సిరిసిల్ల రూరల్ : కరీంనగర్ జిల్లా సిరిసిల్ల రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం మధ్యాహ్నం ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి హారిక సిరిసిల్ల పట్టణానికి చెందిన సుదర్శన్ను వివాహం చేసుకుంది.
అయితే తన భర్త కాపురానికి తీసుకెళ్లడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ రూరల్ పోలీసులను ఆశ్రయించింది. ఇదే విషయమై పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరిగింది. ఆదివారం సీఐ రంగయ్యగౌడ్ను కలిసేందుకు స్టేషన్కు వెళ్లింది. పోలీసుల నిర్లక్ష్యంపై విసుగుచెందిన ఆమె అక్కడే పురుగుల మందు సేవించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది.
పోలీస్ స్టేషన్ వద్ద వివాహిత ఆత్మహత్య
Published Sun, Feb 14 2016 1:12 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement