నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం | wandering leopard in Nizamabad district | Sakshi
Sakshi News home page

నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం

Published Mon, Jun 20 2016 10:16 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం

నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం

సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తల్లరమడుగు గ్రామంలో చిరుత సంచరిస్తుండటంతో.. గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని ఒడ్డెర కాలనీ వద్ద ఆదివారం రాత్రి గొర్రెల మందపై దాడి చేసిన చిరుత ఓ గొర్రెను హతమార్చింది. గొర్రెల కొట్టం సమీపంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండటంతో.. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత పాద ముద్రలను పరిశీలిస్తున్నారు. కాగా.. చిరుత ఏ క్షణాన దాడి చేస్తుందో అని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement