ఎస్కేయూ/జేఎన్టీయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సమావేశాలు సోమవారం వేర్వేరుగా నిర్వహించనున్నారు. నూతన పాలక మండలి ఏర్పాటైన తరువాత ఆయా వర్సిటీలలో నిర్వహించడం ఇదే రెండో సారి . ఎస్కేయూ పాలకమండలి సమావేశం ఉదయం 10 గంటలకు, జేఎన్టీయూ పాలక మండలి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఐఏఎస్ అధికారులు సమావేశాలకు హాజరుకాలేమని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు.