Leopard
-
కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్పూర్, షియోపూర్లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.ఉమ్రికాల గ్రామం విజయ్పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు -
పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
లక్నో: యూపీలోని లక్నోలో ఊహకందని ఉదంతం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఆనందంగా పెళ్లి వేడుకలు జరుగుతుండగా హఠాత్తుగా ఒక చిరుత ప్రత్యక్షమయ్యింది. దానిని చూసినవారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.లక్నోలోని బుద్ధేశ్వర్ రింగ్ రోడ్డులో గల ఎంఎం లాన్లో బుధవారం రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. అతిథులతో వాతావరణమంతా ఎంతో సందడిగా ఉంది. అయితే ఇంతలో ఊహకందని రీతిలో ఒక చిరుత అతిథుల మధ్యకు ప్రవేశించింది. ఈ ఘటన లక్నోలోని పారా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 11.40 నిముషాల సమయంలో ఒక చిరుత పెళ్లి వేడుకల్లోకి చొరబడింది. దానిని చూసి హడలెత్తిపోయిన అతిథులు అ విషయాన్ని పోలీసులకు ఫోన్లో తెలియజేశారు. వెంటనే పోలీసు సిబ్బంది, అటవీశాఖ అధికారులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఈ ఘటన గురించి డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ స్థానికుడు దీపక్ కుమార్ సోదరి వివాహం జరుగుతుండగా, ఈ ఘటన జరిగిందన్నారు. తమకు సమాచారం అందగానే ఒక పోలీసు బృందంతో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నదన్నారు. వెంటనే వారు కల్యాణ వేదికను ఖాళీ చేయించారని, అటవీశాఖ సిబ్బంది ఆ చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అతిథులు విందు ఆరగిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నదన్నారు. అటవీశాఖ అధికారులు మ్యారేజ్ హాలులోని రెండవ అంతస్తులో ఒక కుర్చీ వెనుక నక్కిన చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ హాలు తలుపులు మూసివేసి, దానిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కల్యాణ మండపంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను కూడా ఖాళీ చేయించామన్నారు. ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా -
వాహనం ఢీకొని చిరుత మృతి
చిన్నశంకరంపేట(మెదక్): గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో చిరుత పులి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూర్ అటవీ ప్రాంతంలో జరిగింది. గురువారం రాత్రి నార్సింగి–వల్లూర్ మధ్యన నర్సరీ సమీపంలో రహదారిపై తీవ్రగాయాలతో పడి ఉన్న చిరుతను వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వైద్యం కోసం చిరుతను తరలించేందుకుప్రయత్నిస్తున్నా క్రమంలో మృత్యువాత పడింది. మెదక్ జిల్లా అటవీ శాఖ అధికారి జోజీ, రామాయంపేట రేంజీ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. ముందు ఒక వాహనం ఢీకొన్న అనంతరం చిరుత పరుగెత్తేందుకు ప్రయతి్నంచిన క్రమంలో మరో వాహనం ఢీకొని ఉండవచ్చని, నడుముకు, పొట్ట భాగంలో తీవ్ర గాయాలు కావడంతో అది మృతి చెందిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని నడిరోడ్డుపై చిరుత మృతిమెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో NH-44పై రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంనడుము విరిగి పలు చోట్ల గాయాలు కావడంతో నడిరోడ్డు పైనే చిరుత మృతి pic.twitter.com/KpHzjenKCw— Telugu Scribe (@TeluguScribe) January 31, 2025 -
తిరుమల, ఎస్వీ యూనివర్సిటీలో చిరుతల సంచారం
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం రాత్రి సమయంలో యూనివర్సిటీ ఆవరణలో చిరుత.. ఓ కుక్కను వేటాడి ఎత్తుకెళ్లడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఎస్వీ యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. తాజాగా క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లింది. దీంతో, యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, స్కాలర్స్ , హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అయితే, గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలు ఉన్నాయంటూ ఫ్లెక్సీలు అక్కడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చిరుతను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు.ఇక, తిరుమలలో కూడా చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
తిరుమలలో చిరుత కలకలం.. సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ వద్ద అలర్ట్!
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి చిరుత సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత సంచారం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. దీంతో, వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించారు.వివరాల ప్రకారం.. తిరుమలలో చిరుత సంచారం భక్తులను మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు భక్తులు గుర్తించారు. ఈ క్రమంలో వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే, ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులను టీటీడీ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. -
రంగారెడ్డి జిల్లాలో చిరుత కలకలం
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం రేపింది. సైన్స్ సెంటర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తున్న చిరుతను బైక్ ఢీకొట్టింది. దీంతో టీటీడీ ఉద్యోగి మునికుమార్ బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. రుయాకు ఆసుపత్రికి తరలించారు. అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది.కాగా, ఎస్వీయూలో చిరుత కదలికలనూ ప్రత్యేకంగా అమర్చిన 10 సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్టు ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఆర్ఓ సుదర్శన్, వన్యప్రాణి జీవశాస్త్రవేత్త సౌజన్య తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం వర్సిటీ రిజిస్ట్రార్ భూపతి నాయుడును కలిసి వర్సిటీ ప్రాంగణంలో చిరుత కదలికలపై పూర్తి సమాచారాన్ని అందించారు. అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వర్సిటీలో ప్రధానంగా రాత్రి ఒంటిగంట సమయంలో జంటలు జంటలుగా తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.క్యాంటీన్ల వద్ద ఆహార వ్యర్థాల నిర్వహణ సరిగా లేదని, దీంతో వీధి కుక్కల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు, పాదచారులు, వర్సిటీలోకి వచ్చే బయటి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు వర్సిటీలో తిరగకూడదని, ఎక్కడబడితే అక్కడ కూర్చోకూడదని స్పష్టం చేశారు. చిరుత తనకన్నా చిన్న సైజు కలిగిన జంతువులను, కుక్కలను, జింకలను, ఆవులు, గేదెలను ఆహారంగా తీసుకెళుతుందన్నారు.వర్సిటీలో కుక్కల బెడద చిరుతకు మంచి అవకాశంగా చేసుకుందని, వ్యర్థ ఆహార పదార్థాల నిర్వహణను క్యాంటీన్ల వద్ద, హాస్టల్లో విధిగా పాటించాలని చెప్పారు. కుక్కల కోసం పాదచారులు ఆహారాన్ని అందించకూడదన్నారు. జాగ్రత్త పట్టికలను ఏర్పాటుచేసి అందులో ఈ మెయిల్స్ వాట్సాప్, ఫోన్ నంబర్ల వివరాలు ఉంచాల ని సూచించారు. వర్సిటీకి అడవి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నివాసం ఉండేవారు పెంపుడు జంతువులు పెంచుకోకూడదని సూచించారు. చిరుత సంచారాన్ని గుర్తిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.ఇదీ చదవండి: ఎటు చూసినా సంక్రాంతి రద్దీ.. ప్రత్యేక రైళ్లతో ప్రయాణికులకు చుక్కలే -
చిరుతను బంధించిన ధైర్యశాలి
తుమకూరు: చిరుత కనిపించిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆమడ దూరం పరిగెడతారు. అయితే ఓ యువకుడు ధైర్యసాహసాలు ప్రదర్శించి, ప్రాణాలకు తెగించి ఓ చిరుతను తోక పట్టుకొని బోనులోకి నెట్టేశాడు. ఈఘటన జిల్లాలోని తిపటూరు తాలూకా రంగాపురం వద్ద జరిగింది.గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేయగా అటవీశాఖ అధికారులు సమీపంలో బోను ఏర్పాటు చేశారు. పరలేహళ్లి రోడ్డులోని కుమార్ అనే వ్యక్తికి చెందిన తోటలో చిరుత నిద్రావస్థలో ఉండగా దానిని బంధించేందుకు అటవీ అధికారులు, సిబ్బంది సకల సరంజామాతో వచ్చారు.అయితే చిరుతను పట్టుకునేందుకు భయంతో వెనుకాడుతుండగా గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు ముందుకు వచ్చాడు. చిరుత తోకను పట్టుకుని బోనులోకి లాగి పడేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న అటవీ సిబ్బంది వల విసిరి చిరుతను బంధించడంలో సఫలమయ్యారు. కాగా యువకుడి ధైర్యసాహసాలను పలువురు ప్రశంసించారు. The #forest department officials with the help of a local youth Anand captured a #leopard at Rangapur Village in #Tumakuru... pic.twitter.com/QFrdogAvqt— Yasir Mushtaq (@path2shah) January 7, 2025 -
శ్రీశైలంలో చిరుత పులి
-
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
చిరుత ఎంట్రీతో..ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోం ఆఫర్ ..!
న్యూ ఈయర్ సంబరాల వేళ కూడా ఆఫీన్ అంటే ప్చ్..! ఏంటిదీ అనే ఫీల్ వచ్చేస్తుంది. డిసెంబర్ 31తో ఈ ఏడాదికి ముగింపు పలికే కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పే సందడి టైంలో మనవాళ్లతో ఉంటే ఆ ఫీల్ వేరుకదూ..!. కానీ ఉద్యోగ బాధ్యతల రీత్యా వెళ్లాల్సిందే. కానీ చిరుత ఎంట్రీతో జాక్పాట్ లాంటి అవకాశం కొట్టేశారు టెక్కీ ట్రైనీ ఉద్యోగులు. ఎక్కడంటే..మైసూర్లోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఈ ఆఫర్ని ఇచ్చింది. డిసెంబర్ 31న ట్రైనీ ఉద్యోగులంతా ఇంటి నుంచే పనిచేసేలా వర్క్ ఫ్రమ్ హోం(Work From Home)ని అమలు చేసింది. మైసూర్(Mysuru) ఇన్ఫోసిస్ క్యాపస్లో చిరుత(leopard) ప్రవేశించడంతో ఈ నిర్ణయం తీసుకుంది టెక్కంపెనీ. ఈ నేపథ్యంలోనే క్యాంపస్ లోపలికి ఎవరినీ అనుమతించవద్దని భద్రతా బృందాన్ని కూడా ఆదేశించినట్లు తెలిపింది. అలాగే తన కంపెనీ ట్రైనీ ఉద్యోగులను ఈ రోజు(డిసెంబర్ 31న) ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా కోరినట్లు పేర్కొంది టెక్ కంపెనీ. ఇదిలా ఉండగా, మంగళవారం ఇన్ఫోసిస్ మైసూరు క్యాంపస్లోకి చిరుత ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ చిరుతను పట్టుకునేందుకు టాస్క్ఫోర్స్ తెల్లవారుజామున 4 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఫారెస్ట్ అధికారి ఐబీ ప్రభుగౌడ్ తెలిపారు. కాగా, ఇలా టెక్ కంపెనీ ఆవరణలో చిరుత ప్రవేశించడం తొలిసారి కాదు. గతంలో 2011లో ఇలానే చిరుత క్యాంపస్లోకి ప్రవేశించి కలకలం సృషించింది. (చదవండి: ట్రా'వెల్నెస్' టిప్స్..! ప్రయాణాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..) -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
మహానందిలో చిరుతపులి కలకలం
-
పెంచలకోన దేవస్థానం సమీపంలో చిరుత సంచారం..
-
మియాపూర్: ‘చిరుత కాదు.. అడవి పిల్లి’
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్ నగరంలోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత పులి సంచరించినట్లు నిన్న (శుక్రవారం) సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఓ వీడియో తీవ్ర కలకలం రేపింది. ఆ వీడియోపై అటవీశాఖ అధికారులు క్లారీటీ ఇచ్చారు. మియాపూర్ సంచరించింది చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు నిర్ధారించారు. శుక్రవారం మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ సంచరించిన జంతువు.. చిరుత పులి కాదని.. అడవి పిల్లిగా అధికారులు తేల్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.చదవండి: కలెక్టర్..ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు? -
హైదరాబాద్ లో చిరుత కలకలం
-
బహ్రాయిచ్లో పట్టుబడిన చిరుత
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో జనాలపై దాడి చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది. దానిని అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు. ఆ చిరుత ఒక బాలికతో పాటు వృద్ధురాలిపై కూడా దాడి చేసింది. చిరుత పట్టుబడటంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.దీనికిముందు గత సోమవారం అటవీశాఖ అధికారులు ఒక చిరుతను పట్టుకున్నారు. ఇప్పుడు రెండో చిరుతపులిని పట్టుకున్నారు. కతర్నియాఘాట్ అటవీ ప్రాంత పరిధిలోని పలు గ్రామాల్లో చిరుతలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఒక చిరుత 13 ఏళ్ల బాలికపై దాడి చేసి గాయపరిచింది. ఇదేవిధంగా 80 ఏళ్ల రెహమానా ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసింది. ఆ చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు గ్రామ సమీపంలోని చెరుకు తోటలో బోనును ఏర్పాటు చేశారు. కొద్దిసేపటికి చిరుత ఆ బోనులో చిక్కింది. పోలీస్ స్టేషన్ హెడ్ హరీష్ సింగ్, రేంజర్ రోహిత్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చిరుతను ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించి, అటవీశాఖ రేంజ్ కార్యాలయానికి తరలించారు.ఇది కూడా చదవండి: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి -
పూజారిని చంపిన చిరుత.. 10 రోజుల్లో ఆరో ఘటన
ఉదయపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో చిరుతపులి భీభత్సం కొనసాగుతోంది. తాజాగా గోగుండాలో ఒక పూజారిపై చిరుతపులి దాడి చేసింది. ఈ దాడిలో పూజారి మృతిచెందాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ చిరుతపులి ఆలయంలోని పూజారిని నోట కరుచుకుని లాక్కుపోయింది.కొద్దిసేపటికి ఆలయానికి కొంత దూరంలో పూజారి మృతదేహం స్థానికులకు కనిపించింది. నిత్యం చిరుతపులి దాడులతో గ్రామస్తులు భయాందోళనలకు లోనవుతున్నారు. గడచిన 10 రోజుల్లో చిరుత ఆరుగురిపై దాడి చేసింది. ఇదేవిధంగా గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చిరుతపులి దాడిలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు బాయి(65) ఇంట్లో ఒంటరిగా ఉంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆమె కనిపించలేదు. స్థానికులు అడవిలో గట్టు బాయి మృతదేహం కనిపించింది.మరోవైపు గోగుండ అడవుల్లో ఒక చిరుతపులి అటవీశాఖ అధికారులకు పట్టుబడింది. గోగుండ పోలీస్ స్టేషన్ పరిధిలో చిరుతపులి దాడుల్లో ఐదుగురు మృతిచెందారు. ఇటీవల ఐదేళ్ల బాలిక చిరుతపులి దాడిలో మృతి చెందింది. సూరజ్ (5) అనే బాలికను చిరుత నోట కరచుకుని, పొలాల్లోకి తీసుకెళ్లి చంపేసింది. గ్రామస్తులు ఆ బాలిక కోసం వెతకగా, ఆ చిన్నారి మృతదేహం వారికి లభ్యమైంది.ఇది కూడా చదవండి: AP: ఇంట్లో పేలిన డిటోనేటర్లు.. వీఆర్ఏ మృతి -
శ్రీవారి భక్తులకు హెచ్చరిక..
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం
సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారిమెట్టు వద్ద చిరుత పులి కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత రావడంతో కుక్కలు అరుస్తూ వెంబడించాయి. చిరుతపులి వాటిపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డు దీపక్ అప్రమత్తమయ్యాడు. కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నాడు.శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం 5 గంటలకు భక్తులను శ్రీవారిమెట్టుకు వదిలారు. అదే సమయంలో గార్డు దీపక్ గది నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీ శాఖ అధికారులకు చిరుత గురించి సమాచారమిచ్చాడు. తర్వాత కాలి నడక భక్తులను గుంపులు, గుంపులుగా వదులుతున్నారు.మరోవైపు, చిరుత సంచారంతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల ప్రజలు కొన్నిరోజుల నుంచి భయాందోళనకు గురవుతున్నారు. బుర్రిలంకలోని నర్సరీ, పరిసరాల్లో అమర్చిన ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు నమోదు కాలేదని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు.శనివారం రాజమహేంద్రవరంలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తెలిపిన అనుమానాస్పద ప్రదేశాల్లో సిబ్బంది వెళ్లి గమనించగా, అవి కుక్కల పాదముద్రలుగా గుర్తించామన్నారు. దివాన్చెరువు అటవీ ప్రాంతంలో ట్రాప్, సీసీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు గుర్తించలేదన్నారు.బుర్రిలంక సమీపంలోని గోదావరి లంకల్లో జింకలు ఉంటాయి కాబట్టి అటువైపు చిరుతపులి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. ఆదివారం నుంచి గోదావరి లంకల్లో సిబ్బంది బృందాలుగా ఏర్పడి గమనిస్తారన్నారు. కడియపులంక సర్పంచ్ పాటంశెట్టి రాంజీ, గ్రామస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. అసత్య ప్రచారాలు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని వివరించారు.ఇదీ చదవండి: బ్రహ్మూత్సవాలకు వెళాయే -
ట్రాప్ కెమెరా నుంచి తప్పించుకున్న చిరుత..
-
రాజమండ్రిలో రూట్ మార్చిన చిరుత..
