూడా అదే రకమైన ప్రోత్సాహం ఇచ్చారని తెలి పారు. సీనియర్ వై.సూర్యనారాయణ వల్లే తాను ఈ స్థానంలో ఉన్నానన్నారు. సహచర న్యాయవాదుల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పారు. ఈ హైకోర్టు భవనం ఎంతో మంది గొప్ప న్యా యమూర్తులను, న్యాయ వాదులను అందించింద న్నారు. ఇటువంటి ఈ భవనం వందేళ్ల కార్యక్ర మం లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్న సైన్యంతో పెద్ద యుద్ధం: ఏసీజే చౌహాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ స్వాగతోపన్యాసం చేస్తూ, అతి తక్కువ మంది సైన్యం (జడ్జీలు)తో గొప్ప యుద్ధం(కేసులతో) పోరాటం చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 1.93 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. 11 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారని ఆయన తెలి పారు. ప్రతి న్యాయమూర్తి 17,545 కేసుల అదనపు భారాన్ని మోస్తున్నారని వివరించారు. కింది కోర్టులో 5.22 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, కేవలం 350 మంది న్యాయాధికారులే పనిచేస్తున్నారని తెలిపారు. కుటుంబ కోర్టుల్లో 12,951 కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టుల్లో 3,322 కేసులు పెండింగ్లో ఉన్నాయని, సగటున ఒక్కో న్యాయాధికారి 1,500 కేసుల భారాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం 416 కోర్టుల్లో 80 కోర్టులు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. ఓ జట్టుగా అందరం కలిసి సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైకోర్టుల ముందున్న సవాళ్లును ఎదుర్కొనేం దుకు ప్రతీ హైకోర్టు కూడా 2030 విజన్ స్టేట్మెంట్ను సిద్ధం చేసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ వం దన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సి.దామోదర్రెడ్డి మాట్లాడారు. అనం తరం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులతో వెలుగులీనుతున్న హైకోర్టు భవనం ధనార్జన యంత్రాల్లా మారొద్దు న్యాయం ఉన్న చోట ప్రశాంతత ఉంటుందని భీష్మ పితామహుడు చెప్పారని, అందువల్ల న్యాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని జస్టిస్ రమణ అన్నారు. న్యాయపాలన ద్వారా ప్రజాస్వామ్య, రాజ్యాంగ లక్ష్యాలను సాధించాలని, ఇందులో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలన్నారు. న్యాయవ్యవస్థ ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, వీటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతే వ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడిన ట్టేనన్నారు. కేవలం ఆదాయాన్ని ఆర్జించే యంత్రాల్లా కాకుండా సమాజంలో అవసరమైన వారికి న్యాయ సాయం చేస్తూ, సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలని న్యాయవాదులకు సూచించారు. జడ్జీల సంఖ్యను 42కు పెంచాలి: జస్టిస్ సుభాష్రెడ్డి జస్టిస్ సుభాష్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇంత తక్కువ మంది జడ్జీలతో లక్షల్లో ఉన్న కేసులను విచారిం చడం చాలా కష్టమేనన్నారు. ఇరు హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏం చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుం టామన్నారు. న్యాయమూర్తులు ఎన్ని కేసులను పరిష్కరించామని కాకుండా, ఎంత నాణ్యతతో తీర్పులిచ్చామన్నదే చూడాలన్నారు. అప్పుడే ప్రజలకు న్యాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. న్యాయవాదులుగా తాము వాదనలు వినిపించిన సమయంలోని న్యాయమూర్తులం దరినీ (ఇప్పుడు రిటైర్డ్) ఈ కార్యక్రమంలో చూడటం ఆనందంగా ఉందన్నారు. -
హైకోర్టులో ఘనంగా శతాబ్ది ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, ఎల్ నాగేశ్వరరావులు హాజరయ్యారు. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్, ఇతర న్యాయ మూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. చారిత్రాత్మకమైన హైకోర్టు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ అన్నారు. హైకోర్టులాంటి అద్భుతమైన నిర్మాణంలో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టు క్యాంపస్ వాతావరణం న్యాయవాదులకు చాలా అనుకూలంగా ఉంది. వీలైనంత తొందరలో హైకోర్టు పెండింగ్ ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సామాన్యులకు న్యాయం అందేలా చూస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలలో త్వరలో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కోర్టులలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. 1 లక్ష 93 వేల కేసులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 1 లక్ష 73 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. పెండింగ్లో ఉన్న కేసులను న్యాయ పరంగా త్వరగా పరిష్కరించాలని సూచించారు. యువ న్యాయవాదులకు కేసుల్లో వాదనలు వినిపించేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. హైదరాబాద్ హైకోర్టుతో 31 సంవత్సరాల అనుభవం ఉందని జస్టీస్ ఎన్ వి రమణ అన్నారు. ఇది చాలా ఎమోషనల్ డే అని, తన సగం జీవితం ఈ కోర్టులోనే గడిచిందన్నారు. తన పుట్టినింటికి ఈరోజు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం కృషిచేస్తానని, హైకోర్టు ఇతర సమస్యలు సైతం త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. -
గొప్ప మానవతావాది పద్మనాభరెడ్డి
సాక్షి, హైదరాబాద్: నీతి, నిజాయితీ, విలువలకు తుదివరకు కట్టుబడి త్రికరణశుద్ధిగా న్యాయవాద వృత్తిని కొనసాగించిన అరుదైన అతికొద్దిమంది న్యాయవాదుల్లో చాగరి పద్మనాభరెడ్డి ఒకరు. ఉభయ రాష్ట్రాల్లో పద్మనాభరెడ్డి గురించి తెలిసిన ప్రతీఒక్కరూ చెప్పేమాట ఇదే. తాను నమ్మిన విలువలద్వారా ప్రజల హక్కుల్ని కాపాడిన గొప్ప మానవతావాది ఆయన. కేసుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం మొదలు ఆపన్నులకు ఉచిత న్యాయ సహాయం అందించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ఆయన్నుంచీ నేర్చుకోవాల్సిన సుగుణాలెన్నో ఉన్నాయని విశ్రాంత న్యాయమూర్తులు, ప్రస్తుత న్యాయమూర్తులు ముక్తకంఠంతో చెబుతారు. వామపక్షవాదిగా చివరివరకు ప్రజా ఉద్యమాలకు తన అండదండలు అందించారు. 2013, ఆగస్టు 4న ఆయన తుదిశ్వాసవిడిచారు. ఆయనకు గురువే దైవం.. అనంతపురంజిల్లా యాడికి గ్రామంలో 1931, మార్చి 18న మధ్యతరగతి కుటుంబంలో పద్మనాభరెడ్డి జన్మించారు. తండ్రి ఓబుల్రెడ్డి, తల్లి సోమక్క. 5వ తరగతి వరకు యాడికి వీధి బడిలో చదివారు. 6 నుంచి 8 తరగతుల్ని తాడిపత్రి మున్సిపల్ హైస్కూలులో చదివారు. గుత్తిలోని లండన్ మిషన్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. తరువాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి, అనంతపురం గవర్నమెంట్ కాలేజీలో బీఎస్సీ, మద్రాస్ వర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 1953లో మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రాక్టీస్ చేసి 1954లో గుంటూరు(ఆంధ్ర హైకోర్టు)లో, 1956లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రాక్టీస్ మార్చారు. ప్రముఖ న్యాయకోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఓ.చిన్నపరెడ్డిని ఆయన దైవంగా భావించారు. చిన్నపరెడ్డే తన గురువూ, మార్గదర్శకుడిగా చెప్పేవారు. తాను సాధించినదంతా చిన్నపరెడ్డి చలవేనని, ఆయన చూపిన ప్రేమాభిమానాల్ని ఎన్నటికీ మరిచిపోలేమని ఎంతో వినమ్రంగా చెప్పేవారు. సుదీర్ఘ ప్రస్థానం..: పద్మనాభరెడ్డిది న్యాయవాదిగా 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం. అంతకాలంపాటు ఆయన క్రిమినల్ లాయర్గా న్యాయవ్యవస్థకు సేవలందించారు. ఎంతోమంది న్యాయమూర్తులు తమ సందేహాలను ఆయనద్వారా నివృత్తి చేసుకునేవారు. హైకోర్టులో అరవై వేలకుపైగా కేసులు వాదించిన ఆయన.. ఫీజులతో నిమిత్తం లేకుండా కేసుల్ని వాదించేవారు. ఎన్నడూ ఫీజుకోసం అడిగింది లేదు. ఫీజు ఇవ్వలేని స్థితిలో ఉన్నవారు ఒకవేళ అప్పోసొప్పో చేసి ఫీజు తెచ్చి ఉంటే.. ఆ విషయాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ డబ్బును వారికే తిరిగిచ్చేవారు. ఒక్కోసారి చార్జీలకు సైతం ఆయన తన జేబులోనుంచి డబ్బుతీసి వారికిచ్చేవారని ఆయన్ను దగ్గరనుంచి చూసిన న్యాయవాదులు చెబుతుంటారు. ఎన్కౌంటర్ల సమయంలో ఎదురుకాల్పులు జరిగినప్పుడు, పోలీసుల కాల్పుల్లో ఎవరైనా చనిపోతే, అందుకు బాధ్యులైన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా? వద్దా? అన్న సందేహం హైకోర్టుకు వచ్చింది. సందేహనివృత్తికి వెంటనే హైకోర్టుకు గుర్తుకొచ్చేది పద్మనాభరెడ్డే. ఈ అంశంపై విచారణ జరిపిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కోర్టు సహాయకారి(అమికస్ క్యూరీ)గా పద్మనాభరెడ్డిని నియమించింది. ఆత్మరక్షణకోసం ఎదురుకాల్పులు జరిపామని పోలీసులు కోర్టులో నిరూపించుకోవాలని, కేసు నమోదు చేయకుండా పోలీసులే తీర్పునివ్వడం చట్టవ్యతిరేకమని ఆయన వాదించారు. ఆయన వాదనల్ని అంగీకరించిన ధర్మాసనం.. ఎన్కౌంటర్లలో అవతలి వ్యక్తులు మృతిచెందితే అందులో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలని సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అపార పరిజ్ఞానం ఆయన సొంతం తనకున్న అపార పరిజ్ఞానంతో కేసులో వైరుధ్యాలను, చట్టవ్యతిరేక అంశాలను, సాక్ష్యాలను, సహజ న్యాయశాస్త్ర ఉల్లంఘనలను పద్మనాభరెడ్డి సులభంగా ఎత్తిచూపేవారు. ఇంత పరిజ్ఞానము న్నా ఆయన అతి సాధారణ వ్యక్తిగానే చెలామణి అయ్యారు. ఎవరిపైనా కోపాన్ని ప్రదర్శించి ఎరుగరు. ఎవరు ఏ సలహా అడిగినా విసుగూ, విరా మం లేకుండా చెప్పడం ఆయనకే చెల్లింది. రాజకీయ విశ్వాసాలకు సంబంధించిన కేసుల్ని వాదిం చారంటూ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆయనకు వ్యతిరేకంగా నివేదికివ్వడంతో పద్మనాభరెడ్డి హైకోర్టు జడ్జి కాలేకపోయారు. కానీ ఆయన కుమారుడు జస్టిస్ ప్రవీణ్కుమార్ ఏపీ హైకోర్టు తొలి తాత్కాలిక సీజే గా నియమితులై చరిత్ర సృష్టించారు. -
సంస్కరణలకు తక్షణ తరుణం
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్సభ సభ్యులు 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంతవరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ‘భారత రాజ్యాం గంలో సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం మసకబారుతూ ఉండడంతో న్యాయస్థానం విశ్వసనీయత హరించుకుపోతుంది.’ – ఫ్రంట్లైన్, 25–5–2018 (హిందూ గ్రూపు) ‘భావితరాల కోసం న్యాయ వ్యవస్థ హోదాను సంరక్షించుకుని కాపాడుకోవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దృఢంగా, తగినంత స్వతంత్ర ప్రతిపత్తితో మెలగుతూ వర్తమాన సామాజిక సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలి. ఈ దేశంలో ఎవరికీ భద్రత లేదు. ఈ పరిస్థితులలో పరిపాలనలో ఉన్న స్త్రీపురుషులను అదుపాజ్ఞలలో పెట్టగల యంత్రాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే. పదవులలో ఉన్నవారిని అధికారం అవినీతి పాల్జేస్తుందని మానవచరిత్ర నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను దుర్వినియోగం చేస్తున్నాయి.’ – జస్టిస్ చలమేశ్వర్ (నాగ్పూర్ సభలో, 17–4–18) ఇటీవల దేశ పరిపాలన క్రమంలో గొలుసుకట్టుగా సాగిన పరిణామాలు గణతంత్ర రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకే ప్రమాదకరంగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు దారితీసిన పరిణామాలు నాలుగు: 1. ఒక వైద్య కళాశాల ప్రవేశాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఒకరికి సంబంధం ఉన్న అంశాన్ని పరిశీలించాలని ఒక ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సిద్ధపడలేదు. దీనితో పిటిషనర్ నుంచి మరో పిటిషన్ దాఖలైంది. ఈసారి జస్టిస్ దీపక్ మిశ్రా లేని ధర్మాసనానికి తన దరఖాస్తును నివేదించాలని పిటిషనర్ (ఎన్జీవో) కోరడం జరిగింది. ఆపై అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వేరే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 2. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం (న్యాయ పాలనా నిర్వహణ వ్యవస్థ) సిఫారసు చేయడం. 3. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా సొహ్రా బుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా ఆకస్మికంగా మరణించారు. ఈ కేసులో ఒక బీజేపీ ప్రముఖ నేత అభియోగాలను ఎదుర్కొంటున్నారు. లోయా మరణం గురించి న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు, లోయా తోబుట్టువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరినా సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి అంగీకరించక, కొట్టివేయడం జరిగింది. ఇంకొక అంశం– జస్టిస్ దీపక్ మిశ్రా మీద రాజ్యసభలో విపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఏకపక్షంగా తోసిపుచ్చడం. 4. సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లను సంబంధిత ధర్మాçసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి సోదర న్యాయమూర్తులతో సంప్రతించడం అనివార్యమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపైన న్యాయమూర్తులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇంత పెద్ద దేశాన్ని వారే శాసించాలా? కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పిం చింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్సభ సభ్యులే 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంత వరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ఏడు దశాబ్దాలుగా పాలకవర్గ ఆచరణ దీనిని నిరూపిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయస్థానాలు కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేవని (తొలి రెండు దశాబ్దాల నాటి భారత న్యాయమూర్తుల తీర్పులను మినహాయిస్తే) నేటి చరిత్ర మరింత స్ఫుటంగా హెచ్చరిస్తున్నది. అనేక సందర్భాలలో సాక్ష్యాలు ఉన్నా వాటిని ‘నిర్దిష్టంగా లేవు’ అన్న సాకుతో నీరుగారుస్తున్నారు. బీజేపీ హయాంలో 2002లో గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏదో ఒక పేరుతో దళితులు, మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో గానీ సాక్ష్యాలను, సాక్షులను మాయం చేస్తున్న ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1964లోనే (కొలీజియంకు మచ్చలేని రోజులు) అన్ని కేసులలోను అన్ని సాక్ష్యాలను నమ్మలేకపోయినా సాక్ష్యాన్ని పూర్తిగా విచారించి బేరీజు వేయడంలో న్యాయస్థానం జాగరూకతతో మెలగాలని ఒక తీర్పులో పేర్కొన్నది. ‘ఇచ్చిన సాక్ష్యంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నా, లేకపోయినా లేదా సాక్ష్యం సబబైనదేనని కోర్టుకు అనిపించినా లేదా సాక్ష్యం వల్ల బహిర్గతమై గాథ నిజమైనా లేకున్నా – ఇవన్నీ తప్పనిసరిగా గణనలోనికి తీసుకోవలసిందే. కానీ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలు సాక్షికమైనవీ, ప్రయోజనాలు ఆశించినవీ కాబట్టి, వాటిని సాక్ష్యాలుగా పరిగణించరాదన్న భావన మాత్రం హేతు విరుద్ధం. కేవలం ఫలానా సాక్ష్యాన్ని అది పాక్షికమైనదన్న కారణంగా యాంత్రికంగా (మెకానికల్ రిజెMý‡్షన్) తోసిపుచ్చడమంటే తరచూ అన్యాయానికే దారితీస్తుంది’’(మసల్తీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీం తీర్పు). న్యాయ నిపుణుడు జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ఒక సందర్భంలో చెప్పినట్టు ‘‘న్యాయమూర్తులు వివాదాలపై తీర్పులు చెబుతూంటారు. కానీ, సమాజాన్ని మార్చడం కూడా న్యాయమూర్తుల కర్తవ్యం కాగలిగినప్పుడు అసలైన మార్పుకు దోహ దం చేయగలుగుతారు!’’ సంస్కరణలకు తొందరపడాలి ఈ అనుభవాలన్నింటిని రంగరించి, క్రోడీకరించుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరమైన ఒక ‘సంస్కరణ పత్రాన్ని’(రిఫార్మ్ ఎజెండా) 1980లోనే అందజేశారు: అందులో: ‘‘మన న్యాయస్థానాలు నేడు క్లిష్ట దశలో ఉన్నాయి, మన జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన న్యాయ పాలనా వ్యవస్థ ఎంత గోప్యంగా, ఎంత ఆటంకంగా తయారైందంటే– అది సామాన్య ప్రజల నుంచి దూరంగా జరిగిపోయింది. అందుకనే ఈ మౌలికమైన లోటును సవరించాలి. ఇందుకు న్యాయ ప్రక్రియలోనే సంస్కరణ, కూలంకషమైన మార్పులు రావాలి. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగ దార్శనిక దృష్టి స్పష్టంగా, ప్రకాశమానంగా ఉండాలి. దాని లక్ష్యం రాజ్యాంగం ముందుమాటలో నిర్వచించిన ప్రజానుకూల విలువలకు కట్టుబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి శాసన వేదికలు నేడు సమాజంలోని మోతుబరులకే అనుకూల వ్యవస్థలు. శ్రామిక ప్రజా బాహుళ్యంతో సంబంధం లేని వర్గాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్ని నడిపిస్తున్నాయి. వీరి ఎంపిక ఆశ్రిత పక్షపాతం ఆదాయ వనరులపై ఆధారపడి జరుగుతుంటుంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో, సుప్రీం బెంచ్కి సోదర న్యాయమూర్తులను ఎంచుకోవడంలో చర్యలు కొన్ని సందర్భాలలో సెలక్షన్ తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సహితం పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు’’అన్నారు (ఫ్రం బెంచ్ టు బార్’ జస్టిస్ కృష్ణయ్యర్). ఎన్నికైన ప్రతినిధులూ, శాసనకర్తలూ ఎంతగా వంకర పద్ధతుల్లో ధన ప్రయోగానికీ అవి నీతికీ పాల్పడుతుంటారో ఇంటర్నెట్ ద్వారా ఒకరు తనకు ‘ఈ–మెయిల్’లో పంపిన వ్యంగ్య సందేశాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ప్రస్తావించారు. అందులో పేర్కొన్న ‘కంపెనీ’ ఏదో కాదు సుమా! ప్రభుత్వమే. ‘‘ఈ కంపెనీ కింద పనిచేసే ‘ఉద్యోగులు’ 500 మంది పైచిలుకు ఉంటారు. అందులో 29 మంది భార్యల్ని వేధించేవారని ఆరోపణ. మరి ఏడుగురు మోసాల కారణంగా అరెస్టయినవారు. 19 మంది పైన క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. 117 మంది మీద హత్య, రేప్లు, దాడులు, దోపిడీ నేరాల మీద విచారణ సాగుతోంది. 71 మంది తీసుకున్న రుణాలు/అప్పులున్నందున పరపతి పుట్టనివారు. 21 మంది అనేక కోర్టు దావాల్లో ఇరుక్కున్నవారు. 84 మంది దాడుల కేసుల్లో జరిమానాలు చెల్లించారు. ఇంతకూ ఇంతటి ‘బడా కంపెనీ’ ఏదై ఉంటుందో ఊహించండి. ఆ ‘కంపెనీ’ భారత దిగువ సభ, ఇది నీ కోసం, నా కోసమే పనిచేస్తుంది సుమా! దిగువ సభలోని 545 మంది సభ్యులు నీ కోసం నా కోసమే పనిచేస్తారు. ఇదే ‘గ్రూపు’ మనల్నందర్నీ ఒక వరసలో నిలబెట్టి వందలాదిగా చట్టాలు చేస్తుంది. ఇంతటి భారీ ‘కంపెనీ’ గురించి మనమేమైనా చేయగలమా?!’’. ఆ ప్రశ్నార్థకంతో ఆ ఈ–మెయిల్ సందేశాన్ని జస్టిస్ ముగించారు. -ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయ వ్యవస్థపై కూడా మోదీ ముద్ర
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని న్యాయ వ్యవస్థ స్వతంత్రపై ఆందోళన మొదలైంది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన రెండు సిఫార్సుల్లో ఒక సిఫార్సును ఆమోదించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో సిఫార్సును తిరస్కరించడమే అందుకు కారణం. సుప్రీం కోర్టు జడ్జీలుగా సీనియర్ అడ్వకేట్ ఇందు మల్హోత్ర, ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసఫ్ల పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం గురువారం ప్రతిపాదించగా వారిలో ఇందు మల్హోత్ర నామినేషన్ను అంగీకరించిన మోదీ ప్రభుత్వం జోసఫ్ నామినేషన్ను అంగీకరించని విషయం తెల్సిందే. ఈ కొలీజియం వ్యవస్థకు రాజ్యాంగ భద్రతగానీ, పార్లమెంట్ చట్టం భద్రతగానీ లేదు. కేవలం సుప్రీం కోర్టు అభిప్రాయం మేరకు కేంద్రం ఈ కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో నలుగురు సీనియర్ సుప్రీం కోర్టు జడ్జీలు ఉంటారు. హైకోర్టు కొలీజియంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు నలుగురు సీనియర్ హైకోర్టు జడ్జీలు ఉంటారు. ఈ కొలీజియంలు మెజారిటీ అభిప్రాయంతో దిగువ కోర్టుల నుంచి తమ కోర్టులకు పదోన్నతులతో పాటు జడ్జీల బదిలీ వ్యవహారాలను నిర్వర్తిస్తాయి. ఇందులో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదు. అయితే సదరు వ్యక్తుల ప్రవర్తన, గత జీవితాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్సీ బ్యూరో ద్వారా సమాచారాన్ని సేకరించుకోవచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల నుంచి ఈ కొలీజియం వ్యవస్థ ఒత్తిడికి గురవుతూనే ఉంది. న్యాయవ్యవస్థ నియామకాలను తన పరిధిలోకి తీసుకోవడానికి వీలుగా 2014లోనే మోదీ ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది. అప్పటి నుంచి మోదీ ప్రభుత్వం దొడ్డిదారిన, అంటే మౌఖికంగా న్యాయ వ్యవస్థ నియామకాలను ప్రభావితం చేస్తోంది. కర్ణాటక హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జయంతి పటేల్ను 2017లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. దాంతో కర్ణాటకకు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. కక్షతోనే తనను బలి చేశారని నాడు ఆయన ఆరోపించారు. 2004లో ముంబైకి చెందిన ఇశ్రాత్ జహాన్ను గుజరాత్ పోలీసులు హత్య చేశారనే ఆరోపణలపై సీబిఐ దర్యాప్తునకు జయంతి పటేల్ ఆదేశించారు. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. హైకోర్టు కొలీజియం సిఫార్సులను పట్టించుకోకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2016లో గుజరాత్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఓ జడ్జీ బదిలీని అడ్డుకుంది. 2017లో కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి వాల్మీకీ మెహతా బదిలీని కూడా మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు కేఎం జోసఫ్ నియమకాన్ని మోదీ ప్రభుత్వం అడ్డుకోవడానికి కూడా కారణం ఉంది. 2016లో ఉత్తరాఖండ్లో మోదీ ప్రభుత్వం విధించిన రాష్ట్రపతి పాలనను జోసఫ్ రద్దు చేశారు. జోసఫ్ తరహాలోనే 2014లో కొలీజియం సిఫార్సు చేసిన గోపాల్ సుబ్రమణియం నామినేషన్ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించి మరో ముగ్గురు నామినేషన్లను అంగీకరించినప్పుడు అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఏకపక్షంగా గోపాల్ సుబ్రమణియం నామినేషన్ను ఎలా తిరస్కరిస్తారంటూ కేంద్రాన్ని విమర్శించారు. ఇప్పుడు జోసఫ్ విషయంలో అది జరగలేదు. న్యాయ వ్యవస్థ స్వతంత్ర గురించి మాట్లాడే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ప్రభుత్వ నిర్ణయనికి తలొగ్గి జోసఫ్ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు బెంచీలను నిర్ణయించడంలో కేసులను కేటాయించడంలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలు ప్రజల్లోకి వచ్చి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్టు స్వతంత్రత గురించి చర్చ మొదలైంది. కేసుల కేటాయింపుల్లో దీపక్ మిశ్రాపై ప్రభుత్వ ప్రభావం ఉండొచ్చన్న ఆరోపణలను ఖండించిన ఆయన న్యాయ వ్యవస్థ స్వతంత్రతకే తాను ప్రాధాన్యం ఇస్తానన్నారు. అలాంటప్పుడు ఆయన ప్రభుత్వ నిర్ణయంతో విభేదించాల్సి ఉంది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలను న్యాయవ్యవస్థనే జరుపుకునే విధానం భారత్లో తప్పా ప్రపంచంలో మరెక్కడా లేదు. అది వేరే విషయం. -
న్యాయ దేవతకు...న్యాయమేది?
