Sircilla
-
లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ గంగారాం మృతి
రాజన్న: తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న గంగారం మరణించడం జరిగింది. నిన్న ఓ అపార్ట్మెంట్లో డిన్నర్ కు వెళ్లాడు గంగారం. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశాడు గంగారం.అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్ లో.. కమాండెంట్ గంగారం పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు గంగారం. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గంట తర్వాత ప్రకటించారు వైద్యులు. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేటీఆర్ సంతాపంతెలంగాణ సచివాలయ మాజీ సీఎస్ఓ, సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ తోట గంగారాం మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ సంతాపం తెలియజేశారు. గంగారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసు శాఖకు ఉన్నతంగా సేవలందిస్తున్న గంగారాం ప్రమాదవశాత్తు జరిగిన లిప్టు ప్రమాదంలో మరణించడం బాధాకరమని అన్నారాయన. -
ప్రయాణం ఫ్రీనే.. బస్సే లేదు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు. పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఆ రూట్ మా పరిధిలో లేదుఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి. – ప్రకాశ్రావు, సిరిసిల్ల డిపో మేనేజర్. Ration Cards: మీసేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు -
కేటీఆర్ క్షమాపణలు చెప్పాల్సిందే: ఐఏఎస్ల సంఘం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యల పట్ల ఐఏఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిరిసిల్ల కలెక్టర్పై కేటీఆర్ ఆరోపణలు సరికాదంటూ ఖండించింది.సివిల్ సర్వీసెస్ అధికారిపై కేటీఆర్ ఆరోపణలు నిరాధారం. ఇలాంటి ఆరోపణలతో వ్యవస్థలపై చెడు ప్రభావం పడుతుంది. కలెక్టర్ విధులను వక్రీకరించొద్దని ఐఏఎస్ అధికారుల సంఘం తెలిపింది.సివిల్ సర్వీసు అధికారుల గౌరవం, స్వతంత్రత, నిష్పక్షపాతత్వాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని సంఘం స్పష్టం చేసింది. నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఐపీఎస్ల సంఘం డిమాండ్ చేసింది. -
కొందరు ఉపాధ్యాయుల వికృత చేష్టలు, బిక్కుబిక్కుమంటున్న అమ్మాయిలు
సిరిసిల్ల కల్చరల్: పాఠశాలల్లో కొందరు టీచర్లు కీచకులుగా మారుతున్నారు. మాస్టార్లు చెప్పే పాఠాల కోసం బడులకు వస్తున్న విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. చట్టాలు ఎంత పదునుగా తయారవుతున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. అయితే వారి దుశ్చర్యల గురించి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలా మంది బాధితులు లోలోపల కుమిలి పోతున్నారు. వెలుగులోకి రానివెన్నో.. బ్యాడ్ టచ్ బారిన పడుతున్న పిల్లలు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తల్లిదండ్రులకు సైతం చెప్పే స్వేచ్ఛ కొన్ని కుటుంబాల్లో లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇటీవల షీటీమ్స్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు కొంతమేర సత్ఫలితాలిస్తున్నాయి. అయినా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదులు రావడం తక్కువే. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు రాజన్న సిరిసిల్ల జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి నివాసి, ప్రభుత్వ ఉపాధ్యా యుడు నామని సత్యనారాయణ అదే కాలనీకి చెందిన ఓ బాలికను జామకాయ కోసి ఇస్తానంటూ తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలిక చేతులు పట్టుకొని, అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. వీర్నపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహించిన ఓ ప్రబుద్ధుడు విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించాడు. గత నెల 21న జిల్లా కేంద్రంలోని గీతానగర్ జెడ్పీ హైస్కూల్లో ఉద్యోగ విరమణకు చేరువైన కె.నరేందర్తోపాటు మరో టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేడ్కర్నగర్ జెడ్పీ హైసూ్కల్లో రఘునందన్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంతో కేసు నమోదు చేశారు. కొద్ది వారాల క్రితం గంభీరావుపేట మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న ఓ లెక్చరర్ అదే కళాశాల విద్యార్థిని విషయంలో అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. ఇప్పటి వరకు నమోదైన కేసులు రాజన్నసిరిసిల్లా జిల్లాలో మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న పోకిరీలపై ఇప్పటి వరకు 38 కేసులు నమోదైనట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటిలో టీచర్లపైనే ఐదు కేసులు నమోదయ్యాయి. ఎవరైనా వేధింపులకు గురైతే 87126 56425 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో). ఇది లైంగిక వేధింపుల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. లైంగికదాడి నేరాలకు పాల్పడిన నిందితులకు ఈ చట్టంతో జీవితఖైదీగా 7 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిగితే కనీసం 10 నుంచి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. రెండు నెలల్లోపే కేసు దర్యాప్తు జరగాలని నూతన చట్టం నిబంధన విధించింది. -
రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం కోసం .. ఆందోళన..!
-
రేవంత్ డౌన్ డౌన్.. బెటాలియన్ పోలీసుల ధర్నా!
సాక్షి, నల్లగొండ: తెలంగాణ పోలీసుల్లో తిరుగుబాటు మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తాజాగా పోలీసులు సిబ్బంది ధర్నాకు దిగారు. నల్లగొండలో ఎస్ఐను సస్పెండ్ చేయాలని బెటాలియన్ పోలీసులు డిమాండ్ చేయగా.. సిరిసిల్లలో సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ పోలీసులు నినాదాలు చేశారు.వివరాల ప్రకారం.. నల్లగొండలోని అన్నెపర్తి 12వ బెటాలియన్లో సిబ్బంది మరోసారి ఆందోళన దిగారు. నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబును సస్పెండ్ చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆందోళన చేస్తున్న తమతో పాటు తమ కుటుంబ సభ్యుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సిబ్బంది ఆరోపించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ బెటాలియన్ నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వస్తున్న సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు వేయడంతో సిబ్బంది బయటకు రాకుండా ఆగిపోయారు. ప్రతీకార బాంబులు అణుబాంబులు మిరపకాయ బాంబులుతాటాకు బాంబులు కాదుతెలంగాణకు కావాల్సింది.. !మీ..మాయ హామీలను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎలాగో మంచి చేయలేదు.. !కనీసం ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులనైనా మనుషులుగా చూడండి.. !ఒక సంవత్సరంలోనే ఇంత చెండాలమైనా ప్రభుత్వం బహుశా..ఈ ప్రపంచంలోనే… pic.twitter.com/0x7DDbFRpy— Mallaiah Yadav Bollam (@BollamMallaiah) October 26, 2024 మరోవైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ దగ్గర పోలీసులు నిరసన, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణలో ఒకే పోలీసు విధానం ఉండాలని డిమాండ్ చేశారు. మాకు డ్యూటీలు వేసి కుటుంబాన్ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీస్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. మాతో లోపల కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా ధర్నా చేస్తున్న కానిస్టేబుల్ వద్దకు జిల్లా ఎస్పీ అఖిల్ చేరుకొని పోలీసులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో ఎస్పీ కాళ్లపై పడి తమ బాధను తీర్చాలని కానిస్టేబుల్ వేడుకున్నారు. పోలీస్ లే కార్మికుల తరహాలో స్లొగన్స్.. సమ్మె కానీ సమ్మె ఇది!#CongressFailedTelangana pic.twitter.com/00v54OZsLb— Harish Rao Thanneeru (@BRSHarish) October 26, 2024 సంచలనం.. యూనిఫాం వేసుకుని బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళనతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్స్ https://t.co/HvAS9vFfGe pic.twitter.com/9NyrTl0JBr— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024 Video Credit: Telugu scribe -
కేసులకు భయపడం.. ఏం చేస్తారో చేస్కోండి
సిరిసిల్ల: ‘మహా అయితే.. ఏం చేస్తారు.. ఏవో తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతారు.. ఏం కేసులు పెడుతారో పెట్టుకోండి. ప్రజల కోసం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇంతకు వందరెట్లు వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం. ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు. వచ్చేది మేమే.. నేనే.. ’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు అన్నారు. విద్యుత్ సంస్థల చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో త్వరలో రాజకీయ బాంబులు పేలతాయనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ముందు ఆయనపై జరిగిన ఈడీ దాడులు, బీజేపీ వాళ్లతో రహస్య ఒప్పందాలు, సీఎం బామ్మర్దితో కాంట్రాక్టు ఒప్పందాలు ఇవన్నీ చూసుకోవాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రూ.4,500 కోట్ల వ్యవహారం చూసుకోవాలి. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. చంద్రబాబునాయుడు వంటి వాళ్లతోనే కొట్లాడినం.ఈ చిట్టినాయుడు ఎంత..’అని అన్నారు. తానింకా బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని, కాంగ్రెస్లో చేరలేదంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, మరి సీఎం రేవంత్రెడ్డితో ఎందుకు కండువా కప్పించుకున్నారని, బీఆర్ఎస్లో ఉంటూ కాంగ్రెస్తో కలవడమంటే రాజకీయంగా వ్యభిచారం చేసినట్టేనని అన్నారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన వారంతా రాజకీయ వ్యభిచారులేనని వ్యాఖ్యానించారు. పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు పెంచలేదు ఈఆర్సీ బహిరంగ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో పైసా విద్యుత్ చార్జీలు కూడా పెంచకుండా నెలకు రూ.వెయ్యి కోట్లు భరిస్తూ పాలన అందించామని కేటీఆర్ చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల వాతలు పెడుతోందని విమర్శించారు. పెద్ద పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను ఒకే గాటన కట్టి, కుటీర పరిశ్రమకు రాయితీలను ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అదానీతో సమానంగా సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యజమానులు ఎలా విద్యుత్ చార్జీలు చెల్లిస్తారని ప్రశ్నించారు.విద్యుత్ చార్జీలు పెంచే ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నామని, డిస్కంలపై రూ.18,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపే ప్రయత్నాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్నతరహా, కుటీర పరిశ్రమలకు గ్రీన్చానల్ ఏర్పాటు చేసి సబ్సిడీ టారిఫ్తో విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. నేతన్నల సంక్షేమం కోసం 10 హెచ్పీల వరకు ఉన్న 50 శాతం విద్యుత్ రాయితీని 30 హెచ్పీల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. బహిరంగ విచారణలో ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు మహావీర్రాజు, కృష్ణయ్య, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాప్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ అరుణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. దద్దమ్మ పాలనలో దద్దరిల్లుతున్న రాష్ట్రం దద్దమ్మ పాలనలో రాష్ట్రం ధర్నాలతో దద్దరిల్లుతోందని కేటీఆర్ విమర్శించారు. దిక్కుమాలిన పాలనలో ప్రజల జీవితాలు దిక్కూమొక్కూ లేకుండా తయారయ్యాయని శుక్రవారం ‘ఎక్స్’లో ఆయన పేర్కొన్నారు. ‘అలంపూర్ నుండి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు, గ్రామ సచివాలయం నుండి మొదలు రాష్ట్ర సచివాలయం వరకు ధర్నాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మొదలుకుని రైస్ మిల్లర్ల వరకు, కారి్మకులు మొదలు కాంట్రాక్టర్ల వరకు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.టీచర్ల నుంచి పోలీస్ కుటుంబాల దాకా, అవ్వతాతలు, ఆడబిడ్డలు, విద్యార్థులు, విద్యావంతులు, నిరుద్యోగులు , ఉద్యోగులు రోడ్లెక్కుతున్నారు. కాంగ్రెస్ ప్రజాపతినిధులు, ప్రతిపక్ష నాయకుల నుంచి వృద్దులు, బడి పిల్లలు కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళనలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పాలన వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలన ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది..’అని కేటీఆర్ మండిపడ్డారు. -
పొంగులేటి.. బాంబులు అంటే ఈడీ సోదాల గురించేనా?: కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణలో కేసీఆర్ పాలన విద్యుత్ రంగానికి స్వర్ణయుగమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందనా కేటీఆర్ తెలిపారు. అలాగే, ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ..‘2014లో తెలంగాణ ఏర్పడిన కొత్తలో పారిశ్రామికవేత్తలు పవర్ హాలీడే వద్దని రోడ్డెక్కారు. నేతన్నలు పవర్ లేక ఇబ్బంది పడ్డారు. ఇవాళ మళ్లీ పది నెలల నుంచి కోతలు మొదలయ్యాయి. ఇప్పుడు పెంచుతున్న విద్యుత్ ధరలను మేం వ్యతిరేకిస్తున్నాం. మధ్యతరగతి నడ్డి విరిచే నిర్ణయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం వివిధ విద్యుత్ సంస్థలు 12 వందల కోట్ల రాబడి కోసం చేసిన ప్రతిపాదనను మేం ఖండిస్తున్నాం.మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల విద్యుత్ భారాన్ని నాడు ప్రభుత్వం భరించిందే తప్ప ప్రజలపై భారం వేయలేదు. ఇళ్లకు 300 యూనిట్లు దాటితే 50 రూపాయలు యూనిట్కు పెంచడం దుర్మార్గం. 300 యూనిట్లు 70 శాతం ప్రజలు దాటడం ఖాయం. అసంబద్ధమైన విద్యుత్ ఛార్జీలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే మాదిరిగా లెక్క కట్టడం సరికాదు. దీంతో కుటీర పరిశ్రమలు ఇంకా కుంటుపడే అవకాశం ఉంది. రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తూ పదేళ్ల పాలనలో రూపాయి ఛార్జీలు పెంచలేదు. కానీ, ఈ ప్రభుత్వం పది నెలల్లోనే 18 వేల కోట్ల అదనపు భారాన్ని ఎందుకు మోపుతున్నారో ఈ సర్కారు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన ఈఆర్సీ ప్రజాకోణంలో యోచించాలి. ప్రభుత్వానికి విషయాన్ని తెలియజేయాలి. తెలంగాణలో సహకార విద్యుత్ సంస్థ ఒకే ఒక్కటి మన సిరిసిల్ల జిల్లాలో ఉంది. డిస్కంలతో పోలిస్తే మా సెస్ ఎంతో బెటర్. కాబట్టి సెస్ను కాపాడాలని కోరుతున్నాను. సెస్లో డిమాండ్కు తగ్గట్టు ఏడు హెచ్పీ మోటార్ల వరకు సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను. సెస్ కోసం వచ్చే సబ్సిడీ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలి. రైతులే నడిపించే సంస్థ సెస్. ఈ పది నెలల్లోనే పదిమంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరం.బాంబులు అంటే పొంగులేటి ఆయన మీద జరిగిన ఈడీ రైడ్ల గురించి చెబుతారేమో బహుశా?. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండి. చిట్టినాయుడు బెదిరింపులకి మేము భయపడం. ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం. మళ్ళీ మేము వస్తాం. ఒక్కొక్కడి సంగతి చెబుతాం. జగిత్యాల ఎమ్మెల్యే గాడిదలు కాయడానికి రేవంత్ రెడ్డితో కండువా కప్పుకున్నాడా?. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి. రాజకీయ వ్యభిచారం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులనే చంపుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఖబడ్దార్ రేవంత్.. కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ కలకలం
సాక్షి, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కట్టిన పోస్టర్ తీవ్ర కలకలం సృష్టించింది. గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాయమాటలు చెబుతోంది. రేషన్ కార్డులు ఇస్తామని ఇంకా ఇవ్వడం లేదు. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే రేషన్ కార్డుల విషయంపై ఆలోచించాలని రాశారు.వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్ ప్రత్యక్షమైంది. ఈ పోస్టర్లో గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయని అనుకున్నాం. రేషన్ కార్డు లేక, లేబర్ కార్డ్ రావడం లేదు. ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ఉన్నాం. తెలివి ఉన్న ముఖ్యమంత్రి అయితే ముందుగా రేషన్ కార్డు సమస్యను తీర్చండి. గత ప్రభుత్వం మాదిరిగానే మాయమాటలు చెప్పి, ప్రజలకు నమ్మక ద్రోహాన్ని చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్.. అని పోస్టర్ కట్టారు. దీంతో, ఈ పోస్టర్పై ప్రజల్లో చర్చ నడుస్తోంది. అయితే, బీఆర్ఎస్ నేతలే ఇలా పోస్టర్లు కట్టారంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. -
మగ్గానికి మంచి రోజులు ఎప్పుడు ?
-
అక్కరకురాని సుట్టాలెందుకు.. కాంగ్రెస్, బీజేపీపై కేటీఆర్ సెటైర్లు
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తనకు రాజకీయంగా జన్మనిచ్చిందే సిరిసిల్ల అని చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణలో మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. అలాగే, రాముడు అందరి వాడు.. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, కేటీఆర్ సోమవారం సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేత కార్మికుల కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్మికులను కాపాడుకున్నాం. సిరిసిల్ల పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దుకున్నాం. మీరు నన్ను ఇక్కడ గెలిపించినా.. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించింది. మోచేతికి బెల్లం పెట్టి.. మోసపూరిత హామీలతో గెలిచింది.ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి?. అబద్ధాలు చెబితే డిజిటల్ ప్రపంచంలో ఒక్క నిమిషంలో దొరికిపోతారు. కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నామో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను పట్టుకుని కాంగ్రెస్ నాయకులు అనేక మాటలు, బూతులు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం ఒక లెక్క.. ఓట్లు వేయించుకున్నాక ఒక లెక్క అన్నట్టుంది కాంగ్రెస్ పార్టీ తీరు. కేసీఆర్ మళ్లీ కావాలనుకుంటే మే 13వ తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించండి.. తెలంగాణలో శాసించే అధికారం వస్తుంది.బీజేపీ నేతలు మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు. రాముడు అందరివాడు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలు బీజేపీ పుట్టకముందు నుంచే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ రేట్లపై పన్నులు వేసి మోదీ డబ్బులు వసూలు చేస్తున్నాడు. మళ్లీ అబ్కీ బార్ 420 అంటున్నాడు. అక్కరకురాని చుట్టాలకు ఎందుకు ఓటు వేయాలి. నాకో జోడీ దారు దొరికితే.. రాష్ట్రం, కేంద్రంపై పోరాడే శక్తి వస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
సీతమ్మకు బంగారు చీర..
-
రైతు బంధు కోసం పెట్టిన రూ. 7 వేల కోట్లు ఏమయ్యాయి: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో ఉన్న తమ నేత కేసీఆర్.. ఎర్రటి ఎండలో ప్రజల్లో తిరిగితే.. సీఎం రేవంత్ ఐపీఎల్ మ్యాచులు అంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన నాలుగు నెలల్లోనే వ్యవసాయం సంక్షోభం వస్తుందని ఊహించలేదని.. ఇలాంటి దుస్థితికి కారణం సీఎం రేవంత్ రెడ్డి సర్కారే అని మండిపడ్డారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతుదీక్షలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. పాలిచ్చే బర్రెను పంపించి దున్నపోతును తెచ్చుకున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు కోసం రూ. 7 వేల కోట్లు సిద్ధంగా పెట్టామని అయితే రైతుబంధు ఇవ్వొద్దంటూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపిందని గుర్తు చేశారు. రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈసీకి రేవంత్ లేఖ రాయాలి రైతులకు 500 బోనస్ ఇవ్వమని అడిగితే ఎలక్షన్ కోడ్ ఉందని సీఎం, మంత్రులు చెబుతున్నారని.. పాలన తన చేతుల్లో లేదని సీఎం రేవంత్ అనడం సిగ్గు చేటని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పంటలకు బోనస్ ఇస్తామని ఈసీకి రేవంత్ లేఖ రాయాలని అన్నారు. ఇందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. చదవండి: నేడు కాంగ్రెస్ జనజాతర సభ.. తుక్కుగూడ నుంచే సమర శంఖం కాంగ్రెస్ తెచ్చిన కరువు కరువు వస్తే మమ్మల్ని తిడతారా అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. 14 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. తెలంగాణకు నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి బ్యారేజీలు నిర్మించాం. భారీ మోటార్లు పెట్టి గోదావరి నీళ్లు ఎత్తిపోశాం. ఇవాళ కూడా గోదావరిలో 2 వేల క్యూసెక్కుల నీళ్లు పోతున్నాయ్. ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తళ్లు దూకినాయి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని అన్నారు. కేసీఆర్ వస్తున్నారని నీళ్లు వదిలారు ‘300 పిల్లర్లు ఉన్న బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగాయి. కేసీఆర్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్లో వచ్చే తప్పుడు వార్తలు చూసి ఆగం కావొద్దు. కేసీఆర్ వస్తున్నారని అన్నారం, సుందిళ్ల నీళ్లు వదిలారు. హరీశ్రావు హెచ్చరిస్తే కూడవెళ్లి వాగుకు నీళ్లు ఇచ్చారు. ఇన్నాళ్లు నీళ్లు ఉన్నా కూడా ఇవ్వలేదని అర్థమైంది కదా.. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. రైతుబంధు రూ. 15 వేలు ఇస్తామని మోసం చేసింది. రూ. వరికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని ఇవ్వడం లేదు. ఎర్రటి ఎండల్లో కేసీఆర్ రైతుల దగ్గరికి వెళ్లి భరోసా ఇచ్చారు. రైతుల హక్కుల తరుపున కొట్లడుదాం. రేపటి నుంచి కండువా వేసుకొని రైతులకు వచ్చే బోనస్పై కాంగ్రెస్ పార్టీని నిలదీద్దాం. మిషన్ భగీరథ అప్పగించినా నీళ్లిచ్చే తెలివి కాంగ్రెస్కు లేదు. వండిన అన్నం వడ్డించే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించాలి.’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
దద్దమ్మలు రాజ్యమేలుతున్నారు: కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్లో 4 సజీవ జలధారలను సృష్టించామని కేసీఆర్ తెలిసారు. తాము గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేస్తే.. నాలుగు నెలల్లో జలధారాలు ఎండిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం అనేక అడ్డగోలు హామీలు ఇచ్చిందని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యమే కారణం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా.. సిరిసిల్ల తెలంగాణా భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంట ఎండిపోయిందన్నారు. ఇది కాలం తెచ్చిన కరువా.. కాంగ్రెస్ తెచ్చిన కరువా.. మంత్రులు తెచ్చిన కరువా అని ప్రశ్నించారు. వర్షపాతం లేదని మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్న కేసీఆర్.. నీటిని వాడే విధానం తెలియని ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని విమర్శించారు. పంటలు ఎండటానికి కరెంట్ కోతలు కూడా కారణమని దుయ్యబటారు. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం క్వాలిటీ కరెంట్, రైతుబంధు ఇవ్వకుండా ప్రభుత్వం కాలం గడిపేస్తుందని మండిపడ్డారు కేసీఆర్. ‘వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని చెప్పాను. చనిపోయిన 209 మంది రైతుల జాబితాను 4 గంటల్లోనే ప్రభుత్వానికి పంపించాను. లిస్ట్ ఇస్తే సాయం చేస్తామన్న సీఎం.. ఉలుకు, పలుకు లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలి. పరిహారం ఇవ్వకుంటే వాళ్లందరి ఉసురు తగులుతుంది. ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం. తప్పించుకులేరు. వీపు విమానం మోత మోగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం వచ్చింది ఇప్పటికీ రైతుబంధు పూర్తిగా ఇవ్వలేదు. బ్యాంకర్లతో ఎందుకు సమావేశాలు నిర్వహించలేదు. పంటలకు బోనస్ ఇస్తామన్నారు. జొన్నపంట కొనడం లేదనే ప్రచారం జరుగుతోంది. రుణమాఫీపై తెలంగాణలో పెద్ద సంక్షోభం వచ్చేలా ఉంది. ఈ ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోమం వచ్చింది. ఈ సంక్షోభానికి జబాబుదారీ ఎవరూ?. దళితబంధు 12 లక్షలు ఇస్తామన్నారు.. ఏమైంది? మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే రోజులు దాపురించాయని నేతన్నలు చెబుతున్నారు. నేతన్నలను ఆదుకోవాలని అప్పట్లో మొర పెట్టుకున్నా. 14 ఏళ్ల కిందట చేనేత కార్మికుల బతుకు ఎలా ఉండేదో ఇప్పుడూ అలాంటి పరిస్థితే తెచ్చారు. నాలుగు నెలల్లోనే విధ్యుత్ కొరత దళితబంధు కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇంట్లో ఇద్దరికి రూ. 4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. 30 లక్షల కుటుంబాలకు నెలకు రూ. 6 వేల బాకీ ఉన్నారు. డిసెంబర్లో చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? కళ్యాణలక్ష్మికి తులం బంగార కలిపి ఇస్తామన్నారు.. ఏమైంది? ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వలేదు. గతంలో కంటే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంది. 9 ఏళ్లు వచ్చిన నిరంతర కరెంట్ ఇప్పుడెందుకు రావడం లేదు. ఈ నాలుగు నెలల కాలంలో విద్యుత్ కొరత ఎందుకొచ్చింది. ఇది మనుషులు సృఫ్టించిన కృత్రిమ కరువు. మేం కేసులు పెట్టి జైల్లో వేయలేమా? కాళేశ్వరం ఎంత త్వరగా పూర్తైతే అంత మంచిదని భావించాం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఉన్నవాళ్లకు తోక కూడా తేలీదు. అన్ని బరాజ్ల మీద దాదాపు 200పైగా గగేట్లు ఉంటాయి. మేడిగడ్డ బరాజ్లో గోదవారి పోంగే మూడు నెలలు గేట్లు ఎత్తి ఉంటాయి. కొట్టుకుపోయిన మిడ్మానేరు కట్ట కట్టింది కోమటిరెడ్డి కంపెనీ కాదా?. మేం అనుకుంటే అప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టేవాళ్లం కాదా?. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు. మేడిగడ్డ కుంగిందని కేసీర్ను బద్నాం చేయాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నదులు, బ్యారేజ్లు దగ్గర ఇసుక కుంగడం సహజం. పిల్లర్ల కింద ఇసుక కదిలి రెండు పిల్లర్లు కుంగినయ్. మీకు చేతకాకుండే 50 వేల మంది రైతులను తీసుకుపోతం. తొక్కుకుంటూ పోయి మేడిగడ్డ నుంచి నీళ్లు తెస్తాం. కాళేశ్వరం పని అయిపోయిందన్నోళ్లు మొన్న నీళ్లు ఎలా పంపింగ్ చేశారు. ప్రజల గొంతులు ఎందుకు ఎండబెడుతున్నారు. ఇప్పటి వరకు ఊరుకున్నాం ఇకపై ఊరుకోం. రాష్ట్రం రణరంగం అయినా సరే’ అని కేసీఆర్ మండిపడ్డారు. -
కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట.. రైతులకు పరామర్శ
Live Updates.. ► కరీంనగర్లో కేసీఆర్ పొలంబాట ►కరీంనగర్ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ ►జిల్లాలోని మొగ్దుంపూర్లో ఎండిపోయిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులను పరామర్శించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ► రోడ్డు మార్గంలో కరీంనగర్కు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్ ►లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతులతో మమేకమవుతున్నారు. రాష్ట్రంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ రైతులను పరిశీలిస్తున్నారు. నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ►ఈ సందర్బంగా సాగునీటి కొరతతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ నుండి రోడ్డుమార్గంలో ప్రత్యేక బస్సులో రానున్న కేసీఆర్ ముందుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. ► మధ్యాహ్నం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తరువాత సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి మండలం, వేములవాడ నియోజకవర్గాల్లో పంటలను పరిశీలిస్తారు. సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనంతరం ఎర్రవల్లిలోని ఆయన ఫామ్హౌజ్కు తిరుగుపయనమవుతారు. కాగా, ఈ పర్యటనలో కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
ఫోన్ ట్యాపింగ్ హెడ్క్వార్టర్ ఎక్కడ అంటే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మ లుపు తిరుగుతోంది. ఇది హైదరాబాద్లోని ఎస్ఐ బీ కార్యాలయం కేంద్రంగా సాగగా సిరిసిల్ల, వరంగల్లో ఎస్ఐబీ పోలీసులు కొందరు వార్ రూంలు ఏర్పాటు చేసి, ట్యాపింగ్కు పాల్పడ్డారు. వరంగల్లో ఓ నాయకుడు చెప్పిన నంబర్లు ట్యాప్ చేసినట్లుగా ఆరోపణలు వస్తుండగా అదే తరహాలో సిరిసిల్ల లోనూ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిరిసిల్ల కు చెందిన ఓ కీలక నేత కూడా కొన్ని నంబర్లు ఇచ్చి, స్థానిక వార్ రూం ద్వారా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిర్ధారించారు. పంజగుట్ట పోలీసుల విచారణలో ఆ నాయకుడు ఎవ రు? ట్యాప్ చేయమని ఎవరెవరి నంబర్లు ఇచ్చా డు? వార్ రూం ఎక్కడ నుంచి నిర్వహించారు? అందులో ఎవరెవరు పని చేశారు? తదితర అంశాలపై విచారణ అధికారులు వివరాలు సేకరించినట్లు స మాచారం. ట్యాప్ అయిన జాబితాలోని మెజారిటీ వ్యక్తులు కాంగ్రెస్ సీనియర్లు, అందులోనూ సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితులు కావడం గమనార్హం. వార్ రూం ఎంతకాలం నడిచిందో? గత డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాలతో అప్రమత్తమైన అప్పటి సిరిసిల్ల డీఎస్పీ ప్రణీత్రావు సీసీ కెమెరాలు ఆపేసి, వార్ రూంలోని దాదాపు 50 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసిన విషయం విధితమే. దీనిపై మార్చి 10న పంజగుట్ట పోలీస్స్టేషన్లో కేసు నమోదవడం, 12న డీఎస్పీని సిరిసిల్లలో అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రణీత్రావు, ఆయన బృందం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంగానే వార్ రూం ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అది ఎంతకాలం నడిచింది? ఎవరెవరి కాల్స్ రికార్డ్ చేశారు? అన్న విషయాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. వార్ రూం నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై, ముగ్గురు కానిస్టేబుళ్ల ద్వారా వివరాలు సేకరించినట్లు తెలిసింది. వీరు ట్యాప్ చేసిన కాల్స్లో ముఖ్యమైన వాటిని కాపీ చేసి, ప్రణీత్రావుకు ఇచ్చేవారని సమాచారం. ప్రణీత్రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కుల్లో సిరిసిల్ల కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయని సమాచారం. సిరిసిల్లకే పరిమితం కాలేదా? వార్ రూంలో పనిచేసిన సభ్యులు కేవలం సిరిసిల్ల కు మాత్రమే పరిమితం కాలేదని, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. ముఖ్యంగా పెద్దపల్లిలో ముగ్గురు కీలక ప్రతిపక్ష నేతల అనుచరులకు చెందిన కోట్లాది రూపాయలను అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులు ఉమ్మడి జిల్లాతోపాటు, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పట్టుకున్నారు. కరీంనగర్, జగిత్యాల ప్రతిపక్ష నేతలు డబ్బులు ఖర్చు చేయకుండా వారి కున్న ఆర్థిక మూలాలను ముందే గుర్తించి, కట్టడి చేశారన్న దిశగానూ దర్యాప్తు సాగుతోంది. సూట్కేసు పరిమాణంలో ఉండే ట్యాపింగ్ పరికరాలను ఓ వ్యాన్లో పెట్టుకొని, టార్గెట్ చేసిన నాయకుడి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉంటే చాలు.. ఆయన కాల్స్ మాత్రమే కాదు, ఇంట్లోవారు, ఆ చుట్టుపక్కల వారి కాల్స్ కూడా వినే వీలుంటుంది. 2022లోనే అనుమానించిన ఎంపీ సంజయ్ 2022 మే 25వ తేదీన అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్లోని ఓ ప్రధాన మీడియా సంస్థ విలేకరితో హిందూ ఏక్తా యాత్రపై చర్చించారు. ఆ ఫోన్ కట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఎంపీ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన అనుచరులు సదరు విలేకరే పోలీసులకు సమాచారం ఇచ్చాడంటూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనతోపాటు మరిన్ని సంఘటనలు గుర్తు చేసుకున్న ఎంపీ సంజయ్ తనతోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానించారు. -
సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. మూడోరోజూ కొనసాగుతున్న బంద్
సాక్షి, సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడో రోజు కొనసాగుతోంది. పవర్ లూమ్ సాంచాలు మూగబోయాయి. పాలిస్టర్ పరిశ్రమ బంద్తో సుమారు 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పాలిస్టర్కు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల మిల్లుల్లో రూ. 35 కోట్ల రూపాయల పాలిస్టర్ బట్ట పేరుకు పోయింది. కార్ఖానాల్లోనే ఉత్పత్తి చేసిన బట్ట నిల్వలు ఉండటంతో కొత్త బట్ట ఉత్పత్తి చేయొద్దని సిరిసిల్ల మ్యానుప్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్ణయించింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ఎక్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చేనేత, జౌళీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమస్యపై దృష్టి సారించారు. ఆర్వీఎం బట్టల ఉత్పత్తి ఆర్డర్లను మ్యాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లకు అప్పగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కోటి మీటర్ల మేర పేరుకుపోయిన వస్త్ర నిల్వలు
-
కేటీఆర్ ఫోన్ కాల్ లీక్.. ఆడియో షేర్ చేసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రచార ముగింపు వారం రోజులే ఉండటంతో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 119 నియోజవర్గాల్లోని గల్లీగల్లీ తిరుగుతూ నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఏ వాడ, ఊరిలో చూసిన ప్రచార సభలు, రోడ్షోలే దర్శనమిస్తున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తూ.. మరోవైపు ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి అధికారంలో రావాలని బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తుండగా.. ఈసారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ ఫోన్ కాల్లీక్ అయ్యిందంటూ కాంగ్రెస్ ఓ ఆడియో కలఇప్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ప్రచారానికి పోవాలంటే క్యాడర్ వెనకాడుతుందని, ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందని విమర్శిస్తూ..కేటీఆర్ వాయిస్తో ఉన్న ఆడియోను పోస్టు చేసింది. ఈ ఆడియోలో.. వారం రోజుల్లో ప్రచారం ముగిస్తుందని.. ఈ కొన్ని రోజులు సిరిసిల్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ కార్యకర్తలకు కేటీఆర్ సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి మాటలు పట్టించుకోకుండా.. కౌన్సిలర్లు, సర్వంచులు, మాజీలు, అందరూ కలిసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు పదిమంది పది రకాలుగా మాట్లాడటం బంద్ చేయాలని హెచ్చరించారు. మెజార్టీ తగ్గుందని మనోళ్లే ప్రచారం చేస్తున్నారని, మనల్ని మనమే తగ్గించుకోవద్దని అక్కడి నాయకులకు క్లాస్ తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం సిరిసిల్ల వైపు చూస్తోందని, ఈ వారం రోజులు ఏ ఊరి వాళ్లు ఆ ఊరిలో, ఏ బూత్ వాళ్లు ఆ పరిధిలో పటిష్టంగా ఇంటింటా ప్రచారం చేయాలని సూచిస్తున్నట్లు వినిపిస్తుంది. గతంలో కాకుండా వచ్చే ఎన్నికల తర్వాత వారంలో కనీసంగా రెండు రోజులు సిరిసిల్లకు వచ్చి స్థానికంగా అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాలంటూ, మీకేమైనా సమస్యలుంటే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పండంటూ పేర్కొన్నారు. ఇక కేటీఆర్ ఫోన్ కాల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే ప్రచారానికి పోవాలంటే వెనకాడుతున్న కేడర్. ఫోన్లు చేసి బ్రతిమాలాడుకునే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పరిస్థితి.#ByeByeKCR pic.twitter.com/PXOvRujqt4 — Telangana Congress (@INCTelangana) November 22, 2023 -
సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్
-
సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణి రుద్రమరెడ్డి
-
సిరిసిల్లలో సిఎం కేసీఆర్ పర్యటన
-
కేటీఆర్కు కాంగ్రాట్స్.. తనయుడిని పొగిడిన కేసీఆర్
సాక్షి, సిరిసిల్ల: తన జీవితంలో సిరిసిల్లాకు వందసార్లు వచ్చానని, ఇక్కడ తనకు బంధువర్గం ఎక్కువని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం సిరిసిల్లలో పర్యటించిన సీఎం.. ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. కలలో ఊహించని అభివృద్ధి సిరిసిల్లలో జరిగిందని, వేసవిలో కూడా అప్పర్ మానేర్ ఉరకలేస్తోందన్నారు. అప్పర్ మానేరును చూస్తే ఆత్మ సంతృప్తి కలుగుతోందని కేసీఆర్ అన్నారు. ‘‘కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండటం సిరిసిల్ల అదృష్టం. చేనేత కార్మికుల అవసరాలన్నీ కేటీఆర్ తీర్చారు. చేనేతల బతుకులు మార్చిన కేటీఆర్కు అభినందనలు. సోలాపూర్ తరహాలో సిరిసిల్ల రూపుదిద్దుకోవాలి. చేనేతల కన్నీళ్లు తుడిచేందుకే బతుకమ్మ చీరలు తెచ్చాం. కొంతమంది దుర్మార్గులు చీరలను కాల్చేసి రాజకీయాలు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లను పెంచుకుంటూ వచ్చాం. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే అన్నం పెడుతోంది. వరిసాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్గా ఉంది. తెలంగాణలో మూడు కోట్ల టన్నుల వరి సాగువుతోంది. పేదల కడుపునిండేలా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’’ అని సీఎం తెలిపారు. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలి: కేటీఆర్ కలలో కూడా ఊహించని, కల్పన కూడా చేయని అభివృద్ధి ఇవాళ సిరిసిల్లలో కళ్లకు కనబడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎర్రటి ఎండల్లో కూడా ఆప్పర్ మానేరు మత్తడి దూకుతోంది.. కన్నీరు చూసిన ఈ నేలలో కేసీఆర్ తాగు, సాగు నీరు అందుతోంది. ఇది చేతల, నేతన్నల ప్రభుత్వం.. ఇవాళ సిరిసిల్ల జిల్లా కేంద్రమై లెక్కకు మిక్కిలి విద్యా, వైద్య సంస్థలతో సిరిసిల్ల తులతూగుతోంది.. సిరిసిల్లలో మరోసారి జై కొట్టి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా గెలిపిస్తాం.. మీ ఆశీర్వాదం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ -
పార్టీ ఏదైనా..జెండా తయారయ్యేది అక్కడే
-
సిరిసిల్లలో చిరుత కలకలం.. పొలాల్లో రెండు పిల్లలు లభ్యం
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని కోనరావుపేట మండలం శివంగలపల్లి శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. సబ్ స్టేషన్ ఎదుట ఉన్న డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రాత్రి చిరుతపులి రెండు పిల్లలకు జన్మనిచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ పిల్లను చిరుత తీసుకువెళుతుండగా పొలం పనులకు వెళుతున్న రైతు చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత రైతుల అలజడి విని ఓ పిల్లను వదిలేసి వెళ్ళింది. చిరుత పిల్లను చూసేందుకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. చిన్న చిరుతతో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. పాల కోసం ఏడుస్తున్న చిరుత పిల్లలకు పాలు తాగించే యత్నం చేశారు. అనంతరం అటవీశాఖ అధికారులు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత పిల్లను కరీంనగర్కు తరలించారు. చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులను హెచ్చరించారు. అయితే చిరుత పిల్ల లభ్యం కావడంతో శివంగులపల్లితో పాటు.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. -
స్కూటీలో దూరి.. చుక్కలు చూపించి..