-
రాజమండ్రి: రూట్ మార్చిన చిరుత
రాజమహేంద్రవరం రూరల్/కడియం: దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరించిన చిరుత పులి కడియం నర్సరీ ప్రాంతానికి చేరినట్టు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. కడియం – వీరవరం రోడ్డు మధ్యలోని దోసాలమ్మ కాలనీలో చిరుత జాడలు కనిపించాయి. దీంతో కాలనీ వాసులందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న దివాన్ చెరువు ఫారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పద్మావతి, రేంజర్ శ్రీనివాస్, స్క్వాడ్ డీఆర్వో రాజా అండ్ టీమ్, రేంజ్ పరిధిలోని సిబ్బంది ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలే అని గుర్తించారు. అయితే అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనే విషయం అంతుపట్టడం లేదు. కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి. పులి భయంతో నర్సరీల్లో రైతులెవ్వరూ ఉండడం లేదు. చిరుత ఈ ప్రాంతంలోనే ఉందా, ఎక్కడికైనా వెళ్లిందా అన్న విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు, కూలీలకు బుధవారం నర్సరీలకు వెళ్లవద్దని సూచించారు. -
బెంగళూరులో చిరుత పులి సంచారం కలకలం
కర్ణాటకలోని బెంగళూరులో చిరుత పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. తుమకూరు రోడ్..హోసూర్ రోడ్ మధ్య ఫేజ్ 1 టోల్ ప్లాజ్ ఉంది. ఆ టోల్ ప్లాజా దగ్గరలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి.మంగళవారం ఉదయం తెల్లవారుజామున 3.00 గంటలకు చిరుతపులి టోల్ప్లాజా సమీపంలోని ఫ్లైఓవర్ను దాటుతున్నట్లు టోల్ ఫ్లాజా అధికారులు గుర్తించారు. పనక్ ఇండియా కంపెనీ ప్రాంతం నుండి నెట్టూర్ టెక్నికల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (ఎన్ టీటీ ఎఫ్ ) వైపు చిరుత పులి వెళ్లినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీటీఎఫ్ ప్రిన్సిపల్ సునీల్ జోషి మాట్లాడుతూ.. టోల్ గేట్ సమీపంలోని కెమెరాలో కాంపౌండ్ వాల్ దగ్గర నుండి చిరుతపులి వెళ్ళినట్లు మాకు సమాచారం వచ్చింది. వెంటనే మేం ఇనిస్టిట్యూట్ లలో అన్నీ గదులను, సీసీటీవీ ఫుటేజీలను తనిఖీ చేశాం.ఎక్కడా పులి ఆనవాళ్లు కనిపించలేదు. క్యాంపస్లో ముందస్తు తనిఖీలు నిర్వహించాం. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాం. అధికారులు క్యాంపస్ ను పరిశీలించారు. చిరుతపులి కాంపౌండ్ ప్రక్కన ఉన్న దగ్గర నడుస్తూ కనిపించింది. కాని ఆ తరువాత ఎక్కడికి వెళ్లిందో మాకు తెలియదు’ అని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ తరగతులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇదీ చదవండి : రూటు మార్చిన ఇజ్రాయెల్ -
రాజమండ్రి శివారు ప్రజల్ని భయపెట్టిస్తున్న చిరుత
-
వారం రోజులు గడుస్తున్నా అటవీ శాఖ అధికారులకు చిక్కని చిరుత
-
రాజమండ్రిలో చిరుత పులి కలకలం
-
రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు!
తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. జనసంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డ్ కాలనీ,. స్వరూప్ నగర్, రూప్ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. -
రాజమండ్రిలో చిరుత కలకలం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో చిరుత సంచారం కలకలం రేపింది. జాతీయ రహదారి సమీపంలో దూరదర్శన్ కేంద్రం వెనుక చిరుత సంచరించినట్లు ఆనవాళ్లను గుర్తించారు.చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్ కేంద్రం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శివారు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుత కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
భార్యాబిడ్డల కోసం చిరుతకే పంజా విసిరిన మొనగాడు
చిరుత పులి లేదా మచ్చలపులి ఉన్నట్టుండి మనకు ఎదురుపడితే.. దాడి చేస్తే. అమ్మో, అసలు ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ ఒక వ్యక్తి మాత్రం తన భార్యా బిడ్డల్ని కాపాడుకునేందుకు ఏకంగా చిరుతపులిపైనే పంజా విసిరాడు. చేతిలో ఎలాంటి ఆయధం లేకుండానే దాని ఎదుర్కొన్నాడు. పిడిగుద్దులతో దానికి చుక్కలు చూపించాడు. శరీరం రక్తమోడుతున్నా ఏ మాత్రం భయపడలేదు. ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డను, భార్యను కాపాడుకోవడమే లక్ష్యం. అందుకే ప్రాణాలకు తెగించి మరీ పోరాడి దాన్ని మట్టి కరిపించి హీరోగా నిలిచాడు కర్ణాటకకు చెందిన గోపాల్ నాయక్. వాస్తవానికి ఈ సంఘటన 2021లో జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు 200 కి.మీ దూరంలోని అరసికెరె సమీపంలోని బెండేకెరె గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ స్టోరీ మరోసారి రౌండ్లు కొడుతుంది. మిక్కు అనే ఎక్స్ యూజర్ ఈ ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.-Leopard attacks his daughter -He comes to the rescue -KiIIs leopard with bare hands Not a textbook hero, but a real brave 👑 pic.twitter.com/PuUpLGLDzn— Mikku 🐼 (@effucktivehumor) July 29, 2024 -
మహానందిలో ప్రజలను భయపెడుతున్న చిరుత
-
నల్లగొండ జిల్లా చింతపల్లిలో చిరుత కలకలం
-
యువకుడిపై చిరుత దాడి.. మహానందిలో కలకలం
నంద్యాల: నంద్యాల జిల్లాలోని మహానందిలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మంగళవారం మహానందిలోని ఈశ్వర్ నగర్ సమీపంలో ఓ యువకుడిపై చిరుత పులి దాడి చేసింది. దీంతో ఈశ్వర్ నగర్ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.గత నెల రోజుల నుండి మహానంది చుట్టే ఓ చిరుత సంచరిస్తోంది. ఇవాళ యువకుడిపై దాడి మహానందిలో కలకలం రేపుతోంది. ఇప్పటికైనా చిరుత పులిని బంధించాలని స్థానికులు కోరుతున్నారు. -
మెదక్ జిల్లాలో చిరుత సంచారం
-
వామ్మో చిరుత
మహానంది: వదల బొమ్మాళీ.. నిన్నొదలా! అంటుంది చిరుతపులి. ఒకటి కాదు, రెండు కాదు పలు పర్యాయాలు మహానంది ఆలయ పరిసరాల్లోకి వస్తుండటంతో భక్తులు, స్థానికులు భయాందోళన చెందుతోంది. తాజాగా శుక్రవారం తెల్లవారుజామున గోశాల ప్రాంగణంలోకి మరోసారి చిరుతపులి రావడం కలకలం రేపింది. నల్లమల వైపు నుంచి వచ్చిన చిరుతపులి గోశాల వద్ద టెంపుల్ రోడ్డు మీదుగా వచ్చి తిరిగి అడవివైపు వెళ్లినట్లు స్థానిక దేవస్థానం సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి మహానంది ఈశ్వర్నగర్, పార్వతీపురం, పాత బంగ్లా, గోశాల ప్రాంగణంలోనే ఉంటుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. రెండ్రోజుల క్రితం నవనంది పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కృష్ణనంది ఆలయం వద్ద ఓ చిరుతపులి కనిపించిన విషయం తెలిసిందే. గోశాల ప్రాంగణం వైపు పలు ప్రాంతాల భక్తులు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటవీ అధికారులు వెంటనే స్పందించి చిరుతను బంధించి సుదూర ప్రాంతాలకు తరలించాలని భక్తులు కోరుతున్నారు. -
నంద్యాల జిల్లాలో మరోసారి చిరుత కలకలం
-
నంద్యాల జిల్లాలో చిరుత పులుల కలకలం
-
మహానంది క్షేత్రంలో మళ్లీ చిరుత కలకలం..
-
మహానంది ఆలయంలో చిరుత
-
నంద్యాల: బోనుకి చిక్కిన మ్యాన్-ఈటర్ చిరుత!
కర్నూలు, సాక్షి: ఒక మనిషి చంపి.. పచ్చర్ల సమీప గ్రామ ప్రజలకు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. కుక్క కోసం వచ్చి బోనులో చిరుత చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. పచ్చర్ల టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో కుక్కను ఎరగా వేయగా.. గత అర్ధరాత్రి చిరుత వచ్చి చిక్కుకుపోయింది. ఈ చిరుత మూడు రోజుల కిందట మెహరున్నీసాను చంపడంతో పాటు మరో ఇద్దరిపైనా దాడి చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీల పైనా కూడా దాడి చేసినట్లు సమాచారం. దీంతో అధికారులు చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చివరికి.. చిరుతను బంధించడంతో పచర్ల వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ చిరుతను సురక్షిత ప్రాంతానికి తరలిస్తారా లేక తిరుపతి జూ కు తరలిస్తారా అనేది చూడాలి.మరోవైపు.. మహానంది సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానంది ఆలయ పరిసరాల్లో గత ఆరు రోజుల నుంచి ప్రతి రోజు తిరుగుతున్న మరో చిరుత.. భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారిస్తుండటంతో మహనందిలో భారీగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. -
నంద్యాల జిల్లాలో చిరుత భయం
-
శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
సాక్షి,రంగారెడ్డి : శంషాబాద్లో వరుసగా రెండోసారి చిరుత ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘాంన్సీమియాగుడా గ్రామ శివారులో చిరుత అనవాళ్లు కనిపించాయి.పొలంలో చిరుత సంచరించినట్లు రైతులు ఆనావాళ్లు గుర్తించారు. వెంటనే చిరుతను గుర్తించాలని అటవిశాఖ అధికారులకు ఫోన్ చేశారు. అయితే అధికారులు స్పందించ లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల్లో కనిపించిన జంతువు జాడల్ని కనిపెట్టాలని కోరుతున్నారు. గ్రామంలో వ్యవసాయంపై అదారపడే తాము పొలం వెళ్లాలంటే అరచేతిలో ప్రాణాల్ని పెట్టుకొని వెళ్తున్నామని, వెంటనే అధికారులు సకాలంలో స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.కాగా, నెల రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చిరుతతో పాటు రెండు పిల్లలు ఎయిర్ పోర్టు లోపలికి ప్రవేశించేందుకు ప్రహరీ దూకేందుకు ప్రయత్నించాయి. అయితే ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూం అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే చిరుతను, దాని పిల్లల్ని బందించారు. ఆ సంఘటన మరువక ముందే మళ్ళీ చిరుత అనవాళ్లు గుర్తించడంతో స్థానికుల్లో భయాందోళన మొదలైంది. -
ఆపరేషన్ చిరుత సక్సెస్
-
చిరుత చిక్కింది..
-
కొత్తపల్లిలో చిరుత కలకలం
-
‘‘రాష్ట్రపతి భవన్లోకి వచ్చింది పులి కాదు.. పిల్లి’’
న్యూఢిల్లీ: మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమంలోకి వచ్చిన జంతువు చిరుతపులి కాదని కేవలం పిల్లి అని తేలింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు సోమవారం(జూన్10) క్లారిటీ ఇచ్చారు.మంత్రుల ప్రమాణస్వీకారం సందర్భంగా వెనుకాల కారిడార్లో నడుస్తూ లైవ్ కెమెరాలకు చిక్కింది ఇళ్లలో తిరిగే పిల్లి అని పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్లోకి చిరుత పులి వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టింది.ఇది భద్రతా వైఫల్యమేనని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే ఇవేవీ నిజం కావని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అలాంటి రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. -
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పులి?.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. దేశ, విదేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో సహా 8 వేల మంది అతిథులు హాజరయ్యారు.అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో జరిగిన ఈ వేడుకలో ఆహ్వానం లేదని ఓ అతిథి ప్రత్యక్షమైంది. ప్రమాణస్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉయికే.. రాష్ట్రపతి ముర్ముకు అభివాదం చేస్తుండగా.. స్టేజీ వెనక భాగంలో ఓ జంతువు అటుగా వెళుతూ కెమెరా కంటికి చిక్కింది. ప్రమాణ స్వీకార వేదికకు కాస్త దూరంలోనే సంచరించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సోషల్మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తొలుత ఫేక్ వీడియో లేదా ఏఐ జనరేటెడ్ వీడియో అని కొట్టిపారేశారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నిన్న షేర్ చేసిన యూట్యూబ్ లైవ్ ఫీడ్ను పరిశీలించినప్పుడు.. ఓ జంతువు సంచరించడం నిజమేనని తేలింది.అది చూడటానికి పులిలా కనిపించింది. కానీ ఆ జంతువు పెంపుడు పిల్లి అని, లేదా కు అయి ఉండవచ్చిన పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక కొంతమంది ఈ దృశ్యాలను కూడా నమ్మడం లేదు, బ్యాగ్రౌండ్లో ఎడిట్ చేసి చూపిస్తున్నారని చెబుతున్నారు. మరికొందరైతే అతి కచ్చితంగా చిరుతపులిలా కనిపిస్తుందని, అక్కడి వారు అదృష్టవంతులు దాని బారి నుంచి తప్పించుకున్నారని కామెంట్ చేస్తున్నారు. దీనిపై రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.An animal was seen strolling back in the Rashtrapati Bhavan after MP Durga Das finished the paperwork~ Some say it was a LEOPARD while others call it some pet animal. Have a look 🐆 pic.twitter.com/owu3ZXacU3— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) June 10, 2024 -
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
-
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
-
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ఆపరేషన్ చిరుత ఎట్టకేలకు సక్సెస్ అయ్యింది. బోను దాకా వచ్చి.. ఎరకు చిక్కకుండా ఐదు అటవీశాఖ అధికారుల్ని ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని పట్టుకోవడానికి ఐదు బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు.ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు తరలించనున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
ఢిల్లిలో చిరుత కలకలం.. ఐదుగురు ఆస్పత్రికి!
ఢిల్లిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వాసులను వణికిస్తున్న చిరుత పట్టపగలే మరోసారి దర్శన మిచ్చింది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఉత్తర ఢిల్లిలో రూప్ నగర్లో చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో ముగ్గురిపై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట చక్కర్లు కోడుతుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక బృందం సాయంతో ఎట్టకేలకు దానిని బంధించారు. దీంతో అక్కడి జనం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందం నానా కష్టాలు పడినట్టు సమాచారం. చిరుతని గదిలో బంధించామని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. STORY | Leopard barges into house in Delhi's Roop Nagar, 5 injured READ: https://t.co/EbH7OulTMV VIDEO: (Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH — Press Trust of India (@PTI_News) April 1, 2024 -
ఏం బుర్రరా అయ్యా! చిరుతకే షాకిచ్చాడు..!
చిరుతపులి వస్తే పెద్దవాళ్లమే కంగారు పడిపోతాం.. అస్సలు ఏం చేయాలో తోచదు.. కానీ ఒక 12 ఏళ్ల బుడ్డోడు మాత్రం భలే చాకచక్యంగా వ్యవహరించాడు. అదీ చాలా తాపీగా...దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వైరల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన నాసిక్లోని మాలేగావ్లో వెలుగుచూసింది. మోహిత్ అహిరే (12) ఇంటి మెయిన్ డోర్ తలుపు దగ్గరే ఉన్న సోఫాలో కూర్చుని స్మార్ట్ఫోన్ మొబైల్ గేమ్లో మునిగిపోయాడు. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలియదుగానీ, నేరుగా ఇంట్లోకి వచ్చేసింది చిరుతపులి. అనూహ్యంగా మోహిత్కి అతి సమీపంనుంచే లోపలికి దర్జాగా ఎంట్రీ ఇచ్చేసింది. ఇది చూసిన మోహిత్ ఏమాత్రం కంగారు పడకుండా అక్కడినుంచి లేచి, బయటికి వచ్చేసి, తలుపు లాక్ చేశాడు. ఈ దృశ్యాలు సీసీటీవలో రికార్డ్ అయ్యాయి. అతని రియాక్షన్ ఇపుడు ఇంటర్నెట్లో ప్రశంసల్ని దక్కించు కుంటోంది. వన్య ప్రాణులు ఎదురుపడి నపుడు ప్రశాంతంగా ఉండటం, అక్కడినుంచి తప్పించుకోవడం అనే విషయాలను గుర్తు చేసింది. What an amazing presence of mind Mohit Ahire, a 12-year-old boy, locked a leopard inside an office cabin until assistance arrived in Malegaon & the leopard was rescued. Mohit immediately informed his father, who is a security guard, that he trapped a leopard inside the office. pic.twitter.com/FELlOGac1t — Anshul Saxena (@AskAnshul) March 6, 2024 మోహిత్ అహిరే తండ్రి మ్యారేజ్ హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఆఫీస్ క్యాబిన్లో కూచుని గేమ్ ఆడుకుంటుండగా మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు వచ్చేంతవరకు ఆఫీసు క్యాబిన్లో దానిని బంధించారు. ‘‘ముందు దాన్ని చూడగానే షాక్ అయ్యా..కానీ, వెంటనే తేరుకుని బైటపడ్డా..తలుపును వేగంగా లాక్ చేశా..’’అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు మోహిత్ అంతకుముందే సమీప నివాస ప్రాంతంలో చిరుతపులిని గమనించారు స్థానికులు. తరువాత మ్యారేజ్ హాల్ యజమానికి ఫిర్యాదు మేరకు పోలీసులు, అటవీశాఖ అధికారులు , అధికారులు వేగంగా స్పందించారు. ఐదేళ్ల మగ చిరుతపులిని బంధించారు. సమీపంలోనే వ్యవసాయ పొలాలు, నది ఉండటం వల్ల ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు చిరుతపులులు కనిపిస్తున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
చిరుతతో సెల్ఫీ కోసం ఎగబడ్డ జనం!
నారాయణపేట, సాక్షి: చిరుత పులితో సెల్ఫీ దిగేందుకు జనం ఎగబడ్డ ఘటన శనివారం నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. దామరగిద్ద మండలం కాంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో మూడు చిరుతలు తిరుగుతాయనే సమాచారంతో చుట్టుపక్కల జనం ఎగబడ్డారు. ఆ సమయంలో జనం రాకను చూసి పిల్ల చిరుతలు పరారయ్యాయి. అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి చిరుత నిస్సహాయ స్థితిలో అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. దీంతో కొందరు యువకులు ఫొటోలు-వీడియోలు తీసేందుకు.. ఆ చిరుతతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈలోపు సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని దానిని పరిశీలిస్తున్నారు. -
తిరుమలలో చిరుత..టీటీడీ కొత్త నిబంధనలు
-
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం
-
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్లు సంచారం కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. చిరుతతో పాటు ఎలుగుబంట్లు కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నడకమార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఈవోకు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు. ఇదీ చదవండి: కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు! -
తిరుమల: మరోసారి భయపెట్టిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల్ని మరోసారి చిరుత భయపెట్టింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ స్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. నడకదారిలో గుంపులుగా భక్తులను పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
అలిపిరి మార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు సంచారం
సాక్షి, తిరుపతి: అలిపిరి-తిరుమల నడకదారిలో మరోమారు చిరుత, ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. ఈ మేరకు భక్తులను అప్రమత్తం చేస్తూ శుక్రవారం రాత్రి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఒక ప్రకటన విడుదల చేసింది. అలిపిరి నడక మార్గంలో ఈనెల 24 నుంచి 27వ తేదీ మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు కెమెరా ట్రాప్లో నమోదైంది. దీంతో నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. వరుస దాడుల ఘటనల తర్వాత.. ఈ మార్గంలో ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. భక్తుల భద్రత తమకు మొదటి ప్రాధాన్యం అని చెబుతున్న టీటీడీ.. ఈ మేరకు అవసరమైన చర్యలను తీసుకుంటోంది. మరోవైపు నడక మార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటు పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నిపుణుల కమిటీ ఈ ప్రాంతంలో సర్వే చేపట్టింది. ►అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత, ఎలుగు బంటి సంచారం రికార్డయ్యింది. నరసింహస్వామి ఆలయం నుంచి ఏడవ మైలు ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వీటి సంచారం గుర్తించారు. మూడు రోజులుగా వేకువజామున, రాత్రి సమయాల్లో అవి సంచరిస్తున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారి భక్తులు అప్రమత్తంగా ఉండాలి :::వైల్డ్ లైఫ్ అధికారులు -
చిరుత కుటుంబం ఇంత సన్నిహితమా?