అందరికీ న్యాయం చేసే న్యాయ వ్యవస్థలోనే మహిళలకు తగిన న్యాయం జరగడం లేదు. న్యాయమూర్తుల పోస్టుల్లో సముచిత స్థానం దక్కడం లేదు. దేశంలో న్యాయస్థానాలు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు పరిస్థితి ఇలానే ఉంది. 1959లో జస్టిస్ అన్నా చాందీ దేశంలనే తొలిసారిగా హైకోర్టు మహిళా న్యాయమూర్తిగా నియమితులైనప్పుడు.. ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలకు తగినంత ప్రాతినిధ్యం లభిస్తుందని భావించారు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుతో పాటు అన్ని హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇప్పటికీ అతి తక్కువగా ఉండడం ఈ దుస్థితికి తార్కాణంగా నిలుస్తోంది. కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు. – సాక్షి, హైదరాబాద్ సుప్రీంకోర్టులో 68 ఏళ్లలో ఆరుగురే.. సుప్రీంకోర్టులో ప్రస్తుతమున్న 25 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఒక్క మహిళా న్యాయమూర్తే ఉన్నారు. భారత సుప్రీంకోర్టు 1950 జనవరి 26న ఏర్పాటైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అంటే 68 ఏళ్ల సుప్రీంకోర్టు చరిత్రలో న్యాయమూర్తులుగా నియమితులైన మొత్తం మహిళల సంఖ్య ఆరుగురు మాత్రమే. ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా ప్రముఖ న్యాయవాది ఇందూ మల్హోత్రాను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆమెకు అవకాశం లభించే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1989లో సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా కేరళ నుంచి జస్టిస్ ఫాతిమా బీవీ నియమితులయ్యారు. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటైన 39 సంవత్సరాలకు ఓ మహిళ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 29 ఏళ్లలో సుప్రీం న్యాయమూర్తులుగా నియమితులైన మహిళలు ఐదుగురే. మొత్తంగా 1950 నుంచి ఇప్పటివరకు సుప్రీంకోర్టుకు 229 మంది న్యాయమూర్తులు నియమితులైతే.. అందులో పురుష న్యాయమూర్తులు 223 మందికాగా.. మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. 2014 నుంచి సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి లేరు. హైకోర్టుల్లో 10 శాతమే.. హైకోర్టుల్లోనూ మహిళల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. దేశవ్యాప్తంగా 24 హైకోర్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న మొత్తం న్యాయవాదులు 676 మందికాగా.. అందులో మహిళా న్యాయమూర్తులు కేవలం 74 మంది మాత్రమే. అసలు ఏడు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు. ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి లేరు. ఇక దేశంలోకెల్లా అలహాబాద్ హైకోర్టు పెద్దది. ఇక్కడ ప్రస్తుతం పనిచేస్తున్న 104 మంది న్యాయమూర్తుల్లో మహిళా న్యాయమూర్తులు ఆరుగురే. అత్యధికంగా బొంబే హైకోర్టులో 70 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది.. మద్రాసు హైకోర్టులో 58 మంది న్యాయమూర్తులకు గాను 11 మంది మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. మన ఉమ్మడి హైకోర్టులో ముగ్గురు మాత్రమే మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టులో 8 మందే.. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు 8 మంది మహిళా న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 1977లో ఉమ్మడి హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ కె.అమరేశ్వరి నియమితులయ్యారు. అంటే హైకోర్టు ఏర్పాటైన 21 సంవత్సరాలకు తొలి మహిళా న్యాయమూర్తి నియామకం జరిగింది. 1992లో జస్టిస్ ఎస్.వి.మారుతి, 1998లో జస్టిస్ టి.మీనాకుమారి, 2001లో జస్టిస్ రోహిణి, 2013లో జస్టిస్ అనిస్, 2017లో జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ తేలప్రోలు రజని, జస్టిస్ కొంగర విజయలక్ష్మి న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం జస్టిస్ ఉమాదేవి, జస్టిస్ రజని, జస్టిస్ విజయలక్ష్మి న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా దేశంలోని అన్ని హైకోర్టుల్లో కలిపి.. మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10.94 శాతమే కావడం గమనార్హం. మహిళా న్యాయాధికారులు 27.7శాతమే దేశవ్యాప్తంగా కిందిస్థాయి న్యాయవ్యవస్థలో మొత్తం 11,382 మంది పురుష న్యాయాధి కారులు పనిచేస్తుంటే.. 4,408 మంది మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అంటే మహిళా న్యాయాధికారుల శాతం 27.7 మాత్రమే. చిన్న రాష్ట్రాలైన గోవా, మేఘాలయ, సిక్కింలలో మహిళా న్యాయాధికారుల సంఖ్య 60 శాతానికి మించి ఉంది. అత్యధికంగా మేఘాలయలో 73.08 శాతం న్యాయాధికారులు మహిళలే. ఆ రాష్ట్రంలో 42 మంది న్యాయాధికారులుంటే.. అందులో 31 మంది మహిళలే కావడం విశేషం. అత్యల్పంగా బిహార్లో 11.52% మాత్రమే మహిళా న్యాయాధికారులు ఉన్నారు. అక్కడ 967 మంది న్యాయాధికారులు ఉండగా.. మహిళలు 110 మంది మాత్రమే. బిహార్లో దేశంలోనే అత్యధికంగా 35 శాతం మేర మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. మహిళా న్యాయాధికారుల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. బిహార్ తర్వాత గుజరాత్లో తక్కువ శాతం మహిళా న్యాయాధికారులు ఉన్నారు. ఇక్కడ మొత్తం 959 మంది న్యాయాధికారులు ఉండగా.. 148 మంది మాత్రమే మహిళా న్యాయాధికారులు కావడం ఆందోళనకరం. పలు హైకోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య... అలహాబాద్ (06), ఏపీ–తెలంగాణ (03), బాంబే (11), కోల్కతా (04), ఢిల్లీ (10), గౌహతి (01), గుజరాత్ (04), కర్ణాటక (03), కేరళ (05), మధ్యప్రదేశ్ (03), మద్రాస్ (11), ఒడిశా (01), పట్నా (02), పంజాబ్–హరియాణా (06), రాజస్థాన్ (02), సిక్కిం (01), జార్ఖండ్ (01). దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాలే టాప్... దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోనే అత్యధిక శాతం మహిళా న్యాయాధికారులు పనిచేస్తుండటం విశేషం. తెలంగాణలో 197 మంది పురుష న్యాయాధికారులు పనిచేస్తుంటే, 155 మంది మహిళా న్యాయాధికారులు బాధ్యతలు నిర్వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జూనియర్ సివిల్ జడ్జీల్లో 51.98 శాతం మంది మహిళలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్లో 37.54 శాతం మంది మహిళా న్యాయాధికారులున్నారు. మొత్తం 549 మంది న్యాయాధికారులు పనిచేస్తుండగా, 208 మంది మహిళా న్యాయాధికారులున్నారు. ప్రస్తుతం ఉన్న జూనియర్ సివిల్ జడ్జీల్లో 44.13 శాతం మంది మహిళలు ఉన్నారు. -
ఆ న్యాయమూర్తుల నుంచి స్ఫూర్తి పొందుదాం
సాక్షి, హైదరాబాద్: స్వీయ ప్రయోజనాలకు కాక వ్యవస్థ విలువలను కాపాడేందుకు ప్రాధాన్యతనిచ్చిన న్యాయమూర్తుల నుంచి న్యాయవ్యవస్థలో ఉన్నవారందరూ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ అన్నారు. న్యాయమూర్తుల నైతికత అన్న పునాదిపైనే స్వతంత్ర న్యాయవ్యవస్థ నిర్మితమైందని తెలిపారు. ఈ వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ప్రతీ న్యాయమూర్తి, న్యాయవాది శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ప్రాంగణంలో శుక్రవారం 69వ గణతంత్ర దిన వేడుకలు జరిగాయి. జాతీయ జెండాను ఎగురవేసిన ఏసీజే ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెహ్రూ కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని వివరించారు. ‘1954లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పతంజలి శాస్త్రి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ పదవిని స్వీకరించాలని జస్టిస్ బిజోన్ కుమార్ ముఖర్జీని ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కోరారు. ఈ వినతిని జస్టిస్ ముఖర్జీ సున్నితంగా తిరస్కరించారు. తనకన్నా సీనియర్ ఉండగా, తాను ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టలేనని తేల్చి చెప్పారు. నెహ్రూ ఒత్తిడి చేయగా, న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తానే తప్ప పదవిని చేపట్టబోమని అన్నారు. జస్టిస్ ఎం.సి.మహాజన్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరువాతనే జస్టిస్ ముఖర్జీ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్టించారు. స్వీయ ప్రయోజనాల కన్నా వ్యవస్థ ప్రయోజనాలను ఉన్నత స్థితిలో నిలిపిన ఇటువంటి న్యాయమూర్తులను అనుసరించి, వారి నుంచి మనం అందరం స్ఫూర్తి పొందాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాజ్యంగ రచన ఎలా జరిగింది.. అందుకు కారకులెవరు.. తరువాత పరిణామాలను ఆయన వివరించారు. తాత్కాలిక భవనంలో హైకోర్టు తగదు తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చల్లా ధనంజయ తప్పుపట్టారు. దీనిపై అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం న్యాయవాదుల సంఘానికి ఇవ్వాలని ఆయన ఏసీజేను కోరారు. కాగా గణతంత్ర వేడుకల్లో హైకోర్టు విభజన అంశాన్ని లేవనెత్తడంపై ఏసీజే ఒకింత అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఏపీ అడ్వొకేట్స్ జనరల్ దేశాయ్ ప్రకాశ్రెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జల్లి కనకయ్య ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
వారి ప్రాతినిధ్యం పెరగాలి
