చిలుకూరు: యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు పాఠశాల్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షెన్ స్కీం) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయిలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుండూరి ప్రసాద్రావు, జిల్లా, మండల నాయకులు ఖాదర్పాషా, బావసింగ్, రమేష్బాబు, మూర్తి, కడారు సైదులు, టీఎల్ నరసింహరావు, ఆరె బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
Published Wed, Aug 10 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement