పెరటికోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం
Published Sun, Jul 17 2016 9:12 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
నాగారం(కోనరావుపేట) : పెరటికోళ్ల పెంపకంతో మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని సర్పంచ్ గోపాడి జ్యోతి, బీజేపీ అధ్యక్షుడు సురేందర్రావు అన్నారు. నాగారంలో ఎస్సీ మహిళలకు ఆదివారం పెరటి కోల్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు సహకారంతో గ్రామంలోని 750 కుటుంబాలకు పెరటికోళ్లు పంపిణీ చేశారన్నారు. తొలివిడతలో ఒక్కో కుటుంబానికి 20 కోడిపిల్లలు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు సైండ్ల రాజు, కీసరి మురళి, బొడ్డు విమల, మ్యాకల రవి, తీగల గంగవ్వ, గడప విజయలక్ష్మి, బాస సునీత, యూత్ సభ్యులు ఊరడి మధు, ఇల్లెందుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement