కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, ఎదురూరు విష్ణువర్థన్రెడ్డి మధ్య విబేధాలకు అధికారులు నలిగిపోతున్నారు.
కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డేగల ప్రభాకర్ కర్నూలు టు–టౌన్కు ఈ నెల 6వ తేదీన బదిలీ అయ్యారు. స్పెషల్ బ్రాంచ్లో పనిచేస్తున్న శ్రీనివాసులును కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా నియమించారు. అయితే సీఐ శ్రీనివాసులును ఎమ్మెల్యే మణిగాంధీ సిఫారస్ చేశారన్న కారణంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎదురూరు విష్ణువర్థన్రెడ్డి సీఐ నియామకాన్ని ఇన్చార్జి మంత్రి అచ్చంనాయుడు ద్వారా నిలుపుదల చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జి సీఐగా డేగల ప్రభాకర్ కొనసాగుతున్నారు.