సాక్షి, రాజన్న సిరిసిల్ల: చిన్నదే కానీ చుక్కలు చూపించింది. స్కూటీలో దూరి ఓనర్ని టెన్షన్ పెట్టించింది. దానిని చూసేందుకు జనం సైతం ఎగబడడంతో భారీగా ట్రాఫిక్ఝామ్ కూడా అయ్యింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద జరిగిన హైడ్రామా.. స్నేకా.. మజాకా అని అందరితో అనిపించింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ వద్ద షబ్బీర్ అనే వ్యక్తి ఓ షాప్ ముందుకు తన స్కూటీని ఉంచాడు. అయితే.. నెమ్మదిగా అందులోకి దూరింది ఓ పాము. సమాచారం అందన్కున్న స్నేక్ క్యాచర్ గంటపాటు శ్రమించి బండి మొత్తం పార్ట్స్ విప్పదీశాడు. ఎట్టకేలకు ఆ చిన్నపామును పట్టుకోగలిగాడు. ఆపై దానిని వాటర్ బాటిల్లో దూర్చి దూరంగా తీసుకెళ్లాడు. స్కూటీలో పాము దూరిందనే వార్త సాధారణంగానే జనాలను ఆకట్టుకుంది. చుట్టూ మూగి ఆ డ్రామా అంతా చూస్తూ ఉండిపోయారు. చివరకు పామును స్నేక్క్యాచర్ పట్టేయడంతో స్కూటీ ఓనర్ ఊపిరి పీల్చుకున్నాడు. -
నేను మెడిసిన్ సీటు పొందలేకపోయాను: మంత్రి కేటీఆర్
-
మంత్రి కేటీఆర్ మెడిసిన్ ఎందుకు చదవలేకపోయారంటే..?
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో తొమ్మిది మెడికల్ కాలేజీలను వైద్య, ఆరోగ్యశాఖామంత్రి హరీష్రావుతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రారంభించినందుకు సెస్ కార్యాలయం నుంచి సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం వరకూ భారీ కృతజ్ఞతా ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చైరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ.. 1993లో తాను కూడా బైపీసీ పూర్తిచేసినట్లు తెలిపారు. అమ్మ తనను డాక్టర్ చేయాలనుకుంటే.. నాన్న నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారని ఆనాటి రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తనకు ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చినా.. మెడికల్ సీటు రాలేదని తెలిపారు. కానీ ఇప్పుడు విద్యార్థులు అదృష్టవంతులని.. తెలంగాణాలో 10000 మంది వైద్యులు ప్రైవేట్& ప్రభుత్వ కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని తెలిపారు. డిగ్రీ కాలేజ్ కోసం కొట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు తెలంగాణలో వచ్చాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే(సిరిసిల్ల) ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవని విమర్శించారు. చదవండి: కవిత పిటిషన్పై విచారణ వాయిదా.. ఈడీ ఆఫీసుకు వెళ్తారా? ‘మొన్నటి దాకా డాక్టర్ల కొరత వుండేది. ఇప్పుడు మెడికల్ కాలేజ్ వల్ల కేవలం సిరిసిల్ల జిల్లాలోనే దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లున్నారు. గత పాలనలో రెండే రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసారు. వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలను ఏర్పాటు చేస్తాం. మోదీ లాంటి వాళ్ళు సహకరించకున్నా జిల్లాకో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మాకు బాసులు ఎవరూ లేరు. ప్రజలే మాకు బాసులు. కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి? వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి? ఢిల్లీ వాళ్లనడగాలి.సిరిసిల్లలో నన్ను, వేములవాడలో లక్ష్మీనరసింహారావును మంచి మెజారిటీతో గెలిపించండి. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు’ తెలిపారు మంత్రి కేటీఆర్. -
తెలంగాణలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి చెందుతోంది. వివిధ పథకాల ద్వారా నేతన్నకు అండగా నిలుస్తున్నామన్నారు. మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా అమలు చేస్తున్నమని తెలిపారు. సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోనే వ్యవసాయరంగంతో పాటు.. అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుక్కి దున్నిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటోందన్నారు. గత ప్రభుత్వాలు 200 వందల పెన్షన్ ఇస్తే కేసీఆర్ రూ. 2016, వికలాంగులకు 4016 ఇస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హర్ ఘర్ జల్ యోజన పథకం ప్రారంభించామని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా గురుకులాలు ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి వాహనం, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను నీతి అయోగ్ అభినందించిందని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానా అనే నినాదం నుంచి ఛలో పోదాం పదరా సర్కారు దవాఖానాకు అనేలా రోగులకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిచ్చిందని పేర్కొన్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థులపై 1 లక్షా 25 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన స్వచ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 సర్వేలో పారిశుధ్య విభాగంలో తెలంగాణాకు ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిందని.. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. చదవండి: తెలంగాణ సాగునీటి రంగంలో స్వర్ణయుగం: సీఎం కేసీఆర్ -
కోతుల వీరంగం.. బావిలోపడ్డ వృద్ధురాలు
సాక్షి, సిరిసిల్ల: ఇటీవల కాలంలో కోతుల దాడులు పెరిగిపోయాయి. జనావాసాల్లోకి చొరబడి గుంపులు, గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కోతులు మూకుమ్మడిగా దాడి చేయడంతో ఓ వృద్ధురాలు బావిలో పడింది. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లో శనివారం చోటుచేసుకుంది. రాచర్లబొప్పాపూర్కు చెందిన గంభీర్పూర్ రాజవ్వ (68) ఇంటి బయట కూర్చుని ఉండగా.. హఠాత్తుగా కోతుల గుంపు దాడి చేశాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న బావిలో పడి మధ్యలో ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో సమీప ఇళ్లలోని యువకులు వచ్చి బావిలో వేలాడుతున్న రాజవ్వను తాళ్ల సహాయంతో బయటకు లాగారు. అపస్మారకస్థితిలో ఉన్న రాజవ్వను ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. చదవండి: ప్రగతి కాదు.. సర్పంచ్లకు దుర్గతి.. ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి ధ్వజం -
అమెరికాకు సిరిసిల్ల వస్త్రాలు
సిరిసిల్ల: సిరిసిల్ల అపెరల్ పార్క్లోని గోకుల్దాస్ సంస్థలో గ్రీన్నీడిల్ యూ నిట్లో జిల్లా మహిళలు ఉత్పత్తి చేసిన రెడీమేడ్ వ్రస్తాలు సిరిసిల్ల బ్రాండ్తో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయాన్ని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం ట్విట్టర్లో పంచుకున్నారు. సిరిసిల్ల అపెరల్పార్క్లో రెండేళ్లుగా రెడీమేడ్ వస్త్రాలు తయారవుతున్నా సిరిసిల్ల కాకుండా.. బెంగళూర్ బ్రాండ్తో ఎగుమతి అయ్యేవి. ఇటీవల సిరిసిల్ల బ్రాండ్తో అమెరికాకు నేరుగా ముంబయి నుంచి నౌకలో వెళ్తున్నాయి. అపెరల్ పార్క్లో 3.25 ఎకరాల్లో 66 వేల చదరపు అడుగులతో రూ.24 కోట్లతో గోకుల్దాస్ రెడీమేడ్ వ్రస్తాల తయారీ యూనిట్ను ప్రారంభించారు. ఇందులో ప్రస్తుతం 500 మంది స్థానిక మహిళలు ఉపాధి పొందుతుండగా.. మరో 500 మందికి త్వరలోనే ఉపాధి కలి్పస్తామని గ్రీన్నీడిల్ సంస్థ ప్రకటించింది. రెండు కంటైనర్లలో సిరిసిల్ల బ్రాండ్తో ముంబయికి రెడీమేడ్ వ్రస్తాలు ఎగుమతి కావడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. -
మంత్రి కేటీఆర్ ఇలాకాలో ధరణికి ఇక్కట్లు
-
మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం: కేటీఆర్
-
పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం, కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ హరితహారం కార్యక్రమం ఈ స్థాయిలో లేదు’ అని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇది కూడా చదవండి: ‘తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పోరాడారు’ -
మంత్రి కేటీఆర్కు నిరసన సెగ.. కాన్వాయ్ అడ్డగింత
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్కు సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డి పేట మండలం గుంటపల్లి చెరువుతండాలో మంత్రి కాన్వాయ్ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు నియోజకవర్గంలో పర్యటించేందుకువచ్చిన కేటీఆర్ వాహనాన్ని కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్చేశారు. కాగా రాష్ట్రంలో దాదాపు వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అనేకచోట్ల చేతికొచ్చిన పంట దెబ్బతిన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో దెబ్బతిన్న పంట పొలాలను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆరా తీశారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడొద్దని, కేసీఆర్పై నమ్మకం ఉంచాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు భరోసానిచ్చారు. చదవండి: సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్భవన్ క్లారిటీ.. -
జీ-20 లోగోను వస్త్రంపై నేసిన హరిప్రసాద్
-
సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం: కేటీఆర్
సిరిసిల్ల: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సంపదను సృష్టిస్తున్నామని, తిరిగి ఆ సంపదను పేదలకు పంచుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆయన సోమవారం ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు భూముల ధరలు ఎంత ఉన్నాయని, ఇప్పుడు ఎంత ఉన్నాయో తేడాను ప్రజలు గమనించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడంతోనే భూముల ధరలు పెరిగాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,117 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ వినియోగం 16 వేల మెగావాట్లకు చేరిందన్నారు. ఏటా విద్యుత్ కొనుగోలుకు రూ. 10 వేల కోట్లు వెచి్చస్తున్నామని... రూ. 50 వేల కోట్లు వెచ్చించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామన్నారు. రూ. 200 నుంచి రూ. 2,016కు పెన్షన్ పెంచాం.. పేదరికమే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి కేటీఆర్ వివరించారు. ఒకప్పుడు రూ. 200గా ఉన్న పెన్షన్ను రూ. 2,016కు పెంచామని గుర్తుచేశారు. తెలంగాణలో ఉన్న సౌకర్యాలు ఏ రాష్ట్రంలోనూ లేవని స్పష్టం చేశారు. ఏ ఊరికి వెళ్లినా వైకుంఠధామాలు, డంప్యార్డులు, పల్లె ప్రకృతివనాలు, ట్రాక్టర్లు, ట్యాంకర్లు ఇలా ఎక్కడాలేని సౌలత్లు కలి్పంచిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. నిత్యం తమ ప్రభుత్వాన్ని నిందించే ప్రతిపక్షాలకు చెందిన నాయకులకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు అందిస్తామన్నారు. అర్హులందరికీ డబ్బులిస్తామని కేటీఆర్ తెలిపారు. అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ... దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చలవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగంలో నాడు ఆరి్టకల్–3ని పొందుపరచడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. కంటివెలుగు పథకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని వివరించారు. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడని కొనియాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబాలేమైనా ఉంటే ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సాయాన్ని ఆయా కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రాష్ట్ర పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంపీ సక్కంగ లేడు... మన ఎంపీ (కరీంనగర్) బండి సంజయ్ సక్కంగ లేడని, ఆయన సక్కంగ ఉంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లాకు రైలు సౌకర్యం వచ్చేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆయన హిందూ, ముస్లింల చిచ్చుపెట్టేలా మసీదులను కూలుస్తామని చెప్పడంతోపాటు పేపర్ లీక్లు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా వినోద్కుమార్ను గెలిపిస్తే ఈపాటికి జిల్లాకు రైలు వచ్చేదన్నారు. చదవండి: సుప్రీంకు వెళితే తప్ప బిల్లులు పాస్ చేయరా? -
విషాదం: హెల్మెట్ పెట్టుకున్నా.. దక్కని టీచర్ ప్రాణం
సాక్షి, కరీంనగర్: మృతువు ఆమెను లారీ రూపంలో వెంటాడింది. భర్త ఇక లేడన్న ఆలోచనల నుంచి తేరుకుంటున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. అయితే, మరో 30 మీటర్లు దాటితే ఆమె తన గమ్యస్థానం చేరుతుందనగా అనుకోని విధంగా మృత్యువు కాటేసింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కరీంనగర్ పట్టణానికి చెందిన రజిత.. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లందకుంట మండలం రహీమ్ఖాన్పేట మోడల్ స్కూల్లో గణితం టీచర్గా పనిచేస్తున్నారు. అయితే, రజిత రోజు మాదిరిగానే శుక్రవారం కూడా విధులకు బయలుదేరింది. కాగా, స్కూటీపై ఓ ప్రైవేటు స్కూల్ వరకు వెళ్లి.. అక్కడే వాహనం పార్క్ చేసి ఆర్టీసీ బస్సులో పాఠశాలకు వెళ్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం స్కూటీపై స్కూల్కు వెళ్తుండగా సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఓ సిమెంట్ కాంక్రీట్ మిక్సర్ లారీ రజిత స్కూటీకి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జు అయిపోయింది. లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే టీచర్ రజిత మృతిచెందారు. అయితే, రజిత హెల్మెట్ ధరించినప్పటికీ ఆమె చనిపోయారు. ఇక, రజిత.. మరో 30 మీటర్ల దూరంలో స్కూటీ పార్క్ చేసే స్థలం ఉండటం గమనార్హం. ఇక, రజితకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఆమె భర్త వినోద్ కుమార్ ఐదేళ్ల క్రితమే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో రజిత కూడా చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టూ టౌన్ పోలీసులు.. రజిత డెడ్బాడీని ఆసుపత్రికి తరలించారు. -
Karimnagar: ఎమ్మెల్యేలు హైదరాబాద్కు రావొద్దమ్మా.. కేసీఆర్ ఆదేశాలు?
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి నేటి వరకు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలకు గాను, 12 చొప్పున అసెంబ్లీ స్థానాలు సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు కూడా పూర్వపు తరహాలోనే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు పంపింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా వారంలో కనీసం ఆరురోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు అత్యవసరమైతే తప్ప.. ఇకపై నుంచి చీటికి మాటికి రాజధానికి రావాల్సిన అవసరం లేదని, నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దరిమిలా.. ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సీఎం, పార్టీ అధిష్టానం నుంచి సందేశం అందినట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై నిరంతర నిఘా..! పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? స్థానికంగా ప్రజలకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటున్నారు? హైదరాబాద్లో ఎన్నిరోజులు ఉంటున్నారు? అన్న విషయాలపై నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా వాటి పనితీరును ఆయన బేరీజు వేస్తున్నారని తెలిసింది. ఇటీవల సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. గతవారం కొండగట్టు మాస్టర్ ప్లాన్ సందర్భంగా స్మితా సభర్వాల్ ఒకరోజు ముందే వచ్చారు. తాజాగా కరీంనగర్లో జరుగుతున్న తీగలవంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటలిజెన్స్, పార్టీ, ఇతర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సీఎంవోకు రిపోర్టు అందుతూనే ఉంది. అందుకు అనుగుణంగా సీఎం నుంచి తగిన సూచనలు, సలహాలు వసూ్తనే ఉన్నాయి. అన్ని పార్టీలు వస్తున్న క్రమంలో..! రాష్ట్రంలో పాత కరీంనగర్కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్తోపాటు సీపీఐ, బీఎస్పీ, వైఎస్సార్ టీపీ తదితర పార్టీలు కొంతకాలంగా ప్రయత్నాలు సాగి స్తున్నాయి. తాజాగా వీటికి తోడుగా ఎంఐఎం కూడా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. పెండింగ్ పనులను పూర్తి చేయాలని సీఎం నుంచి సీనియర్ లీడర్ల ద్వారా ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీల సంఖ్య, రాజకీయ పోటీ పెరుగుతున్న దరిమిలా.. నిరంతరం ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం. ఇప్పటికే మొదలు.. జిల్లాలో మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వ పరంగా జిల్లాల్లో వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. అటు కేబినెట్ ఇటు జిల్లా కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 సమావేశాల్లో హుజూరాబాద్, మంథని మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పార్టీ గెలిచింది. సీఎం ఆదేశాలతో దాదాపుగా ఎమ్మెల్యేలంతా స్పీడు పెంచారు. ►జగిత్యాల: డా.సంజయ్కుమార్ పల్లె నిద్రపేరుతో గ్రామాల్లో నిద్రిస్తున్నారు. ►కోరుట్ల: విద్యాసాగర్రావు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ►ధర్మపురి: ఈశ్వర్ నిరంతరం జిల్లా సమీక్షలు, లబ్ధిదారులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. ►సిరిసిల్ల: కేటీఆర్ వేములవాడ మాస్టర్ప్లాన్ జిల్లాపై సమీక్షలు.. ►వేములవాడ: రమేశ్ కొద్దికాలంగా పెరిగిన పర్యటనలు. ►కరీంనగర్: గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎంఆర్ఎఫ్, స్మార్ట్సిటీ పనులపై సమీక్ష ►చొప్పదండి: రవిశంకర్ కొండగట్టు మాస్టర్ప్లాన్తో పెరిగిన స్పీడు.. ►మానకొండూరు: బాలకిషన్ పల్లెల్లో మార్నింగ్ వాక్లకు ప్లాన్ ►పెద్దపల్లి: మనోహర్రెడ్డి నిత్యం లబ్ధిదారులతో సమావేశాలు ►రామగుండం: చందర్ నిరంతరం సేవా, వసతుల కల్పనపై సమీక్షలు ►హుస్నాబాద్: సతీశ్బాబు స్థానిక సమస్యలపై ప్రజలతో సమావేశాలు. -
ఏంటీ, పెళ్లిలో నాన్వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్తోపాటు బస్సు క్లీనర్ అజయ్లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది. ఫోన్లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను పరామర్శించారు. -
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
అన్నంలో పురుగులు, వానపాములు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నంలో పురుగులొస్తున్నాయి.. భోజనంలో వానపాములు వస్తున్నాయి.. వాచ్మన్ నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.. చేయి చేసుకుంటున్నాడు.. ప్రిన్సిపాల్, వార్డెన్,, చివరికి కుక్ కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమస్యలను ఏకరవు పెట్టేందుకు ఆదివారం వేకువజామున ఐదు గంటలకు చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డెక్కారు. దాదాపు 70 మంది హాస్టల్ నుంచి బయటకొచ్చి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. పురుగుల అన్నం.. నీళ్ల చారు పెడుతున్నారని, ఆ భోజనం తినలేక పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, వాచ్మన్ రామస్వామి, భోజనం వండి పెట్టే భద్రమ్మ దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. భోజనంలో వానపాములు వస్తున్నాయని విలపించారు. కాస్మోటిక్ డబ్బులను సైతం ప్రిన్సిపాల్ కాజేస్తోందని చెప్పారు. వాచ్మన్ రామస్వామి నిత్యం తాగొచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, తమపై చేయి చేసుకుంటున్నారని ఆరోపించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్, వార్డెన్, వాచ్మన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల ఆందోళన తెలుసుకున్న ఎస్సై శేఖర్, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్గౌడ్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సంఘటనపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే స్పందించారు. తక్షణమే పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సొసైటీ కార్యదర్శి రొనాల్డ్రాస్ను ఆదేశించారు. జిల్లా సంక్షేమశాఖ అధికారిని కూడా వెళ్లి అక్కడి పరిస్థితులు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకోవాలని సూచించారు. ఆందోళన చెందొద్దని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మంత్రి విద్యార్థినులతో ఫోన్లో మాట్లాడి భరోసానిచ్చారు. ప్రిన్సిపాల్, వాచ్మన్పై వేటు.. అదనపు ప్రిన్సిపాల్ రామారావుకు బాధ్యతలు కాగా, ఘటనపై గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ డీఎస్ వెంకన్న స్పందించారు. విద్యార్థినులను వేధింపులకు గురిచేసినట్లు విచారణలో తేలడంతో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించారు. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్గా కొనసాగుతున్న రామారావుకు ప్రిన్సిపాల్గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే వాచ్మన్గా పనిచేస్తున్న రామస్వామిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. మా మీదే ఫిర్యాదు చేస్తారా.. లోనికి ఎలా వస్తారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం తొలుత విద్యార్థినులపై ప్రిన్సిపాల్ జ్యోతిలక్ష్మి, నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. ఆందోళన ముగిసిన తర్వాత విద్యార్థినులు పాఠశాలకు చేరుకోగా.. గేటుకు తాళంవేసి లోనికి అనుమతించలేదు. ఎవరికి చెప్పి బయటకు వెళ్లారంటూ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థినులు గేటు ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాఠశాలకు వచ్చారు. ప్రిన్సిపాల్తో మాట్లాడి, విద్యార్థినులను లోనికి పంపించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని గేటు ఎదుట ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులతో రీజినల్ కోఆర్డినేటర్ వెంకన్న మాట్లాడి ప్రిన్సిపాల్తో పాటు వాచ్మన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు చెప్పడంతో ఆందోళన విరమించారు. -
చందనాల చీరకు వెండిపోగుల వందనం
సిరిసిల్ల: వెండిపోగులతో మెరిసిపోతోంది. పరిమళాలు వెదజల్లుతోంది. సిరిసిల్ల నేత కళాకారుడి చేయి మరో అద్భుతాన్ని సృష్టించింది.. వెండితో పరిమళించే సిరి చందనం పట్టుచీర సో యగాలొలుకుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నాలుగు దశాబ్దాల కిందటే నేసి ప్రపంచానికి సిరిసిల్ల చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్కుమార్.. తాజాగా వెండిపోగులతో పరిమళించే పట్టుచీరను మగ్గంపై నేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తల్లి జ్యోతి వెండిపోగుల సిరిచందనం పట్టు చీరను ఆర్డర్ ఇచ్చారు. ఈ మేరకు విజయ్కుమార్ నెల పది రోజులపాటు శ్రమించి 90 గ్రాముల వెండితో పోగులను సిద్ధం చేసి, 27 రకాల పరిమళాలతో కూడిన నూలు పోగులతో పట్టుచీరను నేశాడు. 600 గ్రాముల బరువుతో, 48 ఇంచీల వెడల్పుతో ఐదున్నర మీటర్ల పొడవైన వెండిపోగుల చీరను సిద్ధం చేశాడు. కట్టుకోవడానికి వీలుగా ఉండే ఈ చీర తయారీకి రూ.45 వేలు ఖర్చయినట్లు నల్ల విజయ్కుమార్ తెలిపారు. చీరను కలెక్టర్ తల్లి జ్యోతికి అందజేస్తానని ఆయన గురువారం తెలిపారు. -
ఆమె మనోస్థైర్యం ఎంతో అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ కొనియాడారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి.. ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోస్థైర్యం నిరూపించిందన్నారు కేటీఆర్. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమన్న ఆయన.. రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం కమ్ముకుంది. కానీ, చెదరని గుండె నిబ్బరంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారామె. ఆత్మవిశ్వాసంతో ఆమె రాసిన కవితలు మంచి ఆదరణ పొందాయి. ‘‘సంకల్పం ముందు వైకల్యం ఎంత!. ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!. ఎదురీత ముందు విధిరాత ఎంత!. పోరాటం ముందు ఆరాటం ఎంత!.. అంటూ రాజేశ్వరి ఓ కవిత రాసిందామె. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి ‘‘జీవితమే కవిత్వం..’’ అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే. కానీ అమె మాత్రం జీవిస్తుంది.. అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం అంటూ పేర్కొన్నారు. సంబంధిత వార్త: కాళ్లతో కవితలు రాసిన ‘సిరిసిల్ల’ రాజేశ్వరి ఇక లేరు -
Sircilla Rajeshwari: సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూత
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆమె వైకల్యాన్ని ఎదురించింది. కాలి వేళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి. ఆ కవితలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె గాథ.. మరికొందరిలో స్పూర్తి నింపింది కూడా. కానీ, దురదృష్టవశాత్తూ.. కాళ్లతో కవితలు రాసే కవయిత్రిగా దక్కించుకున్న ఆమె ఇక లేరు. కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. సిరిసిల్ల పట్టణం సాయినగర్లో ఓ పేద నేతన్న కుటుంబంలో మూడో సంతానంగా జన్మించింది బూర రాజేశ్వరి. పదిహేనవ ఏట దాకా ఆమె నడవలేదు. అయితే.. వైకల్యాన్ని చూసి ఏనాడూ ఆమె బాధపడలేదు. కసిగా కవితలు రాయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు సాంబయ్య, అనసూయల ప్రోత్సాహంతో చదువుకుంది. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారామె. సుమారు 700ల దాకా కవితలు రాసి అందరినీ ఆకట్టుకున్నారామె.ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయట. రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు. తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.ఈ విషయాన్ని కేవీ రమణాచారి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ సాహిత్యంలో ఆమె రాణించడం.. కేసీఆర్ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. దివ్యాంగురాలు కావడంతో.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను ఆమె కవిత రూపంలో రాశారు. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో రాజేశ్వరి జీవిథ గాధను చాలా టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే 42 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స అందినా ప్రాణం నిలవలేకపోయింది. రాజేశ్వరి మృతి పట్ల స్థానికంగా సంతాపం వెల్లడిస్తున్నారు. ఆమె మృతి వార్తను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు స్థానిక బీఆర్ఎస్ నేతలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె సాహిత్య ప్రయాణాన్ని.. మహారాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ సిలబస్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించడం గమనార్హం. -
Yennam Satyam: అతడి మరణం ఓ విషాదం!
సత్యం! 30, 35 ఏళ్ల క్రితం కవిత్వం, కథలు రాస్తున్న నాతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. క్రమక్రమంగా స్నేహితుడిగా, కవిగా కూడా పరిణామం చెందాడు. నిరంతర అధ్యయనశీలి. శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకున్న వాడు. అంతేగాక తన మొదటి మూడు పుస్తకాలను ఖగోళ శాస్త్రం, విశ్వ రహస్యాలను ఆధారం చేసుకొని భూమి కేంద్రంగా సూక్ష్మస్థాయిలో సుదీర్ఘ కవితల్ని రచించాడు. అవి సుదీర్ఘ జ్ఞాపకం(1996), శిలా ఘోష (1997), బొంగరం (2004). తనకంటూ తెలుగు కవిత్వ రంగంలో ఒక స్థానాన్ని అప్పుడప్పుడే ఏర్పర్చుకుంటున్న కాలమది. చాలా రోజులు అటు జీవితంలోనూ ఇటు కవిత్వంలోనూ తాయిమాయి తొక్కులాడాడు. 2011లో సూది నానీలు పేరుతో ‘నానీ’ పుస్తకాన్ని వెలువరించాడు. ఆ పుస్తకం ఇన్నర్ టైటిల్లో ‘అగర్ తేరీ గలిమే కోయీ భూకా హైతో లానత్ హై తేరే ఖానే పే’ అనే మహమ్మద్ ప్రవక్త సూక్తి తెలుగు అనువాదం ‘మీ వీధిలో ఎవరైనా పస్తులుంటే నువ్వు తినే అన్నం అధర్మమే’ ముద్రించాడు. తద్వారా సత్యం మరో నూతన తాత్విక లోకంలోకి నిబద్ధతతో, నిమగ్నతతో ప్రవేశించాడు. అన్నట్టు చెప్పలేదు కదూ... అరబ్బీని అనర్గళంగా మాట్లాడడమే కాక చదువుతాడు, రాస్తాడు కూడా. ఇక్కడ కొద్దిగా అతడి వలస బతుకు గురించీ యాది చేసుకోవాలి. దర్జీల కుటుంబంలో పుట్టిన సత్యం... జీవిత ప్రారంభంలో జీవనాధారాన్ని వెతుక్కుంటూ సిరిసిల్ల, ముంబై ప్రాంతాల గుండా అరబ్బు దేశాలకు షర్ట్ మేకర్ కార్మికునిగా వలస పోయి 26 ఏళ్లు గడిపాడు. చివరికి ఇక అరబ్బు దేశానికి పోనవసరం లేదనీ, ఇక్కడ సిరిసిల్లలో నివాసం ఏర్పరచుకున్నాడు. ముగ్గురు బిడ్డల పెళ్లిళ్లు చేశాడు. పేద దర్జీ బతుకులకు నిలువెత్తు నిదర్శనంగా ఉండే నానీలను రాశాడు సత్యం. గుండెలను పిండి వేసే మచ్చుకు రెండు నానీలు... ‘అందరికీ జేబులు కుట్టేవాడు చాయ్ బీడీలకు అప్పు పడ్తడు’ ‘అమ్మకు కన్నీళ్లే కళ్లద్దాలు వాటితోనే కాజాలు కుట్టేది’ అంతా సవ్యంగా సాఫీగా బతుకు బండి నడుస్తుందనుకునేసరికి, మూడేళ్ల క్రితం బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడ్డాడు. మూడుసార్లు తలకు ఆపరేషన్ జరిగినప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. పైగా చివరి 4 నెలలు ఒక్కొక్క అవయవం కోల్పోయి నానా ఇబ్బందులు పడ్డాడు. యెన్నం సత్యం (58) కవిగా ఎన్నో మెట్లు ఎక్కవలసిన వాడు, ఎన్నో లక్ష్యాలను అధిగమించి, అందరి అంచనాలను బదాబదలు చేయవలసిన వాడు. కానీ ఆరోగ్యం విషమించి ఈనెల 18న (ఆదివారం) తనువు చాలించాడు. సిరిసిల్ల కవి మిత్రులకే గాక... కరీంనగర్ ఉమ్మడి జిల్లా సాహితీ మిత్రులందరికీ ఇదో తీరని లోటు. ఒక విషాద జ్ఞాపకం. సత్య ప్రమాణంగా సత్యం మరువలేని ఉప్పకన్నీళ్ల చేదు యాది! (చదవండి: సాహిత్యకారుల్లో చాతుర్వర్ణాలు.. అవేంటో తెలుసా!) – జూకంటి జగన్నాథం -
అయోధ్య తప్ప సయోధ్య ఎక్కడుంది.. ‘సెస్’ ఫుల్ఫామ్ చెబితే రాజీనామా!
సాక్షి, సిరిసిల్ల: ‘రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ‘సెస్’ ఎన్నికల్లో మా సీట్లు లాక్కున్నా రని బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు బండి సంజయ్ అంటున్నారు. ఆయన ‘సెస్’ఫుల్ఫామ్ చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు, ‘సెస్’ గురించి ఆయనకు ఏం తెలుసని, అయోధ్య తప్ప రైతులతో ఆ పార్టీకి సయోధ్య ఎక్కడుందని ప్రశ్నించారు. పోరగాళ్లకు మతం మందు కలిపి తాగిస్తున్నారని, వాట్సాప్ గ్రూపుల్లో బీఆర్ఎస్పై వాళ్లతో తప్పు డు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. చదవండి: ఏపీ పరిశీలకుడిగా ఉత్తమ్కుమార్రెడ్డి -
హామీలు అమలు చేస్తే చెప్పు దెబ్బకు సిద్ధం: బండి సంజయ్
సిరిసిల్ల: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ దివాలా కంపెనీ అని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ పార్టీ అమలు చేస్తే ప్రజల కోసం చెప్పుతో కొట్టించుకోవడానికి, తల నరుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను డ్రగ్స్ వాడలేదని పరీక్షల్లో తేలితే చెప్పు దెబ్బలకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్పై బండి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడల్లో గురువారం బీజేపీ శ్రేణులతో సమావేశమై ‘సెస్’ఎన్నికలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబానికి అహంకారం తలకెక్కిందని దుయ్యబట్టారు. ‘కేసీఆర్ నా తలను 6 ముక్కలు చేస్తానన్నడు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తుంటే ట్విట్టర్ టిల్లు (మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి) చెప్పుతో కొడతానంటూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నడు. డ్రగ్స్ వాడి మానేసిండు కదా..‘‘విత్ డ్రాయల్ సింప్టమ్స్’’తో బాధపడుతున్నాడు. కేసీఆర్ బిడ్డనేమో మా ఎంపీ అర్వింద్ను చెప్పుతో కొడతానంటోంది. కానీ మీలాగా సంస్కారహీనంగా మేం మాట్లాడలేం’అని సంజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, అవినీతి, అక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. \ కేంద్రాన్ని బద్నామ్ చేస్తున్నారు... తెలంగాణ లాగా దేశమంతటా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అంటున్నారని, తెలంగాణ ఏ విషయంలో అభివృద్ధి చెందిందో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. ‘రైతు రుణాలు మాఫీ చేయలే. ఉద్యోగాలు భర్తీ చేయలే. నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితబంధు, రైతులకు ఉచిత యూరియా, దళితులకు 3 ఎకరాలు ఇయ్యలే. వడ్లు సరిగ్గా కొనుగోలు చేయట్లే. కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు ఆగలే’అని బండి సంజయ్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పిన కేసీఆర్... 15 గంటలే సరఫరా చేయాలని ఆదేశాలిచ్చారని దుయ్యబట్టారు. రైతులకు సాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ బద్నామ్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం ఎంత భారమైనా రైతులకు సబ్సిడీపై ఎరువులను సరఫరా చేస్తోందని చెప్పారు. రైతులకు ఫసల్బీమా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే కలిసే ముఖం కేసీఆర్కు లేదని ఎద్దేవా చేశారు. కేంద్రానికి సహకరించకుండా రోడ్లు, రైల్వేలేన్లు సహా అన్ని విషయాల్లోనూ కేంద్రాన్ని అపఖ్యాతిపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గపు, నియంత, రాక్షస పాలన అంతం కోసం ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నానని బండి సంజయ్ వివరించారు. రోడ్డుపై ఉరికించి కొట్టాలే.. రాష్ట్రంలో ఓ అధికారి (హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ఉద్దేశించి) క్రైస్తవం వల్లే కరోనా తగ్గిందంటడు. క్రైస్తవం వల్లే భారత్ అభివృద్ధి చెందిందంటడు. ఆయనకు సిగ్గుండాలె. మరి ఈ దేశంలో ఎందుకున్నవ్? దేశం విడిచి పో. ఈ దేశంలో పుట్టి పరాయి పాట పాడతవా? ప్రభుత్వ అధికారిగా ఉంటూ మతప్రచారం చేస్తవా?’అని బండి ప్రశ్నించారు. బరితెగించిన ఇలాంటి అధికారులను రోడ్లపై ఉరికించి కొట్టాలన్నారు. ఎమ్మెల్సీ సీటు కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కాళ్లు మొక్కే అధికారుల సంగతి చూస్తామని సంజయ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణిరుద్రమదేవి, టి.వీరేందర్గౌడ్, మోహన్రెడ్డి, ఆవునూరి రామాకాంత్రావు, రెడ్డబోయిన గోపి, ఆడెపు రవీందర్లు పాల్గొన్నారు. -
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్
-
సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్ల యువతి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను జ్ఞానేశ్వర్ (జానీ) అనే యువకుడిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది శాలిని. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పేర్కొంది. ఇష్టపూర్వకంగానే జానీతో వెళ్లినట్లు తెలిపింది. ఈ మేరకు పెళ్లి దుస్తులతో ఉన్న, ఫోటోలను, వీడియో విడుదల చేసింది. ‘జానీ నేను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే జానీతో వెళ్లా. రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్నా. నా తల్లిదండ్రుల నుంచి ప్రాణహానీ ఉంది’ అని వీడియోలో తెలిపింది. కాగా జిల్లాలోని చందుర్తి మండలం మూడపల్లిలో శాలిని అనే యువతి కిడ్నాప్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అవ్వగా .. మంగళవారం తెల్లవారుజామున తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమాన్ దేవాలయంలో పూజ చేసేందుకు వెళ్లిన శాలిని గుడి ముందే నలుగురు యువకులు అపహరించారు. అడ్డుకున్న యువతి తండ్రిని కొట్టి ఆమెను లాక్కెళ్లారు. యువతి కిడ్నాప్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఇప్పటి వరకు యువతిని కిడ్నాప్ చేశారని అంతా భావిస్తుండగా.. తానే స్వయంగా అతనితో వెళ్లిన్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. చదవండి: రాజన్న సిరిసిల్ల: మాడపల్లి కిడ్నాప్ ఉదంతంపై కేటీఆర్ స్పందన -
సిరిసిల్ల నేతన్నలు అదుర్స్: అమెరికా రీసెర్చ్ స్కాలర్ కైరా ప్రశంసలు
సాక్షి, సిరిసిల్ల: అగ్గిపెట్టలో పట్టే చీర నేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అక్కడి నేతన్నలపై ప్రశంసలు కురిపించారు అమెరికా చేనేత నైపుణ్య నిపుణురాలు, రీసెర్చ్ స్కాలర్ కైరా జాఫ్. నేతన్నల కళానైపుణ్యాలను చూసి అబ్బురపడిపోయారు. అమెరికా ప్రభుత్వ పరిశోధన గ్రాండ్తో ఆసియాలోని వివిధ దేశాల్లో చేనేత పరిస్థితులు, నేతన్నల నైపుణ్యం వంటి రంగాలపై సమగ్రమైన అధ్యయనం చేస్తున్న కైరా.. శనివారం సిరిసిల్లలో పర్యటించారు. సిద్దిపేటలోని సెరికల్చర్ రైతులతో క్షేత్రస్థాయి పర్యటన ముగించుకొని అక్కడి నుంచి సిరిసిల్ల చేరుకున్న ఆమె నేతన్నలతో సమావేశమయ్యారు. చేనేత కార్మికుల మగ్గాలు, వారు నేస్తున్న బట్టలు, చేనేత నైపుణ్యాలకు సంబంధించిన అంశాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేనేత కళ నుంచి మరమగ్గాలవైపు సిరిసిల్ల నేతన్నలు మళ్ళిన చారిత్రాత్మక క్రమంపైనా ఆమె వివరాలు తీసుకున్నారు. తన వినూత్నమైన చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన హరిప్రసాద్ను కలిశారు కైరా జాఫ్. ఆయన రూపొందించిన వివిధ చేనేత ఉత్పత్తులు, ముఖ్యంగా అగ్గిపెట్టెలో పట్టేలా నేసిన చీరను చూసి ఆమె అబ్బురపడ్డారు. ఇంత అద్భుతమైన ప్రతిభ నైపుణ్యం కలిగిన చేనేత కార్మికులను ఇంతవరకు తాను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణంలో ఉన్న చేనేత కార్మికుల నైపుణ్యంతో పాటు పవర్ లూమ్ క్లస్టర్గా మారిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభం నుంచి స్వయం సమృద్ధి వైపు సాగుతుండడంపైన ఆమె ఆసక్తి చూపారు. కైరా బృందం వెంట తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్థి కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, స్థానిక టెక్స్టైల్ అధికారులతో పాటు చేనేత నేత కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు సిరిసిల్ల క్లస్టర్లో నేతన్నల ఇబ్బందులు, పరిశ్రమ సంక్షోభం, దాని నుంచి బయటపడిన విధానం, అందుకు ప్రభుత్వం అందించిన సహకారం, కార్మికులు తమ నైపుణ్యాలను, పవర్లూమ్ యంత్రాలను ఆధునికరించిన విధానం వంటి వివరాలను అందజేశారు. చేనేత కార్మిక క్షేత్రాల్లో పర్యటన.. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న పరిస్థితులు, అక్కడి చేనేత పరిశ్రమపైన ఆమె తన అధ్యయనాన్ని పూర్తిచేసుకుని భారత్కు వచ్చారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తన అధ్యయనాన్ని కొనసాగించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మిక క్షేత్రాలైన పోచంపల్లి, గద్వాల్ సహా ఇతర నేత కార్మిక క్షేత్రాలు ఎన్ఎస్ సిరిసిల్ల సిద్దిపేట జనగామ వంటి ప్రాంతాలలో పర్యటించనున్నారు. ఇదీ చదవండి: బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు -
‘సారీ.. అన్నయ్య మిస్ యూ’.. అంటూ మెసెజ్ పెట్టి..
సాక్షి, సిరిసిల్ల: ‘సారీ అన్నయ్య.. మిస్ యూ’ అంటూ మెసేజ్ చేసి తంగళ్లపల్లి మండలం చింతలఠాణాకు చెందిన గొడుగు దినేశ్(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన గొడుగు అంజయ్య భార్య 15 ఏళ్ల క్రితం చనిపోగా ముగ్గురు కొడుకులు వెంకటేశ్, గణేశ్, దినేశ్లను పెంచి పెద్ద చేశాడు. పెద్దకొడుకు వెంకటేశ్ వివాహం కాగా.. చిన్న కొడుకు దినేశ్కు మేనమామ కూతురితో పెళ్లి చేయాలనుకున్నారు. ఆ అమ్మాయిని దినేశ్ నిరాకరించారు. దీంతో దినేశ్, గణేశ్లకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలని తండ్రి అంజయ్య సంబంధాలు చూస్తున్నాడు. మేనమామ కూతురికి శనివారం మరో అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. తాను నిరాకరించిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరడం.. తనకు దొరక్కపోవడంతో మనస్థాపానికి గురైన దినేశ్ శనివారం మధ్యాహ్నం మేకలు కాసేందుకు గ్రామ శివారులోని కొడిషల్గుట్టకు వెళ్లాడు. అక్కడి నుంచి తన పెద్దన్న వెంకటేశ్కు ఫోన్చేసి తనకు బతకాలని లేదని చెప్పి కాల్ కట్ చేశాడు. వెంకటేశ్ తన తండ్రి అంజయ్యకు సమాచారం ఇవ్వగా శనివారం నుంచి దినేశ్ కోసం గాలించారు. ఆదివారం తెల్లవారుజామున కొడిషల్గుట్ట ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి అంజయ్య ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డుల్లో సిరిసిల్ల టాప్
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల: స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2023 అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు దేశంలోనే ఫోర్ స్టార్ ర్యాంకింగ్ కేటగిరిలో మొదటి స్థానం దక్కింది. జిల్లాలోని అన్ని గ్రామాలను ఓడీఎఫ్ (బహిరంగ మలవిసర్జన రహితం) ప్లస్ కేటగిరిలో మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దినందుకుగాను ఈ అవార్డు లభించింది. కేంద్ర తాగునీరు–పారిశుధ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఓడీఎఫ్ ప్లస్ మోడల్ కింద అన్ని గ్రామాల్లోని ఇళ్లు, సంస్థలలో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవడం, గ్రామాలలో తడి, పొడి చెత్త సక్రమ నిర్వహణ, కంపోస్ట్ షెడ్ల వినియోగం, అన్ని గ్రామాలలో మురుగు నీటి నిర్వహణ, అన్నింటినీ పరిశుభ్ర గ్రామాలుగా తీర్చి దిద్దడంతో పాటు ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన వాల్ పెయింటింగ్స్ ఏర్పాటు చేయడం అనే అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ అవార్డును ప్రకటించారు. అద్భుతాన్ని ఆవిష్కరించారు: మంత్రి కేటీఆర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ –2023 అవార్డుల్లో రాజన్నసిరిసిల్ల జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు దృఢ సంకల్పంతో అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులను అభినందించారు. ఈ విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని కోరారు. తాజా అవార్డుపై సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, సంబంధిత అధికారులను అభినందిస్తూ మంత్రి ట్వీట్ చేశారు. కాగా, ‘మీ నిరంతర మార్గదర్శనం, సహకారం కారణంగానే ఇది సాధ్యమైందంటూ’కలెక్టర్ కూడా ట్వీట్ చేశారు. -
సంక్రాంతి నాటికి ‘డబుల్’ లబ్ధిదారుల గుర్తింపు
సిరిసిల్ల: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తున్నామని, ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగులతో నిర్మించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అర్హులను సంక్రాంతి నాటికి గుర్తించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు 200 గురుకులాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య వెయ్యికి పెరిగిందని, ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఆయా రంగాల్లో సాధించిన ప్రగతి నివేదికలను మార్చిలోగా రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎడ్యుకేషన్ హబ్గా మారిందని, జేఎన్టీయూ, మెడికల్ కాలేజీ, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల మంజూరయ్యాయని వివరించారు. సంక్రాంతి నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9 పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట వరకు ట్రయల్ రన్ నిర్వహించాలని, రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని, సొరంగంలో లైనింగ్ పనులు పూర్తి చేసి మధ్యమానేరు నీటితో మల్కపేటను నింపాలని సూచించారు. అనంతరం తనను కలిసిన గౌడ సంఘం జిల్లా నాయకులతో కేటీఆర్ మాట్లాడుతూ అర్హులైన గీత కార్మికులకు మోపెడ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. -
సిరిసిల్ల చేనేత కళాకారుడికి మోదీ ప్రశంసలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్కు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం నిర్వహించిన మన్కీ బాత్ (మనసులో మాట)లో ప్రధాని మోదీ సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ నైపుణ్యాన్ని అభినందించారు. ఇటీవల జరిగిన జీ–20 సదస్సు లోగోను హరిప్రసాద్ మగ్గంపై తయారు చేసి ప్రధాని మోదీకి పంపారు. ఈ విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ నేతకార్మికుల చేతిలోని అరుదైన కళా నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీవీలో కార్యక్రమాన్ని ఆలకించిన ఎంపీ బండి సంజయ్ చేనేత కళాకారుడు హరిప్రసాద్ను అభినందించారు. చేనేత కళ విస్తరణకు సహకరిస్తానని హామీ ఇచ్చి సత్కరించారు. అరుదైన కళ హరిప్రసాద్ సొంతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూనగర్కు చెందిన వెల్ది హరిప్రసాద్ తన చేనేత కళాప్రతిభను పలుమార్లు ప్రదర్శించారు. ఇప్పటికే అగ్గిపెట్టెలో ఇమిడే చీరతోపాటు ఉంగరంలో దూరే చీరను, సూది రంధ్రంలోంచి దూరే చీరలను నేశారు. సూక్ష్మరూపంలో మరమగ్గాన్ని, కుట్టులేకుండా దుస్తులను తయారుచేశారు. మగ్గంపైనే రాష్ట్ర, జాతీయస్థాయి నాయకుల చిత్రాలను రూపొందించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల కోసం మహాత్ముడి నూలు వడికే చిత్రాన్ని రూపొందించారు. ఆజాద్కీ అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయగీతాన్ని, భారతదేశ చిత్రపటాన్ని కుట్టు లేకుండా నేసి అబ్బురపరిచారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాన్ని వస్త్రంపై నేసి అవార్డు అందుకున్నారు. -
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
పోడు సర్వే జాబితాలో పేర్లు లేవని ఆత్మహత్యాయత్నం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వం చేపట్టిన పోడుభూముల సర్వే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వివరాలిలా.. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం భూక్యతండాలో పోడుభూముల సర్వేను సర్వే కమిటీ చైర్మన్ భూక్య శ్రీరాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోడుభూముల వ్యవహారంలో రాశిగుట్టతండా, భూక్యతండా మధ్య కొన్ని విభేదాలున్నాయి. జాబితాలో భూక్యతండాకు చెందిన బాదావత్ కమల(50), బాదావత్ శివరాం(30) పేర్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004 నుంచే తాము సాగుచేసు కుంటున్నా పేర్లు ఎందుకు లేవంటూ ఆవేదనకు లోనయ్యారు. వీరు సాగు చేసుకుంటున్న భూములు రాశిగుట్ట తండా పరిధిలోకి వస్తాయని.. జాబితాలో పేర్లు లేవని చెప్పగానే శివరాం తాను తెచ్చుకున్న పురుగుల మందు తాగేశాడు. అదే సమయంలో అక్కడే ఉన్న కమల కూడా పురుగుల మందు తాగారు. వెంటనే ఇద్దరినీ ఎల్లారెడ్డి పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కమల 1.20 ఎకరాలు, శివరాం రెండెకరాలు సాగు చేస్తున్నారు. -
గల్ఫ్ చట్టాలు తెలియక చిక్కుల్లో..
సిరిసిల్ల: దుబాయ్లోని చట్టాలపై అవగాహన లేక అక్కడ చిక్కుల్లో పడ్డ ఐదుగురు తెలంగాణ యువకులు మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు సొంతూళ్ళకు రానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన గుగులోత్ అరవింద్, పెద్దోళ్ల స్వామి, గొల్లపెల్లి రాము, అనిల్, నిజామాబాద్ జిల్లాకి చెందిన నరేందర్ ఐదు నెలల కిందట కంపెనీ వీసాలపై లైసెన్స్ ఏజెంట్స్ ద్వారా దుబాయ్కి వెళ్లారు. లేబర్క్యాంపులో వసతులు కల్పించి పని ఇచ్చినా.. వెళ్లేందుకు నిరాకరిస్తూ గొడవకు దిగారు. దాంతో లేబర్కోర్టు అధికారులు అక్కడి సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి వీరి ప్రవర్తన బాగా లేదని నిర్ధారించి, దేశం విడిచి పోకుండా పాస్పోర్టులపై ఆంక్షలు విధించారు. కాగా ఈ ఐదుగురు తిరిగి భారత్ వచ్చేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టుకు వెళ్ళగా. ఆ పాస్పోర్టులపై ఆంక్షలు ఉండడంతో ఎయిర్పోర్టు అధికారులు వారిని వెనక్కి పంపారు. దీంతో వారు గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయామని కేటీఆర్ ఆదుకోవాలంటూ ఎయిర్పోర్టు ముందు నుంచి వీడియో తీసి వైరల్ చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో... వీడియో పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దుబాయ్లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు లేఖ రాశా రు. దుబాయ్లోనే ఉండే గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్య క్షుడు గుండెల్లి నర్సింహులు ఎంబసీ అధికారులతో మాట్లా డి, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఇందులో కంపెనీ తప్పిదం ఏమీ లేదని, ఉపాధి కోసం వచ్చిన సదరు యువకు ల పొరపాటుతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. మంత్రి కేటీఆర్ చొరవతో వారికి విమాన టికెట్లను సమకూర్చగా మూడు రోజుల్లో ఇండియాకు రానున్నారు. -
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్కుమార్ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్కుమార్, నేత కళాకారుడు -
రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ ఏజెంట్ల మోసంతో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న యువకులు రెండు రోజుల్లో స్వగ్రామాలకు రానున్నారు. విమానాశ్రయంలో ఉన్న యువకులకు మంత్రి కేటీఆర్ బాసటగా నిలిచారు. దుబాయ్లో ఉన్న తెలంగాణకు చెందిన కొందరు మిత్రులను సంప్రదించి.. తన సొంత డబ్బులు వెచ్చించి వారికి వసతులు కల్పించారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న గుగులోతు అరవింద్, బర్దిపురం నరేందర్, గొల్లపల్లి రాము, పెద్దొల్ల స్వామి, తిరుమలేశ్, అనిల్కు అక్కడి కంపెనీ ఎగ్జి ట్ వీసాలు రెండు రోజుల్లో అందేలా మంత్రి చర్యలు తీసు కున్నారు. దుబాయ్ రాయబార కార్యాలయానికి ప్రభు త్వం తరఫున సహాయం కోరుతూ కేటీఆర్ లేఖ రాశారు. -
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గోస
సిరిసిల్ల: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో కొందరు తెలంగాణ యువకులు మోసపోయారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కిన యువకులు ఆదివారం తమ గోడును వీడియో ద్వారా మీడియాకు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన పెద్దోళ్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపెల్లి రాము, చందుర్తి మండలం ఎన్గల్కు చెందిన అనిల్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్పల్లికి చెందిన నరేందర్లు ఐదు నెలల క్రితం కంపెనీ వీసాలపై దుబాయ్ వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్లు ఇండియాలో వీసాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పిన పని కాకుండా.. వేరే లేబర్ పని చేయిస్తున్నారని, చెప్పిన విధంగా జీతం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై కంపెనీలో గొడవ జరిగిందని, ఇటీవల కంపెనీ హెచ్ఆర్ అధికారులు ‘మీరు క్యాంపు నుంచి వెళ్లిపోండి’అంటూ.. పాస్పోర్టులు ఇచ్చారని బాధితులు తెలిపారు. పాస్పోర్టులు చేతికి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విమాన టికెట్కు డబ్బులు తెప్పించుకున్నామని వివరించారు. స్వస్థలాలకు వచ్చేందుకు విమాన టికెట్లు కొనుక్కొని ఎయిర్ పోర్టుకు వస్తే.. బోర్డింగ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ‘మీ మీద కేసులు ఉన్నాయి.. మీరు తాగి క్యాంపులో గొడవ చేశారట.. వాటిని పరిష్కరించుకుని రావాలి’అని విమాన టికెట్లు చింపేసి, వెనక్కి పంపించారని వెల్లడించారు. తమ అందరి లగేజీ ఎయిర్ పోర్టులోనే ఉందని వాపోయారు. మూడురోజులుగా ఎయిర్ పోర్టులోనే.. ఎయిర్ పోర్టులోనే మూడు రోజులుగా ఉంటున్నామని బాధి తులు తెలిపారు. అయితే ఎవరూ స్పందించడం లేదని, తిండి, నీళ్లు లేక ఎయిర్ పోర్టు పరిసరాల్లో కట్టుబట్టలతో గడుపు తున్నట్లు వివరించారు. పోలీసులు వస్తే.. పక్కకు తప్పుకుంటూ.. భయం భయంగా ఉంటున్నామని వాపోయారు. మంత్రి కేటీఆర్కు వినతి ఏజెంట్ల మాటలతో మోసపోయామని, తమను ఇండియాకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ సహకరించాలని వీర్నపల్లికి చెందిన యువకుడు అరవింద్ వీడియోలో కోరారు. దయచేసి తమను ఇంటికి చేరేలా చూడాలని, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామని బాధితులు మంత్రిని వేడుకున్నారు. దుబాయ్లో చిక్కిన తెలంగాణ యువకుల గోడు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
రైతులను కూలీలుగా మార్చే కుట్ర!