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్న ఇతర ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ న్యాయ వ్యవస్థ పనిచేయాలని సూచించారు. జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ కమిషన్, నీతి ఆయోగ్ సంయుక్తంగా శనివారం నిర్వహించిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కోవింద్ ప్రసంగించారు. ‘ఉన్నత న్యాయ వ్యవస్థలో బలహీన వర్గాలైన మహిళలు, ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకు అంత తక్కువగా ప్రాతినిధ్యం ఉండటం ఆమోదయోగ్యం కాదు. ఇతర సంస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ కూడా సమాజంలోని వైవిధ్యం ప్రతిబింబించేలా అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం వహించాలి’ అని కోవింద్ అన్నారు. ప్రతి నలుగురు జడ్జీల్లో ఒక్కరే మహిళ ఉన్నారన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్టులకు దూరంగానే పేదలు.. జిల్లా, సెషన్స్ కోర్టుల జడ్జీల నైపుణ్యాలు పెంచే గురుతర బాధ్యత ఉన్నత న్యాయ వ్యవస్థపైనే ఉందని కోవింద్ నొక్కిచెప్పారు. అలా అయితేనే చాలా మంది జిల్లా కోర్టుల జడ్జీలు హైకోర్టులు, సుప్రీంకోర్టులకు పదోన్నతులు పొందుతారని పేర్కొన్నారు. దీని వల్ల దిగువ కోర్టులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని, ఫలితంగా హైకోర్టులపై భారం తగ్గుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నా, ఖర్చు, విచారణల ఆలస్యానికి భయపడి పేదలు కోర్టుల్లో న్యాయ పోరాటం చేయడానికి వెనుకాడుతున్నారని కోవింద్ పేర్కొన్నారు. ధనికులు లొసుగులను అడ్డుపెట్టుకుని కేసులను సాగదీస్తున్నారని, కాలం చెల్లిన, పనికిరాని చట్టాలను రద్దుచేసి పాలనను సులభతరం చేయాలని చెప్పారు. సీజేఐ వర్సెస్ కేంద్ర మంత్రి న్యాయ వ్యవస్థ క్రియాశీలతపై కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాల మధ్య స్వల్ప మాటల యుద్ధం చోటుచేసుకుంది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించడం న్యాయవ్యవస్థ పవిత్ర కర్తవ్యమని జస్టిస్ దీపక్ మిశ్రా పేర్కొనగా, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు దూరంగా ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గౌరవం ఉంటుందని చౌదరి అన్నారు. అలా కాకుండా న్యాయ క్రియాశీలత, సమీక్షల పేరుతో జోక్యం చేసుకుంటే మాత్రం పరిణామాలు ఆందోళనకరంగా ఉంటాయని అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయ స్వతంత్రత మూల స్తంభం వంటిదని, న్యాయ వ్యవస్థలోని జవాబుదారీతనం ఆ స్తంభానికి పునాది అని చెప్పారు. జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పౌరుల ప్రాథమిక హక్కుల్ని ప్రభుత్వ విభాగాలు ఉల్లంఘించకూడదని, హక్కులకు భంగం కలిగిన మరుక్షణం, వాటిని అతిక్రమించే ప్రమాదకర సంకేతాలు ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ పౌరుల పక్షాన నిలుస్తుందని అన్నారు. విధానపర నిర్ణయాలు చేయాలనే కోరిక న్యాయవ్యవస్థకు లేద ఆయన సమాధానమిచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ, విస్తరణకు కోర్టులు చూపుతున్న చొరవను సీజేఐ సమర్థించారు. కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. -
సిట్టింగ్ జడ్జిపై ఎఫ్ఐఆర్ వద్దు: సుప్రీం
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ స్వతంత్రత సీబీఐ లేదా పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడి ఉండబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేయొద్దని పునరుద్ఘాటించింది. జడ్జీల పేరుతో లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలపై సిట్తో దర్యాప్తు చేయించాలన్న పిటిషన్ను మంగళవారం జస్టిస్ ఆర్కే అగర్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం... ఉన్నత న్యాయ వ్యవస్థలోని సిట్టింగ్ జడ్జీలకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ దాఖలుచేయకూడదన్న 1991 నాటి తీర్పును గుర్తుచేసింది. ఓ మెడికల్ కాలేజీకి అనుకూలంగా వ్యవహరించేందుకు అవినీతి జరిగిందన్న ఆరోపణపై సీబీఐ దాఖలుచేసిన ఎఫ్ఐఆర్ ఏ సుప్రీంకోర్టు జడ్జి పేరు సూచించేలా లేదంది. ‘ఎవరైనా జడ్జిపై నమోదైన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందన్న ప్రచారం జరిగితే, అది సదరు జడ్జి, కేసు వేసిన వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే, సిట్ ఏర్పాటు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపే బెంచ్ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తప్పించడానికి పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశాన్ని తెరమీదకు తేవడం సరికాదు’ అని బెంచ్ తేల్చిచెప్పింది. కొం దరు సీనియర్ లాయర్లు ఒకే అంశంపై వేర్వే రు కేసులు వేసి వాటిని పలానా బెంచే విచా రించాలని పట్టుబట్టడాన్నీ తప్పుపట్టింది. -
సత్వర పరిష్కారానికి పనితీరు సూచీ
పెండింగ్ కేసులపై నీతి ఆయోగ్ సూచన న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ పనితీరు సూచీను ఏర్పాటు చేయడం ద్వారా కింది కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించ వచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించింది. దీంతో పాటు ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే న్యాయవ్యవస్థలో నియామకాలను చేయాలని కూడా సూచించింది.హైకోర్టులు, హైకోర్టు న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ పనితీరు సూచీలతో పర్యవేక్షించి జిల్లా కోర్టుల్లోనూ, సబార్టినేట్ స్థాయిల్లోనూ జరిగే ఆలస్యాన్ని నివారించవచ్చని నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో అభిప్రాయ పడింది. మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సమాచారం, ప్రస్తుతమున్న మౌలిక వసతులు, సూచనలతో పాటు కేసులు ఎంతకాలం నుంచి పెండింగ్ లో ఉంటున్నాయి, ఎంత శాతం కేసులు పెండింగ్లో ఉంటున్నాయి వంటి అంశాలను గత ఏడాది సమాచారంతో పోల్చి చూడవచ్చని నివేదికలో పేర్కొంది. కోర్టు పనితీరులో ప్రపంచశ్రేణి ప్రమాణాలను పాటించేందుకు ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యుడీషియల్ అడ్మినిస్ట్రేషన్, ది ఫెడరల్ జ్యుడీషియల్ సెంటర్ (యూఎస్), ది నేషనల్ ఆఫ్ కోర్ట్స్ (యూఎస్), సింగపూర్లోని సబా ర్డినేట్ కోర్టులను అధ్యయనం చేయాలని కూడా సూచించింది. -
న్యాయవ్యవస్థ నవ్వులపాలైంది
జస్టిస్ కర్ణన్ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ వల్ల న్యాయవ్యవస్థ నవ్వులపాలైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన మొరటుగా, పొగరుగా, కోర్టును ధిక్కరిస్తూ చేసిన పనులు శిక్షార్హమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. కర్ణన్కు విధించిన ఆరు నెలల జైలు శిక్షకు సంబంధించిన పూర్తి తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెబ్సైట్లో పెట్టింది. సిట్టింగ్ జడ్జికి శిక్ష వేస్తూ తీర్పునివ్వాల్సిరావడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. కర్ణన్ కేసు విషయంలో తాము జోక్యం చేసుకుని ఆదేశాలిస్తున్న సమయంలో ఆయన మరింత దురుసుగా ప్రవర్తించారంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మే 9న ఈ తీర్పును క్లుప్తంగా ఇవ్వడం తెలిసిందే. జడ్జీల నియామక ప్రక్రియను సమీక్షించాలి ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే విధానాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని కర్ణన్ కేసు ఎత్తిచూపుతోందని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్గొగోయ్లు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే న్యాయమూర్తుల ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని అభిశంసించకుండానే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ఓ న్యాయ యంత్రాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. -
స్వతంత్రంగా వ్యవహరించటంలేదు
న్యాయవ్యవస్థపై మాజీ న్యాయమూర్తి అభయ్ తిప్సే ఆవేదన హైదరాబాద్: దేశంలో న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించటం లేదని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ తిప్సే ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో భారత ప్రజా న్యాయవాదుల అసోసియేషన్ మహాసభల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని.. న్యాయమూర్తులు సైతం స్వార్థ ప్రయోజనాల కోసం ప్రలోభాలకు గురవుతున్నారన్నారు. న్యాయ మూర్తుల నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి ఏర్పడుతుందన్నారు. అసోసి యేషన్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకన్న మాట్లాడుతూ... ప్రజలకు న్యాయం అందించేందుకు, ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ అసోసియేషన్ కృషి చేస్తుందన్నారు. క్రూర, నిర్బంధ చట్టాలైన యూఏపీఏ, ఏఎఫ్ఎస్పీఏ, సెక్షన్ 124ఎ, ఐపీసీలను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ జస్టిస్ హెచ్.సురేశ్, పర్వేజ్ ఇమ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక: భారత ప్రజాన్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడిగా ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్. సురేశ్, ఉపాధ్యక్షులుగా సుధా భరద్వాజ్, ఎం. వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా సురేంద్ర గడ్లింగ్, సహాయ కార్యదర్శులుగా అంకిత్ గ్రేవెల్, సురేశ్ కుమార్, కోశాధికారిగా అరుణ్ ఫెర్రియా తదితరులు ఎన్నికయ్యారు. -
న్యాయవాదిపై కోర్టు ధిక్కార చర్యలు
నరసింహారావుకు నోటీసు జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: న్యాయ వ్యవస్థను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ న్యాయవాది జీఎల్ నరసింహారావుపై ఉమ్మడి హైకోర్టు కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఆయన వ్యాఖ్యలు న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని అభిప్రాయ పడిన హైకోర్టు, నరసింహారావుకు కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ 14(1) కింద నోటీసు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలను ఎందుకు కోర్టు ధిక్కారం కింద పరిగణించరాదో వారం లోపు వివరించాలని అతన్ని ఆదేశించింది. అంతేకాక నరసింహారావును తక్షణమే అదుపులోకి తీసుకోవాలని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) ను ఆదేశించింది. దీంతో రిజిస్ట్రార్ భోజన విరామ సమయంలో నరసింహారావును అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం రూ.25 వేలకు రెండు పూచీ కత్తులు సమర్పించడంతో ఆయన్ను బెయిల్పై విడుదల చేశారు. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరం ఉంటే అప్పీల్ చేసుకోవాలి... ప్రభుత్వం అనుమతించిన ధరల కన్నా అధిక రేట్లకు థియేటర్లు టికెట్లు విక్రయిస్తున్నాయని, దీనివల్ల ప్రజలపై కోట్ల రూపాయల మేర భారం పడుతోందని, అందువల్ల సదరు థియేటర్ల నుంచి ఆ మొత్తాలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. టికెట్ ధర విషయంలో వాస్తవాలను అధికారులు కోర్టు ముందుంచలేదని, దీంతో హైకోర్టు పలు ఉత్తర్వులిచ్చిందని, అవి ప్రజలపై భారం మోపే విధంగా ఉన్నాయని నరసింహారావు వివరించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే అప్పీల్ దాఖలు చేసుకోవడమో లేక రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవడమో చేయాలే తప్ప, ఆ ఉత్తర్వులను తాము స్వతంత్రంగా విచారించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఈ కారణంతో నరసింహారావు పిటిషన్ను కొట్టేస్తూ ఉత్తర్వులిచ్చింది. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుంది... అనంతరం నరసింహారావు స్పందిస్తూ, న్యాయ స్థానాలు వెలువరించే ఇటువంటి ఉత్తర్వుల వల్ల ప్రజలు న్యాయ వ్యవస్థపై నమ్మకం కోల్పోతు న్నారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుందంటూ, అతనికి కోర్టు ధిక్కారం కింద నోటీసు జారీ చేసింది. -
టెక్నాలజీతో సత్వర న్యాయం
⇒ న్యాయ వ్యవస్థ ఐటీని విస్తృతంగా వినియోగించాలి ⇒ పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు సహకరిస్తాం: మోదీ అలహాబాద్: సత్వర న్యాయం అందజేసేందుకు టెక్నాలజీని సమర్థంగా వాడాలని ప్రధాని నరేంద్రమోదీ న్యాయ వ్యవస్థకు సూచించారు. కోర్టులో పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్కు హామీ ఇచ్చారు. ఆదివారం అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవ వేడుకల్లో మోదీ, సీజేఐ జస్టిస్ ఖేహర్ పాల్గొన్నారు. పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేలా కొత్త ఆలోచనలతో స్టార్టప్లు ముందుకు రావాలనిప్రధాని పిలుపునిచ్చారు. న్యాయ వ్యవస్థలో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, దీని వల్ల విలువైన కాలంతో పాటు నిధులనూ ఆదా చేయవచ్చని చెప్పారు. సాక్షులు, ఖైదీలు, అధికారుల వాంగ్మూలాలను సేకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ విధానాన్ని వాడడం ద్వారా డబ్బు, సమయాన్ని ఆదాచేయవచ్చన్నారు. ఖైదీలను నేరుగా కోర్టుల్లో ప్రవేశపెట్టడం వల్ల భద్రతా పరమైన అనేక ఇబ్బందులు ఎదురవుతాయని, వాటన్నిటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెక్ పెట్టవచ్చని చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఖైదీలను కోర్టులకు తీసుకెళ్లే సమయంలో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అయితే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున ఇటువంటి ఘటనలు తగ్గుముఖం పడతాయన్నారు. సీజేఐ జస్టిస్ ఖేహర్ ప్రసంగంతో ఆయన పడుతున్న వేదన తనకు అర్థమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా న్యాయవ్యవస్థ, ప్రభుత్వ అధికారులు దేశాన్ని అత్యున్నస్థాయికి తీసుకెళ్లేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సీజేఐ ఖేహర్.. న్యాయమూర్తుల కొరత కారణంగా పెండింగ్ కేసులు పెరిగిపోతున్న విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం కోర్టు వేసవి సెలవుల సందర్భంగా అసౌకర్యం తలెత్తకుండా మూడు రాజ్యాంగ ధర్మాసనాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ ధర్మాసనాల్లోని న్యాయమూర్తులు వారంలో ఐదు రోజుల పాటు పనిచేయాలని.. రోజుకు కనీసం 10 కేసులను పరిష్కరించాలని ఆయన కోరారు. -
కొన్ని తీర్పులు అర్థరహితం
రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ పణజి: న్యాయవ్యవస్థ ఇచ్చిన కొన్ని ఆదేశాలు అర్థరహితమైనవని.. వాటికి శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీ లేదని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ విమర్శించారు. ఆయన సోమవారం పణజిలో ఘన వ్యర్థ నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం మాట్లాడారు. ‘‘ఎటువంటి శాస్త్రీయ ప్రాతిపదికా లేకుండా అర్థరహిత ఆదేశాలు ఇవ్వటం జరుగుతోంది. శాస్త్రాన్ని అర్థం చేసుకోని కొందరు మనుషులు దానికి భాష్యం చెప్పటం మొదలుపెట్టారు. భారత్లో కొందరు పెట్టుబడులు పెట్టడం ఆపివేశారు.. ఎందుకంటే కోర్టు నిర్ణయాలు తాము అర్థం చేసుకోగల పరిధిని దాటిపోయి ఉన్నాయని అంటున్నారు. ‘‘కాలుష్యం కలిగిస్తున్న డీజిల్ వాహనాలను నిషేధించవచ్చని మేం అర్థం చేసుకోగలం. కానీ.. కాలుష్యం కలిగించని లేదా పెట్రోల్ వాహనం కన్నా తక్కువ కాలుష్యకారకమైన వాహనాలను నిషేధించటంలో అర్థం ఏమిటి?’’ అని వ్యాఖ్యానించారు. -
లక్ష్మణరేఖ!
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్మొహమాటంగా మాట్లాడతారని పేరుంది. న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల గురించి వారం రోజుల వ్యవధిలో ఆయన రెండుసార్లు చేసిన వ్యాఖ్యానాలు సంచలనం కలిగించాయి. న్యాయవ్యవస్థ తన పరిధిని, పరిమితులను అతిక్రమిస్తున్నదన్నదే ఆ రెండు వ్యాఖ్యల సారాంశం. శాసన, కార్య నిర్వాహక వ్యవస్థల అధికారాల్లోకి న్యాయవ్యవస్థ చొరబడుతున్నదని వారంక్రితం ఆయన విమర్శించారు. దానిపై వివరణను కోరిన సందర్భంలో ఈసారి మరింత స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకోవలసిన నిర్ణయాలను దానికే వదిలేయాలి తప్ప ఆ పని న్యాయవ్యవస్థ నెత్తిన వేసుకోరాదని ఆయన హితవు పలికారు. అంతేకాదు...న్యాయవ్యవస్థ క్రియాశీలతకు నిగ్రహం అవసరమని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ తనకు తాను లక్ష్మణరేఖ గీసు కోవాలని కూడా సూచించారు. అరుణ్ జైట్లీ కన్నా ముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం న్యాయమూర్తుల సదస్సులో ఈ మాదిరే అన్నారు. న్యాయస్థానాలు హద్దు మీరుతున్నాయని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ పోకడలపై నేతలు ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారేమీ కాదు. ఆమాటకొస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం దానిపై పలుమార్లు మాట్లాడారు. నాలుగేళ్లక్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.హెచ్. కపాడియా న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఒక్కోసారి పరిధులను దాటుతోందని, ఇందువల్ల శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య ఉండాల్సిన సమతుల్యత దెబ్బతింటున్నదని అంగీకరించారు. ‘న్యాయం చేయాలన్న ఆత్రుతే’ అందుకు కారణమని ఆయన సంజాయిషీ ఇచ్చుకున్నారు. అరుణ్జైట్లీ గతంలో కూడా న్యాయవ్యవస్థ లోటుపాట్లపై నిశితమైన విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు గనుక ఆయన అభిప్రాయాలు కొట్టేయదగ్గవి కాదు. న్యాయమూర్తులుగా పనిచేసేవారు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులనూ అంగీకరించరాదని 2012లో ఒక సదస్సులో మాట్లాడుతూ ఆయన సూచించారు. అక్కడితో ఆగలేదు...కొందరు న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత వచ్చే పదవులు ఆశించి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు రాస్తున్నారని కూడా ఆరోపించారు. ‘న్యాయమూర్తులు రెండు రకాలు... కొందరు న్యాయం తెలిసున్నవారైతే, మరికొందరు న్యాయ శాఖ మంత్రి తెలిసున్నవారు’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. వాటి సంగతలా ఉంచితే న్యాయవ్యవస్థ పరిధులు, పరిమితుల గురించి అరుణ్ జైట్లీ చేస్తున్న వ్యాఖ్యలతో బహుశా కాంగ్రెస్ కూడా ఏకీభవిస్తుంది. కామన్వెల్త్ క్రీడల స్కాం, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం మొదలుకొని బొగ్గు కుంభకోణం వరకూ ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎన్నో ఎదురుదెబ్బలు తింది. సీబీఐని యూపీఏ సర్కారు ఆటబొమ్మగా మార్చిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసి ఈ కేసుల పర్యవేక్షణను సుప్రీంకోర్టు తానే చేపట్టింది. ఆ పరాభవాన్ని కాంగ్రెస్ అంత సులభంగా మరిచిపోదు. అయితే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరాన్ని ఏర్పరిచిందీ, అది విస్తరించ డానికి దోహదపడిందీ కార్యనిర్వాహక వ్యవస్థ వైఫల్యాలేనన్న సంగతి మర్చి పోకూడదు. అధికారంలో ఉన్నవారు రాజ్యాంగానికీ, చట్టాలకూ అనుగుణంగా వ్యవహరిస్తే న్యాయవ్యవస్థ క్రియాశీలత అవసరమే ఏర్పడి ఉండేది కాదు. అయి దేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో జనం ఓట్లతో నెగ్గితే ఆ తర్వాత తమను ఎవరూ ఏమీ చేయలేరని, తాము ఎవరికీ జవాబుదారీ కాదని నాయకులు భావిస్తున్నారు. అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారి చర్యలను నియంత్రించే చట్టాలు లేదా నిబంధనలుంటే వాటిని ఏమార్చడానికి సందేహించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల తీరుతెన్నులను గమనిస్తే ఈ సంగతి బోధపడుతుంది. అవతలి పార్టీల నుంచి గెలిచినవారిని బహిరంగ సభల్లో కండువాలు కప్పి ఆహ్వానించడానికి రెండు రాష్ట్రాల్లోని సీఎంలూ సందేహించడం లేదు. ఇలా చేయడం అనైతికమనుకోవడం లేదు. ఒకపక్క ఇంత దిగజారుడు పనులకు పాల్పడుతూ ప్రజల కనీసావసరాలపై దృష్టి సారించడానికి సమయం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటపుడు కరువు విషయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైతే...ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే ఉలికిపాటు ఎందుకు? తమ అధికారాల్లోకి చొచ్చుకొస్తున్నదని నొచ్చుకోవడం ఎందుకు? దేశంలో కరువుకాటకాలు అలముకున్నప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో చెప్పడానికి 2005 నాటి విపత్తు నివారణ చట్టంతోపాటు 2009లో రూపొందిన కరువు మాన్యువల్, 2010నాటి జాతీయ విపత్తు నివారణ మార్గ దర్శకాలు ఉన్నాయి. అయినా చాలా రాష్ట్రాలకు వాటిని అమలు చేయాలన్న స్పృహే లేకపోయింది. ఈమధ్యే ‘నీట్’పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా జైట్లీ ప్రస్తా వించారు. పరీక్షల నిర్వహణ తమ పరిధిలోనిదైతే వాటిని ఎప్పుడు నిర్వహించాలో, ఏమి చేయాలో సుప్రీంకోర్టు చెప్పడమేమిటని రాష్ట్రాలు అడుగుతున్నాయని కూడా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలున్న మాట నిజమే. కానీ వైద్య విద్యా రంగాన్ని మాఫియా శాసిస్తుంటే, నిజమైన అర్హతలున్నవారికి సీట్లు దక్కని పరిస్థితులుంటే, విద్య అంగడి సరుకవుతుంటే ఇన్ని దశాబ్దాలుగా నిర్లిప్తంగా ఉండిపోయిన ప్రభుత్వాల నిర్వాకం వల్లనే సుప్రీంకోర్టు రంగంలోకి దిగిందని గుర్తుంచుకోవాలి. ఉత్తరాఖండ్ వ్యవహారంలోనూ అంతే. ఒక ప్రభుత్వానికి మెజా రిటీ ఉన్నదో, లేదో తేలాల్సింది చట్టసభలోనే అన్న సంగతి మరిచి ప్రవర్తించడం వల్లనే అక్కడ సుప్రీంకోర్టు జోక్యం అవసరమైంది. ఏ వ్యవస్థకుండే అధికారాలకైనా ప్రాతిపదిక రాజ్యాంగమే. రాజ్యాంగం మూడు వ్యవస్థలకూ ఇచ్చిన అధికారాలైనా... నిర్దేశించిన పరిధులు, పరిమితులు అయినా ప్రజల ప్రయోజనాలనూ, శ్రేయస్సునూ కాంక్షించి రూపొందించినవేనని మరిచి పోకూడదు. తమ అధికారాలను న్యాయవ్యవస్థ కబ్జా చేస్తున్నదని ఆరోపించే ముందు తమ నిర్వాకం ఎలా ఉన్నదో, తమ పరంగా జరుగుతున్న తప్పులేమిటో మిగిలిన రెండు వ్యవస్థలూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. లోటుపాట్లను సరిదిద్దు కోవాలి. అది జరగనంతకాలం న్యాయవ్యవస్థ క్రియాశీలతను హర్షించడమే కాదు... అది మరింత విస్తరించాలని అందరూ కోరుకుంటారు. -
రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు: సీఎం
మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి హైకోర్టు సహకారం కోరుతాం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. న్యాయ వ్యవస్థ సంస్కరణలపై ఆదివారం ఇక్కడి విజ్ఞాన్ భవన్లో జరిగిన ముఖ్యమంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం వివరాలను విలేకరులకు వివరిస్తూ.. రాష్ట్రంలో హైకోర్టును విభిన్నంగా నిర్మించే యోచన చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. కోర్టులలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించే విషయాన్ని ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈసారి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టులలోని ఒక్కో సమస్యపై విపులంగా చర్చించి విభిన్నంగా కార్యాచరణ రూపొందించారన్నారు. ఏటా 10 శాతం ఖాళీలను భర్తీ చేసే విధంగా, కేసులు సత్వరంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారని చంద్రబాబు తెలిపారు. పెండింగ్ కేసులన్నీ 5 ఏళ్ల లోపు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. న్యాయ వ్యవస్థ మొత్తాన్ని కంప్యూటరైజేషన్ చేయడం, వాణిజ్య కోర్టుల ఏర్పాటుపై కూడా చర్చ జరిగిందన్నారు. 79 కొత్త కోర్టులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, మహిళలపై నేరాలకు చెందిన కేసుల సత్వర పరిష్కారానికి 13 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రత్యేక కోర్టులుగా మార్పు చేసామని చంద్రబాబు చెప్పారు. కోర్టుల బయట మధ్యవర్తిత్వం లేదా సఖ్యత ద్వారా ప్రత్యామ్నాయంగా వివాద పరిష్కారాల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు హైకోర్టు సహకారాన్ని కోరుతామని చెప్పారు. బుద్ధ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించండి: ఏపీ భవన్ ఉద్యోగులు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంతకుముందు ఉన్న రీతిలో బుద్ధ విగ్రహాన్ని, అమరావతి స్థూపాన్ని తిరిగి ప్రతిష్టించాలని కోరుతూ ఏపీ భవన్ ఉద్యోగులు సీఎంకు విన్నవించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని కోరినట్టు ఉద్యోగ సంఘాల నేత బాలకోటేశ్వరరావు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గెయిల్ విరాళం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ కింద రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గెయిల్ సంస్థ రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్ను ఏపీ భవన్లో సీఎం చంద్రబాబుకు సంస్థ చైర్మన్ బి.సి.త్రిపాఠి అందించారు. -
ధర్మాసన చైతన్యానికి దారేది?
రెండో మాట కర్ణాటకలో బొమ్మయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ చేసిన ప్రయోగాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఫుల్బెంచ్ కొట్టివేస్తూ చీవాట్లు పెట్టింది. అయినా నేటి బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ ప్రభుత్వం నిస్సిగ్గుగా అదే బాటలో ప్రయాణిస్తోంది. ఈ తప్పుడు ప్రయోగాలను ఆదర్శంగా మార్చుకున్న నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు, సుప్రీంకోర్టు పదే పదే ప్రశ్నించినా వారు లెక్కచేయడం లేదు. న్యాయవ్యవస్థ (ధర్మాసనం) తన చైతన్యపు హద్దులను అదుపు తప్పి పెంచుకుంటూ పోతోంది. కార్యనిర్వాహక వ్యవస్థ అయిన ప్రభుత్వ, శాసన వేదికల అధికారాలను న్యాయవ్యవస్థ తనకు దఖలు పరుచుకోరాదు. సుప్రీంకోర్టు చొరవతో ప్రారంభించిన ప్రజా ప్రయోజన వ్యాజ్య (పిల్) ప్రక్రియ అనేక సామాజిక దురన్యాయాల పరిష్కారానికి దోహదం చేసినప్పటికీ, రాజ్యాంగం మూడు విభాగాలకు కేటాయించిన ప్రత్యేక అధికారాలను, వాటి సాధికారతనూ సుప్రీం న్యాయమూర్తులు పల్చబరచడానికి ప్రయత్నించరాదు. - రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (భోపాల్లో జరిగిన న్యాయమూర్తుల సదస్సులో చేసిన హెచ్చరిక-16-4-16) భోపాల్లో జరిగిన న్యాయమూర్తుల సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. అందులో న్యాయ వ్యవస్థ (ధర్మాసన) చైతన్యం గురించి కొన్ని విమర్శలు వినిపిస్తాయి. సద్విమర్శ చేసిన కొన్ని సందర్భాలూ కనిపిస్తాయి. దేశంలో సుపరిపాలన నెలకొనేందుకు వీలుగా, సమతౌల్యంతో, నిష్పాక్షికంగా న్యాయం అందించే కృషిలో సామాన్యుడికి న్యాయ వ్యవస్థ తన మీద విశ్వాసం కలిగించగలిగిందని ప్రణబ్ పేర్కొన్నారు. అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే శిరోధార్యమని ప్రణబ్ పలికారు. అలాగే రాజ్యాంగ పరిధిలో అధికారాలను చెలాయించడంలో అన్ని సందర్భాలలోనూ సమతౌల్యంతో వ్యవహరించాలనీ, ఈ క్రమంలో శాసనవేదికలూ, ప్రభుత్వాలూ తీసుకునే నిర్ణయాలు న్యాయ వ్యవస్థ సమీక్షకు బద్ధమై ఉండాలని కూడా రాష్ట్రపతి అన్నారు. అయితే, తన అధికారాలను చెలాయించడంలో న్యాయ వ్యవస్థ ఆత్మ నిగ్రహంతో తనకు తానై క్రమశిక్షణతో వ్యవహరించాలని కూడా చెప్పారు. ఈ మాట ఇప్పుడు చెప్పడంలో ఏదో ఒక విశేషం ఉండి ఉండాలి. ఎందుకంటే, కేంద్ర, రాష్ట్రాల పాలకులు ప్రణబ్ ప్రస్తావించిన రాజ్యాంగ స్ఫూర్తితో గాని, చట్టాలను గౌరవించడంలో గాని పరిధులు దాటి వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు, పౌర సమాజాలు మరింత సన్నిహితంగా ఈ అంశాన్ని గుర్తించి ఇంతకు ముందెన్నడూ లేని స్థాయిలో నిరసనలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. పౌరుల, ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు ప్రాణాధారాలైన వాక్, సభా, స్వేచ్ఛాస్వాతంత్య్రాలను రాజ్యాంగం విస్పష్టంగా నిర్వచించింది. ప్రణబ్ ప్రస్తావించిన ఆ ధర్మాసన చైతన్యం పరిధిలోకి, పరిశీలనలోకి ఇవి వస్తాయి. కానీ పాలకులు ఈ స్వేచ్ఛాస్వాతంత్య్రాలను కుంచింపచేసే యత్నం చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛను ‘దేశద్రోహ’ నేరంగా పరిగణిస్తూ, బ్రిటిష్ వలస పాలకుల చట్టాలను దుమ్ము దులిపి ఆ హక్కుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. అగ్నికి కూడా చెదలేనా? ఈ దుర్దశలోనే ఈ నెల 17న పీపుల్స్ ట్రిబ్యునల్ ముందు హాజరైన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రు వ్యధతో చెప్పిన మాటలను గుర్తు చేసుకోకతప్పదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఘటనలపైన, కుల విచక్షణా ధోర ణులపైన దృష్టి సారించిన ఆ ట్రిబ్యునల్ ముందు హాజరైన విద్యార్థులను ఉద్దేశించే జస్టిస్ చంద్రు ఒక అనుభవాన్ని ఆవిష్కరించారు. అది కొట్టివేయదగినది కాదు. ఆ అనుభవం ఆయన మాటలలోనే: ‘నేను విశ్వ విద్యాలయంలో విద్యార్థిగా ఉన్నప్పుడు హాస్టల్ నుంచి మూడుసార్లు నిష్కా రణంగా గెంటేశారు. తిరిగి ప్రవేశించడానికి అనుమతించేదాకా నిరవధిక నిరాహార దీక్ష చేశాను. కొన్ని నిరంకుశ ప్రభుత్వాలు ఉన్నచోట కోర్టుల నుంచి న్యాయం కోసం ఎదురుచూడకూడదు. కోర్టులకు వెళ్లి మా విద్యార్థులం ఎన్నడూ న్యాయం పొందలేకపోయాం. ఇది అనుభవసారం. నేటికీ మార్పు లేకుండా యథాతథ పరిస్థితి కొనసాగుతున్నది- విద్యార్థులు రాజకీయాల వైపు వెళ్లకుండా పాలకవర్గాలు నిరోధించడం. అలాగే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటం నుంచి విద్యార్థులను పక్కకు తప్పుకునేటట్టు చేయడం కూడా. కానీ న్యాయం కోసం పోరాడక తప్పదు. ఎందుకంటే విశ్వవిద్యాలయ ప్రాంగణాలు మా భవిష్యత్ నాయకులను సిద్ధం చేసేందుకు ఉద్దేశించినవేనని మరచిపోరాదు. మరొక అనుభవాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఒక దళిత యువకుడు మున్సిఫ్ ఉద్యోగానికి పరీక్ష రాసి (కింది సివిల్ కోర్టుకి) దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ ఇంటర్వ్యూలో ఆ న్యాయమూర్తి అడిగాడట -‘ఇంతకూ నీ ఆరాధ్యదైవం ఎవరు?’ అని. ఇతడు డాక్టర్ అంబేడ్కర్ అనడం ఆలస్యం పరీక్షలో తప్పించేశాడని జస్టిస్ చంద్రు చెప్పారు. మన న్యాయ వ్యవస్థ కూడా కుల వ్యవస్థలోనే కొట్టుమిట్టాడుతోందని ఆయన బాధను వ్యక్తం చేశారు. నిజానికి విద్యాధికులు, హేతువాదులైన ఆచార్యులు, పౌర హక్కుల ఉద్యమ నాయకులు తమ ధోరణులను ప్రశ్నించరాదని నేటి పాల కులు ఆశిస్తున్నారు. అంతేకాదు, ఒక సమస్యను నిగ్గు తేల్చడానికి ప్రాచీనా చార్యులు నెలకొల్పిన ప్రశ్నోత్తరాల ప్రక్రియ నుంచి తప్పించడానికి జరుగు తున్న కుట్రను నిరోధించడానికీ పెద్ద ఎత్తున ఉద్యమించవలసి వస్తున్నది. పాఠాలు నేర్వని పాలకులు రాజకీయ వ్యవస్థలోనూ ప్రజాస్వామ్యానికి కూడా ఇలాంటి దుర్గతినే పట్టిస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నచోట ప్రభుత్వాలను కూల్చి (ఉదా. ఉత్తరాఖండ్, అరుణాచల్), కృత్రిమ పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పాలన ప్రవేశపెడుతున్నారు. తమ పార్టీ అభ్యర్థులు లేదా అనుచరులు, సాను భూతిపరులు అయిన గవర్నర్లను ఈ పనులలో పావులుగా ఉపయోగించు కుంటున్నారు. 20 ఏళ్ల క్రితం కర్ణాటకలో ఎస్ఆర్ బొమ్మయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ చేసిన ప్రయోగాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఫుల్బెంచ్ కొట్టివేస్తూ చీవాట్లు పెట్టింది. అయినా నేటి బీజేపీ-ఆరెస్సెస్ పరివార్ ప్రభుత్వం నిస్సిగ్గుగా అదే బాటలో ప్రయాణిస్తోంది. ఈ తప్పుడు ప్రయోగా లను ఆదర్శంగా మార్చుకున్న నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా విపక్షాలను లేకుండా చేయాలని చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న విధానాలను హైకోర్టు, సుప్రీంకోర్టు పదే పదే ప్రశ్నించినా లెక్కచేయడం లేదు. అంటే అంబేడ్కర్ చెప్పినట్టు లోపం రాజ్యాంగంలో కాకుండా రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన పాలకులలోనే ఉంది. ఈ సంగతి రాష్ట్రపతికి తెలియదని అనుకోలేం. అయినప్పుడు న్యాయ వ్యవస్థ ధర్మాసన చైతన్యాన్ని విస్తరించకూడద’ని ప్రత్యేకించి హెచ్చరించవలసిన అవసరం ఇప్పుడెందుకు వచ్చింది? బహుశా కారణం ఇది కావచ్చు. జాతిసంపద రేడియో తరంగాల మీద గుత్తాధిపత్యం కోసం కాంగ్రెస్ - యూపీఏ పాలనలో జాతీయ అంతర్జాతీయ టెలికాం కంపెనీలు సాగించిన పెనుగులాట మల్టీ నేషనల్ కంపెనీలకు లాభసాటి వ్యాపారంగా, దేశ బొక్కసానికి పెద్ద చిల్లుగా మారింది. అప్పుడు సుప్రీం జోక్యం చేసుకుని ఈ కంపెనీల ‘వేట’ ఆట కట్టించి, 2-జి కుంభకోణాలపై విచారణకు ఆదేశించింది. సుప్రీం దేశభక్తియుత చర్యలో ఈ విచారణ అగ్రగామిగా చెప్పాలి. ఈ కుంభకోణాలలో సీబీఐ డెరైక్టర్ (సిన్హా?) ఒకరు కోర్టు అభిశంసనలకు గురై కొలువు చాలించుకోవలసి వచ్చింది. కానీ ఆ తర్వాత కూడా ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ గుత్త కంపెనీలకూ, గుత్త పాలకులకూ మరో రూపంలో కొనసాగుతున్న సంబంధాలు చూస్తున్నాం. మరొక కీలక అంశం - బీజేపీ పాలకులు ధార్మిక, విద్యా, ఆరోగ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విదేశీ గుత్త ప్రత్యక్ష పెట్టుబడు లను 49 శాతం నుంచి 100 శాతానికి అనుమతిస్తున్నారు. ఈ దశలో తమ నిర్ణయాలకు, వాటిపైన వచ్చే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు (పిల్స్) న్యాయ వ్యవస్థ అడ్డుగా నిలవడం పాలకులకు ఇష్టముండదు! బీజేపీ పాలకులకూ, అత్యున్నత న్యాయ వ్యవస్థకూ మధ్య ఏడాదిన్నర కాలంగా జరుగుతున్న ‘ప్రచ్ఛన్నయుద్ధం’ (కోల్డ్వార్) దాని ఫలితమే. న్యాయ వ్యవస్థ రెక్కలు కత్తిరించేందుకు సుప్రీం స్వయంపాలిత జ్యుడీషియల్ కమిషన్ స్థానే కేంద్రపాలిత జాతీయ స్థాయి జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పరచడానికి పాలనా వ్యవస్థ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని జ్యుడీషియల్ పాలనా వ్యవస్థలో ప్రత్యక్ష జోక్యంగా న్యాయ వ్యవస్థ భావిస్తోంది. ఎజెండాలు మారితే చాలదు! కేంద్ర ప్రభుత్వ కార్య నిర్వాహక అధికారం రాష్ట్రపతిదే. ఆ అధికారాన్ని రాజ్యాంగ పరిధిలో (అధికరణ 53(1)) రాష్ట్రపతి చెలాయిస్తారు. 1970లలో ‘పిల్‘ ప్రవేశాన్ని సుప్రీం రెండు చేతులతో ఆహ్వానించి ఉండకపోతే ప్రజా వ్యతిరేక పాలకులు జ్యుడీషియరీని మరింతగా ఆట పట్టించి ఉండేవారు. అంతులే, వర్ధిచంద్ కేసులు ఈ ‘పిల్‘ కిందనే అవినీతి నిరోధక చట్టానికి పట్టుబడ్డాయి. ఈ రెండు కేసుల్లోనూ (రాజకీయులవే), బోఫోర్స్ కేసులోనూ ‘పిల్‘ ప్రభావం అసాధారణమైంది! అందుకే కార్యనిర్వాహక శక్తిగా ప్రభుత్వం పని కేవలం చట్టాలు చేయడమేకాదు, శాంతి భద్రతలు కాపాడటమే కాదు, ఆ ‘శాంతి భద్రతలు‘ ప్రజా బాహుళ్యానికి నూటికి 90 మందికి అనుభవంలో వచ్చేటట్లు చూడడం కూడా రాష్ట్రపతి అధికార పరిధిలోనిదే. ఎందుకంటే అధికరణలు 38/39 ద్వారా దేశ సంపదను దేశ ప్రజలదిగా రాజ్యాంగం ప్రకటించింది గనుక, ఆ సంపద యావన్మంది ప్రజలకు ఆచరణలో దక్కాలంటే మత ధర్మాలతో నిమిత్తం లేని ‘సెక్యులర్‘ (లౌకిక) వ్యవస్థను వెయ్యి కళ్లతో కాపాడుకోవలసిందే. ఆదివాసీలు, మైనారిటీలు, తదితర అసంఖ్యాక బడుగు, బలహీన వర్గాలూ, మనుషులూ భారతీయులు కానట్లుగా పాలక రాజకీయ పార్టీలు వ్యవహరించినంత కాలం - అదే అసలు ‘దేశద్రోహం‘. అది ’సెడిషన్’కు సరైన అర్థం! అసలు ఎజెండాలు మారాలిగానీ, జెండా రంగులు, డ్రెస్ కోడ్లు మార్చుకున్నంత మాత్రాన, అంబేడ్కర్కు, భగత్సింగ్కు మొక్కుబడిగా పూలమాలలు వేసినంత మాత్రాన వ్యవస్థ మారదు. పేదలకు అవస్థలూ తప్పవు! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
కిందిస్థాయి న్యాయ వ్యవస్థ విభజనతో మాకు సంబంధం లేదు
♦ హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం ♦ పోస్టుల భర్తీలోనూ మా పాత్ర ఉండదు ♦ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలు రూపొందించుకోవాలి ♦ తెలంగాణ సర్కారు వాదనలు వింటామన్న ధర్మాసనం ♦ ఆ తరువాతే ఈ కేసులో తీర్పును వాయిదా వేస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజనతో తమకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన కోసం హైకోర్టే స్వీయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ స్వీయ నిబంధనలను తమ ఆమోదం కోసం పంపాల్సి ఉంటుందని వివరించింది. అంతేగాకుండా కింది స్థాయి న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ ప్రక్రియలో కూడా తమ జోక్యం ఉండదని తెలిపింది. దీంతో ఈ విషయాన్ని రాతపూర్వకంగా అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన, జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినాలని భావిస్తున్నామని పేర్కొంటూ విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.. రాష్ట్ర విభజన నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన పూర్తయ్యేంత వరకు జూనియర్ సివిల్ జడ్జిల పోస్టులను భర్తీ చేయరాదంటూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, మరికొందరు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజ్ వాదనలు వినిపిస్తూ... కింది స్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో హైకోర్టు స్వీయ నిబంధనలను రూపొందించుకోవాలని, వాటిని తమ ఆమోదం కోసం పంపినప్పుడు మాత్రమే పునర్విభజన చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం తాము జోక్యం చేసుకుంటామని వివరించారు. దీంతో మరి పోస్టుల భర్తీ సంగతి ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. అందులోనూ తమకు ఎటువంటి పాత్ర ఉండదని నటరాజ్ చెప్పారు. అనంతరం పిటిషనర్ సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... పునర్విభజన చట్టాన్ని చూపి చేతులు దులుపుకొనేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన విషయంలో ఉభయ రాష్ట్రాలు తగవులాగుడుతుంటే... కేంద్రం ఏమీ పట్టనట్లు చూస్తోందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు ముందు దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు రిజిస్ట్రీ తన వైఖరిని స్పష్టంగా చెప్పలేదని, దీనివల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. మరో సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ... తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి సొంత జ్యుడిషియల్ సర్వీసు నిబంధనలు వచ్చాయని, అవి అమల్లో ఉండగా ఏపీ సర్వీసు నిబంధనల ప్రకారం పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ఇంప్లీడ్ పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రస్తుత పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగిస్తే, తరువాత వారి కేటాయింపుల సమయంలో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశముందన్నారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం... తెలంగాణ ప్రభుత్వ వాదనలు వింటామని, ఆ తర్వాతే ఈ వ్యవహారంలో తీర్పును వాయిదా వేస్తామని పేర్కొంటూ విచారణను మార్చి 3కి వాయిదా వేసింది. -
న్యాయవ్యవస్థలో మార్పులు రావాలి
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవ్యవస్థలోనూ మార్పులు రావాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ అభిప్రాయపడ్డారు. కక్షిదారులకు సకాలంలో న్యాయం అందించేందుకు వీలుగా సంస్కరణలు తీసుకురావాలన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో జరిగిన హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తుల సంఘం వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలోనే 65 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని , కోర్టుల నిర్వహణకు ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. దేశ వ్యాప్తంగా 97శాతం జిల్లా కోర్టులను కంప్యూటరీకరించామని, రూ.88 కోట్లతో పక్కాభవనాల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జస్టిస్ లోకూర్ వెల్లడించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.సి.లాహోటి ‘భారత న్యాయవ్యవస్థ -ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేస్తూ న్యాయ వ్యవస్థలో నైపుణ్యం కొరవడిందని, సామాన్యులకు న్యాయం అందించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలె మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై న్యాయమూర్తులు అందించిన సల హాలను పరిగణనలోకి తీసుకుంటామని, కేసుల పరిష్కారంలో ఈ సూచనలను ఆచరిస్తామని చెప్పారు. సమావేశంలో హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, ఎస్పీ రమారాజేశ్వరి పాల్గొన్నారు. కేసుల పరిష్కారానికి సహకరించండి సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారానికి సహకరించాలని న్యాయవాదులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్ విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తిత్వ కేంద్రాల ఏర్పాటు వల్ల న్యాయవాదుల వృత్తికి వచ్చిన నష్టం ఏమీ లేదని న్యాయవాదులకు సూచిం చారు. వివాదాల పరిష్కారానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో మధ్యవర్తిత్వం మంచి ఫలితాలను అందిస్తోందన్నారు. ఉమ్మడి హైకోర్టులో మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జస్టిస్ లోకూర్ శనివారం హైకోర్టులో మధ్యవర్తి కేంద్రాల ప్రాధాన్యంపై రాజా అండ్ రాణి వేణుగోపాల పిళ్లై స్మారకోపన్యాసం చేశారు. అంతకు ముందు ఆయన హైకోర్టు సీ బ్లాక్లో మధ్యవర్తిత్వం, రాజీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్రెడ్డి, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవ్యవస్థపై రాష్ట్రపతి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశ న్యాయవ్యవస్థపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత కారణంగా రాజ్యాంగం కల్పించిన అధికార వికేంద్రీకరణ నీరుగారిపోకూడదని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యానికి చెందిన ప్రతి అంగం తనకు నిర్దేశించిన పరిధిలోనే పనిచేయాలి కానీ, ఇతర వ్యవస్థలకు కేటాయించిన వాటిలోకి చొరబడకూడదని చెప్పారు. జాతీయ న్యాయనియమకాల కమిషన్ చట్టాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న పౌరులకు సైతం న్యాయం అందాలని, ఇందుకు న్యాయవ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు స్వర్ణోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం ప్రసంగించారు. సహనం, జ్ఞానసముర్జన వంటి వాటి కారణంగానే భారత్ ఎంతోగానే సమృద్ధి సాధించిందని, మన బహుళత్వ లక్షణం ఎన్నో కాలపరీక్షలకు తట్టుకొని నిలబడిందని ఆయన చెప్పారు. -
న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపార నమ్మకం
కర్నూలు (లీగల్) : ప్రజలకు న్యాయ వ్యవస్థపై రోజు రోజుకు అపార నమ్మకం కలుగుతుండటంతో న్యాయస్థానాలను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆర్.మురళి అన్నారు. శనివారం జిల్లా న్యాయ సేవా సదన్లో నిర్వహించిన జాతీయ ప్రజా న్యాయపీఠం (లోక్అదాలత్)ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించే సదుద్దేశంతో సుప్రీంకోర్టు ప్రజా న్యాయపీఠం (లోక్అదాలత్) చట్టం తెచ్చి కేసుల పరిష్కారం చేస్తుందన్నారు. జిల్లాలో లోక్ అదాలత్ల పట్ల ప్రజలకు చైతన్య పరిచేందుకు గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ► జిల్లా ఆరవ అదనపు జడ్జి వి.వి.శేషుబాబు మాట్లాడుతూ ప్రజాన్యాయ పీఠంలో పరిష్కారమైన కేసులకు అప్పిల్స్ ఉండవని, ఇక్కడ జరిగే పరిష్కారమే శాశ్వత పరిష్కారమన్నారు. న్యాయస్థానాల్లో ఓడిన వారు అక్కడే ఏడిస్తే.. గెలిచిన వారు ఇంటికెళ్లి ఏడుస్తారనేది పెద్దలు చెబుతుంటారన్నారు. కక్షిదారులు గెలుపు, ఓటమి సమస్య లేకుండా సామరస్యంగా పరిష్కారం చేసుకోవడమే లోక్ అదాలత్ ధ్యేయమన్నారు. ► జిల్లా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ దేశంలో ఎక్కువ పనిభారం ఉన్న వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ అని, న్యాయ వ్యవస్థపై పనిభారం తగ్గించి, కేసుల పరిష్కారం చేస్తున్న న్యాయమూర్తులకు తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. ► కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి ఎస్.ప్రేమావతి, సీనియర్ సివిల్ జడ్జిలు శివకుమార్, సి.కె.గాయత్రిదేవి, లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్, జూనియర్ సివిల్ జడ్జీలు రామచంద్రుడు, పి.రాజు, ఎం.బాబు, పద్మిని, సీనియర్ న్యాయవాదులు ఎ.చంద్రశేఖర్రావు, కోటేశ్వరరెడ్డి, పి.నిర్మల, ఆదినారాయణరెడ్డి, సీఐలు మొలకన్న, గౌతి, రామకృష్ణ, కక్షిదారులు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు. రాష్ర్టంలో జిల్లా టాప్ జిల్లా వ్యాప్తంగా శపివానం నిర్వహించిన లోక్ అదాలత్లో 2442 కేసులను పరిష్కరించారు. కర్నూలులో 1,269 కేసులు, ఆదోనిలో 131, ఆత్మకూరులో 61, బనగానపల్లెలో 23, నందికొట్కూరులో 3, నంద్యాలలో 474, పత్తికొండలో 112, ఆళ్లగడ్డలో 38, ఆలూరులో 57, డోన్లో 100, కోవెలకుంట్లలో 53, ఎమ్మిగనూరులో 117 కేసులు పరిష్కారమయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరు మాసాలుగా నిర్వహిస్తున్న మెగా లోక్ అదాలత్లో వరుసగా 6వ సారి కేసుల పరిష్కారంలో జిల్లా అగ్రభాగాన నిలువగా, రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలు నిలిచాయి. ► శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో దీర్ఘకాలంగా ఉన్న రోడ్డు ప్రమాద కేసులను పరిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 168 రోడ్డు ప్రమాద కేసులు పరిష్కరించి బాధితులకు రూ.4,10,26,000 నష్టపరిహారం అందించినట్లు లోక్ అదాలత్ జడ్జి సోమశేఖర్ తెలిపారు. ఇందులో నంద్యాలలో 106, కర్నూలు 57, ఆదోని 5 కేసులు ఉన్నాయి. -
న్యాయవ్యవస్థ, సుపరిపాలనపై భేటీ
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశం ఆదివారం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో న్యాయవ్యవస్థ-సుపరిపాలన అంశంపై చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు, పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు ఈ సమాశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ గుప్తా కూడా ఈ భేటీకి హాజరయ్యారు. -
న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి
చిత్తూరు (అర్బన్), న్యూస్లైన్: సకాలంలో కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని, ఇందుకు న్యాయమూర్తు లు, న్యాయవాదుల మధ్య మంచి వాతావరణం నెలకొనాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహణ రాష్ట్ర చైర్పర్సన్ జస్టిస్ రోహిణి పేర్కొన్నారు. ఆమె గురువారం చిత్తూరులోని న్యాయవాదుల సంఘం కార్యాలయాన్ని సందర్శించా రు. ఆమె మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర ఉన్న చిత్తూరు బార్ కౌన్సిల్ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. మహిళా న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని న్యాయవాద వృత్తిలో రాణించాలని కోరారు. ఇటీవల న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో సైతం 50 శాతానికి పైగా మహిళలు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన న్యాయసేవాసదన్ భవనం రాష్ట్రానికే ఆదర్శంగా ఉందన్నారు. అనంతరం పిల్లలపై జరుగుతున్న లైగింక వేధింపులు, దాడులను అరికట్టడంలో వ్యవహరించాల్సిన పద్ధతులపై పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు అవగాహన కల్పించారు. జస్టిస్ రోహిణిని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యం లో జిల్లాలోని న్యాయమూర్తులు ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర మెంబర్ సెక్రటరి శ్యామ్ప్రసాద్, జిల్లా జడ్జి రవి బాబు, అదనపు జిల్లా జడ్జి విజయకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.హేమలత, చిత్తూరు డీఎస్పీ రాజేశ్వరెడ్డి, రాష్ట్ర న్యాయవాదుల క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు. దాతలకు సన్మానం చిత్తూరులోని న్యాయసేవాసదన్ భవనంలో నూతనంగా నిర్మించిన సమావేశపు హాలుకు వస్తువులను విరాళాలుగా ఇచ్చిన దాతలను జ్ఞాపికలు అందజేసి దుశ్శాలువలతో సన్మానించారు. దాతలు విజయభాస్కర్, జగదీ శ్వరనాయుడు, షమీర్, వెంకటేశులునాయుడు, విజయతేజ, త్యాగరాజులునాయుడు, అశోక్రాజు, సుబ్రమణ్యంరెడ్డి, చందనరమేష్, ఎన్పీఎస్ ప్రకాష్ తదితరులు ఉన్నారు. -
పద్మనాభరెడ్డికి హైకోర్టు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ న్యాయ కోవిదుడు, సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డికి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. న్యాయ వ్యవస్థకు ఆయన చేసిన సేవలను కొనియాడింది. పద్మనాభరెడ్డి మరణం రాష్ట్రానికి తీరని లోటని విచారం వ్యక్తంచేసింది. గుండెపోటుతో ఈనెల 4న కన్నుమూసిన పద్మనాభరెడ్డికి నివాళులు అర్పించేందుకు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్జ్యోతి సేన్గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ సమావేశయ్యారు. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, అదనపు ఏజీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాదులతో పాటు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలోనే మానవ హక్కుల రక్షణ కోసం పద్మనాభరెడ్డి ఎంతో తపనపడ్డారని, చివరి వరకు అలాగే పనిచేశారని కొనియాడారు. ‘‘వృత్తిపట్ల అంకితభావం, క్రిమినల్ లా పట్ల అపారమైన విజ్ఞానం, వెరసి ఆయనకు భారీస్థాయిలో కేసులు తీసుకొచ్చాయి. హైకోర్టులో అపారమైన ప్రాక్టీస్ దృష్ట్యా ఆయన క్రిమినల్ లాలో నడిచే ఎన్సైక్లోపీడియాగా పేరుపొందారు. తన వ్యక్తిత్వంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పద్మనాభరెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. పేదలు, అణగారిన వర్గాల న్యాయవాదిగా పేరుపొందారు. ’అని జస్టిస్ సేన్గుప్తా ప్రశంసించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని తన తరఫున, తన సహచర న్యాయమూర్తుల తరఫున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పద్మనాభరెడ్డి మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.