రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Jul 24 2016 6:50 PM | Updated on Sep 4 2018 5:21 PM

అతి వేగంగా వచ్చిన లారీ పాదచారిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

అతి వేగంగా వచ్చిన లారీ పాదచారిని ఢీ కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. న్యూబోయిన్‌పల్లిలోని శంకర్ పాన్‌షాప్ వద్ద ఓ గుర్తుతెలియని వ్యక్తిని లారీ(ఏపీ01టీ 6371) అతివేగంగా ఢీ కొట్టి వెళ్ళింది. ఈ ఘటనలో వ్యకి మృతి చెందినట్లు స్థానికులు శనివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీకి తరలించారు, కాగా మృతుడి జేబులో శాలిబండ నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి బాలనగర్‌కు బస్సులో ప్రయాణించినట్లు బస్ టిక్కెట్లు లభించాయని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకునిధర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement