
నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం
నిజామాబాద్ జిల్లాలో జనావాస ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది.
సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తల్లరమడుగు గ్రామంలో చిరుత సంచరిస్తుండటంతో.. గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని ఒడ్డెర కాలనీ వద్ద ఆదివారం రాత్రి గొర్రెల మందపై దాడి చేసిన చిరుత ఓ గొర్రెను హతమార్చింది. గొర్రెల కొట్టం సమీపంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండటంతో.. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత పాద ముద్రలను పరిశీలిస్తున్నారు. కాగా.. చిరుత ఏ క్షణాన దాడి చేస్తుందో అని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.