వన్యప్రాణులకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు, వీడియోలను తరచూ పంచుకునే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో పర్షియన్ చిరుతపులి కుటుంబానికి సంబంధించిన ఫుటేజీని షేర్ చేశారు. తుర్క్మెనిస్తాన్ వన్యప్రాణి సంరక్షకుడు నరిన్ టి రోసెన్ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరా ద్వారా ఈ దృశ్యాలు చిత్రీకరించారు. చిరుతపులి ఉపజాతిలో పర్షియన్ చిరుతపులి అతిపెద్దది. ప్రస్తుతం అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉంది. ప్రపంచంలో వెయ్యికి తక్కువగానే ఈ జాతి చిరుతపులులు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ‘పర్షియన్ చిరుతపులి కుటుంబం వసతి ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు.. ట్రాప్ కెమెరా ముందు.. మీరు చూస్తున్న ఈ అద్భుత వీడియో గొప్పదనం @NarynTRకి చెందుతుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ జతచేశారు. ఈ అరుదైన వీడియోలో నాలుగు పర్షియన్ చిరుతపులుల కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తుంది. చిరుతపులి కూనలు చేస్తున్న సౌండ్స్ కూడా ఈ వీడియోలో వినిపిస్తాయి. ఇంటర్నెట్ యూజర్స్ ఈ వీడియోను అమితంగా ఇష్టపడుతున్నారు. ఒక యూజర్ ఇలా రాశాడు ‘వావ్.. ఇది నిజంగా అద్భుతం. ప్రకృతి ఒడిలో పర్షియన్ చిరుతపులి కుటుంబం’. మరొక యూజర్ ‘నేను చాలా కాలం తరువాత చూసిన అద్భుతం’ అని రాశారు. కాగా ట్రాప్ కెమెరా అనేది ఇన్ఫ్రారెడ్ సెన్సార్కు జోడించిన డిజిటల్ కెమెరా. ఇది వన్యప్రాణులు, వాటి ఆవాసాలు, జాతుల స్థానం, జనాభా పరిమాణం, జాతుల పరస్పర చర్యలకు సంబంధించిన డేటాను పొందుపరుస్తుంది. ఏదైనా జంతువు కెమెరా సెన్సార్ దగ్గరికు వెళ్ళినప్పుడు అది కెమెరాను ట్రిగ్గర్ చేస్తుంది. తర్వాత వీడియోను రికార్డ్ చేస్తుంది. ఇది కూడా చదవండి: 72 ఏళ్ల క్రితం మూసిన ఆలయం తెరవగానే.. When a Persian Leopard family decided to make home in front of a trap camera. The best thing you will watch. Credits to @NarynTR for raising awareness about them. pic.twitter.com/5hp8R4Whh1 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 14, 2023 -
పుణెలో దారుణం.. ఇంటివద్ద ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత
ముంబై: మహారాష్ట్రలో పుణెలో దారుణం చోటుచేసుకుంది. చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘోరం జున్నార్ తాలుకాలోని ఆలే గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వ్యవసాయ పనులు చేసుకునే అమోల్ కుమారుడు నాలుగేళ్ల శివాన్ష్ బుజ్పాల్ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన చిరుత.. చిన్నారిని నోట కరుచుకొని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాకెళ్లింది. పక్కనే ఉన్న పొలంలో పనులు చేస్తున్న బాలుడి తాత..పిల్లాడి కేకలు విని అక్కడికి పరుగుతెత్తుకొచ్చాడు. బాలుడిని రక్షించేందుకు పొరుగున ఉన్న కొందరు సైతం కర్రలతో చెరుకు పొలాల్లోకి వెళ్లారు. అయితే అప్పటికేచిరుత బాలుడిని చాలా దూరం ఈడ్చుకెళ్లి.. కింద పడేయడంతో తల, మెడ, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా చిరుత పులులను పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ను ముమ్మరం చేశామని, ట్రాప్ కేజ్లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని అటవీ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా జున్నార్ అటవీ డివిజన్లో చిరుత దాడి చేయడం ఈ ఏడాది మూడోసారి. అంతేగాక పుణె జిల్లాలో జనవరి, ఏప్రిల్ మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఇలాంటి సంఘటనలు నాలుగు చోటుచేసుకున్నాయి. -
సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో రెండు పిల్లలు లభ్యం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
చిరుతలను పట్టుకునే చర్యలు నిరంతరంగా సాగుతుంది: భూమన కరుణాకర్ రెడ్డి
-
‘టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించాము’
తిరుమల: తిరుమల: తిరుమల నడకదారిలో బుధవారం ఉదయం మరో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన తర్వాత మరింత అప్రమత్తమైన టీటీడీ.. చిరుతల దాడిని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఆ చర్యలు సత్ఫలితాల్ని ఇవ్వడంతో తిరుమల నడకదారిలో ఆరవ చిరుతను బంధించారు. ఈ మేరకు చిరుత చిక్కిన ప్రాంతానికి వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. ‘చిన్నారి లక్షిత పై దాడి చేసాక టీటీడీ అనేక చర్యలు చేపట్టింది. నడకదారి భక్తులకు భద్రత కట్టుదిట్టం చేశాం. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అన్ని అమలు చేస్తున్నాం. నడకదారిలో భక్తులకు కర్రలు అందించాము. భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తాము. నడకదారిలో కంచె వెయ్యడామా.. లేక జంతువుల సంచారానికి మార్గం సుగమం చెయ్యడానికి ఏర్పాటు చేస్తాము. విమర్శలు చేసే వారికి కనువిప్పు కలగాలి. టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించాము. క్రూరమృగాల సంచారం పై నిరంతరం అధ్యయనం జరుగుతుంది’ అని అన్నారు. కాగా, నడకదారిలో చిక్కిన చిరుతను అటవశాఖ అధికారులు జూపార్క్కి తరలించారు. దీనిపై డీఎఫ్వో మాట్లాడుతూ.. ‘ వేకుమజామున చిరుత బోన్లో చిక్కింది. సుమారు నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం చిరుతను సుదూర అటవీప్రాంతంలో వదలాలా లేదా అన్నది నిర్ణయిస్తాము. బోన్ లో చిక్కిన ఆరు చిరుతలలో రెండు మూడు చిరుతలకు దంతాలు సరిగ్గలేవు. వాటికి వేటడే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని జూపార్క్ సంరక్షణ చేస్తాం’ అని తెలిపారు. -
తిరుమల: నడకదారిలో బోనులో పట్టుబడ్డ చిరుత
-
తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత..
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. శ్రీవారి ఆలయానికి వెళ్లే నడకదారిలో బుధవారం తెల్లవారుజామున మరో చిరుత బోనులో పట్టుబడింది. కాగా, నడకదారిలో వారం రోజులుగా అటవీశాఖ అధికారులు చిరుత సంచారాన్ని గుర్తించారు. వివరాల ప్రకారం.. తిరుమల నడకదారిలో మరో చిరుత బోనులో చిక్కింది. చిరుత సంచారాన్ని గుర్తించిన అధికారులు బోనులు ఏర్పాటు చేయడంతో తాజాగా చిరుత బోనులో చిక్కింది. అయితే, చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే తాజాగా చిరుత చిక్కడం విశేషం. ఇక, చిరుతను జూపార్క్కు తరలించడానికి అటవీశాక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో ఇప్పటి వరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు బంధించారు. ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో అల్పపీడనం! -
విమర్శలకు భయపడం.. భక్తుల భద్రతే ముఖ్యం: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. రెండు నెలల కాలంలో 5 చిరుతలను పట్టుకున్నామని తెలిపారు. నడక దారిలో ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. విమర్శలకు భయపడమని, చిత్తశుద్ధితో భక్తులకు సేవ చేస్తున్నామని పేర్కొన్నారు. చిరుత చిక్కుకున్న ప్రదేశానికి టీటీడీ చైర్మన్ భూమన చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ చిరుత కొనసాతుందని పేర్కొన్నారు. రాత్రి పన్నెండు.. ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని, తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని భూమన అన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని, ఈ కారణంగానే నేడు అయిదో చిరుతను పట్టుకున్నట్లు చెప్పారుజ నడక దారిలో వస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించాలని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. చదవండి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారికి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరుగుతోందన్నారు. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా తమ ఎన్నో అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని విమర్శించారు. కర్రలు ఇస్తామని చెప్పిన తర్వాత నాలుగు చిరుతలు దొరికాయని, అంతకు ముందు ఒక చిరుత బోనులో చిక్కిందని గుర్తు చేశారు. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో తెలియజేసేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే అని చైర్మన్ పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారని తెలిపారు. విమర్శలకు, జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి లేదని విమర్శకులను హెచ్చరించారు. కాగా తిరుమలలో కాలిబాటన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ, అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా మరో చిరుతపులిని బంధించారు అధికారులు. తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. వేకువజామున 12 నుంచి 1 గంట మధ్యలో బోన్లో చిక్కుకున్నట్లు అటవీశాఖ అధికారుల చెప్పారు. గత వారం రోజులుగా ఈ చిరుత సంచారం గుర్తించిన అధికారులు పట్టుకోవడానికి బోన్ పెట్టగా.. నేడు చిక్కుకుంది. దానిని ఎస్వీ జూపార్క్ తరలించారు. -
తిరుమలలో చిక్కిన మరో చిరుత
-
Tirumala: తిరుమలలో చిక్కిన మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది. నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్ కెమెరాల్లో దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం. ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు. భద్రతే ప్రధాన ప్రాముఖ్యత.. నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్ అవుతున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ -
తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ చిక్కింది. చిన్నారి అక్షితపై దాడి చేసి చంపిన స్థలంలోనే చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత పేరుతో నాలుగు చిరుతలను అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో చిరుత సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. -
అనారోగ్యంతో చిరుత.. గ్రామస్థుల ఆకతాయి చేష్టలు!
భోపాల్: మధ్య ప్రదేశ్లోని ఓ గ్రామ శివారులోకి చిరుతపులి ప్రవేశించింది. మొదట చిరుతను చూసి భయపడిన జనాలు.. అది ఆవేశంగా, హుషారుగా కనిపించకపోవడంతో ఆశ్యర్యపోయారు. తరువాత దాని దగ్గరకు వెళ్లి పరీక్షించగా.. సదరు చిరుత అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకొని దానికి పెంపుడు జంతువుగా చూస్తూ ఆటపట్టించారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. దాన్ని చూసి బెంబేలెత్తిన గ్రామస్తులు దూరంగా పారపోయేందుకు ప్రయత్నించారు. అయితే కొద్దిసేపటికి చిరుత దూకుడుగా లేకుండా నీరసంగా ఉండటం చూసి అది అస్వస్థతకు గురైనట్లు అర్థమైంది. దీంతో గ్రామస్థులు చిరుతపులి చుట్టూ చేరి దానితో ఆడుకోవడం ప్రారంభించారు. పెంపుడు జంతువులా చూస్తూ దానితో సెల్ఫీలు తీసుకున్నారు. కొంతమంది అయితే చిరుతపై ఎక్కి రైడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. చదవండి: ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ.. VIDEO | Rescue operation underway by forest officials in Madhya Pradesh’s Iklera village after a leopard was found by locals in a dazed state. “A team from Ujjain is reaching to capture the leopard and the animal will be shifted based on the directions of the higher officials,”… pic.twitter.com/NHpS0f1Mx6 — Press Trust of India (@PTI_News) August 30, 2023 ఈ విషయాన్ని ఓ గ్రామస్తుడు అటవీశాఖకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చే వరకు కూడా కొంతమంది ఆగకుండా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉజ్జయిని నుంచి రెస్క్యూ టీం ఇక్లెరాకు చేరుకుని చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల చిరుతపులిని చికిత్స నిమిత్తం భోపాల్లోని వాన్ విహార్కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా తెలిపారు. దానికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతపులిని ప్రజలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు చిరుత సరిగ్గా నడవలేని స్థితిలో అడవిలో సంచరిస్తుందని ఫారెస్ట్ గార్డు జితేంద్ర చౌహాన్ తెలిపారు. దానికి వాన్విహార్లో చికిత్స అందిస్తున్నామని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఇక గ్రామస్థులు చిరుతతో ఆడుకుంటున్న వీడియో నెట్టింట్లో వైర్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘అభివృద్ధి ముసుగులో ఇప్పటికే వాటి(జంతువుల) స్థలాలను ఆక్రమిస్తున్నాం. ఇప్పుడు వాటిని కూడాఇబ్బంది పెడుతున్నాం. మనుషులుగా మనం సిగ్గుపడాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
‘ఆ రెండు చిరుతలు మ్యాన్ ఈటర్గా మారాయి.. జూ పార్క్లోనే ఉంచుతాం’
సాక్షి, తిరుపతి: ఆక్వా పరిశ్రమలో ఆక్వా పొల్యూషన్ తగ్గిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాలు నిషేధించామని, భక్తులకు ప్లాస్టిక్పై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఏపీ కాలుష్య మండలి ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, చిరుతల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని, శాశ్వత ప్రాతిపదికన కంచె ఏర్పాటు దిశగా టీటీడీ, అటవీశాఖ ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయిలో టీటీడీకి సహకరిస్తామన్నారు. ‘‘ఇటీవల చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారికి ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాం. జరిగిన ఘటన చాలా బాధాకరమన్నారు. మ్యాన్ ఈటర్గా మారిన రెండు చిరుతలు జూ పార్క్లోనే ఉంచుతాం’’ అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చదవండి: ఎమ్మెల్యే వల్లభనేనికి తప్పిన ప్రమాదం -
పట్టపగలే ప్రజలకు చుక్కలు చూపిస్తున్న చిరుతలు
-
తిరుమల లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర బోనులో చిక్కిన చిరుత
-
తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన మరో చిరుత
-
సింగిల్గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..
ఒంటరిగా ఉంటే సింహం అయినా సైలెంట్ అయిపోవాల్సిందే. లేదంటే అంతే సంగతి. ఒక్కొసారి స్థాన బలం, సముహం బలం చూసుకునే దాడికి దిగాలి. లేదంటూ కింగ్లాంటి జంతవైనా పిల్లిలా తోకముడవాల్సిందే. అచ్చం అలాంటి ఘటనే దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికాలో రద్దీగా ఉండే రహదారిపైకి కొన్నొ కొండముచ్చులు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చొన్నాయి. మరోవైపు వాహనాలు వాటినిదాటుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నాయి. ఇంతలో సరిగ్గా అదే టైంలో ఓ చిరుత అటువైపుగా వస్తుంది. కొండముచ్చులే కదా అని తేలిగ్గా తీసుకుందో ఏమో వాటివైపుకే దూసుకొచ్చింది. ఇంతలో ఒకవైపు ఉన్న ఓ కొండముచ్చుపైకి దాడి చేసేందుకు రెడీ అయ్యి ఒక ఊదుటన దూకింది. అంతే ఒక్కసారిగా మేమంతా ఉన్నాం అంటూ కొండముచ్చుల గ్యాంగ్ అంతా ఒకేసారి చిరతపై దాడి చేశాయి. దెబ్బకి హడలిపోయిన చిరుత అక్కడ నుంచి జారుకునేందుకు యత్నించింది. అయినా ఆ కొండముచ్చులు విడువకుండా దాన్ని తరుముకొడుతూ వెళ్లడం విశేం. కలిసి ఉంటే ఎంతపెద్ద కష్టన్నైనా జయించొచ్చు అని నిరూపించాయి ఆ కొండముచ్చులు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: బీచ్లకు రక్షకురాలిగా 96 ఏళ్ల బామ్మ! ఆమెని చూస్తే కార్పోరేటర్లకు దడ!) -
చిరుతలను బంధించడానికి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన టీటీడీ
-
తిరుమల నడకదారిలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
-
తిరుమలలో చిక్కిన ఆడ చిరుతకు నాలుగేళ్లు: డీఎఫ్ఓ
-
బాలికపై దాడి చేసిన ప్రాంతంలోనే పట్టుబడ్డ చిరుత
-
తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ చిరుత
-
తిరుమలలో కొనసాగుతున్న ఆపరేషన్ ‘చిరుత’
తిరుమల: తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. చిన్న పిల్లలను దగ్గరే పెట్టుకొని వెళ్లాలని సూచిస్తోంది. చిరుతల దాడుల నియంత్రణకు నిపుణులు కమిటీ ఏర్పాటు చేశారు. చిరుత దాడిలో మరణించిన లక్షిత కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది టీటీడీ. తిరుమల అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఇదీ చదవండి: విశాఖ కారాగారంలో అన్నీ నదులే..! -
భక్తుల్లో భయం..చిన్నారిని బలి తీసుకున్న చిరుత..!
-
తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత
సాక్షి, తిరుమల: తిరుమలలో విషాద ఘటన చోటు చేసుకుంది. అలిపిరి నడకమార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. ఈ క్రమంలో పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి ఒంటిపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. కాగా నెల కిత్రం ఐదేళ్ల చిన్నారిపై పులి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే ప్రాంతంలోనే రక్షితపై చిరుత దాడి చేయడం గమనార్హం. ఈ ఘటన తిరుమలలో కలకలం రేపుతోంది. చదవండి: Dr Radha Murder Case: డా.రాధా మర్డర్ కేసులో భర్తే హంతకుడు -
కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత..
-
సీరియల్ షూటింగ్లో చిరుతపులి బీభత్సం!
సినిమా లేదా సీరియల్ షూటింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని సమకూర్చుకుని స్టూడియోల్లో షూటింగ్ చేస్తుంటారు. హైదరాబాద్లో చాలాచోట్ల ఇలానే జరుగుతుంటాయి. ముంబయిలో మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్న యాక్టర్స్ తెగ భయపడిపోతున్నారు. దానికి కారణం.. సెట్లోకి పాములు, కొండచిలువ, చిరుతల్లాంటివి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడూ అలాంటి సంఘటనే జరిగింది. (ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!) ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. 'సుఖ్ మాంజే కాయ్ ఆస్తా' అనే మరాఠీ సీరియల్ షూటింగ్ మంగళవారం జరుగుతుండగా, సాయంత్రం 4 గంటల టైంలో చిరుతపులి సెట్లోకి వచ్చింది. చిన్న చిరుత పిల్లతో కలిసి అటు ఇటు తిరుగుతూ యాక్టర్స్తో పాటు మిగతా అందరినీ భయపెట్టింది. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది ప్రాణభయంతో పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్లాల్ గుప్తా మీడియాకు చెప్పారు. గత 10 రోజుల్లో ఇలా చిరుతలు సెట్ లోకి రావడం ఇది నాలుగోసారి అని సురేష్ శ్యామ్ లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈయన ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు జరిగిన సంఘటనతో అర్థమవుతోంది. గతంలో ఇలానే 'అజుని' సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి వచ్చింది, 'గుమ్ హై కిసీ కే ప్యార్ మే' షో జరుగుతుండగా ఏకంగా కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలా వరస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బెదిరిపోతున్నారు. #WATCH | A leopard, along with its cub, entered the sets of a Marathi TV serial in Goregaon Film City, Mumbai yesterday. All Indian Cine Workers Association president Suresh Shyamlal Gupta says, "More than 200 people were present at the set, someone could have lost life. This… pic.twitter.com/m1YgSXARl6 — ANI (@ANI) July 27, 2023 (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) -
చిరుతకు వెరైటీ ట్రీట్మెంట్.. కర్రకు మంటపెట్టి.. వీడియో వైరల్..
కర్ణాటక: కర్ణాటకాలో దారితప్పి బావిలో పడిపోయిన ఓ చిరుతను అధికారులు రక్షించారు. అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చింది. దారితప్పి అనుకోకుండా ఓ బావిలో పడిపోయింది. అనంతరం అరవడం ప్రారంభించింది. దీనిని గమనించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు.. చిరుతను బావి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిరుత పైకి ఎక్కడానికి బావిలోకి ఓ నిచ్చెనను వేశారు అధికారులు. కానీ మనుషులను చూసిన చిరుత.. భయపడి బయటకు రాకుండా బావిలోనే ఉండిపోయింది. దీంతో గ్రామస్థుల సహకారంతో ఓ పెద్ద కర్రకు మంటను అంటించి బావిలోని చిరుతను ఓ వైపు నుంచి బెదిరించారు. దీంతో చిరుత నిచ్చెన ద్వారా బావి పైకి ఎక్కింది. Somewhere in Karnataka. A leopard fell into a well and even when a “ladder” was offered, it was cowering inside. So they put a stick of fire near his bum which forced him to climb the scaffolding & run away into the jungle. How they rejoice! Man, Nature & Jugaad. 😊 Got it on WA. pic.twitter.com/OBr7kDTmlp — Sahana Singh (@singhsahana) June 22, 2023 ఈ వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో మూడు రోజుల క్రితం పోస్టు చేశారు. అయితే.. జంతువులను రక్షించే క్రమంలో ఒక్కో సారి విభిన్నమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. కేవలం మూడు రోజుల్లోనే లక్ష వ్యూస్ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చిరుతను రక్షించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. Every rescue operation is unique and has its own complexities that varies with the species of the animal involved, availability of resources, location, infrastructure and many more. Good team & presence of mind works well. Forest staff are experienced in handling such situations. https://t.co/deMgkB3IIF — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) June 22, 2023 ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్... -
తల్లి చిరుత దొరికేవరకూ ఆపరేషన్ చిరుత కొనసాగిస్తామన్న టీటీడీ
-
ఏడవ మైలు వద్ద చిరుతను పట్టుకున్న అటవీశాఖ అధికారులు
-
తిరుమలలో చిక్కిన చిరుత
-
తిరుమల: బోనులో చిక్కిన చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో బోనులో చిరుత పులి చిక్కింది. మొన్న అలిపిరి మార్గంలో మూడేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుతే ఇది. 7వ మైలురాయి వద్ద ఇది బోనులో పడింది. కేవలం ఒక్కరోజులోనే చిరుతను బంధించారు అధికారులు. నిన్న సాయంత్రం చిరుతను బంధించేందుకు రెండు బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. 150 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి(శుక్రవారం, జూన్ 23) 10.45 గంటల ప్రాంతంలో చిరుత బోనులో పడినట్లు తెలుస్తోంది. డీఎఫ్వో ఏమన్నారంటే.. బాలుడిపై దాడి చేసిన ఒక్కరోజులోనే చిరుతను బంధించాం. తల్లి, పిల్ల చిరుతలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ చిరుతను ఇంకా వేటాడడం పూర్తిగా అలవాటు కాలేదు అని డీఎఫ్వో తెలియజేశారు. చిన్నారి కౌశిక్ను పరామర్శిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. పక్కన చికిత్స అందిస్తున్న వైద్యుడు తిరుమల నడక మార్గంలోని 7వ మైలు వద్ద ఓ చిరుత పులి బాలుడిపై దాడి చేసింది. తన తాతతో కలిసి అక్కడే ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కుంటున్న సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత బాలుడి మెడ పట్టుకుని ఎత్తుకెళ్లింది. వెంటనే స్పందించిన అక్కడి దుకాణదారుడు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది కేకలు పెడుతూ చిరుత వెనుక పరుగులు తీశారు. టార్చ్లు వేస్తూ, రాళ్లు విసరడంతో 7వ మైలు కంట్రోల్ రూం వద్ద చిరుత బాలుడిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయింది. చిరుత దాడి నుంచి బాబును అక్కడి భద్రతా సిబ్బంది రక్షించారు. గాయాల పాలైన బాలుడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడి చెవి వెనుక, మరికొన్ని ప్రాంతాల్లో చిరుత దంతపు గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన బాలుడు కర్నూలు జిల్లా ఆదోని వాసి కౌషిక్(3)గా గుర్తించారు. దాడి గురించి తెలియగానే.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి బాలుడిని పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. చిరుత దాడి చేసిన మెట్ల మార్గంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్టు తెలిపారు. ఇకపై నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపుతామన్నారు. భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఇదీ చదవండి: గోవధ నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? -
చిరుత దాడి.. చిన్నారి కౌశిక్ను పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: తిరుమలలో అయిదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కౌశిక్ను శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంత ఖర్చైనా బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని అన్నారు. అదే విధంగా తిరుమలలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మెట్ల మార్గంలో జంతవులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గంలో భద్రతను మరింతగా పెంచుతామని తెలిపారు. కాగా తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆదోనికి చెందిన భక్తులు అలిపిన నడకమార్గంలో వెళ్తండగా బుధవారం బాలుడిని చిరుత లాక్కెళ్లింది. భక్తులు కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలేసి వెళ్లింది. చిరుత దాడిలో బాలుడి చెవి వెనక, మెడకు, తలకు గాయాలయ్యాయి. పద్మావతి చిల్ట్రన్ ఆసుపత్రిలో బాలుడు కౌశిక్కు చికిత్స అందిస్తున్నారు. చదవండి: ‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు -
తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి
-
చిరుతతో పోరాడి.. రైతు ప్రాణాలు కాపాడిన ఆవు
బనశంకరి: తన యజమానిపై దాడి చేసిన చిరుత పులితో తీవ్రంగా పోరాడి రైతు ప్రాణాలు ఆవు కాపాడిన ఘటన కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నగిరి తాలూకా ఉబ్రాణి హొబళి కొడతికెరె గ్రామానికి చెందిన రైతు కరిహాలప్ప(58) గత సోమవారం తన ఆవును తోటలో వదిలిపెట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాడు. అక్కడే మాటువేసిన చిరుత పులి ఒక్కసారిగా కరిహాలప్పపై దాడి చేసింది. గమనించిన ఆవు పరుగెత్తుకొచ్చి చిరుతపైకి దూకింది. కొమ్ములతో పొడిచింది. దీంతో చిరుత కిందపడిపోగా, అక్కడే ఉన్న శునకం కూడా దానిపైకి దూకింది. దీంతో చిరుత అక్కడి నుంచి ఉడాయించింది. ఈ సందర్భంగా రైతు కరిహాలప్ప మాట్లాడుతూ తాను పోషించిన ఆవు గౌరీ, శునకం మాత్ర శౌర్యాన్ని ప్రదర్శించి చిరుత బారి నుంచి తన ప్రాణాలు కాపాడాయని చెప్పాడు. -
గ్యారేజీలో పడుకున్న యాజమాని.. అర్థరాత్రి ఏం జరిగిందంటే
-
నిద్రిస్తుండగా వేటకొచ్చిన చిరుత..ఆ వీధి కుక్క అతడిని బతికిచ్చింది
ఓ వ్యక్తి నిద్రిస్తుండగా సడెన్గా ఓ చిరుత వచ్చింది. ఇక ఆ వ్యక్తి వద్దకు వచ్చి అటాక్ చేస్తుందేమో అన్న సమయంలో సమీపంలో ఓ వీధి కుక్క కనిపించింది. అంతే సడెన్గా చిరుత దృష్టి దానిపై పడింది. దీంతో నేరుగా ఆ కుక్క వద్దకు వచ్చి దాడి చేసి ఈడ్చుకెళ్లిపోయింది. ఈ అలికిడికి మెలుకువ వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా బిక్కచచిపోతాడు. ఆ కుక్క గనుక అక్కడ లేకపోతే ఆ చిరుత నోట అతను ఉండేవాడు. అదృష్టం బావుంది కాబట్టి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఆ వ్యక్తి. ఈ షాకింగ్ ఘటన పుణేలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నంద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. అటవీ ప్రాంతాలను అభివృద్ధి పేరుతో నాశనం చేయడంతో ఇలా వన్యమృగాలు మానవ ఆవాసాల్లోకి చొరబడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు చెబుతున్నారు . (చదవండి: ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని..ట్వీట్ వైరల్) -
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకి చిరుత వేట
-
వేటగాడే వేటకు బలి.. అరుదైన దృశ్యం నెట్టింట వైరల్..
బలహీనుడిపై బలవంతుడుపై చేయి సాధించడం తెలిసిందే.. అయితే ఇద్దరు బలవంతుల మధ్య పోటీ జరిగితే విజయం ఎవరి వైపు ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్క్లో చిరుతపులిని తింటున్న పులి చిత్రాన్ని నెట్టింట షేర్ చేశారు. రణతంబోర్ నేషనల్ పార్క్లో అనూహ్యంగా ఒక పులి చిరుతను వేటాడింది. వాటి మధ్య జరిగిన బీకర పోరులో చిరుత పులి చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోయింది. చిరుతను చంపిన పులి ఆ తర్వాత దాని మాంసాన్ని ఎంతో ఇష్టంతో తింటోంది. అందులో సఫారీకి వచ్చిన పర్యాటకులు కొందరు ఈ ఘటనను ఫోటో తీశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు పులి, చిరుతపులి మధ్య పోరాటం చాలా అరుదని కామెంట్లు పెడుతున్నారు. Wild wild world. The tiger name is T 101 of Ranthambore. @HJunglebook recently captured it and want everyone to witness it. pic.twitter.com/dAT7WNvxtv — Parveen Kaswan, IFS (@ParveenKaswan) April 1, 2023 -
ఎన్ని అడ్డంకులు ఎదురైన నీ అవ్వా తగ్గేదేలే.. కొండ మేకను వెంటాడి వేటాడిన చిరుత !
-
చిరుత బోనులో కోడి దొంగ!
చిరుతపులి కోసం ఏర్పాటు చేసిన బోనులో.. గాలానికి పడ్డదాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అదొక మనిషి. తనను బయటకు తీయండి మహాప్రభో అంటూ బోను తలుపులను పట్టుకుని.. అధికారులను అతను వేడుకోవడం ట్విటర్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ బులంద్షహర్ జిల్లాలోని బసెందువా గ్రామంలో చిరుత సంచారం గురించి అధికారులు సమాచారం అందుకున్నారు. దానిని పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. చిరుతకు ఎరగా.. ఓ కోడిని అందులో ఉంచారు. అయితే ఆ కోడి కోసం వెళ్లి.. ఆ వ్యక్తి బోనులో చిక్కుకున్నాడు. దొంగతనగా కోడిని బోనులోంచి తీసేందుకు యత్నిస్తుండగా.. ఒక్కసారిగా బోను తలుపు పడిపోయింది. దీంతో బయటకు తీయాలని అధికారులను వేడుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #WATCH | Uttar Pradesh: A man got stuck in a cage, installed to nab a leopard, in Basendua village of Bulandshahr dist. Forest Dept says that the man had entered the cage to get a rooster that was kept there as bait for the leopard. (Video: viral video confirmed by Forest Dept) pic.twitter.com/8ujj23I2AO — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 24, 2023 (చదవండి: మీ సంగతి ప్రజలే చూసుకుంటారు: నరేంద్ర మోదీ) -
Video: చిరుతపులి బీభత్సం.. కోర్టు ఆవరణంలోకి ప్రవేశించి, ఆరుగురిపై దాడి
లక్నో: కోర్టు కాంప్లెక్స్లోకి చొరబడిన ఓ చిరుతపులి స్థానికంగా బీభత్సం సృష్టించింది. కోర్టు అంతా సంచరిస్తూ పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. ఘజియాబాద్ కోర్టులోని మొదటి అంతస్తులోకి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ చిరుతపలి ప్రవేశించింది. కోర్టు ప్రాంగణంలో చిరుతపులి కనిపించడంతో భయంతో అక్కడున్న వారంతా అటు ఇటు పరుగులు తీశారు. చిరుత నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంతమంది లాయర్లు లాయర్లు తమ గదుల్లోకి వెళ్లి లాక్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణంలో గందరగోళం నెలకొంది. చుట్టూ జనాలను చూసి బెంబేలెత్తిన చిరుతపులి మరింత రెచ్చిపోయింది. కర్రల సాయంతో తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్పై చిరుతపులిని దాడి చేసింది. అంతేగాక కోర్టు ఆవరణలో చెప్పులు కుట్టే వ్యక్తి, పోలీస్ అధికారితో సహా పలువురిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచింది. pic.twitter.com/OuxoVC3Bv4 — Utkarsh Singh (@utkarshs88) February 8, 2023 చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాలుగు గంటలు శ్రమించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతపులిని నెట్లో బంధించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వద్ద చిరుతపులి సంచారం.. న్యాయవాదులను గాయపరిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. #WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl — ANI (@ANI) February 8, 2023 -
Russia-Ukraine war: ఉక్రెయిన్కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు: జర్మనీ
బెర్లిన్: తమ మిత్ర దేశాలకు కచ్చితంగా సహకరిస్తామని జర్మనీ చాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ హామీ ఇచ్చారు. రష్యా సైన్యంపై పోరాడుతున్న ఉక్రెయిన్కు అత్యాధునిక లియోపార్డ్–2 ఏ6 యుద్ధ ట్యాంకులు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్కు తమ సొంత ఆయుధాగారం నుంచి తొలుత ఒక కంపెనీలు ట్యాంకులను (14 వాహనాలు) పంపించనున్నట్లు జర్మనీ ప్రభుత్వం ఒక తాజాగా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్కు మొత్తం 88 యుద్ధ ట్యాంకులను త్వరలో సమకూర్చాలని జర్మనీతోపాటు మిత్రదేశాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్కు సాయం అందించే విషయంలో తమ మిత్ర దేశాలతో కలిపి పని చేస్తున్నామని ఒలాఫ్ షోల్జ్ వెల్లడించారు. తమ దేశంలో తయారైన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సైన్యం మరోసారి రష్యా సేనలపై ఎక్కుపెట్టబోతోందని జర్మనీ సైనికాధికారి ఎకెహర్డ్ బ్రోస్ చెప్పారు. రష్యా దండయాత్రను అడ్డుకొనేలా ఉక్రెయిన్కు బాసటగా నిలవాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్కు అందుతున్న విదేశీ సైనిక సాయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు. -
మనిషికి, మృగానికి మధ్య పెరుగుతున్న ఘర్షణలు
కంచర్ల యాదగిరిరెడ్డి దేశంలో ఒక పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంటే.. మరోపక్క పోడు వ్యవసాయం, ఇతరత్రా కారణాలతో అటవీ ప్రాంతం కుంచించుకుపోవడం కొత్త సమస్య తెచ్చిపెడుతోంది. మనిషికీ, వన్య మృగానికీ మధ్య ఘర్షణకు దారితీస్తోంది. పులులు అడవులను దాటి సమీపంలోని గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. పదేళ్లలో 100% పెరుగుదల దేశంలో గత పదేళ్ల కాలంలో చిరుతలు, పెద్ద పులుల సంఖ్య అనూహ్యంగా 100 శాతం పెరిగిందని తాజాగా చేపట్టిన గణన ద్వారా వెల్లడైంది. దాదాపు నాలుగు వేల మంది అటవీ శాఖ సిబ్బంది 54 టైగర్ రిజర్వు ప్రాంతాల్లోని 14,500 చదరపు కి.మీ. మేర అడవుల్ని గాలించి మరీ 4,500 పైచిలుకు పెద్ద పులులు, 2,300 చిరుతలు ఉన్నాయని లెక్క తేల్చారు. దేశంలో మిజోరం మినహా అన్ని రాష్ట్రాల్లో పులుల జాడ కనిపించడం విశేషం. వన్యమృగ సంరక్షణ చరిత్రలో ఇది గుర్తుంచుకోదగిన విశేషమని కజిరంగ నేషనల్ పార్క్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రమేశ్ గగోయ్ అన్నారు. ప్రస్తుతం అక్కడ అనేక రకాల వందల కొద్దీ జంతువులతో పాటు 125కు పైగా పులులు ఉన్నాయి. పులుల సంఖ్య పెరగడం శుభసూచకమే అయినా మనుషులకు, మృగాలకు మధ్య కొనసాగుతున్న ఘర్షణ దేశంలో కొన్నిచోట్ల రక్తసిక్తం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పులుల దాడుల నేపథ్యంలో వాటి నుంచి రక్షణ కోసం ఒకరకంగా యుద్ధమే చేయాల్సి వస్తోంది. గత ఏడాది మనుషులకు, వన్య మృగాలకు మధ్య ఘర్షణలకు సంబంధించిన ఘటనలు దాదాపు 500కు పైగా నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సరిహద్దుల్లో 33,309 హెక్టార్లకు విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం పెద్ద పులులకు ఆవాసంగా మారింది. ఆ ప్రమాదకరమైన ప్రదేశాలకు ప్రజలను దూరంగా ఉంచడంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో మనిషి రక్తం మరిగిన ఓ పులి మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో నెల వ్యవధిలోనే 8 మందిని చంపి తిని కనిపించకుండా పోయిన ఘటన ఆ రాష్ట్ర అధికారయంత్రాంగానికి నిద్ర లేకుండా చేసింది. మరో పులి చంద్రాపూర్ జిల్లాలో ఆరుగురిని బలితీసుకుంది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఇటీవల పులి ఐదుగురిపై దాడి చేసిచంపింది. తాజాగా గురువారం కేరళలోని వయనాడ్ జిల్లాలో ఓ రైతుపై అతని ఇంటి వద్దనే దాడి చేసిన పులి తీవ్రంగా గాయపరచడం కలకలం రేపింది. ఆ తర్వాత అతను చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. గతేడాది మహారాష్ట్రలో 105 మంది పులుల చేతిలో హతమయ్యారని అటవీ శాఖ మంత్రి ఎం.సుధీర్ శాసనసభకు చెప్పారు. అంతకుముందు 2020–21లో 86 మంది, 2019–20లో 80 మంది, 2018–19లో 47 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన వివరించారు. తెలంగాణలో వారం వ్యవధిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రంభీం జిల్లా వాంకిడి ప్రాంతంలో సంచరి స్తున్న పులి వారం వ్యవధిలోనే ఇద్దరిని బలి తీసుకుంది. గతేడాది ఆ ప్రాంతంలో సంచరిస్తున్న పులులు 170 పశువులపై దాడి చేసి హతమార్చా యి. ‘మేము అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లకుండా ఉండలేము. ఎందుకంటే అక్కడ పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నాం. వెళితే ప్రమాదమని తెలిసినా వెళ్లక తప్పడం లేదు..’అని కుమ్రంభీం జిల్లా దిగడ గ్రామానికి చెందిన కళావతి వాపోయారు. పులులు ఎక్కువ ఉన్న చోట్లే.. పులులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. తగ్గిపోతున్న అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి జనావాసాలకు రావడం అధికమైంది. ధ్వని కాలుష్యంతో పాటు దీపాల వెలుగులు, గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల వాతావరణం వంటి అంశాల వల్ల ఏర్పడే గందరగోళంతోనే ఇతర జంతువుల లాగే పెద్ద పులులు భయాందోళనలతో దాడులు చేయడం, చంపడం వంటివి చేస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. పులులు ఉన్నాయని తెలిసినా మనుషులు పోడు వ్యవసాయం, ఇతరత్రా అవసరాల కోసం అటవీ ప్రాంతాల పరిసరాలకు వెళ్లక తప్పడం లేదు. గత ఏడాది నవంబర్ 15న కుమ్రంభీం జిల్లా వాంకిడి సమీపంలో పత్తి చేనుకు కాపలా కాస్తున్న సీడాం భీము (69)ని పెద్ద పులి దాడి చేసి చంపేసింది. అదే జిల్లా దహేగం మండలం దిగిడ గ్రామానికి చెందిన 19 ఏళ్ల విఘ్నేష్పై దాడి చేసి చంపింది. ఏటా 20 శాతంపెరుగుదల పులుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాల్లో సాధారణంగా ఈ పెరుగుదల ఏడాదికి 20% కంటే ఎక్కువగా ఉందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇటీవల పార్లమెంట్కు సమరి్పంచిన నివేదికలో తెలిపింది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా 2020 వెల్లడించిన నివేదికను బట్టి చూస్తే 2016–20 మధ్య దేశవ్యాప్తంగా పులుల స్వా«దీనంలో ఉన్న ప్రదేశం 10 వేల చ.కి.మీ. మేర కుంచించుకుపోయింది. ఒక్క యూపీలోనే గత పదేళ్లలో అటవీ ప్రాంతం వంద చ.కి.మీ. మేర హరించుకుపోయిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. పులులు పెరుగుతున్న చోట అటవీ భూములు కుంచించుకుపోకుండా చూడాలని ఫారెస్ట్ సర్వే అఫ్ ఇండియా గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, పులులు, ఇతర వన్యప్రాణులు రోడ్లు, రైల్వే ట్రాక్లపైకి చేరి చనిపోతున్నాయని ఎఫ్ఎస్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నుంచి 2020–21 మధ్య దేశవ్యాప్తంగా 63 వేల వన్యప్రాణులు రైళ్ల కింద పడి మరణించాయని, వాటిలో నాలుగు సింహాలు, 73 ఏనుగులు సహా 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఉన్న జంతువులు ఉన్నట్లు కాగ్ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో100 దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలకు తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య 100కు పెరిగింది. 2014లో వీటి సంఖ్య 46 మాత్రమే. తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఏపీలోని ఉభయగోదావరి, కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల అటవీ ప్రాంతాలే మొదటి నుంచి పెద్ద పులులకు ఆవాసాలుగా పేరొందాయి. పులుల సంఖ్య పెరుగుతున్న కారణంగానే కేంద్ర ప్రభుత్వం 1983లోనే ఉమ్మడి ఏపీ ఐదు జిల్లాల పరిధిలో పది వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతాల్లో నాగార్జునసాగర్– శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసింది. అయితే అడవుల్లోకి నక్సలైట్ల ప్రవేశంతో 2005 వరకూ పులుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వచ్చిది. ఆ తర్వాత నక్సలైట్ల ఉద్యమం తగ్గుముఖం పట్టడంతో 2008 నుంచి పులుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో కాగజ్నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఫారెస్ట్ డివిజన్లలో పులుల సంచారం అధికమైంది. ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పెద్ద పులుల అభయారణ్యంగా పేరుగాంచింది. ►దేశంలో పెద్ద పులులు 4,500 పైచిలుకు.. ►దేశంలో చిరుతలు 2,300 -
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో చిరుతపులుల హల్ చల్
-
వైరల్ వీడియో: హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి..
-
హడలెత్తించిన చిరుత.. 24 గంటల్లో 15 మందిపై దాడి.. వీడియో వైరల్
దిస్పూర్: అస్సాంలో ఓ చిరుత హడలెత్తించింది. గత 24 గంటలుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అస్సాంలోని జోర్హాట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం ఇనుప కంచె దాడి జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. చిరుత వరుస దాడిలో 15 మంది గాయపడ్డారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. వీరిలో ముగ్గురు అటవీ అధికారులతో సహా మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ఇందులో చిరుత క్యాంపస్ చుట్టూ తిరుగుతూ, ముళ్ల కంచెపై దూకుతూ కనిపిస్తోంది. జనాలపై మాత్రమే కాకుండా రోడ్డుపై వెళ్తున్న కారుపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా జోర్హాట్ శివారల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. అక్కడి నుంచే చిరుతపులి క్యాంపస్లోకి చొరబడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులకు చిరుత చిక్కలేదు. చిరుతను పట్టుకుని బంధించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నివాసితులు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. చదవండి: Japan Snow Storm: జపాన్లో మంచు తుఫాన్ విధ్వంసం..17 మంది మృతి -
ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత
-
హెటిరోలో చిక్కిన చిరుత
జిన్నారం(పటాన్చెరు): జిన్నారం మండలంలోని గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెటిరో డ్రగ్స్ పరిశ్రమలోకి శనివారం వేకువజామున చొరబడిన చిరుతను అటవీ అధికారులు పట్టుకుని బంధించారు. శనివారం ఉదయం నాలుగు గంటలకు హెటిరో డ్రగ్స్ హెచ్బ్లాక్లోకి చిరుత చొరబడింది. పక్కనే విధులు నిర్వహిస్తున్న కార్మికులు చిరుతను చూసి హెచ్బ్లాకులోని డోర్లను మూసి పరిశ్రమ యాజమాన్యం, అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. అటవీ అధికారులు చిరుతను పట్టేందుకు ఆపరేషన్ చేపట్టారు. మేకను ఎర చూపుతూ ప్రత్యేకంగా రెండు బోన్లను ఏర్పాటు చేశారు. హెచ్ బ్లాకులోని పై భాగంలో ఉన్న పైపులపై నిద్రించి ఉన్న చిరుతపైకి పైపుల ద్వారా నీటిని పడేలా ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కిందికి దిగి ఉరుకులు, పరుగులు పెట్టింది. అధికారులు ఏర్పాటు చేసిన బోనులోకి చిరుత వెళ్లకపోవటంతో జూపార్కుకు చెందిన వైద్యులు తుపాకి పేల్చి మత్తును ఎక్కించారు. స్పృహ కోల్పోవటంతో బోనులో బంధించి హైదరాబాద్లోని జూపార్కుకు తరలించారు. ప్రస్తుతం చిరుత యాక్టివ్గా ఉందని, ఎవరికీ ఎలాంటి నష్టం కలుగలేదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని డీఎఫ్ఓ శ్రీధర్రావు తెలిపారు. -
సంగారెడ్డి : చిరుత చిక్కింది
-
సంగారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం.. చిరుత చిక్కిందిలా!
సంగారెడ్డి జిల్లాలో చిరుత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం దానిని బోన్లోకి ఎక్కించి జూకి తరలించారు. కాగా చిరుత సంచారం దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఉన్న రసాయన పరిశ్రమలో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. హెటిరో పరిశ్రమలోని హెచ్ బ్లాక్లో ఉదయం నాలుగు గంటల సమయంలో చిరుత ప్రవేశించింది. చిరుత రాకను గమనించిన ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి తలుపులు మూసివేశారు. అనంతరం పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో నెహ్రూ జూపార్కు నుంచి ప్రత్యేక బృందం హెటిరో పరిశ్రమకు చేరుకుని గాలింపు చేపట్టింది. కాజీపల్లి అటవీప్రాంతం నుంచి చిరుత వచ్చిన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్లపై చిరుత కలకలం..భయంగుప్పెట్లో బెంగళూరు
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు ఔటర్లో చిరుతపులి కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిరుతపులి జింకను వేటాడటంతో అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నార. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా కెంగేరిప్రాంతంలోని తురహళ్లి సమీపంలో చిరుత హల్చల్ చేయడం జరిగింది. ఈమేరకు బెంగళూరు సిటీ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్ఎస్ రవిశంకర్ మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు చిరుతలు కనిపించాయని ఎవరో ప్రచారం చేయడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనులు నెలకొన్నాయి. ఈ తురహళ్లి స్టేట్ ఫారెస్ట్ 519 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే దాదాపు అదే పరిమాణంలో తురహళ్లి అటవీ కారిడార్కి ఆరు కిలోమీటర్ల దూరంలో బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఉంది. అందువల్ల ఇక్కడ తరుచుగా వన్యప్రాణులు కనిపిస్తాయని అన్నారు. (చదవండి: ఏనుగుల బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉంటుందో తెలుసా!) -
ఆ అద్భుతం వెనకాల కష్టం మామూలుది కాదు!
అదో అరుదైన జీవి. మనిషి కంటపడకుండా తిరగడం దాని నైజం. అలాంటి జీవిని.. అంతే అద్భుతంగా కెమెరాలో బంధించింది ఓ ఫీమేల్ ఫొటోగ్రాఫర్. అదీ ఎముకలు కొరికే చలిలో.. ఎంతో కష్టపడి మరీ!. అమెరికాకు చెందిన ఫొటోగ్రాఫర్ కిట్టియా పాలోస్కి.. మంచు పర్వత శిఖరాన ఠీవిగా కూర్చున్న మంచు చిరుతను కెమెరాలో బంధించింది. నేపాల్ ఖుంబు గ్లేసియర్లో ఫాంటోమ్ అల్లేగా పిలువబడే చోట ఆమెకు ఈ దృశ్యం తారసపడింది. కాలినడకన దాదాపు.. 165 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె ఈ అద్భుతాన్ని బంధించారట!. View this post on Instagram A post shared by Kittiya Pawlowski (@girlcreature) ఈ ఫొటో మాత్రమే కాదు.. ఎవరెస్ట్ పర్వతం, పుమోరి పర్వతాల నీడన మంచు చిరుత పయనిస్తున్న ఫొటోలను ఎంతో సుందరంగా తీశారు పాలోస్కి. ఎప్పుడైతే అవి సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయో.. అప్పటి నుంచి అవి వైరల్ కావడం ప్రారంభించింది. యానిమల్ప్లానెట్తో పాటు కొన్ని ప్రభుత్వ సంస్థలు సైతం ఆమె ఫొటోల్ని వాడేస్తున్నాయి. పాంథెరా జాతికి చెందిన మంచు చిరుతకు.. ఘోస్ట్ ఆఫ్ మౌంటెయిన్స్గా పేరుంది. సిగ్గుపడే స్వభావం కారణంగా అది మనుషుల కంట పడదు.. పడినా దాడి చేసిన సందర్భాలు లేవు!. అయితే వేట, అక్రమ రవాణా కారణంగా వీటి జనాభా బాగా తగ్గిపోతూ వస్తోంది. 2040 నాటికి ఇవి అంతరించుకునే పరిస్థితికి చేరుకుంటాయనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్తే ఇలాగే ఉంటది! వీడియో వైరల్ -
రోడ్డుపై చిరుత కలకలం... భయపెట్టించేలా పరుగు తీసింది
మైసూర్లో ఒక రహదారిపై చిరుత హల్చల్ చేసింది. పలువురిని భయబ్రాంతులకు గురిచేసేలా పరుగులు పెట్టించింది. అందుకు సంబంధించిన వీడియో ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో చిరుత రోడ్డుపై వెళ్తున బైకర్ని కిందపడేసి, పిచ్చిపట్లినట్లు కలయ తిరిగింది. ఆ చిరుతను నియంత్రించేందుకు వస్తున్న ప్రభుత్వ ఉద్యోగికి దూరంగా పరుగులు పెట్టింది. చివరికి అటవీశాఖ అధికారులు ఆ చిరుతను ఏదోరకంగా శాంతింప చేసి లొంగదీసుకున్నారు. అది కాస్త ఒత్తిడికి గురైందని, అందువల్లే రోడ్డుపై ఉన్న జనాలను భయపెట్టించి పరుగులు పెట్టించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు. ఈ వైరల్ వీడియోని చూసిన నెటిజన్లు చిరుత రక్షింపబడిందని ఆనందం వ్యక్తం చేయగా, కొంతమంది మానవులు ఆగడాలు ఎక్కువైపోవడం వల్లే అవి రోడ్లపైకి వస్తున్నాయంటూ ట్వీట్ చేశారు. Disturbing visuals from Mysore.The crowd is only adding to the already stressed leopard. Latest, it has been safely tranquilised by the forest Department officials. It’s only mistake was that it was seen. After which the people became wild & the real wild struggled for safety. pic.twitter.com/F4dXNsAYvT — Susanta Nanda (@susantananda3) November 4, 2022 (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
చీకట్లో నల్ల చిరుత.. అలా బంధించే హక్కు ఎవడిచ్చాడు?
వైరల్: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్ లైట్ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో.. అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్ఫెక్ట్ క్యాప్చర్ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నంద ఆ వీడియోను పోస్ట్ చేశారు. A perfect capture. Both by the leopard & the videographer😞😞 But who gave the right to capture these rare moments of nature in full glare of spot light? WA fwd. pic.twitter.com/ZITOBOpO92 — Susanta Nanda (@susantananda3) October 8, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇంట్లోకి చొరబడిన చిరుత
-
నిజాం వెంట చీతా.. అతిథులకు వేట సరదా తీర్చిన నవాబులు
నిజాం పాలనా సమయం.. అది మలక్పేటలోని రేస్ కోర్సు.. ఓ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయం.. ఉన్నట్టుండి అలజడి మొదలైంది. ఆరో నిజాం తన వెంట రెండు చీతాలను తీసుకుని అక్కడికి వచ్చారు. చీతాలను రెండు వైపులా కూర్చోబెట్టుకుని గుర్రపు పందాలను వీక్షించి.. కాసేపటికి వెళ్లిపోయారు. అది 1885.. బ్రిటిష్ అధికారి, రచయిత లార్కింగ్ హైదరాబాద్కు వచ్చారు. నిజాం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భోజనం, ఆ తర్వాత ప్యాలెస్ల వీక్షణంతో గడిచిపోయింది. మరునాడు పొద్దునే లార్కింగ్ను నిజాం పరివారం మహబూబాబాద్ ప్రాంతంలో వేటకు తీసుకెళ్లారు. వారు వెంట రెండు చీతాలను తీసుకురావటం, వాటి సాయంతో వేటాడటం చూసి లార్కింగ్ ఆశ్చర్యపోయారు. ఆ వేటను వివరిస్తూ ఓ పెయింటింగ్ రూపొందించారు. ‘బందోబస్త్ అండ్ ఖబర్’ పేరుతో రాసిన పుస్తకంలో దాన్ని ప్రచురించారు. సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలోనూ చీతాలు ఉండేవి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న విదర్భ ప్రాంతంలో చీతాలు ఉండేవని బ్రిటిష్వారి నివేదికలు చెబుతున్నాయి. అక్కడి నుంచి ఆదిలాబాద్ వరకు అటవీ ప్రాంతంలో అవి తిరుగాడేవి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లెక్కల ప్రకారం.. 1900 నాటికి ఇండియాలో 414 చీతాలు ఉండేవి. అయితే హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి నిజాం ఎలాంటి లెక్కలు తీయించలేదు. ఆ సమయంలో వేట విలాసంగా ఉండేది. పెద్ద పులులను వేటాడేందుకు వెళ్లినవారికి చీతాలు సులభంగా చిక్కేవి. అలా ఎన్నింటినో చంపినా.. ఆ తర్వాతికాలంలో జింకల వేట కోసం చీతాలను వాడటం మొదలుపెట్టారు. ఇందుకోసం నిజాం పాలకులు వేటకుక్కల్లా చీతాలను మచ్చిక చేసుకున్నారు. కానీ వేట, అనారోగ్యం, ఇతర కారణాలతో త్వరగా అంతరించిపోయాయి. దీనితో అడవుల్లో చీతా పిల్లలు కనిపిస్తే తెచ్చి అప్పగించాలని ప్రజలకు నిజాం ఆదేశాలు జారీ చేశారు. చివరికి బ్రిటీష్ అధికారులకు లేఖ రాసి మధ్యప్రదేశ్ ప్రాంతంలో చీతాలను పట్టుకుని, హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎడ్ల బండిపై చీతాను తీసుకెళ్తున్నట్టు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గీయించిన చిత్రం 1908లో హైదరాబాద్కు వచ్చిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆల్బర్ట్ ఎడ్వర్డ్.. ఇక్కడ నిజాంతో కలిసి వేటలో పాల్గొన్నారు. వేటకు వెళ్లేప్పుడు రెండు ఎడ్ల బండ్లపై మంచాలు వేసి, వాటికి చీతాలను కట్టి తీసుకురావడం ఆల్బర్ట్ ఎడ్వర్డ్ను ఆశ్చర్యపర్చింది. చీతాలు వాయువేగంతో పరుగెడుతూ జింకలను వేటాడటాన్ని చూసిన ఆయన.. ఆ దృశ్యాలను వివరిస్తూ ఈ చిత్రాలను గీయించారు. జింకను వేటాడుతున్నట్టు గీయించిన మరో చిత్రం ఇప్పటికీ నాటి గుర్తులు నిజాం వారసుల ఇళ్లలో చీతాలకు, నాటి వేటకు సంబంధించిన గుర్తులు ఇప్పటికీ ఉన్నాయి. హైదరాబాద్లోని మౌలాలి ప్రాంతంలో నిజాం ఆంతరంగికుడి వారసుడి నివాసంలో నాడు చీతాల కోసం వినియోగించిన పెద్ద పెద్ద ఇనుపబోన్లు ఉన్నాయి. అప్పట్లో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ కూడా నిజాం సమక్షంలో వేట సరదా తీర్చుకున్నారు. నిజాం 1903లో లార్డ్ కర్జన్ను నిజాం పూర్వపు వరంగల్ జిల్లా నెక్కొండ అడవుల్లో వేటకు తీసుకెళ్లారు. వారు అక్కడ పెద్దపులిని వేటాడి.. దాని పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. (క్లిక్: 70 ఏళ్ల తర్వాత భారత్లోకి 8 చీతాలు.. పేరు పెట్టిన ప్రధాని మోదీ) -
చిరుతల కోసం 'పులి విమానం'.. ఫోటోలు వైరల్..
న్యూఢిల్లీ: భారత్కు 8 చీతాలను(చిరుతలు) తీసుకొచ్చేందుకు ప్రత్యేక జంబో జెట్ నమీబియా రాజధాని విండ్హోక్కు వెళ్లింది. భారీ పరిమాణంలో ఉన్న ఈ కస్టమైజ్డ్ విమానం ముందు భాగాన్ని పులి ఫోటోతో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా ఉన్న ఈ విమానం ఫోటోలను నమీబియాలోని భారత రాయబార కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది. చిరుతలను భారత్కు తీసుకొచ్చేందు 'టైగర్ విమానం' విండ్హోక్లో ల్యాండ్ అయిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. A special bird touches down in the Land of the Brave to carry goodwill ambassadors to the Land of the Tiger.#AmritMahotsav #IndiaNamibia pic.twitter.com/vmV0ffBncO — India In Namibia (@IndiainNamibia) September 14, 2022 ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ 8 చిరుతలు సెప్టెంబర్ 17న భారత్కు రానున్నాయి. మొదట రాజస్థాన్లో ల్యాండ్ అయి, ఆ తర్వాత మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో వీటిని విడుదల చేస్తారు. మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. 8 చిరుతల్లో ఐదు మగవి కాగా.. మూడు ఆడవి. అంతరించిపోయిన జాతి.. ఈ అరుదైన చిరుతలు దేశంలో అంతరించిపోయినట్లు 1952లోనే భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వీటిని పునరుత్పత్తి చేసేందుకు ఇతర దేశాల నుంచి చిరుతలను భారత్కు తీసుకురావడానికి 1970 నుంచి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు ఈ ఏడాది జులైలో నమీబియాతో ఒప్పందం కుదుర్చుకుంది భారత్ ప్రభుత్వం. ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ప్రాజెక్టులో భాగంగా 8 చిరుతలను నమీబియా నుంచి తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్టు కోసమే పులి విమానాన్ని తయారు చేశారు. ఇందులో చిరుతల కోసం ప్రత్యేకంగా బోనులు ఏర్పాటు చేశారు. అంతేకాదు 16 గంటల పాటు ఈ విమానం నిర్విరామంగా ప్రయాణించి భారత్కు చేరుకోనుంది. మధ్యలో ఎక్కడా ఇంధనం కోసం కూడా ఆగాల్సిన అవసరం లేకుండా దీన్ని రూపొందించారు. ఈ 16 గంటలు చిరుతలకు ఎలాంటి ఆహారం అందించరు. గాల్లోనే ప్రయాణిస్తున్నందున వాటికి న్యూయేసియా వంటి సమస్యలు రాకుండా సిబ్బంది ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: నితీశ్ కుమార్తో దోస్తీపై ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు -
చిత్తూరు జిల్లా కుప్పంలో చిరుత కలకలం
-
చిరుతకు రాఖీ కట్టిన మహిళ: ఫోటో వైరల్
అందరూ రాఖీ పండుగను తమ సోదరులకు తమ ప్రియమైన వ్యక్తులకు కట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొంతమంది మనల్ని రక్షించే రక్షక భటులకు కట్టడం వంటివి చేస్తుంటారు. ఒక్కొకరు ఒక్కో పద్ధతిలో తమకు నచ్చిన రీతిలో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఇక్కడొక మహిళ మాత్రం ఏకంగా చిరుతకే రాఖీ కంటే తన గొప్ప మనసుని చాటుకుంది. ఏం జరిగిందంటే...చిరుతకి రాఖీ కట్టడమా! అని ఆశ్యర్యపోకండి. ఔను రాజస్తాన్లోని ఓ మహిళ చిరుతపులికి రాఖీ కట్టింది. అనారోగ్యానికి గురైన చిరుత పులిని అటవీ శాఖకు అప్పగిస్తూ ఆ చిరుతకు రాఖీ కట్టింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద శుక్రవారం ట్విట్టర్లో షేర్ చేశారు. ఆయన భారతీయులు జంతువుల పట్ల అమితమైన ప్రేమను కనబరుస్తూ వాటితో సామరస్యంగా ఉంటారని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. ప్రపంచం మానువులకు మాత్రమే కాదని దేవుడు అన్ని రకాల జంతువులను సృష్టించాడని ఒకరు, వన్యప్రాణుల పట్ల మహిళలా ప్రేమగా వ్యవహరించాలని మరోకరు సదరు మహిళను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. For ages, man & animal in India have lived in harmony with unconditional love to the wild. In Rajasthan, a lady shows this unfettered love to our wild by tying a Rakhi(symbol of love & brotherhood ) to an ailing Leopard before handing over to Forest Department. (As received) pic.twitter.com/1jk6xi1q10 — Susanta Nanda IFS (@susantananda3) August 12, 2022 (చదవండి: నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు) -
బెంగాల్ అడవుల్లో అత్యంత అరుదైన క్లౌడెడ్ లెపార్డ్, ఫోటో విడుదల
అత్యంత అరుదైన క్లౌడెడ్ లెపార్డ్ బుక్సా టైగర్ రిజర్వ్లో ఇటీవల కనిపించింది. పశ్చిమబెంగాల్ అటవీశాఖ గురువారం ఆ చిరుత ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆగ్నేయాసియా, దక్షిణ చైనా గుండా హిమాలయాల దిగువ ప్రాంతానికి వచ్చే ఈ చిరుతలు... ఇప్పుడు అక్కడా అంతరించిపోతున్నాయి. దీంతో 1980 నుంచి ప్రభుత్వాలు ఆ చిరుతలను పెంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. అయినా అవింకా తక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. అలాంటి సమయంలో బుక్సా టైగర్ రిజర్వ్లో ఈ చిరుత ఇలా కెమెరా ట్రాప్స్ కంట పడటంతో... ‘అంతర్జాతీయ క్లౌడెడ్ లెపార్డ్ డే’ సందర్భంగా ఆగస్టు 4న బెంగాల్ అటవీ అధికారులు ఆ ఫొటోను షేర్ చేశారు. ఈ చిరుత గర్జించలేదట. అలాగని పిల్లిలా కూతలు కూయదట. మధ్యస్థంగా ఉంటుంది. పిల్లలు వెంట ఉన్నప్పుడు, భాగస్వామితో ఉన్నప్పుడు మాత్రమే ఆగ్రహంతో ఉండే క్లౌడెడ్ లెపార్డ్... మిగతా సమయాల్లో సాధు జంతువంటే నమ్మండి! -
కెమెరాకు చిక్కిన మంచు చిరుత.. ఎక్కడంటే!
మంచు చిరుత.. వీటి ఫొటోలు అంత ఈజీగా దొరకవు. ఎందుకంటే.. అవి పరిసరాల్లో కలిసిపోయి ఉంటాయి.. వీటిని క్లిక్మనిపించడానికి ఫొటోగ్రాఫర్లు నెలలతరబడి వేచి చూసిన సందర్భాలు అనేకం.. ఇక్కడ కూడా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ సషా ఫొన్సెకా అలాగే ఎదురుచూశారు. ఫలితం.. ఇదిగో.. తన ఫొటోను క్లిక్మనిపిస్తున్న కెమెరా వైపు కోపంగా లుక్కులిస్తు మరీ చిక్కింది ఈ స్నో లెపర్డ్. దీన్ని లడఖ్ పర్వత ప్రాంతంలో తీశారు. ఇంటర్నెట్లో షేర్ చేయగానే.. జనమంతా ఎగబడి చూశారు. దీంతో మంచు చిరుత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ( విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Sascha Fonseca (@sascha.fonseca) -
ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ముంబై: అర్దరాత్రి ఇంటి ముందు ఉన్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ నెల 5వ తేదీన నాసిక్లోని ముంగ్సారే గ్రామంలో నివాస ప్రాంతంలోకి చిరుతపులి ప్రవేశించి హల్చల్చేసింది. అర్దరాత్రి ఉంటి ముందు చిన్న గోడపై పెంపుడు కుక్క కూర్చొని ఉండగా.. దూరం నుంచి చిరుతపులి అటు వైపుగా వచ్చింది. చిరుతను గమనించిన శునకం అలెర్ట్ అయి పారిపోయేందుకు ప్రయత్నించింది. చిరుత దగ్గరకు రావడంతో గోడ వైపు నుంచి అటు ఇటు దూకుతూ చిరుత దాడి నుంచి తప్పించుకునేందుకు ట్రై చేసింది. #WATCH | Leopard entered a residential area in Mungsare village of Nashik, attacked a pet dog yesterday (Source: CCTV) pic.twitter.com/OznDoeQvHR — ANI (@ANI) June 6, 2022 అయితే చిరుతపులి పట్టు వదలకుండా కుక్క వెనకాలే పరుగెత్తింది. అలా కొద్దిసేపటి తరువాత చివరకు ఆ శునకం చిరుతకు ఆహారంగా దొరికిపోయింది. చిరుతపులి తన దవడలతో కుక్కను కరచుకొని వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. కాగా జనావాసాల్లో చిరుతపులి సంచారంపై నాసిక్ ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి వస్తుండటంతో ముంగ్సారే గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, రాత్రిపూట ఇళ్లలోనే నిద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చిరుత సంచరిస్తుందని తెలిసి పెంపుడు కుక్కలను బయట ఎందుకు ఉంచుతున్నారని మండిపడుతున్నారు. చదవండి: అంత బలుపేంటి భయ్యా.. కారు ఉంటే ఇంట్లో పెట్టుకో చౌదరి సాబ్.. Maharashtra | We appeal to the people of Mungsare village to remain indoors at night as leopard activity has increased in this area. People must remain alert: Pankaj Garg, Deputy Conservator of Forest, Nashik pic.twitter.com/2nPNepXCQi — ANI (@ANI) June 6, 2022 -
కన్నకూతురిని చిరుత ఈడ్చుకెళ్తుండగా తల్లి సమయస్ఫూర్తి..
చంద్రాపూర్: చిరుత పులి (Leopard) ఎదురుపడితే.. పైప్రాణాలు పైనే పోవడం ఖాయం. అలాంటిది ఇక్కడ ఓ అమ్మ సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ధైర్యం తెచ్చుకుని చిరుతతో పోరాడింది. బిడ్డ కోసం వంట చేస్తుండగా.. గట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించింది ఓ చిరుత. అన్నం తింటున్న కూతుర్ని ఈడ్చుకెళ్తుంటాన్ని చూసి షాకైన ఆ తల్లి.. ప్రాణాలకు తెగించి మరీ పోరాటం చేసింది. జ్యోతి పుపాల్వర్ తన మూడేళ్ల కూతురితోపాటు మహారాష్ట్ర చంద్రాపూర్ ప్రాంతలోని దుర్గాపూర్ కాంప్లెక్స్లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో కూతురు ఆకలి అనడంతో ఆ చిన్నారికి జ్యోతి అన్నం పెట్టి తన పనిలో నిమగ్నం అయింది. మూడేళ్ల చిన్నారి ఇంట్లో కూర్చుని భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ఇంట్లోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఆ చిన్నారి భయంతో కేకలు వేసింది. కూతురి అరుపులు విన్న జ్యోతి.. చిన్నారి వద్దకు పరుగెత్తుకెళ్లింది. తన కూతురిని చిరుత ఈడ్చుకెళ్లడం చూసి షాకైంది. వెంటనే సమయస్ఫూర్తితో ఓ కర్ర తీసుకుని చిరుతను వెంబడించింది. ప్రాణాలకు తెగించి మరీ దానితో పోరాటం చేసింది. చివరకు కూతురి ప్రాణాలను రక్షించుకుంది. ఆ కర్ర దెబ్బలకు బిడ్డను వదిలేసిన చిరుత.. జ్యోతిని కూడా ఏం చేయకుండా అక్కడి నుంచి పారిపోయింది. తీవ్రంగా గాయపడ్డ కూతురుని స్థానికుల సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది జ్యోతి. ప్రస్తుతం ఆ బిడ్డ క్షేమంగానే ఉంది. చిరుతతో పోరాడిన ఊరంతా జ్యోతిని మెచ్చుకుంటున్నారు. చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్! -
వీడియో: పోలీసులకు చుక్కలు చూపించిన చిరుతపులి
సాధారణంగా ఎక్కడో దూరంలో ఉన్న చిరుతపులిని చూస్తేనే గుండెలో వణుకు పుడుతుంది. ఇక మన పక్కన వచ్చి నిల్చుంటే భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి. అదే చిరుతపులితో పోరాటం అంటే ఎలా ఉంటుంది?. ఇంకేమైనా ఉందా.. పులి ఆకలికి ఆహారం అవ్వాల్సిందే. కానీ కొందరు అధికారులు ప్రాణాలకు తెగించి, చిరుతపులితో పోరాడారు. హర్యానాలో చిరుతపులిని పట్టుకునే ఆపరేషన్లో ఓ పోలీస్, ఇద్దరు అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటన హర్యానాలో ఆదివారం చోటుచేసుకుంది. పానిపట్ జిల్లాలో బెహ్రాంపూర్ గ్రామంలో చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు ఆదివారం ఆపరేషన్ చేపట్టారు. తమ గ్రామంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారుల బృందం చర్యలు చేపట్టింది. చిరుతపులిని పట్టుకునే క్రమంలో అది..పోలీసులూ, అటవీ అధికారులపైకి దూకింది. దాడి చేయకుండా కర్రలతో, రాళ్లతో బెదిరించినా అధికారులపై పంజా విసిరింది. దాని గోళ్లతో చర్మంపై రక్కింది. చిరుత దాడిలో స్టేషన్ హౌజ్ ఆఫీసర్తోపాటు ఇద్దరు అటవీశాఖ అధికారులు గాయపడ్డారు. అయినప్పటికీ ఎట్టకేలకు చిరుతపులిని విజయవంతంగా బంధించారు. చదవండి: మహారాష్ట్ర సీఎంకు ఎంపీ నవనీత్ కౌర్ సవాల్ Tough day at work for people from police and forest dept.. A couple of them suffered injuries..Salute to their bravery and courage..In the end, everyone is safe..Including the leopard.. pic.twitter.com/wbP9UqBOsF — Shashank Kumar Sawan (@shashanksawan) May 8, 2022 ఆపరేషన్లో పాల్గొన్న అధికారుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘పోలీసులు, అటవీ శాఖ ప్రజలకు విధి నిర్వాహణలో కష్టమైన రోజు. ఇందులో ఇద్దరు, ముగ్గురు గాయపడ్డారు.. వారి ధైర్యానికి, సాహసానికి సెల్యూట్. చివరికి, చిరుతపులితో సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.’ అని పానిపట్ ఎస్పీ శశాంక్ కుమార్ సావన్ ట్విటర్లో తెలిపారు. -
భళా సంజన.. చిరుతని చితక్కొట్టి భర్తని కాపాడుకున్నావ్!
పుణె: కొంతమంది పిల్లులను చూసి కూడా భయపడుతుంటారు. అలాంటిది చిరుతపులంటే దడుచుకుని కిలో మిటరు దూరం ఆగకుండా పరిగెత్తారు. అదే పులితో పోరాడాల్సి వస్తే ఆ మాటలను ఊహించాలంటే భయమేస్తుంది. కానీ, మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన మహిళ చిరుతతో పోరాడి దాని బారి నుంచి తన భర్తను కాపాడుకుంది. ఈ ఘటన మార్చి 25 రాత్రి అహ్మద్నగర్ జిల్లాలోని పార్నర్ తహసీల్లోని దరోడి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ మహిళను స్థానికులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సభ్యులందరు గాఢనిద్రలో ఉండగా, సంజన తమ ఇంటి బయట చిరుతపులి ఉండటాన్ని పసిగట్టింది. ఈ విషయాన్ని తన భర్త గోరఖ్ దశరథ్ పవాడేకు చెప్పగా అతడు బయటకు వెళ్లాడు. అంతలో చిరుతపులి ఆ వ్యక్తిపైకి దూకి దాడి చేసింది. అది ఆ వ్యక్తి వీపును పట్టుకుని గాయపరుస్తుండగా ధైర్యాన్ని కూడగట్టుకుని అతని భార్య సంజన పరుగెత్తుకుంటూ వచ్చి పులితో పోరాడుతూ దాని తోకను పట్టుకుని వెనక్కి లాగేందుకు ప్రయత్నించింది. ఆమె చిరుతపులి బారి నుంచి తన భర్తను విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగానే సంజన తండ్రి, ఆ ఇంట్లోని పెంపుడు కుక్క కూడా అక్కడికి చేరుకున్నాయి. ఈలోగా పెంపుడు కుక్కతో దశరథ్ తండ్రి అక్కడికి వచ్చి కట్టెలు, గ్రానైట్ రాళ్లతో చిరుతను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో అతడిపై చిరుత పట్టుకోల్పోయింది. వెంటనే మహిళ భర్త పులి నుంచి దూరంగా జరిగాడు. చివరకు వారంతా కలిసి చిరుత అక్కడి నుంచి తరిమికొట్టారు. చదవండి: ‘ఒంటరిగా ఉన్నాను ఇంటికిరా’.. అంటూ పిలిచి నిలువుదోపిడి చేసిన మహిళ -
‘ఉక్రెయిన్ నుంచి రాలేను.. నా ప్రాణం కంటే చిరుత పులుల ప్రాణాలే ముఖ్యం’
Indian Doctor Refuses To Leave Ukraine: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది. ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్లోని డాన్బాస్లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్బాస్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు. అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్కి సురక్షితంగా తిరిగి వచ్చాడు. (చదవండి: వాషింగ్టన్లో జెలెన్స్ స్కీ పేరుతో రహదారి! వైరల్ అవుతున్న ఫోటో) -
పైథాన్, చిరుతల మధ్య భీకర పోరు.. వీడియో వైరల్
సోషల్ మీడియా విస్తృతి పెరిగిన్పటి నుంచి రకరకాల వీడియోలు వైరల్ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని వీడియోలు చూస్తే భయపడకుండా ఉండలేం! తర్వాత ఏం జరగబోతుందో అనే ఉత్కంఠను రేపుతాయి కూడా. ప్రస్తుతం అటువంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ చెరువులో ఆహారం కోసం వెతుకుతున్న చిరుతకు అదే సమయంలో ఒక చిన్న పైథాన్ ఎదురుపడింది. అయితే ఒక్కసారిగా చిరుత.. ఫైథాన్ను నోట కరిచింది. దీంతో పైథాన్ చిరుతను చుట్టేయడానికి ప్రయత్నించింది. చిరుత పంజా ముందు పైథాన్ ప్రయత్నం సాగలేదు. కొండచిలువను చిరుత నోట కరుచుకొని దగ్గరల్లో ఉన్న గట్టుపైకి ఈడ్చుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను wild_animals_creation అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘పైథాన్ను చిరుత ఏం చేసింది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Wild life stories (@wild_animals_creation) -
బిడ్డ మీదకు దూకిన చిరుత.. మరి ఆ తల్లి ఊరుకుంటుందా?
లక్నో: తనకు ఏమైనా ఫర్వాలేదు.. బిడ్డలకు ఏమీ కాకూడదనే తాపత్రాయం కన్న తల్లిలోనే కనిపిస్తుంది. మరి బిడ్డకు ఆపదొస్తే తల్లి అమాంత ఉరుకుతుంది. కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంటే తల్లి ఎంతవరకూ అయినా తెగిస్తుంది. కొండంత బలాన్ని తెచ్చుకుని పోరాటం చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచిందో ఓ సంఘటన. యూపీలోని బాహ్రయిచ్ జిల్లాలో చోటు చేసుకున్న ఘటన బిడ్డలపై తల్లికుండే ప్రేమకు నిలువటద్దంలా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఖరిఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్డా గ్రామంలో ఒక ఇంటి పరిసర ప్రాంతంలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇళ్లు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఆడుకున్న చిన్నారిపై చిరుత దాడి చేసింది. అంతే వేగంగా ఆరేళ్ల పాపను పట్టుకుని ఎత్తుకుపోయే ప్రయత్నం చేసింది. దాన్ని చూసిన ఆ పాప తల్లి.. చిరుతపులి ఎత్తుకపోతుంటే చూస్తూ కూర్చోలేదు. ఒక్క ఉదుటన చిరుతపైకి ఉరికింది. తన ప్రాణం గురించి పట్టించుకోలేదు. అది చిరుత అనే సంగతే మరిచిపోయింది. తల్లి మరో చిరుతపులి అయిపోయింది. బిడ్డను రక్షించుకోవడానికి ఒక బలమైన కర్ర తీసుకుని ఆ బిడ్డను వదిలేదాక కొట్టింది. ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆ పాపకు చికిత్స అందిస్తున్నారు. అటవీ అధికారులు దీన్ని మీడియాకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఆరేళ్ల పాప పేరు కాజల్ కాగా, తల్లి పేరు రీనా దేవి. -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
మేఘం వన్నె చిరుత.. సోషల్ మీడియాలో వైరల్
న్యూఢిల్లీ: మేఘం వన్నె చిరుతలు బయట కనిపించడం ఇప్పటి వరకు బహు అరుదు. సాధారణంగా తక్కువ ఎత్తులో ఉండే సతత హరిత అరణ్యాలలో కనిపించే ఈ రకమైన చిరుతలు మొట్టమొదటిసారిగా భారత్–మయన్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్లోని 3,700 మీటర్ల ఎత్తైన పర్వత ప్రాంతా ల్లో కనిపించింది. 2020 జనవరి–జూన్ నెలల మధ్యలో పరిశోధకులు అమర్చిన 37 కెమెరాలు వీటి కదలికలను రికార్డు చేశాయి. భారత్లో ఇంత ఎత్తైన ప్రాంతాల్లో ఇవి కనిపించడం తొలిసారని పరిశోధకులు అంటున్నారు. ఈ రకం చిరుతలు ఇండోనేసియాతోపాటు హిమాలయ పర్వతాల్లో నివసిస్తుంటాయి. చాలా అరుదుగా కనిపిస్తుండటం తో వీటిని అంతరించిపోయే జాతిగా భావిస్తున్నారు. నాగాలాండ్లోని 65 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని థానమిర్ కమ్యూనిటీ అటవీ ప్రాంతం లోని 7 చోట్ల ఇటువంటి చిరుతలు రెండు పెద్దవి, రెండు కూనలు కనిపించినట్లు వైల్డ్లైఫ్ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీఎస్ఐ) తెలిపింది. సుమారు 3,700 మీటర్ల ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలవని తాజా పరిశీలనతో రుజువైందని డబ్ల్యూపీఎస్ఐ పేర్కొంది. -
వైరల్: ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కష్టంగా ఉందా?
చిరుతపులి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత వేటాడి దాడి చేస్తే ఇక ప్రాణాలు వదులుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే క్రూర జంతువు చిరుతపులి. చెట్లను ఎక్కడం, పాకడం, నీటిలో ఈదడంలోనూ ఇది ఆరితేరిన జంతువు. అలాంటి చిరుతకు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైకు చెందిన అమిత్ మెహ్రా అనే యూజర్ తన ట్విటర్లో చిరుతపులికి చెందిన ఫోటోను పోస్టు చేశారు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! There is a leopard in this picture. Try to spot it. No pun intended 🥴 pic.twitter.com/xeT87wV1cy — Amit Mehra (@amitmehra) December 27, 2021 ఈ చిత్రంలో చిరుత ఎక్కడుందో గుర్తించాలంటూ నెటిజన్లకు సవాల్ విసిరారు. ఈ ఫోటో అడవి మధ్యలో చెట్ల దగ్గర తీసినట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో చిరుత ఎక్కుడుందో కనుక్కోవడమే అసలైన టాస్క్. సాధారణంగా కొన్ని చూడగానే టక్కున కనిపిస్తాయి. మరికొన్ని కొంచెం నిశితంగా పరిశీలిస్తేనే కనిపించే అవకాశం ఉంటుంది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు. ఫోటోలో చిరుత ఉందా అనే సందేహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు గుర్తు పట్టడం చాలా కష్టమండోయ్ అంటున్నారు. మరి ఈ ఫోటోలో చిరుత ఎక్కడుందో కనిపెట్టండి. కనిపించకుంటే కింద ఉన్న ఫోటోను చూడండి మీకే తెలుస్తుంది. చదవండి: రైల్వే ట్రాక్పై తలపెట్టి ఆత్మహత్యాయత్నం.. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో.. -
చిరుత దళం; వాళ్లు చంపాలని.. వీరు కాపాడాలని!
చిరుతపులిని రక్షించాలా? మనిషినా? ఏ ప్రాణమూ తక్కువ విలువైనది కాదు అంటారు ఈ ఏడుగురు. అడవి నుంచి ఊళ్లలోకి వచ్చే చిరుతలను పట్టి మళ్లీ అడవిలో వదలడానికి సూరత్ సమీపాన ఉండే మాండ్వి అటవీ ప్రాంతంలో ప్రత్యేక మహిళా దళం పని చేస్తోంది. ఏడుగురు ఉండే ఈ దళం అడవిలోని చిరుతలకు రక్షకులు. కొత్త చిరుత కనిపిస్తే పట్టుకుని వాటికి ‘రేడియో ఫ్రీక్వెన్సీ’ ట్యాగ్స్ను అమర్చడం కూడా వీరి పనే. కాంక్రీట్ అరణ్యంలో తిరగడానికి జంకే కొందరు స్త్రీలు ఉన్న రోజుల్లో కీకారణ్యంలో ధైర్యంగా తిరుగుతూ స్ఫూర్తినిస్తున్నారు వీరు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు ప్రభుత్వం చిరుతలను అదుపు చేయడానికి చేయవలసిందంతా చేస్తోంది. ఒక్క అడవులను తెగ నరకడాన్ని సమర్ధంగా ఆపు చేయడం తప్ప. సూరత్ (గుజరాత్) జిల్లాలోని మాండ్వి అంటే భిల్లుల సామ్రాజ్యం. అటవీ ప్రాంతం. భిల్లులు, అడవి మృగాలు కలిసి జీవించిన ప్రాంతం అది ఒకప్పుడు. ఇప్పుడు అరా కొరా అడవి మిగిలింది. వాటిలోని చిరుతలు ఏం చేయాలో తెలియక ఊళ్ల మీద పడుతున్నాయి. మాండ్వి అడవిని ఒరుసుకుంటూ పారే తాపి నది ఒడ్డున ఉన్న పల్లెల్లో ఒకప్పుడు కోళ్లు, గొర్రెలు, పశువులు పెంచేవారు. ఇప్పుడు మానేశారు చిరుతల దెబ్బకు. ఒక ఊరిలో కుక్కలు మాయమయ్యాయంటే చిరుతలు తరచూ దాడి చేస్తున్నట్టు అర్థం. ఆ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించిన నెమళ్లు, కోతులు, కుక్కలు అన్నీ పారిపోయాయి. మాండ్వి అడవిలో దాదాపు 50 చిరుతలు ఉన్నట్టు అంచనా. ప్రభుత్వానికి వాటిని కాపాడటం ఎంత అవసరమో మనుషుల్ని కాపాడటం కూడా అంతే అవసరం. మృగానికి మనిషికి మధ్య తకరారు వచ్చినప్పుడల్లా ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. అయితే చిరుత దాడి వల్ల మనిషినో, పశువునో కోల్పోయిన గ్రామస్తులు చాలా కోపంగా ఉంటారు. చిరుతను కొట్టి చంపాలని చూస్తారు. ఆ సమయంలో మగ ఫారెస్ట్ సిబ్బంది మాట వినరు. కాని మహిళా సిబ్బంది అయితే నచ్చ చెప్పే అవకాశం ఎక్కువ. అందుకే ఫారెస్ట్ ఆఫీసర్లు ఏడుగురు మహిళలతో చిరుత దళాన్ని ఏర్పాటు చేశారు. మాండ్వి ప్రాంతంలో చిరుతను పట్టుకోవాలన్నా, దూరంగా తీసుకెళ్లాలన్నా, దాడుల నుంచి కాపాడాలన్నా, వాటిని పట్టి వాటి కదలికల్ని తెలియచేసే రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాలన్నా అదంతా ఈ ఏడుగురు మహిళా సిబ్బంది పనే. స్థానిక సమూహాల నుంచి ఈ మహిళా సిబ్బందిని తీసుకోవడం వల్ల వారికి అడవి తెలుసు. మచ్చల ఒంటితో హఠాత్తుగా ఊడి పడే చిరుతా తెలుసు. వారు భయపడరు. ‘గత సంవత్సర కాలంలో మేము 22 చిరుతలను పట్టుకుని వాటికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ అమర్చాము’ అంటుంది ఈ దళానికి నాయకత్వం వహించే పూజా సింగ్. ‘ఇంకా కనీసం 20 లేదా 30 చిరుతలకు ఈ పని చేయాల్సి ఉంది. కాని చిరుతలు అంత సులువుగా దొరకవు. బోన్లో పడవు. వాటి కోసం వేచి ఉండాలి. అదే సమయంలో అవి ఉత్త పుణ్యానికి దాడి చేయవు’ అంటారు ఈ చిరుత దళ సభ్యులు. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది’ అంటారు ఈ సిబ్బంది. కాని అన్నిసార్లు పరిస్థితి ఇంత సులువుగా ఉండదు. విధి నిర్వహణలో చిరుత దళ సభ్యులు మధార్కుయి గ్రామంలో చిరుత దాడి చేసి ఒక నాలుగేళ్ల పాపాయిని చంపేసింది. గ్రామస్తులు అగ్గి మీద గుగ్గిలం అయ్యి చిరుత వెంట పడ్డారు. అది ఊళ్లోనే నక్కింది. చిరుత దళానికి కబురు అందింది. వీరు ఆఘమేఘాల మీద చేరుకున్నారు. గ్రామస్తులు ఆ చిరుతను చంపాలని. వీరు కాపాడాలని. ‘చివరకు గాలిలో కాల్పులు జరిపి చిరుతను ప్రాణాలతో పట్టుకున్నాం. లోపలి అడవిలో దానిని వదిలిపెట్టాం’ అన్నారు ఆ దళ సభ్యులు. మాండ్వి అడవంచు పల్లెల్లో చెరకు పంట వేస్తారు. పెరిగిన చెరకు పంట చిరుతలకు దాక్కోవడానికి అనువుగా ఉంటుంది. కనుక దాడి చేస్తాయి. మరోవైపు అడవిలో ఆహారం దొరక్కపోవడం, వేసవిలో నీటి కుంటలు ఎండిపోవడం వల్ల కూడా ఊళ్ల మీదకు వస్తాయి. ‘వేసవిలో అవి నీరు తాగే చోటుకు నీరు చేర వేసి ఆ కుంటలు నిండుగా ఉండేలా చూస్తాం’ అంటారు చిరుత దళ సిబ్బంది. వీరు చిరుతలను కాపాడటమే కాదు ఉచ్చుల్లో చిక్కుకున్న అటవీ మృగాలను, గాయపడ్డ పక్షులను కూడా కాపాడుతుంటారు. చిరుతల కోసం ఇలా ఏడుగురు స్త్రీలు ప్రాణాలకు తెగించి పని చేయడం ఈ కాలంలో స్ఫూర్తినిస్తున్న గొప్ప విశేషం. స్త్రీల చేతుల్లో అడవి క్షేమంగా ఉంటుంది అనడానికి మరో నిదర్శనం. ‘ఒకసారి అడవిలో కార్చిచ్చు వ్యాపించింది. మేము అదుపు చేసే పనిలో ఉన్నాం. అప్పుడు మా సమీపంగా చిరుత వచ్చింది. అలాంటి సమయంలో రెచ్చగొట్టే పనులు చేయకూడదని మేము తర్ఫీదు అయి ఉన్నాం. కనుక మేము ఏమీ చేయలేదు. అదీ ఏమీ చేయకుండా వెళ్లిపోయింది. -
తగ్గేదేలే! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు.. ఫోటోలు వైరల్
ఇక్కడ చిరుతపులి గజగజమంటోంది మనలా చలికి కాదండోయ్.. తనని తరుముకొచ్చిన గజరాజుని చూసి భయపడి.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు కదా. అయితే ఆ గొప్పోళ్ల జాబితాలో ఈ చిరుత ఉన్నట్లు లేదు.. అందుకే.. వేట కోసం బయలుదేరి.. తీరా వెళ్లకవెళ్లక ఏనుగుల గుంపు జోలికి పోయింది. దాని దురదృష్టానికి తగ్గట్లు ఆ వెళ్లిన గ్రూపులో ఇలాంటి తిక్క ఏనుగు కూడా ఉంది. అది ఊరుకుంటుందా.. వార్నింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. ఉరుకులెత్తించింది. చదవండి: కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. పందుల పోటీలు గురించి విన్నారా ఏనుగులకు చెట్లెక్కడం రాదు కాబట్టి ఇదిగో ఇలా బతికి బట్టకట్టింది. లేకుంటే.. బతుకు బస్టాండు అయిపోయేది. దక్షిణాఫ్రికాలోని నార్త్వెస్ట్ ప్రావిన్స్లో ఉన్న రిజర్వు పార్కులో చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ కెవిన్ డూలే క్లిక్మనిపించారు. చెట్టెక్కింది కదా అని ఈ ఏనుగు చిరుతను అంత ఈజీగా వదిలేయలేదట. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. రకరకాల విన్యాసాలతో చిరుతకు చుక్కలు చూపించిందట. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఓ తల్లి సాహసం: ఒట్టి చేతులతో చిరుతతో పోరాడి
MP Tribal Woman Fights Leopard With Bare Hands Rescue Her Son: అమ్మ అంటేనే అంతులేని ప్రేమ, త్యాగానికి ప్రతిరూపం. తనకు ఏం జరిగినా పట్టించుకోదు కానీ బిడ్డకు ఆపద అని తెలిస్తే.. ఆ తల్లి ప్రాణం తల్లడిల్లుతుంది. ఎక్కడా లేని ధైర్యం ఆవహిస్తుంది. ఆది పరాశక్తికి ప్రతిరూపంగా మారి.. ఆపదతో పోరాడుతుంది. ఆ సమయంలో తల్లికి ఎలాంటి ఆయుధాలు అవసరం లేవు.. బిడ్డ మీద ప్రేమ ఒక్కటే ఆమెకు వెయ్యి ఏనుగులు బలాన్ని ఇచ్చి.. పోరాడేలా చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. చంటి బిడ్డను నోట కరుచుకుని.. అడవిలోకి పారిపోయింది చిరుత పులి. బిడ్డ ప్రాణాలు కాపాడటం కోసం ఆ తల్లి పెద్ద యుద్ధమే చేసింది. తన చేతులనే ఆయుధాలుగా మార్చి.. చిరుతతో పోరాడి.. బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది ఆ తల్లి. ఆ వివరాలు.. (చదవండి: దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత) మధ్యప్రదేశ్, సిధి జిల్లాలోని సంజయ్ టైగర్ జోన్లోని ఝరియా అనే గ్రామంలో శంకర్ బైగా, కిరణ్ బైగా తమ పిల్లలతో జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం కిరణ్ బైగా తన పిల్లలతో కలిసి ఆరు బయట ఏర్పాటు చేసిన చలి మంట దగ్గర కూర్చుంది. కిరణ్ ఒడిలో ఓ పాప ఉండగా, మరో ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. ఇంతలో అడవిలో నుంచి వచ్చిన చిరుతపులి ఒక్కసారిగా వీరిపై దాడి చేసి.. కిరణ్ బైగా ఎనిదేళ్ల కొడుకు రాహుల్ని నోట కరుచుకుని అడవిలోకి పరిగెత్తింది. జరిగిన సంఘటనతో కిరణ్ బైగా ఒక్కసారిగా షాక్కు గురయ్యింది. వెంటనే తేరుకుని మిగిలిన పిల్లలను ఇంట్లో ఉంచి.. రాహుల్ని కాపాడుకోవడం కోసం అడవిలోకి పరుగు తీసింది. అప్పటికే చీకటి పడింది. ఎదురుగా ఏం కనిపించడం లేదు. చిరుత బిడ్డను తీసుకుని పొదల్లో దూరింది. ఏం చేయాలో కిరణ్బైగాకు పాలు పోలేదు. కానీ తన బిడ్డ ప్రాణం ఆపదలో ఉన్న విషయం ఆమెను వెంటాడింది. (చదవండి: బాయ్ఫ్రెండ్ మాట్లాడటం లేదని పోలీసులకు ఫిర్యాదు.. కట్ చేస్తే) చేతికి దొరికిన కర్ర తీసుకుని అడవిలో ముందుకు వెళ్లింది. అప్పటికే కిరణ్ బైగా ధైర్యాన్ని చూసి చిరుత కాస్త జంకింది. ఈ క్రమంలో ఆమె బిడ్డను వదిలేసింది. వెంటనే కిరణ్ అక్కడకు పరిగెత్తి.. బిడ్డను తన పొత్తిళ్లలోకి తీసుకుంది. అంతసేపు కిరణ్ బైగాను చూసి జంకిన చిరుత.. ఉన్నట్టుండి ఆమె మీద దాడి చేయసాగింది. వెంటనే అప్రమత్తమైన కిరణ్ బైగాను బిడ్డను కాపాడుకుంటూనే.. ఒట్టి చేతలతో చిరుతతో పోరాడసాగింది. అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు కిరణ్, ఆమె బిడ్డ కోసం వెతుకుతూ.. అడవిలోకి వచ్చారు. జనాలను చూసిన చిరుత అడవిలోకి పరుగు తీసింది. ఈ దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన ఫారెస్ట్ అధికారులు కిరణ్బైగా సాహసాన్ని ప్రశంసించి.. తక్షణ సాయం కోసం ఆమెకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. బిడ్డ ప్రాణం కోసం కిరణ్ బైగా చేసిన సాహసంపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. The woman of the village saved her little child from the leopard, this would have been the mother of real India (the land of Shivaji Maharaj) Not like today's gentle mother who is busy eating pizza burger and her lust, who shouts help me help me every time. #IndianMother pic.twitter.com/o5V0VRhvtZ — Odd-Purush (Odd Man) (@prevaildatruth) December 1, 2021 చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ -
వామ్మో.. తరగతి గదిలో ప్రవేశించిన చిరుత..
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అలీఘడ్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఒక తరగతి గదిలో చిరుతపులి ప్రవేశించింది. ఈ క్రమంలో ఉదయాన్నే కళాశాలకు వెళ్లిన విద్యార్థిపై దాడిచేసింది. అతను భయంతో కేకలు వేస్తూ.. బయటకు పరుగులు తీశాడు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అలీఘడ్లోని చౌదరి నిహాల్ సింగ్ అనే పాఠశాలలో చిరుతపులి ప్రవేశించింది. తరగతి గదిలో బెంచీల చాటున దాక్కుంది. గదిలోకి ప్రవేశించిన..లక్కీరాజ్ సింగ్ అనే బాలుడిపై వెనక నుంచి దాడిచేసి.. గాయపర్చింది. వెంటనే పులి వేరే చోటుకి పారిపోయింది. అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత.. బాలుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని పాఠశాల ప్రిన్సిపాల్ యోగేశ్ యాదవ్ తెలిపారు. ప్రస్తుతం చిరుత ఒక తరగతి గదిలో దాక్కుందని పాఠశాల సిబ్బంది అటవీ అధికారులకు తెలిపారు. చిరుత పులి కదలికలు పాఠశాలలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈక్రమంలో.. అటవీ సిబ్బంది చిరుత పులిని బంధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో తెలియడంతో పెద్ద ఎత్తును ప్రజలు పాఠశాల వద్దకు చేరుకున్నారు. -
దేశంలోనే తొలిసారి కనిపించిన అరుదైన ‘గులాబీ’ చిరుత
జైపూర్: అత్యంత అరుదైన ‘గులాబీ’ చిరుత దేశంలో తొలిసారి కంటపడింది. రాజస్థాన్ ఆరావళి పర్వతాల్లోని రణక్పూర్ ప్రాంతంలో ఈ గులాబీ చిరుతపులిని స్థానికులు గుర్తించారు. అయితే భారతదేశంలో స్ట్రాబెర్రీ రంగు చర్మంతో ఉన్న చిరుతపులి కనిపించడం ఇదే మొదటిసారి. విస్తారమైన అటవీ ప్రాంతం కారణంగా గులాబీ రంగు చిరుతపులిని చాలాసార్లు చూసినట్లు రణక్పూర్, కుంభాల్ఘర్లోని గ్రామస్తులు చెప్పినట్లు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (డీసీఎఫ్) ఫతే సింగ్ రాథోడ్ తెలిపారు. అయితే ఈ పింక్ చిరుత ఇటీవల కెమెరాకు చిక్కడం ఇదే తొలిసారన్నారు. చదవండి: ఆ పాఠశాలకు అందరూ స్కర్టుతోనే రావాలి.. ఎందుకో తెలుసా? వన్యప్రాణుల సంరక్షణకర్తగా చిరుతపులిని రక్షించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాథోడ్ వివరించారు. కాగా నాలుగు రోజుల శోధన తర్వాత ఈ గులాబీ చిరుతను ఫొటో తీసినట్లు వన్యప్రాణుల సంరక్షణ ఫొటోగ్రాఫర్ హితేష్ మోత్వాని తెలిపారు. దీని వయసు 5,6 ఏళ్లు ఉంటుందన్నారు. ఇంతకముందు 2012, 2019లో గులాబీ రంగు మచ్చలు కలిగి ఉన్న ఈ అరుదైన చిరుతపులిని దక్షిణాఫ్రికాలో కనిపించింది. చదవండి: నదిలో నీళ్లు చల్లుతున్నారు.. కొత్త టెక్నిక్ కాదు.. మరేంటి! -
వైరల్ వీడియో: ఇంటికొచ్చిన చిరుత.. గమనించిన కుటుంబ సభ్యులు..
-
ఇంటికొచ్చిన చిరుత.. గమనించిన కుటుంబ సభ్యులు..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో చొరబడిన చిరుతపులి అక్కడే బందీ అయ్యింది. రామనగర తాలూకా జాలమంగల గ్రామంలో రేణుకాచార్య అనే వ్యక్తి ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత ప్రవేశించింది. దానిని గమనించిన కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి చాకచక్యంగా బయటకు వచ్చి తలుపులు గడిపెట్టేశారు. దీంతో పెద్ద ము ప్పు తప్పింది. అటవీ అధికారులు చేరుకుని చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించి తీసుకెళ్లారు. (చదవండి: కూతుళ్లే పుట్టారని వేధింపులు.. తల్లి, ఇద్దరు పిల్లల ఆత్మహత్య) -
‘సాగర్’ తీరాన చిరుత సంచారం.. కారుకు అడ్డం తిరిగి..
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాలతో పాటు హెడ్స్లూయిస్, నవోదయ విద్యాలయం, నిజాంసాగర్ ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తోంది. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ముగ్గురు స్నేహితులు ప్రవీణ్, శివ, కిశోర్ కలిసి కారులో నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శన ఆదివారం వచ్చారు. ప్రాజెక్టు పరిసరాల్లో సేదతీరిన వీరు సాయంత్రం వేళ ఇంటికి కారులో బయలు దేరారు. నిజాంసాగర్ప్రాజెక్టు ప్రధాన రోడ్డుపై కారుకు అడ్డంగా చిరుత పులి బైఠాయించడంతో వాహనాన్ని నిలిపి వేసి డోర్లు లాక్ చేసుకున్నారు. కొద్దిసేపటికి చిరుతపులి నిజాంసాగర్ మండల కేంద్రానికి వెళ్లే మట్టి రోడ్డు మార్గం వైపు చిరుతపులి వెళ్లడంతో కారులో ఉన్న స్నేహితులు చిరుత కదలికలను సెల్ఫ్లోన్లల్లో బందించారు. (చదవండి: వివాహేతర సంబంధం: కారు ఆగింది.. కథ అడ్డం తిరిగింది) కాగా నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో పర్యాటకులు బెంబేలెత్తుతున్నారు. అంతేకాకుండా హెడ్స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు 33 కేవి విద్యుత్ సబ్స్టేషన్ పరిసరాల్లో చిరుత సంచారం ఎక్కువైందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచారం నేపథ్యంలో పర్యాటకులు మరింత అప్రమత్తం అవుతున్నారు. (చదవండి: 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి.. ) -
‘సాగర్’ తీరాన చిరుత సంచారం.. కారుకు అడ్డం తిరిగి..
-
చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ
ఎంత కష్టమొచ్చినా బిడ్డను కడుపులో దాచుకునే అమ్మల కథలు విన్నాం.. ఇది అలాంటి అమ్మ కథ కాదు.. కష్టంలో ఉన్న అమ్మను కడవరకు వీడని ఓ బిడ్డ వ్యథ.. తల్లి ప్రాణాలను చిరుత పట్టుకుపోతుంటే... వదలలేక.. ఏం చేయాలో పాలుపోక.. ఆ అమ్మనే గట్టిగా పెనవేసుకున్న ఈ చిన్నారి వానర చిత్రం ప్రతి ఒక్కరి గుండెను మెలిపెట్టేదే.. జాంబియాలోని నేషనల్ పార్క్లో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక సన్నివేశాన్ని షఫీక్ ముల్లా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్మనిపించారు. చివర్లో ఈ పిల్లను కూడా చిరుత చంపేసిందని ఆయన తెలిపారు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా.. -
చిరుత దాడిలో రెండు మేకలు మృతి
పెంబి(ఖానాపూర్): నిర్మల్ జిల్లా తాండ్ర రేంజ్ పరిధిలోని పస్పుల అటవీ ప్రాంతంలో మేతకు వెళ్లిన మేకల మందపై చిరుత దాడిచేసి రెండు మేకలను హతమార్చింది. పెంబి మండలం హరిచంద్తండాకు చెందిన పశువుల కాపరి టేకం రాజేశ్ బుధవారం మేకల మందతో పస్పుల అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో మందపై చిరుత దాడి చేసింది. రాజేశ్ కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అటవీ సిబ్బందికి సమాచారం అందించగా ఎఫ్ఎస్వో ప్రభాకర్, ఎఫ్బీవో నరేశ్, ఇతర సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి జీవాల కళేబరాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో చిరుత దాడిచేసిన ప్రాంతంలో అటవీ సిబ్బంది సీసీ కెమెరాలను బిగించారు. వాటిని గురువారం పరిశీలించగా, మేకల కళేబరాలను చిరుత ఎత్తుకెళ్లినట్లు నమోదైంది. -
వీడియో: వృద్ధురాలిపై చిరుత దాడి.. వాకింగ్ స్టిక్తో ఫైటింగ్
ముంబై: ముంబైలోని ఆరే ఏరియాలో మరోసారి చిరుత కలకలం రేపింది. బుధవారం సాయంత్రం ఓ ఇంటి ఆవరణలో కూర్చున్న వృద్ధురాలిపై చిరుత దాడి చేసింది. అయితే ఆమె ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా తన వాకింగ్ స్టిక్ సహాయంతో చిరుతతో పోరాడింది. ఓ వైపు పులితో పోరాడుతూనే తాను గట్టిగా అరవడంతో ఆ పిలుపులు విన్న మహిళ కుటుంబ సభ్యులు అటు రావడంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మొత్తం ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. కాగా ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలుకావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో రెండ్రోజుల కింద నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేయగా తాజాగా ఇలాంటి ఘటన జరగడం రెండో సారి కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంత నివాసితులు భయాందోళనకు గురవుతున్నారు. చదవండి: Viral Video: స్టేజ్పై నుంచి కిందపడ్డ బీజేపీ కార్యకర్త -
ముంబైలో మహిళ పై చిరుత దాడి
-
బోన్ లో పడిన చిరుత
-
రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి
దేవరకద్ర: రోడ్డు ప్రమాదంలో ఓ చిరుత మృతి చెందింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదర్పల్లి శివారులోని మన్యంకొండ గుట్టలు, గద్దెగూడెం అడవుల్లో కొన్నేళ్లుగా చిరుతలు సంచరిస్తున్నాయి. తరచూ జాతీయ రహదారిని దాటుతుంటాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఓ చిరుత 167వ జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం వాహనదారులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎఫ్ఓ గంగారెడ్డి, ఎఫ్ఆర్ఓలు చంద్రయ్య, రజినీకాంత్, బీట్ ఆఫీసర్లు రాజేందర్రెడ్డి, శ్రీనివాసులు, సాదిక్, దేవర కద్ర ఎస్ఐ భగవంతరెడ్డి పరిశీలించారు. రోడ్డు ను దాటడానికి ముందు చిరుత పాదముద్రలు సమీపంలోని బురదలో స్పష్టంగా కనిపించా యి. చిరుత కళేబరానికి రోడ్డు పక్కనే పొలం లో పశువైద్యాధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. కాగా, ఈ ప్రాంతంలో 2007లో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఓ చిరుత, 2018లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరో చిరుత మృతిచెందాయి. -
మన్నెంకొండ సమీపంలో రోడ్డుపై చిరుత మృత్యువాత
-
నిజామాబాద్ జిల్లాలో చిరుత పులి కలకలం
-
పులిని చంపేసి మేకలను కాపాడిన కాపరి
డెహ్రాడూన్: తనకు జీవనోపాధి కల్పిస్తున్న వాటిని కాపాడుకునేందుకు ఓ యువకుడు ఏకంగా పులితో పోరాడాడు. దాడి చేసేందుకు వస్తున్న వ్యాఘ్రాన్ని ఏమాత్రం బెరుకు లేకుండా పోరాడి చివరకు అంతమొందించాడు. అతడి సాహసం.. తెగువను గ్రామస్తులు మెచ్చుకున్నారు. అయితే పులిని హతమార్చడంతో కేసుల బారిన పడే అవకాశం ఉంది. ఈ సంఘటన ఉత్తరాఖండ్లో జరిగింది. పితోర్గడ్ జిల్లా నైని గ్రామానికి చెందిన మేకల కాపరి నరేశ్ సింగ్. మేకలను మేపుతూ జీవిస్తున్నాడు. చదవండి: సినిమాను మించిన మర్డర్.. మూడు హత్యలతో వరంగల్ ఉలిక్కి రోజు మాదిరిగా బుధవారం మేకలను మేత కోసం అడవి బాట పట్టాడు. మేత మేస్తున్న మేకల మందలో అలజడి మొదలైంది. ప్రాణభయంతో మేకలు ఆర్తనాదాలు చేస్తున్నాయి. ఏమైందా అని వెళ్లి చూడగా చిరుత పులి ప్రత్యక్షమైంది. తన మేకలను కాపాడుకునేందుకు నరేశ్ విశ్వ ప్రయత్నాలు చేశాడు. బెదిరించాడు.. వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్న నరేశ్పైకి పులి దూసుకొచ్చింది. తన మీదకు దాడి చేసేందుకు వచ్చిన పులిపై కొడవలితో ఒక్క వేటు వేశాడు. అతడి దెబ్బకు పులి నేలకొరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరాన్ని పరిశీలించారు. అయితే పులిని హతమార్చడం వాస్తవంగా నేరం. కాకపోతే ఆత్మరక్షణ కోసం చంపడంతో నరేశ్పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే నరేశ్ తెగువను గ్రామస్తులు అభినందించారు. తమకు పొంచి ఉన్న పులి ముప్పును తప్పించాడని ప్రశంసించారు. చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు.. జీతం అడిగితే పోలీస్ కేసు!