నేడే లాసెట్ | today lawcet entrance exam | Sakshi
Sakshi News home page

నేడే లాసెట్

May 24 2016 3:23 AM | Updated on Sep 5 2018 8:36 PM

రాష్ర్టంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది.

► ఎల్‌ఎల్‌బీకి 17,427 మంది, ఎల్‌ఎల్‌ఎంకు 1,793 మంది..
► 37 పరీక్షా కేంద్రాల ఏర్పాటు     
కేయూ క్యాంపస్: రాష్ర్టంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు సూచించారు.

నిర్ణీత సమయూనికి ఒక నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్‌ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతోపాటు ఆరు ఫ్లరుుంగ్ స్క్వాడ్‌లను నియమించినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement