
తిరుపతి,సాక్షి: తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని ప్రజలను ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు దొరికిపోయింది. తిరుపతి వేదిక్ యునివర్సిటీలో బోనులో చిరుత చిక్కింది.
గత కొంత కాలంగా ఓ చిరుత భయ భ్రాంతులకు గురిచేస్తుంది. ఈ తరుణంలో రెండు రోజుల కిందట ఆ చిరుతను పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ తరుణంలో ఆదివారం వేకువ జామున చిరుత ఆ బోనులో చిక్కుకుంది. సమాచారం అందుకున్న వైల్డ్లైఫ్ అధికారులు చిరుతను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.