అనంతపురం అగ్రికల్చర్ : విద్యుత్ వినియోగదారులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం బుధవారం హిందూపురం ట్రాన్స్కో డివిజినల్ ఇంజనీరు కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే అదాలత్ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని సూచించారు.