సిరిసిల్ల: కేంద్ర ప్రభుత్వం రైతులను కూలీలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రూ.25 వేల కోట్ల రుణాలిస్తామని కేంద్రం చెప్పిందని, అయినా సీఎం కేసీఆర్ రైతుల పక్షానే నిలబడ్డారని చెప్పారు. రాజన్న సిరిసిల్ల పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం వేర్వేరు కార్యక్రమాల్లో 6 వేల మంది విద్యార్థులకు ట్యాబ్లను, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండానే విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్పరం చేసేందుకు సిద్ధమైందని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో టన్ను బొగ్గు రూ.3 వేలకు లభిస్తుంటే.. రూ.35 వేలకు టన్ను విదేశీ బొగ్గును కొనాలని కేంద్రం చెబుతోందని.. ఇదంతా ప్రధాని మోదీ కార్పొరేట్ మిత్రులకు ప్రయోజనం కలిగించేందుకేనని పేర్కొన్నారు. కేంద్ర విద్యుత్ బిల్లు చట్టంగా మారితే రైతులకు ఉచిత కరెంటు, వివిధ వృత్తుల వారికి సబ్సిడీ విద్యుత్ పోతుందని పేర్కొన్నారు. పేదలకు ఉచితాలు రద్దు చేయాలంటున్న మోదీ.. తన కార్పొరేట్ మిత్రులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం ఏమిటని నిలదీశారు. తెలంగాణ వడ్లు కొనాలని కోరితే నాలుగేళ్ల వరకు నిల్వలు ఉన్నాయన్న కేంద్రం.. ఇప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉందనడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు నాలుగు ఎన్నికల్లో పోటీ చేశానని, ఏనాడూ చుక్క మందు పంచలేదని.. పైసా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు సిరిసిల్ల కాలేజీ మైదానంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే 6 వేల మంది ఇంటర్ విద్యార్థులకు కేటీఆర్ ట్యాబ్లను పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తున్నానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఇలా 2020లో రాష్ట్రవ్యాప్తంగా 120 అంబులెన్స్లు పంపిణీ చేశామని, 2021లో 1,200 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, స్కూటీలు అందించామని వివరించారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తున్నామని తెలిపారు. ఇక సిరిసిల్లలో బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన కేటీఆర్.. వస్త్రోత్పత్తిలో సిరిసిల్ల తమిళనాడులోని తిరువూరుకు దీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. నేతన్నల సంక్షేమానికి త్రిఫ్ట్ పథకాన్ని అమలు చేస్తున్నామని.. అర్హులకు పెన్షన్లు, సొంత స్థలమున్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు మంజూరు చేయనున్నామని చెప్పారు. బీజేపీ జోకర్లకు దమ్ము లేదు: కేటీఆర్ ‘మనకు న్యాయబద్ధంగా రావాల్సిన హక్కుల గురించి నిలదీసేందుకు తెలంగాణకు చెందిన ఒక్క బీజేపీ జోకర్కు కూడా దమ్ములేదు. గుజరాత్ బాస్ల చెప్పులు మోసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండే వీరికి తెలంగాణ హక్కుల గురించి నిలదీసి డిమాండ్ చేసే ధైర్యం లేదు’అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’మూలంగా తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ ఆస్కార్ బరిలో నిలవలేకపోయిందని వచ్చిన ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ మోదీ నామస్మరణకు గుజరాత్ కేంద్రంగా నిలుస్తోందని ట్విట్టర్లో మండిపడ్డారు. ‘సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది’అంటూ రెండురోజుల క్రితం బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ ట్విట్టర్లో మండిపడ్డారు. ‘లక్ష్మణ్ గారూ.. ఎవరి సొమ్ముతో మీరు సోకులు పడుతున్నారు. తెలంగాణ సొమ్ముతో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తర్ప్రదేశ్ సోకులు పడుతున్నది. దేశాభివృద్ధికి తెలంగాణ దోహద పడుతున్నందుకు కృతజ్ఞతలు తెలపండి. లెక్కలు తెలుసుకోండి, ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం. కానీ, ప్రజలను మభ్యపెట్టకండి’అని వ్యాఖ్యానించారు. ‘కరువుపీడిత నేలగా ఉన్న తెలంగాణ ఈ రోజు 1.35 లక్షల ఎకరాల మాగాణం అయింది. నాడు సాగునీరు సరిపడాలేక నెర్రలు బారిన నేల నేడు పచ్చని పైర్లతో కళకళలాడుతూ నూతన రికార్డులు సృష్టిస్తోంది. రైతుబంధు, నిరంతర విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతోంది’అని.. ‘పంటలు ఫుల్’శీర్షికతో గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. -
Telangana: కోటి మందికి బతుకమ్మ చీరల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ చీరలను రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ చీరల పంపిణీ జరిగేలా చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు కోటి చీరల పంపిణీ లక్ష్యంగా నిర్దేశించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ చీరల తయారీకి రూ.339.73 కోట్లు వెచ్చించింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది 24 విభిన్న డిజైన్లు, ఆకర్షణీయమైన రంగుల్లో మొత్తం 240 రకాల జరీ అంచులతో (త్రెడ్ బోర్డర్) తెలంగాణ టెక్స్టైల్ విభాగం ఈ చీరలను తయారు చేయించింది. గ్రామీణ ప్రాంతాల మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తిని పరిగణనలోకి తీసుకొని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహకారంతో డిజైన్లను రూపొందించారు. అత్యుత్తమ ప్రమాణాలతో చీరలను ఉత్పత్తి చేశారు. రెండు విభిన్న పొడవుల్లో చీరలను తయారు చేయించగా, ఇందులో ఆరు మీటర్ల చీరలు 92 లక్షలు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వయోవృద్ధ మహిళలు ధరించే 9 మీటర్ల పొడవైన చీరలు ఎనిమిది లక్షలు తయారు చేయించినట్లు చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డు కలిగి, 18 ఏళ్లు పైబడిన మహిళలకు అందజేయనున్నారు. బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగు: కేటీఆర్ తెలంగాణ ఆడపడుచులకు ప్రేమపూర్వక చిరుకానుక ఇచ్చేందుకు 2017లో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు వెల్లడించారు. గురువారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. సంక్షోభంలో చిక్కుకున్న నేత కార్మికులకు బతుకమ్మ చీరల తయారీతో భరోసా వచ్చిందన్నారు. నేతన్నల వేతనాలు రెట్టింపు కావడంతో పాటు కార్మికులు తమ కాళ్లపై తాము నిలబడే పరిస్థితికి చేరుకున్నారని తెలిపారు. నేత కార్మికులు ఏడాది పొడవునా ఉపాధి పొందేందుకు ఈ పథకం దోహదం చేసిందన్నారు. సమైక్య రాష్ట్రంలో దెబ్బతిన్న నేత కార్మికులను ఆదుకునేందుకు సొంత రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ వంటి విధానాలతో వారి ఉపాధిని క్లిష్టతరం చేస్తోందన్నారు. 2017 నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇదీ చదవండి: టెర్రర్ ఫండింగ్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ తనిఖీలు -
కేటీఆర్ ఇలాకాలో సంచలనం.. టీఆర్ఎస్ నేతల వేధింపులు భరించలేక..
తంగళ్లపల్లి (సిరిసిల్ల): ‘టీఆర్ఎస్ నాయకులు వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. డబ్బుల కోసం వేధిస్తున్నారు’ అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లికి చెందిన మ్యాన పద్మ ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకపోతున్నానని, తనకు చావే శరణ్యమంటూ బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. వివరాల ప్రకారం.. బాధితురాలు పద్మ బద్దెనపల్లిలో కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తనకున్న స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా.. స్థానిక టీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు ఆమె నుంచి పెట్రోల్ బాటిల్ను లాగేశారు. -
టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రవీణ్
సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ను తెలంగాణ పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్లకు చెందిన గూడూరి ప్రవీణ్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గతంలో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్గా, సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) వైస్ చైర్మన్గా, ‘సెస్’పర్సన్ ఇన్చార్జిగా ఆయన పనిచేశారు. -
హమ్మాయ్యా! టెన్షన్ పోయింది.. కేసీఆర్ హామీతో ఎమ్మెల్యేల్లో ఉత్సాహం
సాక్ష, కరీంనగర్: ‘ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మనకు 90 సీట్లు పక్కా.. ఇప్పటికే నలభై, యాభై సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ప్రజలతో, పార్టీ క్యాడర్తో మమేకమయ్యే వారికి ఎప్పుడూ ఢోకా ఉండదు. టికెట్ల విషయంలో బెంగ వద్దు, మనం గతంలోనూ పెద్దగా మార్చుకోలేదు. మార్చడం నాకు ఇష్టం ఉండదు. అలాగని గిట్లనే ఉంటం అంటే కుదరదు. ఏం చేసినా సరే అంటే కూడా చెల్లదు.. తప్పదంటే ఓ నాలుగైదు సీట్లు మార్చాల్సి వస్తదేమో’ అంటూ సీఎం కేసీఆర్ ఈనెల 3న తెలంగాణ భవన్లో జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశనం చేయడంతో తాజా ఎమ్మెల్యేల్లో ఆనందం వ్యక్తమవుతుండగా టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు గుబులు పట్టుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ పార్టీల హడావిడి నెలకొంటున్న తరుణంలో సీఎం కేసీఆర్ పాతవారికే టికెట్లు, పెద్దగా మార్పులేమి ఉండవంటూ ఇచ్చిన హామీతో కార్యకర్తల్లో నయా జోష్ నెలకొంది. ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి, బలబలాలు, విజయావకాశాలపై కొన్నాళ్లుగా ప్రశాంత్కిషోర్(పీకే) టీం సభ్యుల రకరకాల నివేదికలు అధిష్టానానికి అందాయనే ఊహగానాల నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు ఉండగా మంథనిలో కాంగ్రెస్ నుంచి శ్రీధర్బాబు, హుజూరాబాద్లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీఎం హామీతో మిగతా 11 నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కే అవకాశాలు మెండుగా ఉండడంతో వారి అనుయాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న చోటామోటా నేతలంతా తమకు మొండిచేయి తప్పదనే మీమాంసలో పడ్డారు. కరీంనగర్ నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్న మాజీ మేయర్ రవీందర్సింగ్ లాంటి ఆశావహులు గులాబీ బాస్ ప్రకటనతో డీలాపడ్డారు. కరీంనగర్ జిల్లా! కరీంనగర్: కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 2009లో టీడీపీ, 2014–2018లో టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకుని, 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చొప్పదండి: 2018లో అనూహ్యంగా తెరమీదకు వచ్చిన సుంకె రవిశంకర్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా సీఎం హామీతో ఈయనకు రెండోసారి బెర్త్ ఖరారైంది. మానకొండూరు: సాంస్కృతిక సారథి చైర్మన్గా కొనసాగుతున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ 2014 నుంచి వరుసగా గెలుపొందారు. ఈసారి కూడా ఇతన్నే అధిష్టానం బరిలో దించనుంది. హుస్నాబాద్: 2014 నుంచి ఇక్కడ వొడితెల సతీశ్బాబు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఇక్కడ ఇతనే పోటీలోకి దిగుతారు. హుజురాబాద్: గతంలో ఇక్కడ టీఆరెఎస్ ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఏడాది క్రితం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయనపై గులాబీ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్యాదవ్ పోటీ చేశారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా! సిరిసిల్ల: సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా 2004 నుంచి కేటీఆర్ విజయపరంపర కొనసాగిస్తున్నారు. 2014 నుంచి మంత్రిగా బాధ్యతలు చేపట్టి తన వైవిధ్యత, ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వేములవాడ: 2009 నుంచి ఇక్కడ చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రమేశ్ భారతీయ పౌరుడు కాదంటూ ప్రత్యర్థి ఆది శ్రీనివాస్ ఈయనపై న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా! ధర్మపురి: టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న కొప్పుల ఈ శ్వర్ «2014 «నుంచి ధర్మపురి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఓట్ల లెక్కింపులో పారదర్శకత లేదని వేసిన కేసు న్యాయస్థానంలో నడుస్తోంది. జగిత్యాల: ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ 2014లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయారు. తర్వాత 2018లో అతడిపైనే సంజయ్ విజయం సాధించారు. పార్టీ ప్రకటనతో ఈసారి కూడా ఆయనకే టికెట్ దక్కనుంది. కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్రావు 2009 నుంచి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అధిష్టానం ఇతనికే టికెట్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయినా, ఈసారి ఇతని తరఫున ఆయన కుమారుడు సంజయ్ బరిలో దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లా! పెద్దపల్లి: ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా దాసరి మనోహర్రెడ్డి 2014 నుంచి కొనసాగుతున్నారు. ఈసారి ఆయన కోడలు, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం సాగుతోంది. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 2018లో ఏఐఎఫ్బీ నుంచి గెలిచారు. తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్దపల్లి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటిపై ఇటీవల ఆర్ఎఫ్సీఎల్ కొలువుల స్కాంలో విమర్శలు వచ్చాయి. మంథని: పుట్ట మధుకర్ ఇక్కడ 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి దుద్ధిళ్ల శ్రీధర్బాబు చేతిలో ఓడిపోయారు. రాష్ట్రంలో సంచలనం రేపిన న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్గా కొనసాగుతున్నారు. -
నేతన్నల బీమాకు వీడిన చిక్కు
సిరిసిల్ల: రైతుల తరహాలో నేత కార్మికులకోసం ప్రకటించిన నేతన్నబీమా పథకంలో ఆంక్షలను తొలగించారు. నేతకార్మికులకు బీమా త్రిఫ్ట్(పొదుపు) పథ కంలో చేరితేనే వర్తిస్తుందనే నిబంధనను ప్రభుత్వం తొలగించింది. త్రిఫ్ట్లో చేరకున్నా అర్హులైన నేత కార్మికులకు, అనుబంధ రంగాల్లో పనిచేసేవారికి బీమా వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులకిందట జీవో జారీ చేసింది. దీంతో త్రిఫ్ట్తో సంబంధం లేకుండా 18–59 ఏళ్ల మధ్య వయసు న్న కార్మికులకు నేతన్నబీమా స్కీం వర్తించనుంది. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వమే ఏటా రూ.5,425 ప్రీమియాన్ని ఎల్ఐసీకి చెల్లించి బీమా కల్పించనుంది. ఎలాంటి కారణంతో మరణించినా, వారి కుటుంబంలోని నామినీకి రూ.5 లక్షల బీమా సొమ్ము లభిస్తుంది. 2021 జూలై 4న సిరిసిల్లలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రకటించారు. ‘సాక్షి’ మెయిన్లో ఆగస్ట్ 21న ప్రచురితమైన కథనం 2022 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దీనికి మార్గదర్శకాలు జారీచేశారు. నేతన్నలకు బీమా పథకంతో రాష్ట్రంలోని సిరిసిల్ల, దుబ్బాక, నారాయణపేట, యాదాద్రి, నల్లగొండ, కరీంనగర్, భువనగిరి, జనగామ, గద్వాల, భూదాన్ పోచంపల్లి ప్రాంతాల్లోని నేతన్నలకు లబ్ధి కలగనుంది. అయితే ఆంక్షలు అడ్డంకిగా మారాయని ‘సాక్షి’లో ఆగస్టు 21న ప్రచురితమైన ‘నేతన్నల బీమాకు నిబంధనల చిక్కు’ కథనంపై స్పందించిన కేటీఆర్ జౌళిశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి త్రిఫ్ట్తో లింకును తొలగించారు. తాజా ఆదేశాల నేపథ్యంలో అర్హతలున్న నేతన్నలందరికీ బీమా కల్పిస్తామని జౌళిశాఖ ఏడీ సాగర్ తెలిపారు. -
అధ్యాపకురాలి క్రూరత్వం.. ఆస్పత్రి పాలైన విద్యార్థిని
వేములవాడ అర్బన్: సెలవుపై ఇంటికెళ్లిన విద్యార్థిని తిరిగి కళాశాలకు ఆలస్యంగా వచ్చిందంటూ ఓ అధ్యాపకురాలు ఆమెపట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఐదు రోజులపాటు తరగతి గది బయట 8 గంటల చొప్పున నిలబెట్టడంతో నడవలేని స్థితికి చేరి, ఆదివారం ఆసుపత్రి పాలైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటకు చెందిన మద్దెల నిహారిక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళాడిగ్రీ కళాశాలలో బీకాం మూడో సంవత్సరం చదువుతోంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న నిహారిక ఈ నెల 18న ఒకరోజు సెలవుపై ఇంటికెళ్లి 22న తిరిగొచ్చింది. ఆలస్యంగా వచ్చిందంటూ నిహారికపై అధ్యాపకురాలు మహేశ్వరి కఠినంగా వ్యవహరించింది. ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు క్లాస్లోకి అనుమతించకపోగా నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట నిలుచోబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని నడవలేని స్థితికి చేరింది. ఈ విషయం హాస్టల్ ఇన్చార్జి దృష్టికి వెళ్లడంతో ఆదివారం ఉదయం వేములవాడ ఏరియా ఆస్పత్రికి నిహారికను తరలించి వైద్యసేవలు అందించారు. దీనిపై కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్యామలను వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందన్నారు. కాగా, ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందిస్తూ అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ప్రిన్సిపాల్పైనా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
తల్లిని చిత్రహింసలు చేస్తున్న తండ్రిపై ఫిర్యాదు చేసిన బాలుడు
-
ఐదోసారికి కేటీఆర్ సిద్ధం.. వేములవాడ నుంచి బండి సంజయ్ బరిలోకి?
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక ప్రాంతం రామగుండంలో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా మూడు ప్రధాన పార్టీలు అప్పుడే నువ్వా నేనా అన్నట్టు ప్రచారబరిలోకి దిగాయి. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. కారు జోరుకు బ్రేకులు వేయాలని కాంగ్రెస్, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. సింగరేణి కార్మికులే ఇక్కడ గెలుపోటములు డిసైడ్ చేస్తారు. ఎత్తుకు పై ఎత్తులు రామగుండం నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా ఎగురవేసేలా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మరోవైపు గులాబీ పార్టీ ఎత్తుకు బీజేపీ పై ఎత్తులు వేస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఈ సారి ఎలాగైనా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఓటరు దేవుళ్ళను ప్రసన్నం చేసుకునేందుకు అప్పుడే ఇంటింటికి తిరుగుతూ ప్రచారం మొదలుపెట్టేశారు మూడు పార్టీల నాయకులు. టీఆర్ఎస్లో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ రానున్న ఎన్నికలు సవాల్తీగాసుకుని తమ పంతం నెగ్గించుకునేలా పావులు కదుపుతున్నారు. సింగరేణి కార్మికులదే రామగుండం నియోజకవర్గంలో గోదావరిఖని పట్టణం, రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు ఉంటాయి. సింగరేణి కార్మికులు మొత్తం గోదావరిఖని 8 ఇంక్లైన్ కాలనీల్లో ఉంటారు. ఇక్కడ కార్మికుల కుటుంబాలు, మహిళా ఓటర్లు ఎక్కువ. సింగరేణి కార్మికులు యూనియన్ల పరంగా పోటాపోటీగా ఉంటాయి. కారుణ్య నియామకాలు, పేరు మార్పిడి జీఓ, బోనస్ లాంటి అంశాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. పింఛన్లు టీఆర్ఎస్కు అనుకూలమే. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే చందర్ అనుచరుల తీరు వల్ల కొంత ఇబ్బంది ఉంటుందనే చర్చ నడుస్తోంది. గతంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ది కలిసి వస్తుందని బీజీపీ నేత సోమారపు భావిస్తున్నారు. చదవండి: పార్టీకి గుడ్బై! గులాం నబీ ఆజాద్పై కాంగ్రెస్ సీనియర్ నేతల సెటైర్లు ద్విముఖ పోటీనే మంథని నియోజకవర్గం పేరు వినగానే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నియోజక వర్గంలోనిదే. మహాదేవ్ పూర్ ప్రాంతం భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లడంతో కాళేశ్వరం ఆలయం, మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మి పంపు హౌజ్ ఉన్న ప్రాంతాలు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. పార్వతీ బ్యారేజ్ సరస్వతీ పంపు హౌజ్ మంథని నియోజక వర్గంలోనే ఉన్నాయి. ఎన్నికలు మరో ఏడాదిలో జరిగే అవకాశాలు కన్పిస్తుడంతో రాజకీయ నాయకులు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నారు. అనేక ఏండ్లుగా ఇక్కడ ద్విముఖ పోటీనే ఎక్కువగా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కొసాగుతోంది. కానీ ఈసారి మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో త్రిముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీధర్బాబుపై అసంతృప్తి మంథని నియోజకవర్గంలో శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున మూడు సార్లు ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై శ్రీధర్బాబు విజయం సాధించారు. నాటి నుంచి నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉన్నారు. అక్కడక్కడ అయనపై ఇంకా అసంతృప్తి కన్పిస్తోంది. కార్యకర్తల ఫోన్లు లిఫ్ట్ చేయరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు శ్రీధర్బాబు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరు ఖరారు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన చందుపట్ల బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అధిష్టానం దృష్టిలో వడినట్లు సమాచారం. పుట్టమధుపై ఆరోపణలు న్యాయవాది వామన్ రావు హత్య విషయంలో టీఆర్ఎస్నేత, జడ్పీ చైర్మన్ పుట్ట మధుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ వద్దే ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తమకు ఇబ్బందులే తప్ప ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. ఈ రెండు అంశాలు గులాబీ పార్టీకి మైనస్అని భావిస్తున్నారు. పుట్ట మధు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు సన్నిహితంగా ఉంటారనే టాక్ ఉంది. గులాబీ పార్టీ టికెట్ రాకపోతే పుట్ట మధు బీజేపీలోకి వెళ్ళవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. రెండుసార్లు పట్టం వరుసగా రెండుసార్లు ఏ పార్టీని ఆదరించని పెద్దపల్లి ప్రజలు ఒక్క టీఆర్ఎస్కు మాత్రమే రెండుసార్లు పట్టం కట్టారు. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నందున ఈసారి అధిష్టానం టికెట్ ఇవ్వదని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. టిక్కెట్ఇవ్వని పక్షంలో తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని మనోహర్ రెడ్డి చెబుతున్నట్లు సమాచారం. బండి సంజయ్ వర్గీయుడికి టికెట్? ఇక కాంగ్రెస్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయిన చింతకుంట విజయరమణారావు ఈసారయినా గెలిచి తీరాలనే పట్టుదలగా ఉన్నారు. అయితే ఆయనకు జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఓదెల ఎంపిపి గంట రాములు పక్కలో బల్లెంలా తయారయ్యారని టాక్. పెద్దపల్లిలో పోటీలో ఉండే కమలనాధులెవరనే ప్రశ్న వినిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ అనుమానమేనంటున్నారు. బండి సంజయ్ వర్గీయుడు ప్రదీప్ రావుకు పెద్దపల్లి టికెట్ ఇవ్వచ్చని సమాచారం. 100 కోట్ల ఆదాయం వస్తున్నా అభివృద్ధి సున్నా దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజ రాజేశ్వర స్వామి కొలువై ఉన్న నియోజక వర్గ కేంద్రం అది. ఏడాదికి 100 కోట్ల ఆదాయం వస్తున్నా రాజన్న ఆలయం అభివృద్ధి కాలేదు. నియోజక వర్గం కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. స్వయానా సీఎం కేసీఆర్ ప్రకటించిన టెంపుల్ మాస్టర్ ప్లాన్ కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక్కడ 2009 నుంచి చెన్నమనేని రమేష్ బాబు గెలుస్తూ వస్తున్నారు. రమేష్ బాబుకు జర్మనీ పౌరసత్వం ఉండేది. దీనిపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఫిర్యాదు చేయడంతో కోర్టులోను, కేంద్ర హోమ్ శాఖ ఆధ్వర్యంలో కూడా విచారణ జరుగుతోంది. పోటీలోకి మాజీ గవర్నర్ కొడుకు! సీనియర్ కాంగ్రెస్ నేత చల్మెడ లక్ష్మీ నరసింహా రావు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వేములవాడ టీఆర్ఎస్ టికెట్ చల్మెడకే అనే టాక్ వినిపిస్తోంది. మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కొండ దేవయ్య కూడా టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన సీహెచ్. విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ పోటీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని సిరిసిల్ల అనగానే చేనేత.. సీనియర్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరావు గుర్తుకు వస్తారు. ఇప్పుడు మంత్రి కేటీఆర్ పేరు వినగానే సిరిసిల్ల గుర్తుకు వచ్చే పరిస్తితి వచ్చింది. చెన్నమనేని రాజేశ్వరావు లాగే కేటీఆర్ కూడా సిరిసిల్లలో నాలుగు సార్లు గెలుపొందారు. ఐదోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు కేటీఆర్. కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్తోపాటు మంత్రి కావడం, ముఖ్యమంత్రి కుమారుడు కావడం సిరిసిల్లకు కలిసి వచ్చింది. ఎన్నడూ లేని విధంగా సిరిసిల్లలో నేత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతోంది. సిరిసిల్లలో చాలా అభివృద్ధి పనులు కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసారి కూడా కేకేనే సిరిసిల్ల టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకుల్లో కుమ్ములాటలు జనాల్లో పార్టీకి చెడ్డపేరు తెస్తోంది.. నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన కకేకే మహేందర్రెడ్డి 171 ఓట్ల స్వల్ప తేడాతో కేటీఆర్ చేతిలో ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్తరపున పోటీచేసినా ఓడారు. కేకేకు కాంగ్రెస్ నేతల నుంచి సహాయ నిరాకరణ కొనసాగుతూనే ఉంది. ఈసారి కూడా కేకే మహేందర్ రెడ్డినే పోటీకి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఇక సిరిసిల్లలో బీజేపీ పుంజుకుంటోంది. ఈసారి బీజేపీ తరపున మృత్యుంజయం లేదా జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పోటీ చేస్తారని తెలుస్తోంది. -
సార్.. మా నాన్న తాగొచ్చి అమ్మను కొడుతున్నడు..
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల):‘సార్ మా నాన్న రోజూ తాగొచ్చి అమ్మను, నన్ను, చెల్లిని కొడుతున్నడు.ఎందుకు కొడుతున్నడో ఏమో..’ అమ్మే పనికి పోతది.. మాకు బువ్వ పెడుతది. అమ్మ దగ్గరున్న పైసలు గుంజుకుని రోజూ పొద్దున్నే తాగుతున్నడు.. ఇంటికొచ్చి కొడుతున్నడు..’ అంటూ ఎనిమిదేళ్ల బాలుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జంగం భరత్ (8) అంబేడ్కర్నగర్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. తన తండ్రి తీరుకు విసిగిపోయి గురువారం ఉదయం ఒక్కడే స్థానిక పోలీస్స్టేషన్కు వచ్చాడు. బాలుడి ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ భరత్ తల్లిదండ్రులు దీపిక, బాలకిషన్ను పోలీస్స్టేషన్కు పిలిపించారు. బాలకిషన్కు తెలిసిన డ్రైవింగ్ పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలకిషన్ వేధింపులను భార్య దీపిక కూడా కన్నీటిపర్యంతమవుతూ ఎస్ఐకి వివరించింది. పిల్లలను బాగా చదివించాలని, తాము అండగా ఉంటామని ఎస్ఐ భరోసా ఇచ్చారు. భరత్ను హాస్టల్లో చేర్పిస్తాననగా.. తాను గురుకులంలో సీటు సాధిస్తానని.. పోలీస్ కావడమే తన లక్ష్యమని చెప్పడం విశేషం. చిన్న వయస్సులోనే సమస్య పరిష్కారానికి వచ్చిన బాలుడిని ఎస్సైతో పాటు అక్కడున్న సిబ్బంది అభినందించారు. చదవండి: హయత్ నగర్లో దారుణం.. టీచర్ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య -
మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వండి
సిరిసిల్ల: సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు ప్రధాని, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగించారు. టెక్స్టైల్ రంగంపై విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. నేత కార్మికులకు బాసటగా నిలిచేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, చేనేత, పవర్లూమ్ కార్మికులు ఏ కారణంగా మరణించినా వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందుతుందని అన్నారు. రాష్ట్రంలో 80 వేలమంది నేత, పవర్లూమ్ కార్మికులకు బీమాసౌకర్యం లభిస్తుందని తెలిపారు. పవర్లూమ్ కార్మికులకు రూ.2,500 కోట్ల బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్, స్కూల్ యూనిఫారాల వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చామని వివరించారు. ప్రభుత్వ ఆర్డర్లతో నేత కార్మికులు మెరుగైన ఉపాధి పొందుతున్నారని, వారికి పొదుపు(త్రిఫ్ట్) పథకాన్ని కూడా అమలు చేస్తున్నామని వివరించారు. సిరిసిల్ల శివారుల్లోని 60 ఎకరాల్లో రూ.174 కోట్లతో నిర్మిస్తున్న అపెరల్ పార్క్ పూర్తయితే గార్మెంట్ రంగంలో 8 వేలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. మధ్యమానేరు జలాశయంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులతో 10 వేలమందికి ఉపాధినిచ్చేలా 367 ఎకరాల్లో ఆక్వాహబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. 12 రాష్ట్రాలకు సిరిసిల్ల జెండాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ రెండు వేలమంది సిరిసిల్ల నేతన్నలు ఐదువేల మగ్గాలపై కోటి 20 లక్షల జాతీయజెండాలను తయారు చేశారని కేటీఆర్ అన్నారు. రూ.5 కోట్ల విలువైన జాతీయ జెండాలను 12 రాష్ట్రాలకు అందించారని అభినందించారు. మండెపల్లి వద్ద 12 బ్యాచ్ల్లోని 332 మందికి అత్యుత్తమ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి 139 మందికి ప్లేస్మెంట్ కల్పించినట్లు తెలిపారు. కాలునొప్పితోనే మంత్రి కేటీఆర్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. కుర్చిలో కూర్చునే ప్రసంగించారు. మంత్రి ప్రయాణిస్తున్న వ్యాన్ మొరాయించడంతో నిర్ణీత సమయం కంటే 35 నిమిషాలు ఆలస్యంగా సిరిసిల్లకు చేరుకున్నారు. అనంతరం సిరిసిల్ల నేతకార్మికులు మంత్రి కేటీఆర్ను నూలుపోగుల దండతో సత్కరించారు. మూడు అంశాలతో ముందుకు... తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరణలకు వేదికైందని, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్టక్చర్, ఇంక్లుజివ్ గ్రోత్ అనే మూడు అంశాలపై ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2022ను కేటీఆర్ ప్రారంభించారు. 33 జిల్లాల ఆవిష్కర్తలతో జరిగిన గూగుల్మీట్లో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందన్నారు. టీ–హబ్, వీ–హబ్, అగ్రీ–హబ్, కే–హబ్, బీ–హబ్ వంటి అనేక కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం వేదికగా నిలుస్తుందని కేటీఆర్ వివరించారు. -
చీర్లవంచ వద్ద భారీ వారధి! రాజమండ్రి తరహాలో డబుల్ వంతెనకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ వద్ద మిడ్మానేరు ప్రాజెక్టు మీదుగా భారీ వారధి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో గోదావరినదిపై రాజమండ్రి వద్ద నిర్మించిన భారీవంతెనను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని నిర్మించతలపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ నిర్మాణ బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం.. వంతెన నిర్మాణ డిజైన్లను ఇప్పటికే సీఎం కేసీఆర్కు చూపించడం, ఆయన కొన్నిటికి సూత్రప్రాయ అంగీకారం తెలిపిన నేపథ్యంలో ప్రాజెక్టు పనిని ప్రారంభించారు. డబుల్ వంతెన, ఆకట్టుకునే రూపం! ఈ వంతెన రాష్ట్రంలో మిగిలిన వంతెనల కంటే భిన్నంగా, నాణ్యమైనదిగా, డిజైన్లో ఆకట్టుకునేలా ఉంటుందని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. వంతెన రెండు అంతస్తులుగా ఉంటుందని, పైభాగంలో బస్సులు, లారీలు తదితరాలు వెళ్లేందుకు రోడ్డుతో కూడిన మార్గం, కింద కొత్తపల్లి–మనోహరాబాద్ రైలు వెళ్లేలా ప్రత్యేక రైల్వేట్రాక్తో వంతెన నిర్మిస్తామన్నారు. కేంద్రంతోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎం కూడా దీని నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి సైతం ఎంతో దోహదపడుతుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. రాజమండ్రి వారధిలో కింద ఉన్న రైలు వంతెన 2.8 కి.మీ.లు, కాగా పైనున్న రోడ్డు వంతెన 4.1 కి.మీ. ఉంటుంది. చీర్లవంచ వంతెనలో రైలు, రోడ్డు వంతెన ఎన్ని మీటర్లు ఉంటుందన్న సాంకేతికాంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. డబుల్ వంతెన కడితే బహుళార్థ సాధక ప్రాజెక్టు అవుతుందన్న సీఎం కేసీఆర్ సూచనలతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఈ బ్రిడ్జి పనులకు దాదాపుగా అన్నిరకాల అనుమతులు వచ్చినట్లే. ప్రభుత్వం ఆగస్టు 15న ప్రకటించనున్న అనంతరం టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. -
27 రకాల సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీర
సిరిసిల్ల: అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నల్ల పరంధాములు తనయుడు నల్ల విజయ్కుమార్ పరిమళించే పట్టు చీరను రూపొందించారు. విజయ్కుమార్ ఇప్పటికే తండ్రి పరంధాములు స్ఫూర్తితో అనేక ప్రయోగాలు చేశారు. తాజాగా 27 రకాల సుగంధ ద్రవ్యాలను కలిపిన ద్రావణంలో పట్టు పోగులను ఉడకబెట్టి పవర్లూమ్పై పట్టు చీరను నేశాడు. సుగంధ ద్రవ్యాల ప్రభావంతో ఆ చీర పరిమళిస్తోంది. చీర ఐదున్నర మీటర్ల పొడవు, 46 ఇంచీల వెడల్పు, 400 గ్రాముల బరువుంది. నాలుగు రోజులపాటు శ్రమించి నేసిన ఈ చీర తయారీకి రూ.12 వేలు ఖర్చయినట్లు విజయ్కుమార్ తెలిపారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. (క్లిక్: డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి) -
పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న!
సాక్షి, సిరిసిల్ల/బోధన్/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి నేత కూర రాజన్న (80) అలియాస్ కేఆర్ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు. వయోభారంతో రాజన్న అనారోగ్యంతో ఉన్నారని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఏనుగు ప్రభాకర్రావు అలియాస్ వేణుగోపాల్రావు హత్యకేసులో కూర రాజన్న నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన రాజన్న, జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. కానీ.. మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్నపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ జనశక్తి సాయుధ దళాలను నిర్మించేందుకు రాజన్న ఆయుధాలు సమకూర్చుకుంటున్నట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెడతారని భావిస్తున్నా... రాజన్న అరెస్ట్పై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా... జిల్లాలోని వేములవాడకు చెందిన కూర రాజన్న నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో విచారించాలి.. పోలీసులు అరెస్టుచేసిన సీపీఐఎం ఎల్ జనశక్తి నేత కూర రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విచారించాలని మానవహక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఇతరుల సహాయం లేకుండా నడవ లేని, శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్నాడని వైద్యుల పర్యవేక్షణలో, రాజన్న ఏర్పాటు చేసుకున్న న్యాయవాది సమక్షంలో విచారించాలని సంస్థ అధ్యక్షులు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. -
నేతన్నలకు ‘జెండా’ పండుగ
పవర్లూమ్స్పై పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్న ఇతని పేరు మామిడాల సమ్మయ్య. సిరిసిల్లలోని విద్యానగర్కు చెందిన సమ్మయ్య నిత్యం 12 సాంచాలపై పనిచేస్తూ పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సమ్మయ్యకు వారానికి రూ.2,500 కూలి వస్తుంది. ఇలా ఒక్క సమ్మయ్యనే కాదు.. సిరిసిల్లలో 5 వేల మంది కార్మికులు శ్రమిస్తున్నారు. జాతీయ జెండాల తయారీపని చేస్తున్న వీరు సిరిసిల్లకు చెందిన మహిళలు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అందుకు అవసరమైన జెండాలను సిరిసిల్లలో సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్లలో జెండాలు తయారుచేసే పది మంది వ్యాపారులు ఢిల్లీ సహా వివిధ రాష్ట్రాలకు జెండాలను సరఫరా చేస్తున్నారు. సిరిసిల్ల: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా.. మహనీయు ల త్యాగాలు.. పోరాటఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతి ఇంటిపై జాతీయజెండాను ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15కి ముందు వారం, తరువాత మరో వారం రోజులు భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కోద్వారా కొ నుగోలుచేసి, ఆ వస్త్రాన్ని ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారుచే యాలని నిర్ణయించారు. ఈ మేరకు సిరిసిల్ల నేతన్నల వద్ద 30 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొ నేందుకు టెస్కో ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్లలో 30 లక్షల మీటర్ల వస్త్రం కొనుగోలు.. తెలంగాణవ్యాప్తంగా 38,588 పవర్లూమ్స్ ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్లూమ్స్ ఉన్నాయి. 4,116 సాంచాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలతో (18) సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో కొనుగోలు చేస్తోంది. సిరిసిల్లలోనే 30 లక్షల మీటర్లు కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వస్త్ర నాణ్యత, పొడవు, వెడల్పును బట్టి రూ.13 నుంచి రూ.16 వరకు ఒక్కో మీటరుకు చెల్లించాలని నిర్ణయించారు. సిద్ధమవుతున్న జెండాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి సిరిసిల్లకు ఆర్డర్లు వచ్చాయి. దీంతో జెండాలు తయారుచేసే వ్యాపారులు బిజీగా మారా రు. ఇక్కడి పది మంది వ్యాపారులకు 50 లక్షల జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. వీటి ద్వారా 1,200 మంది మహిళలు జెండాలు కుడుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది అనుకోని ఆర్డర్ టెస్కో ద్వారా పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేస్తారని తెలియదు. ఇది అనుకోని ఆర్డర్. నాకు 52 సాంచాలు ఉన్నాయి. నా వద్ద నిల్వ ఉన్న 50 వేల మీటర్ల వస్త్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నా. టెస్కో కొనుగోలు చేయడం ఆనందంగా ఉంది. – కోడం విజయ్, వస్త్రోత్పత్తిదారుడు, సిరిసిల్ల ఢిల్లీకి 5 లక్షల జెండాలు ఇస్తున్నా.. నాకు ఢిల్లీ నుంచి జూలై 10న ఐదు లక్షల జెండాల ఆర్డర్లు వచ్చాయి. కొంచెం ముందుగా ఆర్డర్లు వస్తే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా రాష్ట్రాల ఆర్డర్లు వస్తున్నాయి. కానీ సమయం సరిపోదు. నా వద్ద ఓ 50 మంది ఉపాధి పొందుతున్నారు. – ద్యావనపల్లి మురళి, వ్యాపారి, సిరిసిల్ల నెలకు రూ.6 వేలు సంపాదిస్తున్న నేను బీడీలు చేసిన. ఆ పని కష్టంగా ఉండటంతో జెండాలు కుట్టడం, ప్యాకింగ్ చేయడం చేస్తున్న. నెలకు రూ.6వేలు సంపాదిస్తున్న. మా ఆయన సాంబశివ సాంచాలు నడుపుతారు. మాకు ఇద్దరు పిల్లలు. ఈ పని బాగుంది. నాలాగే చాలా మంది ఈ పని చేస్తున్నారు. – వెల్దండి శైలజ, సిరిసిల్ల -
నిరుద్యోగులకు ప్రైవేటు కొలువులిప్పిస్తున్నాం
సిరిసిల్ల: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 8 లక్షలే నని, అందువల్ల నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కలిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం బీసీ స్టడీ సర్కిల్ను కేటీఆర్ సందర్శించి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. జిల్లా ఆస్పత్రిలో పిల్లల వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లా డుతూ.. రాష్ట్రంలో తమ తొలి విడత ఐదేళ్ల పాలనలో 1.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని, ప్రస్తుత రెండో దఫా పాలనలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. దేశంలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో 35 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగార్థులందరూ సెల్ఫోన్ పక్కనపెట్టి అంకితభావంతో చదివితే రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో మరో 134 స్టడీసర్కిళ్లను సీఎం మంజూరు చేసినట్లు కేటీఆర్ గుర్తుచేశారు. ప్రతిభ ప్రాతిపదికనే ఉద్యోగాల భర్తీ ఉంటుందన్నారు. అభ్యర్థులు అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ చోదకశక్తిగా ఎదిగింది.. తెలంగాణ తలసరి ఆదాయం, జీఎస్డీపీ రెట్టింపు అయిందని.. దేశాన్ని సాదుతున్న రాష్ట్రంగా, ఆర్థిక చోదకశక్తిగా ఎదుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే.. ఇప్పుడు రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. ఇవి ఆర్బీఐ చెప్పిన లెక్కలని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో దేశానికి ట్యాక్సుల రూపంలో రూ.3,65,797 కోట్లు రాష్ట్రం నుంచి ఇచ్చామన్నారు. కేంద్రం నుంచి రూ.1,68,000 కోట్లు తిరిగి తెలంగాణకు వచ్చాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉండాల్సిన కేంద్రం అడుగడుగునా వివక్ష చూపతోందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతి ప్రజాస్వామ్య వేదికపై గలమెత్తుతామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు. -
సర్కారు దవాఖానలో సౌలత్లు బాగున్నయ్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శివారులోని చింతల్ఠాణా పునరావాస కాలనీకి చెందిన సామంతుల వసంత, స్వామి కూతురు శిరీష (హారిక) పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లారు. వైద్యులకు చూపించారు. వారు ‘ఎలాంటి ఇబ్బంది లేదు.. కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం’అనడంతో.. సాధారణ కాన్పుకు సిద్ధమయ్యారు. పండంటి మగబిడ్డ పుట్టాడు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు, సేవలపై వసంత సంతృప్తి చెందింది. దీంతో చదువు రాని ఆమె వెంటనే తన కూతురు శిరీషతో రాయించిన ఉత్తరం మంత్రి హరీశ్రావుకు మంగళవారం చేరింది. ఉత్తరం ఇలా.. ‘సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులున్నాయని నా బిడ్డను సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుకపోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేశాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికెళ్లినం. అక్కడ డాక్టర్లు మంచిగా చూసి ‘సాధారణ కాన్పు చేపించుకో’అన్నారు. పైసా ఖర్చులేదు, కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు, అమ్మఒడి వాహనంలో మా ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నా బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికీ తెలవాలన్న ఉద్దేశంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నా. సర్కారు దవాఖానలో సకల సౌలత్లు ఉన్నాయ్.. కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికే రావాలి.. నాకు జరిగిన మేలు అందరికి జరగాలే.. ఇట్లు.. శామంతుల వసంత’అని లేఖలో పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉంది సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకొని.. సాధారణ కాన్పులు చేపించుకోవాలని, తన బిడ్డకు జరిగిన మేలు అందరికీ జరగాలని ఒక మంచి సందేశం ఇచ్చిన వసంత ఉత్తరం నాకు అందింది. చాలా సంతోషంగా ఉంది. వసంత నూరు వసంతాలు పిల్లపాపలతో వర్ధిల్లాలి. ఈ ఉత్తరం ప్రజల్లో మంచి చైతన్యాన్ని కలిగిస్తుంది. – మంత్రి హరీశ్రావు సారుకు చేరుతుందని అనుకోలే.. మా బిడ్డ చిన్న వయసుది. కోనరావుపేట మల్కపేటకు చెందిన శ్రీకాంత్తో పెళ్లి చేసినం. తొలిచూరు కాన్పు తల్లిగారే చేయాలి కాబట్టి సిరిసిల్ల దవాఖానాకు తీసుకపోయిన. నార్మల్ డెలివరీ అయింది. మాకు జరిగిన మేలు పది మందికి తెలువాలే అని సారుకు మా బిడ్డ శిరీషతో ఉత్తరం రాయించిన. అది సారుకు చేరుతుందని అనుకోలే. ప్రైవేటు దావాఖానాకు పోతే ఎంత లేదన్నా రూ.40వేలు అయ్యేది. మా ఉత్తరానికి మంత్రి స్పందించడం సంతోషంగా ఉంది. – వసంత, చింతలఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ -
వచ్చే నెలలో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.. మనవడిని చూడకుండానే..
సాక్షి, కరీంనగర్క్రైం: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కరీంనగర్లో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని భగత్నగర్కు చెందిన తాండ్ర పాపారావు–పద్మల కుమారుడు ప్రణీత్కు నిజామాబాద్కు చెందిన యువతితో వివాహమైంది. ఈ దంపతులు అమెరికాలో ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల క్రితం బాబు జన్మించాడు. అప్పటినుంచి తమ మనవడిని చూడాలని పాపారావు–పద్మ ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వీసా పనిమీద ఆదివారం కారులో హైదరాబాద్ బయలుదేరారు. కానీ విధి వక్రీకరించడంతో మల్లారం వద్ద డివైడర్ పైకి దూసుకెళ్లిన ఓ లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనతో మనవడిని నేరుగా చూడకుండానే మృత్యుఒడికి చేరుకున్నారు. వీరితోపాటు కారు డ్రైవర్ గుంటి ఆంజనేయులు కూడా మృతిచెందాడు. ఎంతో మంది విద్యార్థులకు మార్గనిర్దేశకుడు.. కామర్స్ అధ్యాపకుడైన పాపారావు తొలుత నిర్మల్లో జూనియర్ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కళాశాల, జగిత్యాల ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ లెక్చరర్గా, అగ్రహారంలో, చివరకు కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలల్లో బోధించాడు. ఒక ఏడాదిపాటు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్గా పని చేశారు. 2016లో ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలలో ఉద్యోగ విరమణ పొందాడు. వేలాది మంది విద్యార్థులకు పాఠాలు బోధించి, వారికి మార్గనిర్దేశకుడిగా మారారు. పాపారావు భార్య పద్మ ఆరేళ్ల క్రితం ల్యుకేమియా వ్యాధితో ఏడాదిపాటు పోరాడి, కోలుకున్నారు. అప్పుడు అండతో మృత్యువును గెలిచినా ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దంపతులిద్దరూ ఇద్దరు వైష్ణవ భక్తులు. వీరు దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నట్లు వారి సన్నిహితులు తెలిపారు. పాపారావు కుమారుడు ప్రణీత్ అమెరికా నుంచి బయలుదేరాడు. సోమవారం రాత్రి వరకు ఇంటికి చేరనున్నాడు. మంగళవారం తల్లిదండ్రుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది. చదవండి: జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ కేసు: అత్యాచార ఉద్ధేశంతోనే పబ్కు ప్రమాదంలో చనిపోయిన కారు డ్రైవర్ ఆంజనేయులుది నాగుల మల్యాల స్వగ్రామం. సొంతంగా ట్యాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆంజనేయులు గతంలో చాలాసార్లు పాపారావును ట్యాక్సీలో తీసుకెళ్లినట్లు సమాచారం. -
Sircilla Weavers: అంచు చీరలే ఆ‘దారం’
► సాంచాలపై కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తున్న ఇతను వేముల వెంకట్రాజం. సిరిసిల్లలోని వెంకంపేటకు చెందిన ఆయన మూడో తరగతి చదువుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే చేనేత మగ్గాలు నడుపుతున్నారు. ఇప్పుడు ఆరు పదుల వయసులో కాటన్ జరీ అంచు చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. నిత్యం రెండు సాంచాలపై చీరలను నేస్తూ.. నెలకు రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదిస్తున్నారు. ► ఈయన సబ్బని నరేందర్. సిరిసిల్ల శివనగర్కు చెందిన ఇతను డిగ్రీ చదివారు. అందరిలా పవర్లూమ్స్(సాంచాల)పై పాలిస్టర్ బట్టను, బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేయకుండా సొంతంగా కాటన్ చీరలపై దృష్టి పెట్టారు. తనకున్న ఇరవై సాంచాలపై ఇదే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ మరో పది మందికి పని కల్పిస్తున్నారు. నవ్యమైన, నాణ్యమైన కాటన్ చీరల ఉత్పత్తి చేస్తున్నారు. ఆ చీరలకు సొంతంగానే మార్కెటింగ్ చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోను నెలకు రూ.50వేలు సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిరిసిల్ల: సిరిసిల్లలో ఇలా సొంతంగా వస్త్రం ఉత్పత్తి చేసి మార్కెటింగ్ చేస్తున్న వారు ఒక్కరిద్దరు కాదు.. సుమారు 300 సాంచాలపై 150 మంది కార్మికులు, 25 మంది యజమానులు ఉన్నారు. సొంతంగానే జరీ అంచులతో కూడిన కాటన్ చీరలను ఉత్పత్తి చేస్తూ స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రాలేదనే బెంగలేదు.. బతుకమ్మ చీరల బిల్లులు రాలేదనే చింత లేదు. సర్కారు ఆర్డర్ల వైపు ఎదురుచూడ కుండా సొంత సాంచాలపై జరీ అంచుతో 8 మీటర్ల (18 మూరల) గోచీ చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. వాటిని నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, భీంగల్, నిర్మల్, భైంసా వంటి పట్టణాల్లోని వస్త్ర వ్యాపారులకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఒక్కో చీరను రూ.650 నుంచి 800 వరకు నాణ్యతను బట్టి అందిస్తున్నారు. నేరుగా నూలు కొనుగోలు చీరలకు అవసరమైన నూలును నేరుగా భీవండి నుంచి కొనుగోలు చేస్తున్నారు. నూలుకు అవసరమైన రంగులను అద్ది, బీములు పోయించుకుని, సాంచాలపై ఎక్కిస్తారు. జరీ పోగులతో చీరల అంచులను, కొంగులను డిజైన్ చేసి ఇంపైన రంగుల్లో ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు వారే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. పెరుగుతున్న నూలు ధరలతో కాస్త ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని అధిగమించి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం చేయూతనిస్తే.. కాటన్ చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు సరఫరాకు ప్రభుత్వం స్థానికంగా నూలు డిపోను ఏర్పా టు చేస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి. కరోనా లాక్డౌన్ వంటి విపత్తులు ఎదురైనా, తట్టుకుని నేతన్నలు చీరల బట్టను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. మంత్రి కేటీఆర్ చొరవ చూపి సిరిసిల్లలో నూలు డిపో ఏర్పాటు, మార్కెటింగ్కు అవకాశాలు కల్పిస్తే.. మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని నేతన్నలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
విద్య, వైద్యంలో అద్భుతాలే లక్ష్యం
సిరిసిల్ల/మెట్పల్లి(కోరుట్ల): విద్య, వైద్యరంగాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మూడేళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో చల్మెడ జానకీదేవి పేరుతో రూ.2కోట్లతో నిర్మించిన స్కూల్ భవనాన్ని శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలసి ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ‘మన ఊరు.. మన బడి’లో రూ.7,300 కోట్లతో 2,600 స్కూళ్లలో 12 రకాల వసతులు కల్పించి ఇంగ్లిష్ మీడియంగా మార్చుతున్నామని వివరించారు. ఇటీ వల అమెరికా వెళ్లినప్పుడు అనేక మంది ప్రవా సులు సొంతూళ్లలో తమ పూర్వీకుల పేరిట స్కూల్ భవనాలు కట్టించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పా రన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ ఆర్)లో భాగంగా అనేక కార్పొరేట్ సంస్థలు పేద లకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్ల డించారు. కాగా, వేములవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మధ్యమానేరు ముంపు గ్రామాల్లో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు డెక్కన్ అగ్రి రిసోర్సెస్ కంపెనీతో ఎంవోయూ పూర్తిచేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయం రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్దే విజయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మంత్రులు ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్తో కలసి పాల్గొన్నా రు. కాంగ్రెస్కు కుల, బీజేపీకి మత రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధిపై వాటికి చిత్తశుద్ధి లేదని కేటీఆర్ విమర్శించారు. బీజేపీ చిల్లర మాటలతో గల్ఫ్ దేశాల్లోని లక్షలాది మంది భారతీయుల జీవి తాలు ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, మెట్లచి ట్టాపూర్లో రూ.160 కోట్ల పెట్టుబడితో ధాత్రి, రూ.1,060 కోట్ల పెట్టుబడితో భువి బయో సంస్థలు ఏర్పాటు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోరుట్ల లో వీఫై ఐటీ సంస్థ ఏర్పాటు చేసే కాల్సెంటర్ ఒప్పందపత్రాలను యజమానులకు అందజేశారు. -
ఎనిమిదేళ్లలో ఎంతో సాధించాం
సిరిసిల్ల: దేశంలో 75 ఏళ్లలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ గత ఎనిమిదేళ్లలోనే సాధించిందని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పేర్కొన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. అస్తిత్వం కోసం 60ఏళ్లు పోరాడిన తెలంగాణ నేల.. ఇప్పుడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందన్నారు. ఎనిమిదేళ్ల స్పల్ప కాలంలోనే ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయం పెరుగుదల, విద్యుత్ సరఫరా, తాగు, సాగునీటి సదుపాయం కల్పన, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక, ఐటీ రంగాల ప్రగతిలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కఠినమైన, పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకుంటూ 2014 నుంచి 2019 వరకు 17.24 శాతం సగటు వార్షిక వృద్ధిరేటుతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జలవిప్లవం, హరిత విప్లవం, క్షీర విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవాలతో దేశానికి ఆదర్శంగా నిలిచామని కేటీఆర్ చెప్పారు. పల్లె ప్రగతికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. -
ఆగిన గుండెకు ఊపిరి పోశారు..
సిరిసిల్ల టౌన్: శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న శిశువుకు 108 సిబ్బంది సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. యాదాద్రి జిల్లాకు చెందిన దండుగుల దేవకి మూడో కాన్పు కోసం సిరిసిల్ల లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం చేరి ఆదివారం మగ శిశువుకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండా జన్మించిన శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోగా.. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని మాతా శిశు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శిశువు శ్వాస ఆగిపోయింది. అప్ర మత్తమైన 108 సిబ్బది అనిల్ కుమార్, పెద్ది శ్రీనివాస్ నోటి ద్వారా కృత్రిమశ్వాస అందిం చడంతో బాబు శ్వాస తీసుకోవడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం శిశువు మాతాశిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాబు ఆరోగ్యపరిస్థితి నిలకడ గా ఉందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పులు తీర్చాలంటూ భర్త వేధింపులు..
బోయినపల్లి(చొప్పదండి): అత్తింటి వేధింపులకు మూడు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఇంటి అవసరాలకు చేసిన అప్పులు తీర్చాలం టూ భర్త, అత్తమామలు వేధించడంతో ఇద్దరు కుమారులతో కలసి తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో గురువారం ఈ సంఘటన జరిగింది. బోయినపల్లికి చెందిన బొజ్జ అనూష (23) పోతర్ల మహిపాల్ ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మోక్షిత్ (3), మణి (18 నెలలు) అనే కుమారులు ఉన్నారు. కుటుంబ అవసరాలకు రూ.5 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధికి మహిపాల్ ఇటీవల గల్ఫ్ వెళ్లా డు. అనూష ఇద్దరు పిల్లలతో ఇంటి వద్దనే ఉంటోంది. కాగా, అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వస్తుండడంతో వాటిని అనూషనే తీర్చాలంటూ అత్తామామలు సత్తవ్వ–లచ్చయ్యతోపాటు గల్ఫ్లో ఉంటున్న భర్త మహిపాల్ ఫోన్లో వేధించారు. దీంతో మానసిక వేధింపులు భరించలేక అనూష కుమారులు మోక్షిత్, మణిలతో కలసి గ్రామ సమీపంలోని వ్యవసాయబావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. బుధవారం రాత్రి అప్పుల విష యంపై ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. తన కూతురు అనూష, మనుమలు మోక్షిత్, మణిల చావుకు కారకులైన అత్త పోతర్ల సత్తవ్వ, మామ పోతర్ల లచ్చయ్య, భర్త మహిపాల్పై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అయ్యో! ఎంత ఘోరం.. అనారోగ్యంతో బాబు, ఆవేదనతో తల్లి..
సాక్షి, సిరిసిల్ల: అనారోగ్యం ఆ కుటుంబాన్ని వెంటాడింది.. విధి వెక్కిరించడంతో తల్లీకుమారుడు రెండు నెల వ్యవధిలో మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి.. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్కు చెందిన అల్లే పద్మ–బాలయ్య దంపతుల మూడో కూతురు ప్రీతికి 13 నెలల కిందట ముంబాయికి చెందిన అవినాష్తో వివాహం జరిగింది. ఈ దంపతులకు బాబు జన్మించగా అవిష్ అని పేరు పెట్టారు. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్న ఆ చిన్నారి రెండు నెలల క్రితం చనిపోయా డు. అప్పటినుంచి తీవ్ర ఆవేదనకు గురవుతున్న ప్రీతి అనారోగ్యం పాలైంది. ముంబాయిలోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కూతురు, మనవడి మృతితో వృద్ధులైన ప్రీతి తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని -
హత్యకు 5 లక్షల సుపారీ
సిరిసిల్ల క్రైం: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిని హత్య చేసేందుకు రూ.ఐదు లక్షల డీల్ కుదుర్చుకున్న సు పారీ గ్యాంగ్ కుట్రను ఛేదించినట్టు సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే తెలిపారు. ఈ ఘాతుకానికి ప్రణాళిక చేసిన ముగ్గురితోపాటు హత్య చేయడానికి ఒప్పుకున్న బిహారీని అరెస్టు చేసినట్టు చెప్పా రు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వేములవాడలోని తిప్పపూర్కు చెందిన నీలం శ్రీనివాస్ కుమార్తెకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. ఆమె భర్తకు తెలియకుండా వేములవాడకు చెందిన మనోజ్కుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. పద్ధతి మార్చుకోవాలంటూ మనోజ్కు పెద్దల సమక్షం లో పలుమార్లు పంచాయితీలు పెట్టారు. కానీ ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. శ్రీనివాస్ తన పరిచయస్తులకు ఈ విషయాన్ని చెప్పాడు. మనోజ్ హత్యకు శ్రీనివాస్.. తిప్పపూర్లో ఉండేæ మానుకు కుంటయ్య, జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బొమ్మాడి రాజ్కుమార్, బిహార్కు చెందిన లిఖింద్ర సాహ్నితో రూ.5 లక్షలు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మనోజ్ రోజు కూలి కోసం వేములవాడ బైపాస్ నుంచి వస్తాడని గ్రహించిన వీరు గురువారం ఉదయం బైపాస్లోని బతుకమ్మతెప్పవద్ద మరణాయుధాలతో కారులో మాటువేశారు. ఇదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు అనుమానం వచ్చి అక్కడున్న కారును తనిఖీ చేశారు. అందులో 2 పెద్దకత్తులున్నాయి. దీంతో వారందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా, మనోజ్ను హత్య చేయడానికి చేసిన కుట్రను శ్రీనివాస్, కుంటయ్య, రాజ్కుమార్, సాహ్ని వెల్లడించారు. పోలీసులు వీరి నుంచి కారు, బైక్, 4 సెల్ఫోన్లు, చంపాలనుకున్న వ్యక్తి ఫొటో, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
టెక్స్టైల్ పార్క్ మూసివేత
సిరిసిల్ల: కార్మికుల దినోత్సవం రోజునే టెక్స్టైల్ పార్కు మూతపడింది. మరమగ్గాలపై నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూని ట్లను ఆదివారం మూసివేశారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్లో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని ఆధునిక మరమగ్గాలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆదివారం మొత్తం పరిశ్రమలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే 1,500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే టెక్స్టైల్ పార్క్ మూతపడటం చర్చనీయాంశమైంది. కరెంట్ ‘షాక్’ కారణం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైంది. ఇక్కడ 7,000మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాల్సి ఉండగా.. 3వేల మందికే పని లభిస్తోంది. పార్క్లో 113 యూనిట్లలో (1,695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంక్షోభానికి గురైన 25మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్ను అమ్మేసుకున్నారు. వసతుల లేమి.. విద్యుత్ చార్జీల భారం పార్క్లోని పరిశ్రమ లకు శాపంగా మారాయి. సిరిసిల్లలోని పాత మర మగ్గాలకు 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అమ లుచేస్తోంది. అదే టెక్స్టైల్ పార్క్లో వస్త్రోత్పత్తిదా రులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీ రూ.3గా ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా.. అంతకుమించి వినియోగిస్తే.. ప్రతి యూనిట్కు రూ.2.50గా ఉంది. గతంలో టెక్స్టైల్ పార్క్లోని యూనిట్లకు.. 2014 డిసెంబర్ నాటికి 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. మరోవైపు నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. యజమానుల డిమాండ్లు ఇవీ.. ♦2015 జనవరి – 2020 డిసెంబర్ వరకు విద్యుత్ సబ్సిడీ రీయింబర్స్ చేయాలి. ♦పార్క్లో మరమగ్గాల ఆధునీకరణకు, కొత్త యూనిట్లకు 25% ప్రోత్సాహకం ఇవ్వాలి. ♦పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకు ‘ఎన్వోసీ’ సరళతరం చేయాలి. ♦టెక్స్టైల్ పార్క్లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటు చేయాలి. ♦ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లను 25% టెక్స్టైల్ పార్క్కు ఇవ్వాలి. ♦యువకులకు మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. మంత్రి కేటీఆర్ చొరవచూపాలి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ చొరవచూపి ఆదుకోవాలి. ప్రధానంగా పెండింగ్లో ఉన్న విద్యుత్ రాయితీ రీయింబర్స్మెంట్ అందించాలి. – అన్నల్దాస్ అనిల్కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
రూ.20 లక్షల కట్నం, ఘనంగా పెళ్లి.. ఏడాది కాకముందే..
సాక్షి, సిరిసిల్ల: వరకట్నం వేధింపులకు నవ వధువు బలైంది. హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహాన్ని కస్బెకట్కూర్కు తరలించారు. సిరిసిల్లలోని అబ్బాయి ఇంటి వద్ద అమ్మాయి కుటుంబీకులు, గ్రామస్తులు నిరసన తెలుపగా.. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మృతురాలి పెద్దనాన్న జూపల్లి వేణుగోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటకు చెందిన చీటి ఉదయ్కు తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్కు చెందిన జూపల్లి నిఖితకు 11 నెలల క్రితం వివాహమైంది. రూ.20 లక్షల కట్నం, ఇతర లాంఛనాలతో ఘనంగా పెళ్లి చేశారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అయిన ఉదయ్, నిఖితలు హైదరాబాద్లో కాపురం పెట్టారు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఉదయ్ అదనపు కట్నం తేవాలని నిఖితను వేధించసాగాడు. తల్లిగారింటి వద్ద వ్యవసాయ భూమిలో నుంచి రెండెకరాలు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన నిఖిత హైదరాబాద్లో వారు ఉంటున్న ఇంట్లోనే గురువారం తెల్లవారుజామున ఉరేసుకుంది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు అంబులెన్స్ను కస్బెకట్కూర్ పంపించిన పోలీసులు నిఖిత కుటుంబసభ్యులు ఆమె మృతదేహంతో హైదరాబాద్ నుంచి అంబులెన్స్లో బయలుదేరారు. సిరిసిల్లలోని నిఖిత అత్తగారింటి వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు తంగళ్లపల్లి మండలం జిల్లెల చెక్పోస్టు వద్ద అంబులెన్స్ను అడ్డుకొని, కస్బెకట్కూర్కు పంపించారు. మృతురాలి పెద్దనాన్న ఆధ్వర్యంలో పలు వు రు ముందుగానే ఉదయ్ ఇంటికి వెళ్లగా.. అప్పటికే తాళం వేసి, పరారయ్యారు. ఎలాంటి తప్పు చేయకుంటే ఇంట్లో ఎందుకు ఉండరని ప్రశ్నిస్తూ అక్కడే నిరసనకు దిగారు. అయితే మృతదేహం కస్బెకట్కూర్లో ఉండగా కుటుంబసభ్యుల్లో కొందరు సిరిసిల్లలో ఉదయ్ ఇంటి వద్దే ధర్నా చేస్తున్నారు. ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
11 ఏళ్ల కిందట సంచలనం.. ఇప్పటి యువ ఐపీఎస్లకు పాఠమైంది..
సిరిసిల్ల(రాజన్న సిరిసిల్ల): డబ్బుల కోసం వేసిన వలపుగాలానికి సంపన్న వ్యక్తి చిక్కాడు. మహిళతో సుతిమెత్తగా మాట్లాడిస్తూ.. అతడ్ని ట్రాప్ చేసి దూర ప్రాంతానికి రప్పించారు. ఓ గదిలో బంధించారు. అతడి కుటుంబానికి ఫోన్ చేసి లక్షలు డిమాండ్ చేశారు. సొమ్ములిచ్చేంత వరకు ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టారు. తమను గుర్తు పడితే లైఫ్కే ప్రమాదమని చంపేశారు. మృతదేహం వానస రాకుండా ఫ్రిజ్లో కుక్కేశారు. పదిరోజులైనా ఆచూకీ లభించలేదు. కేసును చాలెంజ్గా తీసుకున్న పోలీసులు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వినియోగించి ఛేదించారు. నిందితులను పట్టుకుని జైలుకు పంపారు. ఆ హత్యకేసులో ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. సిరిసిల్లలో 2011 జూన్లో సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఐపీఎస్లకు పాఠమైంది. మిస్టరీగా మారిన యువకుడి హత్యోదంతాన్ని అన్ని ఆధారాలతో సహా కోర్టు ఎదుట ఉంచడంలో పోలీసులు సక్సెస్ అయిన తీరును అకాడమీలో హిస్టరీగా బోధించారు. 11 ఏళ్ల కిందట సంచలనం సృష్టించిన ఆ ఘటనపై ప్రత్యేక కథనం.! చదవండి👉: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా? క్రైం నంబరు 173/2011 సిరిసిల్ల పట్టణంలోని సుభాష్నగర్కు చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపా రి గర్దాస్ శ్రీనివాస్(42). అతనికి భార్య లలిత, ఇద్దరు పిల్లలు సాయికృష్ణ, శ్రీకాంత్, తల్లిదండ్రులు సునంద, నర్సప్ప ఉన్నారు. సుజాత అనే మహిళ శ్రీనివాస్కు ఫోన్లో పరిచయమైంది. హైదరాబాద్ రావాల్సిందిగా కోరింది. శ్రీనివాస్ 2011 జూన్ 20న హైదరాబాద్ ఉప్పల్లోని ఏఆర్కే అపార్ట్మెంట్కు వెళ్లాడు. ఆరుగురు సభ్యులు గల ముఠా పథకం ప్రకారం అతన్ని నిర్బంధించి కుటుంబసభ్యులను రూ.25లక్షలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ తండ్రి నర్సప్ప నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలో రూ.1.50 లక్షలు వేశాడు. ఆ డబ్బులను వివిధ ఏటీఎంల నుంచి డ్రా చేసుకున్నారు. తమను గుర్తుపడితే సమస్య ఏర్పడుతుందని అదే అపార్ట్మెంట్లో హత్యచేశారు. ఫ్రిజ్లో శవాన్ని మూటకట్టి ఉంచారు. ఈ ఘటనపై సిరిసిల్ల పోలీసులు క్రైం నంబరు 173/ 2011 కేసు నమోదు చేశారు. పక్కావ్యూహంతో.. వలపు వల ♦ప్రస్తుత మంచిర్యాల జిల్లాకు చెందిన కొండపాక శ్రీధర్ ఉరఫ్ శేఖర్(30) 2003 నుంచి వివిధ నేరాల్లో జైలుకు వెళ్లాడు. భార్యను హత్య చేసిన కేసులో సిరిసిల్ల తారకరామనగర్కు చెందిన మేర్గు చిరంజీవి జైలుకు వెళ్లాడు. వీరిద్దరు అక్కడే పరిచయమయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీధర్ సిరిసిల్లు మకాం మర్చాడు. ♦సిరిసిల్లలో ప్రముఖ వస్త్రవ్యాపారి గర్దాస్ శ్రీనివాస్ ఇంట్లో అద్దెకు ఉండే ఆకులేని ఇందిరతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. భర్తతో విడాకులై ఒంటరిగా ఉంటున్న కొక్కుల సుజాతను వివాహం చేసుకున్నాడు. తనకు పెద్దమొత్తంలో డబ్బులు కావాలని తొలుత పరిచయమైన ఇందిరతో చెప్పాడు. ♦తమ ఇంటి యజమాని శ్రీనివాస్ బాగా ఆస్తిపరుడని అతన్ని ట్రాప్ చేస్తే డబ్బులు గుంజవచ్చని ఇందిర సలహా ఇచ్చింది. పథకం ప్రకారం.. హైదరాబాద్ ఉప్పల్లో ఓ అపార్ట్మెంట్లో రెండునెలల కోసం ప్లాట్ను అద్దెకు తీసుకున్నారు. శ్రీధర్ సుజాతతో శ్రీనివాస్కు ఫోన్ చేయించి ట్రాప్ చేశారు. ♦2011 జూన్ 20న శ్రీనివాస్ను హైదరాబాద్ రావాల్సిందిగా సుజాత కోరగా.. శ్రీనివాస్ వెళ్లి అపార్ట్మెంట్లో బంధి అయ్యాడు. సిరిసిల్లకు చెందిన మేర్గు చిరంజీవి, గూడూరి రాజు సహకారంతో శ్రీధర్ శ్రీనివాస్ను బంధించాడు. శ్రీనివాస్ తండ్రి గడ్దాస్ నర్సప్పకు ఫోన్ చేసి రూ.25 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. వాళ్లు చెప్పిన అకౌంటులో నర్సప్ప రూ.1.50 లక్షలు వేయగా.. నిందితులు హైదరాబాద్లోని వివిధ ఏటీఎంల నుంచి రూ.1.25 లక్షలు డ్రా చేశారు. ♦బంధీగా ఉన్న శ్రీనివాస్ జూన్ 25న పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ప్లాట్లోనే అతన్ని హత్య చేశారు. శవం వాసన రాకుండా దాచే ందుకు కొత్త ఫ్రీజ్ కొన్నారు. శవాన్ని మూట గా అందులో ఉంచారు. జూన్ 26న ఇందిర, కొండ రాజును హైదరాబాద్కు పిలిచి రూ.లక్షతో పాటు బైక్ ఇచ్చి సిరిసిల్లకు వెళ్లి అక్కడి ఎం జరుగుతుందో ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పాల్సిందిగా నిందితులు సూచించారు. చదవండి👉: కడుపులో 11.57కోట్ల కొకైన్.. 2017 సెప్టెంబరు 12న శిక్ష శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు శాస్త్రీయంగా విచారించారు. సెల్ఫోన్ సంభాషణ ఆధారంగా కొండ రాజును ముందుగా పట్టుకున్నారు. అతడ్ని విచారించి అపార్ట్మెంటుకు వెళ్లగా.. ఫ్రీజ్లో శవం బయటçపడింది. నిందితులు భీవండికి పారిపోగా.. అప్పటి సిరిసిల్ల ఓఎస్డీ ధరావత్ జానకీ, ప్రొబేషనరీ డీఎస్పీ శ్రీనివాస్, సిరిసిల్ల టౌన్ సీఐ సర్వర్ కేసును శాస్త్రీయంగా ఛేదించారు. 2017 సెప్టెంబరు 12న కరీంనగర్ న్యాయస్థానం నిందితులు కొండపాక శ్రీధర్, ఆకులేని ఇందిర, కొక్కుల సుజాత, మేర్గు చిరంజీవి, గూడూరి రాజు, కొండ రాజుకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. చిరంజీవి అప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండు నెలలకు చార్జ్షీట్ అప్పుడు నేను సిరిసిల్ల టౌన్ సీఐగా ఉన్నాను. ఈ కేసును చాలెంజ్గా తీసుకుని నిందితులను పట్టుకున్నాం. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల సూచన... సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుని, అన్ని ఆధారాలు సేకరించి రెండు నెలల్లో చార్జ్షీట్ వేశాం. నిందితులకు శిక్ష పడింది. ప్రస్తుతం ఆ కేసును శిక్షణ ఐపీఎస్లకు ఇటీవల పాఠంగా బోధించారు. – సర్వర్, ఎస్బీ, సీఐ, సిరిసిల్ల -
నేతన్న ఓనరయ్యేనా?
సాంచాలు నడుపుతున్న ఈయన (గడ్డం గణేశ్, సిరిసిల్ల పట్ట ణం సర్ధార్నగర్) 25 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. రోజూ 10–12 గంటలపాటు 10 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.2 వేలు వస్తాయి. అదే బతుకమ్మ చీరల వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.3 వేలు వస్తాయి. గణేశ్ భార్య మిషన్ కుడతారు. వారికి ఇద్దరు అమ్మాయిలు. భార్యాభర్తలు పనిచేస్తే వచ్చే డబ్బులు బట్టకు, పొట్టకే సరిపోతుంది... ఇది ఒక్క గణేశ్ పరిస్థితే కాదు. సిరిసిల్లలో పాతిక వేలమంది కార్మి కుల దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసాముల వద్ద పనిచేసే కార్మికులను యజమానులుగా మార్చేందుకు ప్రభుత్వం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రతిపాదించింది. నేతకార్మికుడే యజమానిగా.. మెరుగైన ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఆ పథకం ఐదేళ్లుగా తుదిరూపం దాల్చలేదు. సిరిసిల్ల: నేత కార్మికులకు పుట్టినిల్లయిన సిరిసిల్లలో.. కార్మికుడే యజమానిగా మారితే వారి బతుకుల్లో మార్పు వస్తుందనే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.220 కోట్లతో వీవింగ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేయించారు. సిరిసిల్లలో ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలను ఏర్పాటుచేసి.. ఆధునిక విధా నాల్లో వేగంగా వస్త్రోత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఒకే సారి 4 రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తిచేసి ప్రపంచస్థాయిలో వస్త్రాన్ని ఎగుమతి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అయితే ఏళ్లుగా వీవింగ్ షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో పనులు కొలిక్కి రాలేదు. ఏమిటీ ‘వర్కర్ టు ఓనర్’పథకం? వర్కర్ టు ఓనర్ పథకానికి ఎంపికైన కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో పది శాతం చెల్లిస్తే 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందుతుంది. ఒక్కో కార్మికుడికి ఒక యూనిట్ కింద రూ.8 లక్షలు వెచ్చిస్తారు. నాలుగు ఆధునిక మగ్గాలు సమకూర్చి, ఒక్కో షెడ్డులో ఎనిమిది మంది కార్మికులకు యూనిట్లు అందిస్తారు. ఆధునిక మగ్గా లపై వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ యజమాని, ఆసామి లేకుండా కార్మికులు సొంతంగా ఉపాధి పొందుతారు. తొలివిడతగా ఎంపికయ్యే 1,104 మందికి ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇచ్చి యూనిట్లు కేటాయిస్తారు. తమకు శాశ్వత ఉపాధి కల్పించే ఈ పథకం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందా.. అని సిరి సిల్ల నేతన్నలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టాలని నేతకార్మికులు కోరుతున్నారు. మోడల్ లూమ్స్ బిగించాం సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద బైపాస్ రోడ్డులో వీవింగ్ పార్క్లో షెడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. నాలుగు మోడల్ లూమ్స్ బిగించాము. వర్కర్ల షెడ్లు పూర్తయితే.. వీవింగ్ పార్క్ను ప్రారంభిస్తాం. – తస్నీమా, జేడీ, జౌళిశాఖ, సిరిసిల్ల -
వడ్లు వేయొద్దన్నరు.. ఇప్పుడేమి కొంటున్నరు
ముస్తాబాద్ (సిరిసిల్ల): పోయిన సీజన్లో దొడ్డు వడ్లు వేయొద్దన్నరు.. యాసంగిలో వరి పెడితే ఉరేనని భయపెట్టిండ్రు.. ఇప్పుడేమి వడ్ల కొంటున్నరు.. ప్రభుత్వం కొనదేమోనని ముందుగా రైస్ మిల్లులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోయినం.. మా పరిస్థితి ఏంటి.. అంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామ రైతులు అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ను నిలదీశారు. ఆవునూర్లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చేందుకు శుక్రవారం గ్రామానికి వచ్చిన అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్కు ఈ అనుభవం ఎదురైంది. వరి వేయొద్దని ఆవునూర్ రైతు వేదికలోనే కలెక్టర్ చెప్పడంతో గ్రామంలో చాలా మంది రైతులు వరి వేయలేదని రైతులు వాపోయారు. కొందరే మో బీడు భూములు ఉంచడం ఇష్టం లేక వరి పండించి.. ఎవరూ కొనమంటే రైస్మిల్లులకు తక్కువ ధరలకే అమ్ముకున్నామన్నారు. దీనిపై అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేస్తామన్నారు. ఆవునూర్లో పంట కోతలు ముందుగా వస్తాయని.. ఎందరు రైతులు మిల్లర్లకు విక్రయించారో విచారణ జరిపి వారికి మద్దతు ధర ఇప్పించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. -
తెలంగాణ దళితులు దేశానికి దిక్సూచి కావాలి
సిరిసిల్ల: ఆర్థికంగా అట్టడుగున ఉన్న దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతోనే దళితబంధు అమలవుతోందని, మన రాష్ట్రంలో ఇది విజయవంతమైతే దేశం మనవైపు చూస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రూ.17,500 కోట్లతో దళితబంధు పథకాన్ని అమలు చే స్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు స్వయం ఉపాధితోపాటు పది మందికి పనికల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ దళితులు దేశానికి దిక్సూచిలా మారాలన్నారు. 75 ఏళ్లలో ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయని విధంగా సీఎం కేసీఆర్ దళితబంధును ప్రారంభించారన్నారు. కేసీఆర్ 1987–88 ప్రాంతంలోనే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండగా.. దళిత చైతన్య జ్యోతి పథకాన్ని ప్రారంభించి దళితులను చైతన్యవంతులను చేశారని గుర్తుచేశారు. తెలంగాణ చిన్న రాష్ట్రం అయినా ఎంతో అభివృద్ధి సాధించి దేశానికి మార్గదర్శి అయిందన్నారు. సీఎం కేసీఆర్ అంటే పరివర్తనకు, మార్పునకు చిహ్నమన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిందే.. కానీ.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో ఏకీభవిస్తున్నానని, కానీ రాజ్యాంగ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని కేం ద్రం అరాచకపాలన సాగిస్తోందని విమర్శించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడు తూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్లో ప్రపంచం అబ్బురపడేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు రూ.200 కోట్లతో 3 వేల మందికి టీప్రైడ్ ద్వారా రాయితీలు అందించినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమని, సంపదను సృష్టించి పది మందికి పంచగలిగితే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని అన్నారు. అంబేడ్కర్ ఆలోచనలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. దళితులతో సహపంక్తి భోజనం సిరిసిల్లలో రూ.2.5 కోట్లతో నిర్మించిన అంబేడ్కర్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. దళితబంధు లబ్ధిదారుల తో సహపంక్తి భోజనం చేశారు. అం తకుముందు తంగళ్లపల్లిలో అంబేడ్కర్ భవ నానికి భూమి పూజ చేశారు. సారంపల్లి, మల్లాపూర్, లక్ష్మీపూర్, అంకుసాపూర్ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు. అలాగే సిరిసిల్లలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ప్రసంగించారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి బైఠాయింపు
అక్కన్నపేట(హుస్నాబాద్): పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఆమె కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి చెందిన కాదాసు కీర్తన, అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన బత్తుల సతీశ్ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. గర్భం పోయేందుకు అబార్షన్ చేయించాడు. అనంతరం వారి ఇరువురి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని సతీశ్ ఒప్పకున్నాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతూ పెళ్లిని దాటవేస్తున్నాడు. 2020 సెప్టెంబర్ 12 తేదీన సతీశ్ తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో కొడుకుతో పెళ్లి చేస్తామని ఒప్పంద ప్రతం రాసి ఇచ్చారు. ఆ మేరకు రెండు నెలల క్రితం రుదంగ్రి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయంలో వరపూజ జరిగింది. నెలలోపు పెళ్లి ఏర్పాటు చేస్తామని ప్రియుడు, అతడి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే వరకట్నంగా కారు, డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానంటూ ప్రియుడు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని కీర్తన కన్నీటి పర్యతమైంది. ప్రియుడు, అతడి తల్లిదండ్రులు బత్తుల కొమురయ్య, ఎల్లవ్వ, వారిని ప్రోత్సహిస్తున్న మల్లేశ్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం జరగకుంటే ప్రియుడి ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని కీర్తన హెచ్చరించింది. -
అవార్డులు గౌరవాన్ని పెంచాలి
సిరిసిల్ల కల్చరల్: జ్ఞాన సముపార్జనకు వయసుతో నిమిత్తంలేదని, జీవితకాలంపాటు అధ్యయనం చేయొచ్చని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్రావు అన్నారు. రంగినేని సుజాతమోహన్రావు తన మాతృమూర్తి ఎల్లమ్మ స్మారకార్థం ఇచ్చే జాతీయస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ ప్రముఖకవి జూకంటి జగన్నాథం అధ్యక్షతన జరిగింది. కిషన్రావు మాట్లాడుతూ కవిగా వచ్చిన గుర్తింపు, అందిన పురస్కారాలు గౌరవాన్ని పెంచాలని, గర్వాన్ని దరి చేరనీయొద్దని సూచించారు. ప్రాంతానికో మాండలీకం ఉన్నప్పటికీ మౌలికంగా సంవేదనలోంచి వచ్చిన కవిత్వమే సమాజంలో నిలిచిపోతుందన్నారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్కు రంగినేని సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రశంసాపత్రం, రూ.25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో కవులు డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ పత్తిపాక మోహన్, అన్నవరం దేవేందర్, పెద్దింటి అశోక్, డాక్టర్ బెల్లి యాదయ్య, ఎలగొండ రవి, జిందం అశోక్, మానేరు రచయితల సంఘం, సాహితీ సోపతి, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులతోపాటు సిద్దిపేట, కరీంనగర్కు చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. మానేటి బిడ్డనే.. మేనమామ ఇంట్లో పుట్టా.. ఇదే జిల్లాలోని గూడెం గ్రామం మా అమ్మమ్మ వాళ్లది. మేనమామ ఇంట్లోనే పుట్టాను. నా మూడేళ్ల వయçసులో అనుకుంటా. ఎడ్లబండి మీద సిరిసిల్లలోని రాజేశ్వర్ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాను. తోటివాళ్లంతా సినిమా చూస్తుంటే నేను మాత్రం ఉశికెతో ఆడుకున్నట్లు గుర్తుంది. అలా మానేరు నా మదిలో ఉండిపోయింది. – తంగెడ కిషన్రావు, తెలుగు వర్సిటీ వీసీ మానేటి కవులే నాకు ప్రేరణ పశువుల కాపరిని సాహిత్యానికి పరిచయం చేసిన పాలమూరుకు, నన్ను కవిగా ఆవిష్కరించుకునేందుకు ప్రేరణ ఇచ్చిన మానేటి కవులకు కృతజ్ఞతలు. సత్కరించిన మానేటి సహృదయులకు పాలమూరు కన్నీటి బొట్లతో అభిషేకం చేస్తున్నా. మా అమ్మ పేరూ ఎల్లమ్మనే కాబట్టి ఈ పురస్కారాన్ని అందుకోవాలని కలలు కన్నా. – తగుళ్ల గోపాల్, రంగినేని ఎల్లమ్మ పురస్కార గ్రహీత -
సిరిసిల్లలో రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లలోని పెద్దూరు గ్రామ శివారులో 63 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న తెలంగాణ అపారెల్ పార్కులో దుస్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రముఖ జౌళి సంస్థ టెక్స్పోర్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వేలాది మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా వస్త్రోత్పత్తి, ఎగుమతుల కోసం బిల్ట్ టు సూట్ పద్ధతిలో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ అపారెల్ పార్కు’ను అభివృద్ధి చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న టెక్స్పోర్ట్ కంపెనీ 1978 నుంచి అపారెల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, విదేశీ ఎగుమతులు లక్ష్యంగా రెడీమేడ్ దుస్తులను తయారు చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ సంస్థకు 19 చోట్ల రెడీమేడ్ తయారీ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రూ.620 కోట్ల వార్షికాదాయంతో ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 15 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. రెండు వేల మందికి ఉపాధి ప్రస్తుత ఒప్పందం మేరకు సిరిసిల్లలోని తెలంగాణ అపారెల్ పార్కులో 7.42 ఎకరాల విస్తీర్ణంలో రూ.60 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి లభిస్తుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్, టెక్స్పోర్ట్ ఎండీ నరేంద్ర డి.గోయెంకా సంతకాలు చేశారు. రాష్ట్రంలో టెక్స్టైల్ పరిశ్రమ అభివృద్ధికి, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. సిరిసిల్లలోని నేతన్నల నైపుణ్యం, ఇక్కడి అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అపారెల్ పార్కులో ఫ్యాక్టరీ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని టెక్స్పోర్ట్ కంపెనీ ఎండీ గోయెంకా తెలిపారు. -
కరగని ‘గుండె’
సిరిసిల్ల: కొందరి కష్టాలు చూస్తే పగవారికైనా రావద్దనిపిస్తుంది. సొంత ఇల్లు లేదు.. భార్య ఏనాడో కన్నుమూసింది. కొడుకుతో కలసి సాంచాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న ఓ నేత కార్మికుడి గుండె ఆగిపోయింది. అయితే ఇంటి యజమాని శవాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఊరి బయట టెంట్ వేసుకుని శవాన్ని ఉంచాల్సి వచ్చింది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్నగర్లో నివసించే దీకొండ దేవదాస్ (66) నేతకార్మికుడు. దేవదాస్ భార్య కళావతి చాలా రోజుల క్రితం అనారోగ్యంతో మరణించింది. ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి. కొడుకు అరుణ్కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, దేవదాస్ అనారోగ్యంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో మరణించడంతో శవాన్ని ఇంటికి తేవద్దని యజమాని చెప్పాడు. దీంతో కొడుకు అరుణ్కు ఎటు పోవాలో తెలియక శుక్రవారం రాజీవ్నగర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో టెంట్ వేసి తండ్రి శవాన్ని ఉంచాడు. ఓ కూతురు భివండిలో ఉండడంతో ఆమె వచ్చేంత వరకు కుటుంబ సభ్యులు అక్కడే నిరీక్షించారు. అరుణ్ చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో బంధువులు ఆర్థిక సాయం అందించి అంత్యక్రియలు నిర్వహించారు. పేదవాడైన అరుణ్ను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కేంద్రం మొండి వైఖరిపై పోరు
సిరిసిల్ల: వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చేనేత, జౌళి రంగాన్ని కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. రాష్ట్ర నేతన్నల కోసం కేంద్రానికి ఎన్నో విజ్ఞప్తులు చేశామని, అయినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ విధించినప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ.. రాష్ట్రం తరఫున లేఖ రాశామని చెప్పారు. జీఎస్టీ ముప్పు ఇంకా తొలగిపోలేదని, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతోనే తాత్కాలికంగా పక్కన పెట్టిందని పేర్కొన్నారు. కేంద్ర మొండి వైఖరికి నిరసనగా రాష్ట్రంలోని నేతన్నలు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. అండ కోరితే.. మొండి చెయ్యి చూపారు ‘‘కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్రానికి అండగా ఉండాలని, నేతన్నలను ఆదుకోవాలని ఏడేళ్లుగా అనేక లేఖలు రాశాం. పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఎనిమిది బడ్జెట్లు ప్రవేశపెడితే.. ఒక్కసారైనా తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదు. వరంగల్లో దేశంలోనే అతిపెద్ద మెగా టెక్స్టైల్ పార్క్ను 1,250 ఎకరాల్లో ప్రారంభిస్తే దానికి సాయం చేయలేదు. రాష్ట్రంలో ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఏర్పాటు చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో దుబ్బాక, నారాయణపేట, కొత్తకోట, జమ్మికుంట, పోచంపల్లి, కమలాపూర్, సిద్దిపేట, గద్వాల వంటి ప్రాంతాల్లో 11 చేనేత కస్టర్లను ఏర్పాటు చేయాలని.. సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ ఇవ్వాలని కోరాం. మా కార్మికులు షోలాపూర్, భీవండిలకు వలస వెళ్లకుండా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశాం. కేంద్రం నుంచి ఉలుకూ పలుకు లేదు. ఏడేళ్లుగా మొండిచెయ్యి చూపుతుంటే ఎలా ఊరుకుంటాం. సమయం వచ్చినప్పుడు రోడ్డెక్కాలి సిరిసిల్ల వేదికగా రాష్ట్రంలోని నేతన్నలకు పిలుపునిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా, జీఎస్టీ విధింపుపై మరోసారి ఉద్యమించాలి. సమయం వచ్చినప్పుడు అందరం కలిసి రోడ్డెక్కాలి. పోరాడితేనే ప్రభుత్వాలు దిగొస్తాయి. కష్టమొచ్చినప్పుడే ఒక్కటిగా నిలబడి కొట్లాడాలి. అలా పోరాడితేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రంలో నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిస్తోంది. కార్మికులకు 50 శాతం రాయితీ అందిస్తున్నాం, పవర్లూమ్ రంగాన్ని ఆధునీరించేందుకు అప్గ్రేడేషన్ స్కీమ్ను అమలు చేస్తున్నాం. ప్రభుత్వం తరఫున వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తున్నాం. నేత కార్మికుల సంక్షేమం కోసం త్రిప్ట్ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. టెక్స్టైల్ పార్క్కు తోడుగా కొత్తగా అపెరల్ పార్క్ను సిరిసిల్లలో ఏర్పాటు చేస్తున్నాం..’’ అని కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో మెకనైజ్డ్ దోబీ ఘాట్స్ రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన అత్యాధునికమైన మెకానైజ్డ్ (యంత్రీకృత) దోబీ ఘాట్ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు. రూ.2.10 కోట్లతో ఆధునిక హంగులతో దీనిని నిర్మిం చారు. దోబీఘాట్కు శాశ్వత భవనాన్ని నిర్మిం చి.. ఆధునియ యంత్రాల సాయంతో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, ఇస్త్రీ చేయడం వంటివన్ని ఒకేచోట పూర్తిచేసేలా వసతిని ఏర్పాటు చేశారు. గంటకు 90 కిలోల బట్టలను ఉతికి, ఆరబెట్టే చేసే సామర్థ్యమున్న యంత్రాలను అమర్చారు. ఈ విధానంతో నీరు ఆదా అవడంతోపాటు రజకులకు శ్రమ తగ్గనుంది. అత్యాధునిక మోడల్ దోబీఘాట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించడంపై రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు. -
నేత బ్యాగు.. మోత బాగు
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల శ్రావణ్ చేతిలో ఇమిడిపోయే సూక్ష్మ బ్యాగును సృష్టించారు. అగ్గిపెట్టెలో ఇమిడేచీరను నేసి నాలుగు దశాబ్దాల కిందటే ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే నల్ల శ్రావణ్. వస్త్రోత్పత్తిలో వినియోగించే వార్పు నైలాన్ పోగులు, వెప్టు పీసీ ధారంతో ఈ సూక్ష్మ సంచిని తయారు చేశాడు. పొడవు 24 ఇంచులు, వెడల్పు 16 ఇంచులతో కేవలం 24 గ్రాముల బరువుతో చేతిలో ఇమిడి పోయేలా బ్యాగును రూపొం దించాడు. ఈ బ్యాగును ‘కీ’ చైన్తో ఉంచుకునే అవకాశం ఉంది. ప్లాస్టిక్ కవర్లను సిరిసిల్లలో నిషేధించిన నేపథ్యంలో బట్టతో చేసిన సూక్ష్మ బ్యాగును ఎక్కడికైనా తీసుకెళ్లేలా తయారు చేశాడు. 10 కిలోల బరువు గల వస్తువులను మోయగల సామర్థ్యంతో బ్యాగును రూపొందించినట్లు శ్రావణ్ తెలిపారు. చేతిలో ఇమిడి పోయే బ్యాగును తయారు చేసినందుకు శ్రావణ్ను పలువురు అభినందించారు. -
ముందస్తుగా బతుకమ్మ చీరల ఆర్డర్లు
సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నలకు ఈ యేడు ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు వచ్చాయి. తొలివిడతగా రూ.140.80 కోట్ల విలువైన 4.40 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లను సోమవారం టెస్కో అధికారులు సిరిసిల్ల నేతన్నలకు అందించారు. ఈమేరకు సిరిసిల్లలోని మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీలు(మ్యాక్స్), చిన్న తరహా యూనిట్ల(ఎస్ఎస్ఐ) యజమానులకు ఆర్డర్లు సిద్ధమయ్యాయి. ఈసారి బతుకమ్మ పండుగకు చీర, జాకెట్(పీస్)లను వేర్వేరుగా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. చీరకు బ్లాక్ రోటోవార్ప్తో డిజైన్ చేయగా.. జాకెట్ను మాత్రం వేరుగా డిజైన్ చేశారు. గతంలో మీటరు బతుకమ్మ చీరల బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 ఇవ్వాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. బ్లాక్ రోటోవార్ప్తో 2020 నాటి డిజైన్ను ఈ ఏడాది మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా ప్రతీ మీటరుకు ఒక్క రూపాయి ధర తగ్గించారు. చీరల్లో 240 రకాల డిజైన్లను రూపొందించి అందులోనే మార్పులు చేశారు. కాగా, బతుకమ్మ చీరల బట్ట ధరను ఒక్క రూపాయి తగ్గించడంపై నేతన్నల్లో నిరాశ నెలకొంది. గతేడాది మీటరు బట్టకు రూ.33 ఇవ్వగా.. ఈ ఏడాది రూ.32 నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కరీంనగర్లో దంచికొట్టిన వాన..కుప్పకూలిన 70 అడుగుల లైటింగ్ కటౌట్
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం దంచికొట్టింది. కొన్నిచోట్ల ఈదురుగాళ్లతో కూడిన రాళ్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో కరీంనగర్ పట్టణంలోని గీతా భవన్ సెంటర్లో ఉన్న 70 అడుగుల ఎత్తైన శ్రీ రాముడి పట్టాభిషేక లైటింగ్ కటౌట్ కూలిపోయింది. ఫిబ్రవరిలో జరగబోయే బ్రహ్మోత్సవాల్లో రాముడి పట్టాభిషేకాన్ని ఆవిష్కరించేలా ఆలయ కమిటీ అధికారులు సుమారు రూ. 45 లక్షలు ఖర్చు చేసి ఈ భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. వారం రోజుల నుంచి రాత్రి వేళల్లో కటౌట్ ఆకట్టుకుంటోంది. అయితే సర్కిల్లోనే కట్టెలు కూలడంతో ప్రమాదం తప్పింది. చదవండి: గాంధీ, ఉస్మానియాలో కరోనా కలకలం.. 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్ గాలుల ధాటికి విద్యుత్ దీపాల అలంకరణ లుమినార్ నేలకొరిగింది. జిల్లాలోని చొప్పదండి, రామడుగు, మానుకొండూరు, పెద్దపల్లి, శంకరపట్నం, జమ్మికుంట మండలలాల్లోనూ భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిలఆలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ స్థాయిలో గాలులు వీడయంతో సిరిసిల్ల విద్యానగర్లో విద్యుత్ స్తంబాలు, చెట్లు విరిగిపోయాయి. #Karimnagar, Heavy rains and gales recently installed mark of Sri Venkateshwara Swamy anual fete Rama Pattabhi shekam scaffold illumination structure collapsed, luckily no one injured. few days back installed at Telangana chowk. pic.twitter.com/LT3RzuTmtX — naveenkumar (@naveen_TNIE) January 11, 2022 (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పోరాట యోధుడు వంగరి నర్సయ్య కన్నుమూత
సిరిసిల్ల: నిజాం వ్యతిరేక పోరాటంలో ఉద్యమించిన సమరయోధుడు, సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు వంగరి నర్సయ్య(102) గురువారం కన్నుమూశారు. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించిన వంగరి నర్సయ్య పెద్దగా సుపరిచితులు. శతాధిక వృద్ధుడిగా గుర్తింపు పొందిన ఆయన అనారోగ్యంతో గత పక్షం రోజులుగా మంచం పట్టారు. సిరిసిల్ల నేతన్నల సంక్షేమం కోసం 2008లో సీఎం కేసీఆర్ రూ.50లక్షల నిధిని సమకూర్చగా.. ఆ నిధిని పేదలకు అందించే బాధ్యతను పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడిగా వంగరి నర్సయ్యకు అప్పగించారు. పేదలకు వడ్డీ లేని రుణాలు అందించి ట్రస్ట్ను సమర్థవంతంగా నడిపించడంలో నర్సయ్య ముందున్నారు. ఆయనకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూమార్తెలు ఉన్నారు. వంగరి నర్సయ్య మృతి పట్ల వివిధ సంఘాల నాయకులు, పద్మశాలి సంఘం పెద్దలు సంతాపం తెలిపి, నర్సయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. -
ఒమిక్రాన్ బాధితుడి ఇంట రెండు పాజిటివ్ కేసులు.. అక్కడ లాక్డౌన్
సాక్షి, ముస్తాబాద్ (సిరిసిల్ల): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన గూడెంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వేరియంట్ నిర్ధారణకు నమూనాలను హైదరాబాద్కు పంపించారు. గూడేనికి చెందిన పిట్టల చందు ఈ నెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్ ఎయిర్పోర్టులో పరీక్ష చేయించుకోగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిన సంగతి విదితమే. దీంతో జిల్లా వైద్యాధికారి, మండల వైద్యాధికారి అప్రమత్తమై.. సదరు వ్యక్తితో కాంటాక్టు అయిన 16 మందిని హోమ్ క్వారంటైన్ చేశారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా అతని భార్య, తల్లికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారి సంజీవ్రెడ్డి బుధవారం తెలిపారు. ప్రస్తుతం వీరికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గూడెంలో ఒమిక్రాన్ నమోదవడం, మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో లాక్డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే దుకాణాలు, హోటళ్లు, బడులు మూసివేశామంది. మరో పది రోజులపాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. హయత్నగర్లో ఒమిక్రాన్ హయత్నగర్: హయత్నగర్ డివిజన్లో ఒమిక్రాన్ కేసు బయటపడటంతో స్థానికంగా కలకలం రేగింది. మూడు రోజుల క్రితం సూడాన్ దేశం నుంచి వచ్చి సత్యనారాయణ కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యిందని హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతీ దివాకర్ తెలిపారు. దీంతో అధికారులు ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులకూ పరీక్షలు నిర్వహించారు. అతడి ప్రాథమిక కాంట్రాక్ట్లపై దృష్టి పెట్టి కాలనీలోని మరో 30 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది. #Lockdown: Gudem Village in Rajanna Sircilla dt enters into a self imposed #lockdown for 10 days after Gulf returnee tested positive for #OmicronVariant. His family too tested +ve for #Covid19 but not for #Omicron. All shops closed. #Telangana. pic.twitter.com/D7nxMsX3lh — krishnamurthy (@krishna0302) December 23, 2021 > -
వచ్చే నెల తొలి వారంలో ‘హెల్త్ ప్రొఫైల్’
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాత్మక హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేనెల మొదటివారంలో ముందుగా ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఊరూరా ఇల్లిల్లూ తిరిగి ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం సేకరించి హెల్త్ ప్రొఫైల్ను పక్కాగా రూపొందించాలని సూచించారు. సోమవారం ఇక్కడ జరిగిన వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఈ పరీక్షలు పూర్తయినవారి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో క్లౌడ్ స్టోరేజ్ చేస్తారని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఆసుపత్రికి వెళ్లినా, యాక్సిడెంట్కు గురైనా అతడి ఆరోగ్య సమాచారమంతా క్లౌడ్ స్టోరేజ్ నుంచి తెప్పించుకుని వైద్యసేవలు అందిస్తారని అన్నారు. హెల్త్ ప్రొఫైల్ సమాచారం పకడ్బందీగా ఉంటే, ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ఏ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి... ఆ ప్రాంతంలో ఎలాంటి వైద్యసేవలు, మందులు అవసరం... ఎలాంటి వైద్య నిపుణులు, వైద్య పరికరాలు అవసరం... అనేవి తెలుస్తాయని వివరించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్లో ప్రస్తుతం 8 పరీక్షలు చేస్తుండగా, తెలంగాణ డయాగ్నసిస్ ద్వారా 57 టెస్టులు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇందులో వాడే పరికరాల ద్వారా ఫలితాలు కచ్చితంగా ఉంటాయని, రోజుకు పదివేల పరీక్షలు చేయొచ్చని పేర్కొన్నారు. నోడల్ ఆఫీసర్ల ద్వారా వేగంగా.. ప్రతి ఇంటికి వెళ్లి అందరి ఆరోగ్య సమాచారం తీసుకోవాలని, నోడల్ ఆఫీసర్లను నియమించి ఈ ప్రక్రియ వేగంగా సాగేలా చూడాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ను ఎలా తయారు చేయనున్నారనే వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారం, ఆధార్ నంబర్, డెమోగ్రాఫిక్ వివరాలు, షుగర్, బీపీ, ఇతర వ్యాధుల సమాచారం సేకరించనున్నట్లు తెలిపారు. ఈ సమాచారం ద్వారా వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన రిస్క్ అంచనా వేసి, హైరిస్క్ వాళ్లకు అవసరమైవ వైద్యసేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్లతో కూడిన కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, వైద్య విధాన పరిషత్ కమిషనర్ రమేశ్రెడ్డి పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి విద్యార్థుల గల్లంతు
సిరిసిల్ల: సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లారు.. ఒకరి వెంట ఒకరు ఐదుగురు అందులో దూకారు.. లోతు ఎక్కువగా ఉండటంలో దూకిన విద్యార్థులంతా గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా, మిగతా నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్లపల్లి శివారులోని మానేరు వాగులో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల పట్టణ శివారులోని రాజీవ్నగర్కు చెందిన ఈ విద్యార్థులంతా జిల్లా కేంద్రంలోని కుసుమ రాజయ్య జెడ్పీ హైస్కూల్లో చదువుతున్నారు. పాఠశాలలో సోమవారం బాలల దినోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటకు ఇంటికి వెళ్లిన పిల్లల్లో 8 మంది భోజనం చేసి మానేరు వాగు వద్దకు ఈతకు వెళ్లారు. ముందుగా రాజీవ్నగర్కు చెందిన కొలిపాక గణేశ్(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్(14), కొంగ రాకేశ్ (15) శ్రీరామ్ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్(14), దిడ్డి అఖిల్(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వాగులో గాలించగా.. గణేశ్ మృతదేహం లభ్యమైంది. వెంకటసాయి, అజయ్, రాకేశ్, శ్రీరామ్ క్రాంతిల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈత కోసం వెళ్లిన ఐదుగురు స్నేహితులు నీటిలో గల్లంతవడం సిరిసిల్ల పట్టణంలో విషాదాన్ని నింపింది. సోమవారం రాత్రి వరకు నలుగురి పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఓ వైపు వర్షం.. మరోవైపు చిమ్మచీకటి.. ఇంకోవైపు మత్తడి దూకుతున్న వరద.. ఇలాంటి పరిస్థితిలోనూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేతన్నకు అండగా నిలవండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదని, నేత కార్మికులకు అండగా నిలిస్తేనే టెక్స్టైల్ రంగం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ లాంటి ప్రగతిశీల రాష్ట్రాలకు సరైన మద్దతు ఇవ్వకపోవడంతోనే ప్రపంచంలోని చిన్న దేశాలతో కూడా భారత్ టెక్స్టైల్ రంగంలో పోటీ పడలేకపోతోందని చెప్పారు. సిరిసిల్లలో ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పరిశ్రమలు, టెక్స్టైల్ శాఖ మంత్రి పీయూష్ గోయల్కు కేటీఆర్ ఆదివారం లేఖ రాశారు. కేంద్రం నుంచి సరైన ప్రోత్సాహం లేకున్నా తెలంగాణ వస్త్రోత్పత్తి రంగంలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించినట్లు లేఖలో పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో టెక్స్టైల్ రంగానికి అనువైన పరిస్థితులు లేకున్నా వాటిని ప్రోత్సహిస్తూ, అన్ని వసతులు కలిగిన తెలంగాణను నిర్లక్ష్యం చేస్తున్నారని వెల్లడించారు. మెగా క్లస్టర్తో ఉపాధి అవకాశాలు కాంప్రహెన్సివ్ పవర్లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీంలో భాగంగా సిరిసిల్లలో ‘మెగా పవర్లూమ్ క్లస్టర్’ఏర్పాటు చేస్తే స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఢిల్లీకి స్వయంగా వచ్చి విన్నవించినా కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. మరమగ్గాల కార్మికుల కోసం రాష్ట్రంలో 40శాతం సబ్సిడీతో వేజ్ కంపెన్సెషన్ స్కీం, నేతన్నకు చేయూత వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైద్రాబాద్లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. చదవండి: బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ -
బాలికపై టీఆర్ఎస్ సర్పంచ్ అత్యాచారం.. బాధితురాలికి బండి పరామర్శ
సాక్షి, నాంపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావు పేట మండలం వట్టిమళ్ళ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల గిరిజన బాలికపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు అత్యాచారం చేసి హత్య చేసే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గమైన సంఘటన అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. రెడ్హిల్స్లోని నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం పరామర్శించేందుకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. చివరి ఘడియలో బాలిక ప్రాణాలు కాపాడే ప్రయత్నం జరిగిందని అన్నారు. స్థానిక ప్రజానీకం ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించలేదన్నారు. అభం శుభం తెలియని చిన్నారి బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులని మండిపడ్డారు. సిరిసిల్లలో సీఎంఓ ఒత్తిడి, మంత్రి ఒత్తిడితో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారే తప్ప, అత్యాచారానికి గురైన పాపను రక్షించాలనే సోయి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా చేసుకోవచ్చని, వీరు లైసెన్స్ కలిగిన గూండాలుగా మారారని సంజయ్ దుయ్యబట్టారు. సిరిసిల్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు. వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై.. కాగా.. సభ్య సమాజం తలదించుకునేలా ఓ బాధ్యతగల పదవిలోఉండి చిన్నారిపై మృగంలా ప్రవర్తించిన ఆ నేత తీరు ఆది నుంచి వివాదస్పదమే.. అల్మాన్పూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త, రైతుబంధు మండల అధ్యక్షుడు రాధారపు శంకర్(48) ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడటం అధికార టీఆర్ఎస్ పార్టీని కూడా కుదిపేసింది. గిరిజన బాలికపై అత్యాచారం చేసిన శంకర్ ప్రస్తుతం జైలులో ఊచలులెక్కిస్తున్నారు. కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన గిరిజన దంపతులు ఉపాధి కోసం అల్మాన్పూర్కు వచ్చి అద్దె శంకర్కు చెంది న ఇంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల చిన్నారి ఉంది. ఉద్యోగరిత్యా వీరు బయటకు వెళ్లగా.. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన బాలిక శంకర్ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికకు చాక్లెట్లు ఇస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. రెండు రోజు అంనతరం కడుపులో నొప్పి వస్తుందంటూ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగుచూసింది. సిరిసిల్ల ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి: ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ నాంపల్లి: రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, సిరిసిల్ల ఘటనపై వెంటనే పాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూడాలని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన బాధిత బాలికను, తల్లిదండ్రులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ భర్త ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టడం దారుణం అన్నారు. ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన శంకర్పై అనేక ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోందని అన్నారు. నేర చరిత్ర కలిగిన నేతలను టీఆర్ఎస్ పారీ్టలో ఎలా చేర్చుకున్నారో తెలియదు కానీ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. -
సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్: సంతోషంలో కేటీఆర్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్మోహన్రావు, వైద్య సిబ్బందిని ట్విటర్లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ కొత్తగా 558 మందికి వ్యాక్సినేషన్ జిల్లాలో బుధవారం 558 మందికి వ్యాక్సినేషన్ చేశారు. కోవిడ్ పరీక్షలు 2,326 మందికి చేయగా మరో ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వేములవాడలో రెండు, ఇల్లంతకుంటలో ఒక్క కేసు ఉంది. ప్రస్తుతం 193 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 564కు చేరింది. పొలాల బాట పట్టిన వైద్యసిబ్బంది కరోనా వైరస్ నివారణకు జిల్లా వైద్యసిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీకా తీసుకోవడంతోనే కరోనా వైరస్ను ఎదుర్కొనవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం 18 ఏళ్లు పైబడ్డ 4,60,859 మందిని గుర్తించారు. ఫ్రంట్లైన్ వారియర్స్ చేస్తున్న కృషితోనే ప్రస్తుతం జిల్లాలో 135 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ప్రత్యేక కార్యాచరణతో వ్యాక్సినేషన్ జిల్లాలో వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉపఆరోగ్యకేంద్రాలలో క్షేత్రస్థాయి సిబ్బందితో టీకా తీసుకోని వారికి కౌన్సెలింగ్ ఇప్పించారు. టీకా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ సోకినా ఆస్పత్రికి వెళ్తే పరిస్థితులు రావని అవగాహన కల్పిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి మరీ టీకాలు ఇస్తున్నారు. పనిచేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహించారు. జిల్లాలో తొలి, రెండో డోసులను 4,55,544 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో టీకా తీసుకోని వారు 53 వేల మందిని గుర్తించారు. ఏఎన్ఎంలు నిత్యం 13 వేల నుంచి 15 వేల మందికి టీకా ఇస్తున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రత్యేక సందర్భాల్లోనే టీకాకు దూరం జిల్లాలో దాదాపు నూరుశాతం వ్యాక్సినేషన్ అయ్యిందని చెప్పుకోవచ్చు. బాలింతలు, గర్భిణులు, కరోనా పాజిటివ్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు, వివిధ జబ్బులతో ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నవారు మాత్రమే కరోనా టీకా తీసుకోలేదు. ఇలాంటి వారు 5,335 మంది ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది. Congratulations Collector Garu & DMHO team 👏 https://t.co/K8NmPztAs7 — KTR (@KTRTRS) September 29, 2021 -
చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన సిద్దిపేట ఆర్టీసీ బస్సు
సాక్షి, సిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి జిల్లాలో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే పంటలు నీట మునిగాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పలుచోట్ల ఒర్రెలు తెగడం, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనపై ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు. కాగా ఎగువ మానేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో నీరు మత్తడి దుంకుతుంది. దీంతో వాగుల్లో వరద పెరిగింది. అయితే వరదను తక్కువగా అంచనా వేసి బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద మరింత పెరగడంతో మంగళవారం బస్సు పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. -
వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
-
సృజనాత్మకతతోనే నూతన ఆవిష్కరణలు
సాక్షి, హైదరాబాద్: సృజనాత్మకతే నూతన ఆవిష్కరణలకు మూలమని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సమ్మిళిత ఆవిష్కరణల అభివృద్ధికి సాక్ష్యంగా నిలుస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్–2021ను ఆదివారం ఆయన సిరిసిల్లలో ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా ఎంపిక చేసిన 105 ఆవిష్కరణలు తోటి భారతీయుల నిజమైన సమస్యల ఆధారంగా రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో తెలంగాణలోని 33 జిల్లాల నుంచి వందకంటే ఎక్కువ ఆవిష్కర్తలు వర్చువల్ షోకేస్ ద్వారా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో భాగంగా వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంకేతికత, రవాణా, నీరు, ఆరోగ్య రంగాల్లో పాఠశాల విద్యార్థుల నుండి ఇళ్లల్లో తయారీదారుల వరకు, మెకానిక్ నుండి రైతు వరకు వందకి పైగా ఆవిష్కరణలను ఆన్లైన్లో ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆవిష్కరణలను ప్రజలు www. teamtsic. telangana. gov. in/ intinta& innovator& exhibition&2021/ పోర్టల్లో సందర్శించవచ్చు. ఈ కార్యక్రమం కోసం 33 జిల్లాల సైన్స్ అధికారులు జిల్లా కలెక్టర్ల మార్గదర్శకత్వంలో నోడల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. హైదరాబాద్ నుంచి ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్రంజన్ వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. -
దేశంలోనే 100% వ్యాక్సిన్ వేసుకున్న తొలి గ్రామం.. ఎక్కడో తెలుసా?
సాక్షి, సిరిసిల్ల: అది మారుమూల పల్లె. ఒకప్పుడు నక్సలైట్ల కదలికలతో కల్లోలంగా ఉండే ఆ ఊరు ఇప్పుడు కరోనా వైరస్ను కట్టడి చేసే యజ్ఞంలో స్ఫూర్తిగా నిలిచింది. వంద శాతం కోవిడ్–19 కట్టడికి అర్హులైన అందరికీ వ్యాక్సిన్ వేయించాలనే సదాశయంతో ‘ప్రాజెక్టు మదద్’అనే స్వచ్ఛంద సంస్థ ముందుకు రాగా.. ఆ పల్లెవాసులు మద్దతుగా నిలిచారు. ఊరంతా టీకా వేయించుకున్న గ్రామంగా దేశంలోనే గుర్తింపు పొందింది ఆ పల్లె. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట వంద శాతం టీకాతో ఆదర్శంగా నిలిచింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారకరామారావుకు రాజన్నపేట దత్తత గ్రామం కావడం విశేషం. ఎలా సాధించారంటే.. కరోనా భయం నుంచి పల్లెలను కాపాడాలనే సంకల్పంతో ‘ప్రాజెక్టు మదద్’ సంస్థ రాజన్నపేటలో ఐదంచెల విధానాన్ని అమలు చేసింది. ఆ ఊరి జనాభా 2,253. అందులో వ్యాక్సిన్ వేసుకోడానికి అర్హత ఉన్న వారిని ముందుగా ఇంటింటి సర్వే ద్వారా గుర్తించారు. వారికి ముందుగా ఉచితంగా మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేసి ‘ప్రాజెక్టు మదద్’పై నమ్మకాన్ని పెంచారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లకు పల్స్ ఆక్సిమీటర్లు, థర్మామీటర్లను ఉచితంగా ఇచ్చారు. మహిళా సంఘాలు, యువకులను చైతన్యపరిచారు. 52 మహిళా సంఘాల్లోని సభ్యులకు టీకాపై ఉన్న అపోహలను తొలగించారు. అంతే కొద్ది రోజుల్లోనే ఆ ఊరిలో వంద శాతం వ్యాక్సినేషన్ సాకారమైంది. దీనిపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస్రావు స్పందిస్తూ రాజన్నపేట గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని ధ్రువీకరించారు. మిగతా గ్రామాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ వృద్ధురాలి పేరు చింతల రాజవ్వ (70). రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన రాజవ్వ రెండు డోస్ల టీకా తీసుకుంది. ఒంటరిగా ఉండే రాజవ్వకు బీపీ, షుగర్ ఏమీ లేవు. ఆ ఊరిలో ఒక్క రాజవ్వనే కాదు.. 18 ఏళ్లు దాటిన అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. నాలుగు కేంద్రాల్లో.. రాజన్నపేటలో గ్రామ పంచాయతీ, రెడ్డి సంఘం భవనం, మహిళా సంఘ భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏక కాలంలో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేశారు. కోవిషీల్డ్ టీకాను ‘ప్రాజెక్టు మదద్’సంస్థ సొంత ఖర్చులతో కొనుగోలు చేసి ఇవ్వడం విశేషం. కలెక్టర్ ఆదేశాల మేర కు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్ చేశారు. ఇప్పుడు రాజన్నపేటకు కోవిడ్ను నిరోధించగల సత్తా చేకూరింది. ఆ ఊరి అభివృద్ధికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారు. ‘ప్రాజెక్టు మదద్’ గురించి.. అమెరికాలో స్థిరపడిన కొంతమంది భారతీయ వైద్య నిపుణులు పల్లె ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ‘ప్రాజెక్టు మదద్’ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ‘ఫస్ట్ అమెరికన్ లైఫ్’, ‘కాల్ హెల్త్’, ‘రిపుల్స్ ఆఫ్ కైండ్నెస్ ఫౌండేషన్’సంస్థలు చేయూతనిచ్చాయి. దీంతో నేరుగా ప్రజల ముంగిట్లోకి వెళ్లి పని చేసి సక్సెస్ అయింది. రాజన్నపేటలో మాస్కులతో మహిళలు శక్తివంతమైన విధానంతో.. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న శక్తివంతమైన విధానాన్ని రాజన్నపేటలో అమలు చేశాం. కరోనా కట్టడికి వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో చేయించడం ఒక్కటే మార్గమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వమొక్కటే ఈ పని చేయలేదని భావించి పల్లె ప్రజలకు సేవ చేసేందుకు పూనుకున్నాం. సక్సెస్ అయ్యాం. – బలరాం రెడ్డి, ప్రాజెక్టు మదద్ నిర్వాహకుడు అందరూ సహకరించారు మా ఊళ్లో వంద శాతం వ్యాక్సినేషన్ అయింది. ‘ప్రాజెక్టు మదద్’సంస్థతో పాటు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, గ్రామస్తుల సహకారంతో ఇది సాధ్యమైంది. దేశంలోనే మా ఊరికి పేరు రావడం సంతోషంగా ఉంది. – ముక్క శంకర్, సర్పంచ్, రాజన్నపేట అర్హులందరికీ టీకా వేశాం.. రాజన్నపేటలో ఇం టింటా సర్వే చేయిం చి వ్యాక్సినేషన్ చేశాం. అర్హులందరికీ టీకా ఇచ్చాం. – సుమన్మోహన్రావు, జిల్లా వైద్యాధికారి -
‘పెద్దింటి’కి సినీ స్వర్ణ కమలం అవార్డు
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కథకుడు, సినీరచయిత పెద్దింటి అశోక్కుమార్కు సినీ స్వర్ణ కమలం అవార్డు లభించింది. సినిమా రంగంలో ప్రతిభావంతులకు ఇచ్చే ఈ అవార్డును ఉత్తమ రచయిత విభాగంలో 2020 సంవత్సరానికిగాను పెద్దింటి అశోక్కుమార్కు ఇస్తున్నట్లు అవార్డు కమిటీ సభ్యులు సీవీఎల్ నరసింహరావు ప్రకటించారు. కథకుడిగా తెలంగాణ భాష, యాసలపై పట్టుకున్న ‘పెద్దింటి’ పది సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. ఆయన మాటలు, పాటలు రాసిన ‘మల్లేశం’ సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ప్రస్తుతం అశోక్కుమార్ ముగ్గురు ప్రముఖ అగ్రహీరోల సినిమాలకు మాటల రచయితగా పనిచేస్తున్నారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అశోక్కుమార్ రాసిన జిగిరి నవల ఆధారంగా హాలీవుడ్ హంగులతో సిని మాగా రూపొందుతుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ప్రస్తుతం సిరిసిల్లలో స్థిరపడిన అశోక్కుమార్కు సినీ స్వర్ణకమలం అవార్డు రావడంపై పలువురు ఆయన్ని అభినందించారు. -
కనిపించని కత్తెర...కేసీఆర్ ఆగ్రహం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలోని కేసీఆర్నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి సీఎం రాగా.. భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రిబ్బన్ కట్ చేసేందుకు కత్తెర మరిచిపోయారు. కత్తెర ఏదీ అంటూ కేసీఆర్ ఆరా తీయగా కనిపించలేదు. కొద్దిసేపు వేచి చూసిన సీఎం ఒకింత ఆగ్రహానికి గురై రిబ్బన్ ను పక్కకు జరిపి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. -
సిరిసిల్ల: 12 ప్రమాదాలు.. 69 మంది మృతి
మల్ల వేణి రాజుకి భార్య, పిల్లలు ఉన్నారు. గత బుధవారం సర్దాపూర్ వద్ద కంటైనర్ ఢీకొన డంతో రాజు మరణించగా భార్య సుమలత, ఇద్దరు కొడుకులు మణిదీప్, విక్రమ్ అనాథలయ్యారు. మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మరణంతో ఆ కుటుంబంలో తీరని వేదన మిగిలింది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో పాటు సుమలత, ఇద్దరు పిల్లల పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ కుటుంబ రోదనలు అందరినీ కదిలిస్తున్నాయి. రోడ్డునపడ్డ రాజు కుటుంబంలాగానే ఆరు నెలల కాలంలో జిల్లాలో 69 కుటుంబాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.’ సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతూనే ఉంది. విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారడంతో రహదారులు రద్దీగా మారాయి. అతివేగం, మద్యం మత్తులో వెళ్తుండడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితం అన్నదమ్ములతోపాటు మరో రెండు ఘటనల్లో ఇంకో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇది మరువక ముందే శుక్రవారం ఉదయం సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇసుక లారీ, కారును ఢీకొట్టింది. త్రుటిలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. 112 ప్రమాదాలు.. 69 మంది మృతి జిల్లాలో ఆరునెలల వ్యవధిలో పోలీసులు రికార్డుల ప్రకారం 112 ప్రమాదాలు జరుగగా.. 69 మంది మరణించారు. 98 మంది గాయపడ్డారు. ఇందులో 22 ప్రమాదాలు ఇసుక ట్రాక్టర్లతో జరగడం విశేషం. గాయపడిన వారిలో 30 శాతం మంది పనులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనధికారికంగా జిల్లాలో దాదాపు 150 పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో ఇసుక ట్రాక్టర్లతోనే 22 ప్రమాదాలు జరిగాయి. తెర్లుమద్ది, రాగట్లపల్లి, పోతుగల్, తంగళ్లపల్లి, వెంకటాపూర్ వద్ద ట్రాక్టర్ల ప్రమాదాల్లో 10 మంది వరకు మరణించారు. రోడ్డున పడుతున్న కుటుంబాలు జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల్లో జరిగిన ప్రమాదాలతో సుమారు 295 మంది కుటుంబసభ్యులు రోడ్డున పడ్డారు. గత నెల 30న జిల్లాలోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై నాలుగు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మరణించడంతో ఆ రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు రోడ్డున పడ్డారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పట్టించుకోనే వారు లేక దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. పిల్లలను చదివించే స్థోమత లేక కూలీలుగా మారుతున్నారు. ప్రమాదకర మూలమలుపులు ఇవే.. జిల్లాలోని రాగట్లపల్లి, వెంకటాపూర్, పెద్దూరు, సర్దాపూర్, సిరిసిల్ల బైపాస్, చంద్రపేట ఎక్స్రోడ్డు, తంగళ్లపల్లి, వేములవాడ కామన్, నాంపలిగుట్ట, జిల్లెల్ల, కంచర్ల, వీర్నపల్లి సబ్స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద కనీసం ఆర్అండ్బీ శాఖ వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. డేంజర్గా జంక్షన్లు ముందుచూపు లేకుండా వేసిన జంక్షన్లు ప్రమాద కేంద్రాలుగా మారాయి. సిరిసిల్ల పట్టణంలోని తంగళ్లపల్లి వెళ్లే బ్రిడ్జి ముందున్న చౌరస్తాతోపాటు అదే దారి గుండా కలిపే రగుడు చౌరస్తా అటు నుంచి సిరిసిల్లకు వచ్చే క్రమంలో చంద్రంపేట జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు హడావుడిగా రక్షణ చర్యలు చేయడం తప్ప శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. సిరిసిల్ల నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభమైతే రగుడు చౌరస్తాలో వాహనాల రద్దీ మరింత పెరిగి ప్రమాదాలు సైతం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నా యి. శాశ్వత ప్రమాదరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. లారీల భయం జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతాల వాసులు అ వసరాల కోసం ఇసుకను తీయడం పరిపాటిగా మా రింది. అంతేకాకుండా కాసులు కురిపించే వనరుగా ఇసుక మారడంతో ఇసుకాసురులు దొడ్డిదారిన లారీ ల్లో అర్ధరాత్రి అతివేగంగా దూరప్రాంతాలకు తరలి స్తున్నారు. ఇలాంటి చర్యలతో పలుమార్లు రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఇసుక లారీ ప్రమాదాల ఘటనను దృష్టిలో పెట్టుకొని అధి కారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. తనిఖీలు ముమ్మరం వాహనదారులు విధిగా హెల్మె ట్, సీటుబెల్టు ధరించాలి. బేఖా తరు చేసిన వారికి జరిమానాలు వేశాం. నిబంధనలు పాటించా లి. భారీ వాహనాల వేగం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్ని ఠాణాల అధికారులకు ఆదేశాలిచ్చాం. లాక్డౌన్ సమయంలో తప్ప ప్రతీ రోజు డ్రంకెన్డ్రైవ్ చేపడుతున్నాం. నిర్ణీత స్పీడ్, వాహనచట్టాన్ని పాటిస్తే ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు. – రాహుల్హెగ్డే, ఎస్పీ -
KTR: కేసీఆర్ను తిడితే పెద్ద లీడర్లు అయిపోరు
సిరిసిల్ల: తెలంగాణను అత్యంత ప్రేమించే సీఎం కేసీఆర్ను తిట్టినంత మాత్రాన పెద్ద లీడర్లు అయిపోరని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నోరుందని కొందరు సీఎం కేసీఆర్ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలా తిట్టే పిచ్చివాళ్లకు మీరే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో ఆర్అండ్బీ శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డితో కలిసి రైతువేదికను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలోనూ ఎక్కడా సంక్షేమం ఆగలేదని చెప్పారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, కోనసీమను దాటి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నామని.. ఇది సీఎం కేసీఆర్ సాధించిన ఘనత కాదా అని కేటీఆర్ అన్నారు. సమైక్యాంధ్ర పాలనకు, తెలంగాణ స్వరాష్ట్ర పాలనకు కొదురుపాక పాత బ్రిడ్జి.. కొత్త బ్రిడ్జి సాక్ష్యాలని పేర్కొన్నారు. కొదురుపాకలో తన అమ్మమ్మ, తాతయ్య జోగినిపల్లి లక్ష్మి, కేశవరావు జ్ఞాపకార్థం సొంత డబ్బులతో కేటీఆర్ రైతువేదికను నిర్మించారు. అమ్మమ్మ ఊరు కొదురుపాకతో ఉన్న చిన్ననాటి జ్ఞాపకాలను కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే.. రాష్ట్రంలోని అర్హులందరికీ వెనకా ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేటల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రులు ప్రారంభించి మాట్లాడారు. ఇప్పుడు ఇళ్లు రానివారు నారాజు కావద్దని, భవిష్యత్లో తప్పకుండా వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ పేదల ముఖాల్లో చిరునవ్వు చూడాలనే సంకల్పంతోనే ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ దేశంలోనే అత్యుత్తమ మంత్రిగా పేరు సంపాదించారన్నారు. ఆయన చొరవతో ఐటీ పరిశ్రమలు వస్తున్నాయని, 19వేల ఎకరాల్లో, రూ.75వేల కోట్లతో ఫార్మా హబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఎల్లారెడ్డిపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలతో పాటు, కొత్తబట్టలు అందించారు. వారితో కలిసి మంత్రులు సహపంక్తి భోజనాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సిరిసిల్లలో తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్, కొదురుపాకలో రైతు వేదిక, విలాసాగర్లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్హెగ్డే పాల్గొన్నారు. గల్ఫ్ బందీల విడుదలకు భరోసా సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన శివరాత్రి రవి, మల్లేశం, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు 15 ఏళ్లుగా దుబాయ్ జైల్లో బందీలుగా ఉన్నారు. వీరి కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ను కలిసి కన్నీరు పెట్టుకున్నారు. ఆ బందీల విడుదలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. గతంలో వీరి విడుదల కోసం రూ.15 లక్షలు చెల్లించామని, దౌత్యపరమైన చర్చల ద్వారా వారి విడుదలకు కృషిచేస్తామని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఉందా? రైతుబంధు ఇచ్చే సంస్కారం ఉందా? రైతుబీమా కల్పించే ఆలోచన ఉందా..? ఆడపిల్ల పెళ్లికి కల్యాణలక్ష్మి ఇస్తున్నారా..? రైతు వేదికలు ఉన్నాయా? అని ప్రతిపక్షాలను కేటీఆర్ ప్రశ్నించారు. -
టీటీడబ్ల్యూఆర్డీసీఎస్లో పార్ట్టైం టీచింగ్ పోస్టులు
హైదరాబాద్లోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చెందిన సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్(టీటీడబ్ల్యూర్డీసీఎస్)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ సబ్జెక్టుల్లో పార్ట్టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► డైరెక్టర్ హానరరీ: అర్హత: మాస్టర్ ఆఫ్ డిజైన్/పీహెచ్డీతో సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.60,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాషన్ డిజైన్: అర్హత: ఫ్యాషన్ డిజైన్/ఫ్యాషన్ టెక్నాలజీలో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఇంటీరియర్ డిజైన్: అర్హత: ఇంటీరియర్ డిజైన్/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ ఫోటోగ్రఫీ: అర్హత: ఫోటోగ్రఫీ/తత్సమాన సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► పార్ట్టైం ఫ్యాకల్టీ ఇన్ కంప్యూటర్ సైన్స్: అర్హత: ఎంసీఏ/ఎంటెక్(సీఎస్ఈ/ఐటీ) తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: www.ttwrdcs.ac.in మరిన్ని నోటిఫికేషన్లు: ఆర్సీబీలో టెక్నికల్ కొలువులు డీఎస్ఎస్ఎస్బీలో 7236 ఉద్యోగాలు -
‘సొంత పార్టీ నేతలే ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, సిరిసిల్ల: అండగా నిలవాల్సిన సొంత పార్టీ నాయకులే తన వ్యవసాయ భూమి విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ లింగం రాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి తక్కళ్ల సుందర్ తాడూరు గ్రామ శివారు సర్వే నంబర్ 1147లో ఎకరం 22 గుంటలు వ్యవసాయ భూమిని 1985లో సాదాబైనామా ద్వారా కొనుగోలు చేశారని అన్నారు. అప్పటినుంచి కాస్తులో తామే ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదన్నారు. దీనిని సాకుగా చూపుతూ ఆ భూమి తమదేనని టీఆర్ఎస్ నాయకుడు కుర్మ రాజయ్య తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. తనకు రూ.70 వేలు ఇస్తేనే భూమిని వదిలేస్తానని డిమాండ్ చేయడంతో గతేడాది రూ.30వేలు చెల్లించానని తెలిపారు. ప్రస్తుత సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ అన్న అనంతరెడ్డి ఆ భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. వీరికి తంగళ్లపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు కూడా అండగా ఉన్నాడని ఆరోపించారు. సొంత పార్టీ వాళ్లే ఇలా తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా వారికే వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుంటానని ఆమె హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులపై సొంత పార్టీకి చెందిన మహిళా నాయకురాలు మాజీ ఏఎంసీ చైర్పర్సన్ స్థాయి వ్యక్తి ఆరోపణలు చేయడంపై మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయం మండల టీఆర్ఎస్లో చిచ్చు రేపుతుందో? లేదా టీ కప్పులో తుపానులా సద్దుమణుగుతుందోనని టీఆర్ఎస్ కార్యకర్తలు గుసగసులు పెడుతున్నారు. చదవండి: ఆక్సిజన్ కొరత.. కొండా విశ్వేశ్వర్రెడ్డి గుడ్న్యూస్ కన్నీరు పెడుతున్న లింగం రాణి -
మాస్క్.. సిరిసిల్ల మార్క్..!
‘‘జూకీ మిషన్పై మాస్క్లు కుడుతున్న ఈ అమ్మాయి పేరు దిడ్డి అనుప్రియ. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్కు చెందిన అనుప్రియ డిగ్రీ చదివింది. ఏడాదిగా మాస్క్లు కుడుతోంది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 మాస్క్లు కుట్టగా.. ఒక్కో మాస్క్కు రూ.1.50 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన నెలకు సగటున ఆరు వేల వరకు మాస్క్లు కుడుతూ.. రూ.9 వేలు సంపాదిస్తోంది. ఒక్క అనుప్రియనే కాదు.. సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మూడు వేల మంది యువతులు, మహిళలు మాస్క్లు కుడుతూ ఉపాధి పొందుతున్నారు.’’ సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్రోత్పత్తి ఖిల్లా. ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు తయారు అవుతాయి. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి మాస్క్ల తయారీకి శ్రీకారం చుట్టారు. 50 మంది హోల్సేల్ వ్యాపారులు నేరుగా వివిధ రంగుల్లో మాస్క్లను కుట్టిస్తున్నారు. నాణ్యమైన కాటన్ బట్టతో పాటు, మామూలు పాలిస్టర్ బట్టతోనూ మాస్క్లు కుడుతున్నారు. మెటీరియల్ అందిస్తూ.. జాబ్ వర్క్లాగా మహిళలు పని చేస్తున్నారు. మూడు వేల మంది మహిళలు నిత్యం నాలుగు నుంచి ఐదు లక్షల మేరకు మాస్క్లు కుడుతున్నారు. నాణ్యతను బట్టి ఒక్కో మాస్క్ ధర రూ.6 నుంచి రూ.25 వరకు ధర ఉంటుంది. సిరిసిల్ల మాస్క్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మాస్క్ల వాడకం తప్పని సరైంది. వినియోగం కూడా భారీగా పెరిగింది. సిరిసిల్ల నుంచి నేరుగా హైదరాబాద్కు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి నుంచి దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు, వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. కాటన్ మాస్క్లకు డిమాండ్ కాటన్ మాస్క్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. నా వద్ద 50 మంది మహిళలు జాబ్ వర్క్గా పని చేస్తారు. నేను హైదరాబాద్కు మాస్క్లు సరఫరా చేస్తాను. క్వాలిటీని బట్టి ధర ఉంది. సిరిసిల్లలో మాస్క్ల తయారీ భారీ ఎత్తున సాగుతోంది. మహిళలకు మంచి ఉపాధి లభిస్తుంది. –గుంటుక కోటేశ్వర్, యజమాని, సిరిసిల్ల బీడీల పని కంటే బెటర్ నేను గతంలో బీడీలు చేశాను. రోజుకు 500 బీడీలు చేస్తే నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 వచ్చేవి. నా భర్త సాంచాలు నడిపిస్తారు. ఇప్పుడు మాస్క్లు కుడుతున్న. ఏడాదిగా చేతి నిండా పని ఉంది. ఎన్ని మాస్క్లు కుడితే అంత కూలి వస్తుంది. నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వస్తుంది. బీడీల పని కంటే బెటర్. –దాసరి మాధవి, కార్మికురాలు నెలకు రూ.6 వేలు వస్తున్నాయి నేను మాస్క్లు, లంగాలు కుడుతూ.. నెలకు రూ.6 వేల వరకు సంపాదిస్తున్న. గతంలో నేను బీడీలు చేస్తే నెలకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వచ్చేవి. ఇప్పుడు పని బాగుంది. ఎంత పని చేస్తే అంత కూలి వస్తుంది. నా భర్త గార్మెంట్ యూనిట్ నిర్వహిస్తాడు. ఆయనతో పాటు నేను పని చేస్తాను. –గాజుల జయలక్ష్మీ, కార్మికురాలు -
ఆగస్ట్లో మునిగింది.. ఏప్రిల్లో తేలింది
దండేపల్లి (మంచిర్యాల): మంచిర్యాల–జగిత్యాల జిల్లాల సరిహద్దులో గోదావరి నదిపై ఉన్న రాయపట్నం పాత వంతెన తేలింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్వాటర్తో గత ఆగస్ట్లో ఈ వంతెన నీట మునిగింది. తొమ్మిది నెలలపాటు నీటిలోనే మునిగి ఉన్న ఈ వంతెన ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గడంతో తేలింది. వంతెనతో పాటు నది ఒడ్డున గల శనేశ్వరాలయం, పుష్కర ఘాట్లు కూడా బయటకు కనిపిస్తున్నాయి. నదిలో ప్రస్తుతం పాత వంతెనకు సమానంగా నీరు నిలిచి ఉంది. జలసిరితో చెరువులు.. పసిడి పచ్చని పంటలు ముస్తాబాద్ (సిరిసిల్ల): కాళేశ్వరం గోదావరి జలాల తో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం లోని చెరువులు, కుంటలు జలసిరిని సంతరించుకున్నాయి. ఆ చెరువుల కింద పసిడి పచ్చని పంట పొలాలు కనువిందు చేస్తున్నాయి. మండు వేసవిలో మద్దికుంట ఊర చెరువు, దానికింద కోతకు వచ్చిన వరి పంట బంగారు వర్ణంలో మెరిసిపోతుండగా.. కోతకు రాని పంట పచ్చదనంతో ఉట్టిపడుతోంది. ఇక ముస్తాబాద్ పెద్ద చెరువు గోదావరి జలాలతో మత్తడి పోస్తూ ప్రకృతి రమణీయతతో అలారారు తోంది. ఈ రెండు దృశ్యాలు ఇక్కడి ప్రకృతి ప్రేమికుల మనసులకు ఆహ్లదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ చదవండి: హైదరాబాద్లో జనాభాకు మించి ఆధార్ కార్డులు.. ఎందుకో తెలుసా? వైరల్: మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి! -
Sircilla: సాంచాల సవ్వడి షురూ..
ఇతడి పేరు రాజమౌళి. సిరిసిల్లలోని సుందరయ్యనగర్లో పవర్లూమ్ కార్మికుడు. భార్య అనసూర్య బీడీ కార్మికురాలు. పది రోజులపాటు ఆసాముల సమ్మెతో రూ.3,500 వరకు వేతనం కోల్పోయాడు. మూడు రోజుల కిందట సమ్మె ముగియడంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి మొదలైంది. ఇప్పుడు చీరల ఉత్పత్తి ద్వారా వారానికి రూ.4 వేల వరకు వేతనం పొందనున్నాడు. ఒక్క రాజమౌళే కాదు.. కార్మిక క్షేత్రంలోని సుమారు 20 వేల మంది కార్మికుల జీవన స్థితి ఇది. సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలను అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల నేతన్నలకు తయారీ ఆర్డర్లు అందించింది. గతానికి భిన్నంగా ఇప్పుడు సిరిసిల్ల వస్త్రోత్పత్తిలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పాత మరమగ్గాలకు (పవర్లూమ్స్) డాబీలను, జకార్డులను అమర్చి ఆధునిక హంగులతో, నేటితరం మహిళలు కోరుకునే డిజైన్లతో బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు. ఆధునిక హంగులతో.. భూటకొంగుతో, బార్డర్ లైనింగ్తో బతుకమ్మ చీరలు తయారవుతున్నాయి. వస్త్ర పరిశ్రమలో 29,680 మరమగ్గాలు ఉండగా.. ఇప్పటికే 14 వేల మగ్గాలపై బతుకమ్మ చీరల ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి ఐదేళ్లలో ఎంతోమార్పు.. నేతన్నల వస్త్రోత్పత్తి నైపుణ్యాన్ని ఏటేటా జౌళిశాఖ మెరుగు పరుస్తోంది. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చిన తొలిఏడాది 2017లో 52 రంగుల్లో కోటి చీరలను రూ.280 కోట్లతో ఉత్పత్తి చేశారు. 2018, 2019లో 100 రంగుల్లో కోటి చీరలు తయారు చేశారు. 2020లో 225 రకాల బతుకమ్మ చీరలను అందించారు. ఈ ఏడాది భూటకొంగుతో ఉత్పత్తి చేస్తుండగా.. కొత్త డిజైన్లలో లైనింగ్తో నవ్యమైన చీరలను ఉత్పత్తి చేస్తున్నారు. 136 మ్యాక్స్ సంఘాలకు, 138 చిన్న తరహా పరిశ్రమలకు, టెక్స్టైల్ పార్క్లోని 70 యూనిట్లకు చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. బతుకమ్మ చీరల ఆర్డర్లతో 20 వేల మంది సిరిసిల్ల నేతన్నలకు ఆరు నెలలపాటు చేతినిండా పని లభిస్తుంది. కార్మికులకు మెరుగైన వేతనాలు అందనున్నాయి. ఇక్కడ చదవండి: కరోనా ఎఫెక్ట్; మళ్లీ పెరుగుతున్న నిరుద్యోగం! ఢిల్లీ బస్సు వచ్చింది.. వంద కోట్లు మింగింది! -
మాస్క్ తీసి ఫొటో దిగు నాయనా..
గంభీరావుపేట (సిరిసిల్ల): ఇష్టమైన నాయకులు, సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. ప్రతీ ఒక్కరు సెల్ఫీ దిగుతుంటారు. అలాగే, చంద్రకళ అనే వృద్ధురాలు కూడా మంత్రి కేటీఆర్తో సెల్ఫీ దిగాలనుకుంది. సోమవారం సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండల కేంద్రంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్కు ఆ బామ్మ ఎదురు వచ్చింది. ‘ఏం కావాలమ్మా?’అని కేటీఆర్ అడగగా.. ‘నీతో సెల్ఫీ దిగాలని వచ్చిన బిడ్డా..’అని బదులిచ్చింది. దీంతో కేటీఆర్ ఆమెతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, కేటీఆర్ మాస్కు ధరించి ఉండటంతో ‘మాస్కు తీసి ఫొటో దిగు నాయనా..’అని అడిగింది. ఆమె కోరిక మేరకు కేటీఆర్ మాస్కు తీసి ఫొటో దిగారు. (చదవండి: కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అంతా గప్చుప్!) (పాత వేపచెట్టు : భారీ జరిమానా) -
ఉద్రిక్తత: మంత్రి కేటీఆర్కు నిరసన సెగ
సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. కోనరావుపేటలో మంత్రి కాన్వాయ్ని బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని పక్కకు నెట్టేశారు. ఈ క్రమంలో అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరకాల ఎమ్మెల్యే ఇంటిపై దాడిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసి వారికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి పర్యవసానంగా కేటీఆర్కు సొంత జిల్లాలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. సిరిసిల్ల పర్యటనకు సోమవారం మంత్రి కేటీఆర్ వచ్చారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ని కోనరావుపేటలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘెరావ్ చేసేందుకు యత్నించారు. వరంగల్ ఘటన నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. రైతు వేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్ను అడ్డుకునేందుకు యత్నించారు. కాన్వాయ్లోకి కార్యకర్తలు దూసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్త ఒకరు పోలీసులను చేదించుకుని రోడ్డుపైకి దూసుకురావడంతో కానిస్టేబుల్ గట్టిగా పట్టుకున్నాడు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తల ప్రయత్నాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించారు. దీంతో బీజెపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాటతో ఘర్షణ వాతావరణం ఏర్పడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలను టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లగొట్టారు. అప్పటికే పోలీసులు పలువురు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా వారిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. వెంటనే కమలం కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం మంత్రి కేటీఆర్ పర్యటన పోలీసుల సహాయంతో సాఫీగా సాగింది. -
వీరిద్దరినీ గుర్తు పట్టారా..?
సిరిసిల్ల: వీరిద్దరినీ గుర్తు పట్టారా..? రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన వ్యక్తులు. ఒకరు కేటీఆర్, మరొకరు హరీశ్రావు. ఇద్దరూ బావబామ్మర్దులు. యుక్త వయస్సులో ఉండగా దిగిన ఫొటో ఇది. సిరిసిల్లలో శనివారం సోషల్ మీడియాలో ఈ ఫొటో వైరల్ అయింది. యువకులుగా ఉన్న ఆ ఇద్దరు మంత్రుల పాతఫొటో ఓ మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుందని టీఆర్ఎస్ నేతలు చర్చించుకున్నారు. -
‘సిరి’సిల్ల మురుస్తోంది..!
సాక్షి, సిరిసిల్ల : ఆత్మహత్యలు, వలసలు, కార్మికుల సమ్మెలు ఇదీ దశాబ్దంక్రితం సిరిసిల్ల ఉరిసిల్లగా మారిన నేతన్న బతుకుచిత్రం. నేడు వస్త్రోత్పత్తి ఆర్డర్లతో సాంచాల(పవర్లూమ్స్) వేగం పెరిగి నాటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా ‘సిరి’సిల్లగా వెలుగొందుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిన సిరిసిల్ల ఇప్పుడు చేతి నిండా పనితో మురిసిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 74వేల మరమగ్గాలు ఉండగా, ఒక్క సిరిసిల్లలోనే 34వేలు ఉన్నా యి. వీటిలో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్ బట్ట, ఏడు వేల పవర్లూమ్స్పై కాటన్(ముతక రకం) బట్ట ఉత్పత్తి అవుతోంది. ఈ రంగంలో 25 వేల మంది కార్మికులు ఉపాధి లభిస్తోంది. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా అద్దకం, సైజింగ్, వైపణి, వార్పిన్ పనులు ఉంటాయి. గతంలో సిరిసిల్లలో ఉపాధి లేక నేత కార్మికులు ముంబయి, బీవండి, షోలాపూర్, సూరత్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లే వారు. కానీ ఆరేళ్లలో వచ్చిన మార్పు కారణంగా సిరిసిల్ల కార్మికులు వలసలకు టాటా చెప్పారు. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రా ష్ట్రాల కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. చదవండి: ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు మార్పునకు కారణాలు సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించింది. నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లను సిరిసిల్లకు అందించారు. తొలిసారి 2017లో రూ.280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.100 కోట్ల ఆర్వీఎం, సంక్షేమశాఖల ఆర్డర్లు వచ్చాయి. ఇలా నాలుగేళ్లలో రూ.1280 కోట్ల బతుకమ్మ చీరల ఆర్డర్లు రాగా, మరో రూ.400 కోట్ల సర్వశిక్ష అభియాన్, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ ఆర్డర్లు వచ్చాయి. ఈ నాలుగేళ్లలో రూ.1680 కోట్ల ఆర్డర్లు లభించాయి. ప్రతీ కార్మికుడికి ఉపాధి మెరుగైంది. సిరిసిల్ల కార్మికులకు పొదుపు పథకం త్రిఫ్ట్ అమలు చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన బట్టలో 10శాతం నూలు రాయితీ కార్మికులకు అందిస్తున్నారు. ఫలితంగా చేసే పనిలో భవిష్యత్ ఉందనే ఆశ, పొదుపు అలవాటు అయింది. నేతన్నల జీవితాల్లో సామాజిక మార్పు కనిపిస్తోంది. చదవండి: కేసీఆర్ తాతయ్యా.. న్యాయం చేయరూ..! నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర సిరిసిల్ల శివారులోని రాజీవ్నగర్కు చెందిన కొండ కిష్టయ్య తన తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు బిడ్డలకు కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో కిష్టయ్య చిన్న కూతురు ఒక్కరే బతికిపోగా, ఐదుగురు మరణించారు. ఈ ఘటన 2001లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మూడేళ్లుగా పని చేస్తున్న నేను సిరిసిల్లలో మూడేళ్లుగా పని చేస్తున్న. నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం వస్తుంది. మాది బీహార్లోని మధువని జిల్లా పుర్సోలియా గ్రామం. నాకు ముగ్గురు కొడుకులు. ఏడాదికి ఒక్కసారి మా ఊరికి వెళ్లి వస్తా. నాలాగే ఉత్తరప్రదేశ్, ఒడిశావాళ్లు సిరిసిల్లలో వందల మంది పని చేస్తున్నారు. – అస్రఫ్ అలీ, బిహార్ కార్మికుడు ఉపాధిపై నమ్మకం పెరిగింది సిరిసిల్ల వస్త్రపరిశ్రమలో పని చేసే కార్మికుల్లో చాలా మార్పు వచ్చింది. ఉపాధిపై నమ్మకం పెరిగింది. పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రావడంతో మెరుగైన జీతాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడుపుతున్నారు. గతంలో ఉండే గొడవలు తగ్గాయి. కార్మికుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. – కె.పున్నంచందర్, సైకాలజిస్ట్ ఆత్మహత్యలు తగ్గాయి సిరిసిల్లలో ఒకప్పటితో పోల్చితే నేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి. పరిశ్రమలో పని లేకపోవడం అనేది లేదు. సిరిసిల్లలో కార్మికులకు చేతినిండా పని ఉంది. మెరుగైన ఉపాధి లభిస్తుంది. కొన్ని ఆత్మహత్యలు జరుగుతున్నా, కారణాలు వేరే ఉంటున్నాయి. సిరిసిల్లలో కార్మికుల్లో నైపుణ్యం పెరిగింది. పట్టుదలగా పని చేసే తత్వం వచ్చింది. – వి.అశోక్రావు, జౌళిశాఖ ఏడీ -
కేసీఆర్ తాతయ్యా.. న్యాయం చేయరూ..!
సాక్షి, సిరిసిల్ల టౌన్: ‘‘మోదీ తాతయ్యా.. కేసీఆర్ తాతయ్యా.. నా మొర ఆలకించండి.. మూడేళ్లుగా నా ఆస్తిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడు. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మీరైనా స్పందించి న్యాయం చేయరూ ప్లీజ్..’’ అంటూ ఓ ఆరేళ్ల పసివాడు వేడుకుంటున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమత దంపతులు 2017లో అనారోగ్యంతో చనిపోయారు. వీరికి కుమారుడు నాగప్రణీత్ (6) ఉన్నాడు. మమతకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.16 ఎకరాల భూమి సర్వే నంబర్ 108/17, 33/6లో ఉంది. చదవండి: రాబోయే మూడు నెలలు జాగ్రత్త ఈ భూమిని కౌలుకు తీసుకున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి.. మమత, కుమారస్వామి చనిపోయేవరకు కౌలు చెల్లించాడు. అయితే వాళ్లిద్దరూ చనిపోయాక, కొద్ది రోజుల క్రితం ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ లింగంపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్ వరకు మంగళవారం నాగప్రణీత్ తన తాత రాజయ్యతో కలిసి పాదయాత్ర చేశాడు. ఈ విషయంపై గతంలోనే రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అప్పటి జాయింట్ కలెక్టర్ విచారణకు ఆదేశించినా.. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని బాధితులు తెలిపారు. కలెక్టర్ స్పందించి సరైన న్యాయం చేయాలని వేడుకుంటూ మంగళవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. చదవండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్ -
కుక్క తెచ్చిన వివాదం.. కేసు నమోదు
సాక్షి, సిరిసిల్ల : ఆరేళ్ల బాలుడు కుక్క తోకను తొక్కగా అది కరిచేందుకు వచ్చిందని తిట్టిన విషయం సిరిసిల్లలో వివాదానికి కారణమైంది. కుక్కను పెంచుకుంటున్న వారు, పిల్లవాడి తల్లిదండ్రులు పరస్పరం గొడవకు దిగారు. ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సిరిసిల్ల టౌన్ సీఐ వెంకటనర్సయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం రాజీవ్నగర్కు చెందిన బీసు శ్రీనివాస్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి సాయికీర్తన్(6) కుమారుడున్నా డు. ఈ బాలుడు రోజూ మాదిరిగానే ఆదివారం రాత్రి చుట్టుపక్కల ఆడుకొని, తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శ్రీహరి ఇంటి వద్దకు వచ్చాడు. అక్కడ శ్రీహరి వాళ్లు పెంచుకుంటున్న కుక్క రోడ్డుపై ఉండటంతో సాయికీర్తన్ దాని తోక తొక్కాడు. దీంతో అది అరుస్తూ కరిచేందుకు రావడంతో బాలుడి కుటుంబీకులు దాన్ని వెళ్లగొట్టే ప్రయత్నంలో పలు మాటలు అన్నారు. అవి కుక్కను కాదు తమనే అన్నారని దాన్ని పెంచుకుంటున్న వాళ్లు తమపై దాడి చేశారని శ్రీనివాస్ తెలిపాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీహరి, మరొకరిపై, ఇంటి ఎదుట బీడీలు చేసుకుంటున్న తమపై అకారణంగా దాడి చేశారని శ్రీహరి, అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో శ్రీనివాస్తోపాటు మరొకరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
టూరిజానికి కేరాఫ్ తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం 29వ రాష్ట్రంగా ఉద్భవించిన తెలంగాణ పర్యాటక రంగంలో క్రమక్రమంగా పుంజుకుంటోంది. ప్రసిద్ధ దేవాలయంగా, పర్యాటక కేంద్రంగా యాదాద్రి టెంపుల్ రూపుదిద్దుకుంటున్న క్రమంలో రాబోయే రోజుల్లో దేశ, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరగబోతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్లో అతిపెద్ద బౌద్ధ కేంద్రం అన్ని హంగులు సంతరించుకుని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా విలసిల్లడానికి సంసిద్ధమవుతోంది. ఇటు రాష్ట్రం నలుమూలాల ఉన్న గొప్ప సాంస్కృతిక, చారిత్రక వారసత్వాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు వివిధ టూరిస్ట్ సర్క్యూట్లు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ హెరిటేజ్ సర్క్యూట్ పేరిట ప్రతిష్టాత్మకంగా టూరిజం ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ట్రైబల్ టూరిజం సర్క్యూట్, నాగర్కర్నూల్ జిల్లాలో ఎకో టూరిజం, ఆదిలాబాద్ నిర్మల్, కొమురంభీం–ఆసిఫాబాద్ జిల్లాల్లో ట్రైబల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్ల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2019లోని పర్యాటకరంగ పరిస్థితిని ఒకసారి అవలోకిద్దాం... నిజామాబాద్ జిల్లాకు ఒకే విదేశీ టూరిస్ట్ తెలంగాణలో మూడోవంతు జనాభా పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తుండగా అందులో సింహభాగం రాజధాని హైదరాబాద్లోనే నివసిస్తున్న విషయం తెలిసిందే. అయితే పర్యాటక పరంగా చూస్తే.. 2019లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను 8.33 కోట్ల 59 వేల మంది సందర్శించినట్లు తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. వారిలో అత్యధిక శాతం అంటే 99.6 శాతం దేశీయ టూరిస్ట్లు కాగా, 0.4 శాతం అంటే 3,23,326 మంది మాత్రమే విదేశీ పర్యాటకులున్నారు. విదేశీ టూరిస్ట్లు ఎక్కువగా అంటే 3.19 లక్షల మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లోనే పర్యటించారు. ప్రధానమైన ఈ నాలుగు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాకు 2,450 మంది విదేశీ పర్యాటకులు విచ్చేశారు. ఆ తర్వాత ములుగు, మహబూబ్నగర్, గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో వందల సంఖ్యలో, జయశంకర్ జిల్లాలో 45 మంది, మంచిర్యాలలో 10 మంది, ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, నారాయణపేట జిల్లాలో ఐదుగురు, నిజామాబాద్లో ఒకే ఒక విదేశీ టూరిస్ట్ పర్యటించడం గమనార్హం. రాజన్న సిరిసిల్ల టాప్! జిల్లాల్లో పర్యాటక కేంద్రాల విషయానికొస్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా అత్యధికంగా స్థానిక, దేశీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలోనే టాప్ ప్లేస్లో నిలుస్తోంది. మొత్తం దేశీయ పర్యాటకులు 8.30 కోట్లకు గానూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 1.68 కోట్ల మంది పర్యటించారు. ఆ తర్వాతి స్థానంలో రాష్ట్ర రాజధానికి చుట్టుపక్కలున్న నాలుగు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ ) జిల్లాల్లో 1.38 కోట్ల మంది పర్యాటకులు, ఆ తర్వాతి స్థానంలో 1.28 కోట్ల మంది టూరిస్ట్లతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిలిచింది. ఇక 55 లక్షల నుంచి 15 లక్షల లోపు మంది పర్యాటకులు పర్యటించిన జిల్లాల్లో మెదక్, సంగారెడ్డి, యాదాద్రి, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ, ములుగు, వరంగల్ అర్బన్, ఖమ్మం జిల్లాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 7.76 లక్షల మంది పర్యాటకులు, జయశంకర్ జిల్లాలో 6.62 లక్షలు, ఇక నారాయణపేట జిల్లాలో 3.89 లక్షల మంది, వరంగల్ రూరల్ జిల్లాలో 3.53 లక్షల మంది, జనగామ, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలకు 3.28 లక్షలు మొదలుకుని 1.41 లక్షల మధ్యలో పర్యటించారు. కరీంనగర్, నిజామాబాద్, కొమురం భీం, పెద్దపల్లి జిల్లాల్లో 77,491 మొదలుకుని 16,581 మంది మధ్యలో పర్యటించారు. కామారెడ్డి జిల్లాలో అత్యల్పంగా 534 మంది పర్యాటకులు విచ్చేశారు. అయితే ఒక్కసూర్యాపేట జిల్లా పర్యాటకుల గణాంకాలను నివేదికలో చూపలేదు. -
తండ్రిని బలిగొన్న కొడుకు ప్రేమ వ్యవహారం
సాక్షి, సిరిసిల్ల/కరీంనగర్ : జిల్లాలోని బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది. వివరాలు.. బోయినిపల్లి మండలం స్తంభంపల్లి లో తునికి మహేష్ , ఎదురింట్లో ఉండే అమ్మాయి గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దసరా రోజున పారిపోయారు. మరోవైపు పండుగ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చితార్థం ఉంది.ఇంతలోనే మహేష్ గౌతమిని తీసుకుని పారిపోయాడని అమ్మాయి బంధువులు ఆగ్రహించారు. దీంతో ఆగ్రహంతో మహేష్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై దాడి చేశారు. అబ్బాయి తల్లిదండ్రులను తీవ్రంగా కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్బాయి తండ్రి లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురికావడంతో వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అమ్మాయి బంధువులు కొట్టడంతోనే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుని భార్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా పారిపోయిన ప్రేమజంట ఆచూకి మాత్రం లభించలేదు. ప్రేమించిన పాపానికి తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుని భార్య డిమాండ్ చేస్తుంది. లక్ష్మీనారాయణ (ఫైల్ ఫోటో) -
రక్తమోడిన రామోజీపేట
సాక్షి, సిరిసిల్ల: దసరా పండుగ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో రక్తం చిందింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ఊరు రణరంగమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామోజీపేటలో ఇరువర్గాల మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఆదివారం అర్ధరాత్రి ఒక వర్గం వారు డీజే సౌండ్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తుండగా.. మరో వర్గం వారు వద్దని వారించారు. ఈ క్రమంలో పరస్పర దాడులకు దిగారు. ఒక వర్గం వారు కర్రలతో దాడి చేసి ఏడుగురిని గాయపరిచారు. 9 ఇళ్లను ధ్వంసం చేసి ఇంట్లోకి చొరబడి దాడులు చేశారు. 11 వాహనాలను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రామోజీపేటకు చేరుకుని బాధితులను, సిరిసిల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఎస్పీ రాహుల్హెగ్డే, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ సర్వర్లు గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వర్గంవారు కర్రలతో మరో సామాజిక వర్గం వారిపై దాడి చేయడం ఆందోళన కలిగించింది. -
తోటకు కంచెగా బతుకమ్మ చీరలు
తంగళ్లపల్లి (సిరిసిల్ల): తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలు ఓ గ్రామంలో తోటకు కంచెగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని గండిలచ్చపేట గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంటి వద్ద తోటను పశువులు పాడుచేయకుండా ఉండడానికి బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటని ప్రశ్నించగా, గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోకుండా అలాగే ఉంచి ఇలా ఉపయోగించినట్లు తెలిపాడు. కాగా నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహిళలకు పండుగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘బతుకమ్మ చీరలు’పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నెల 17న మొదలయ్యే బతుకమ్మ పండుగను దృష్టిలో చీరల పంపిణీని చేస్తున్నారు. ఈ ఏడాది కోటి చీరలు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఆయా జిల్లాలకు 98.5 లక్షల చీరలను చేరవేశారు. జిల్లాలలో బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోంది. -
శ్రీనివాస్ చనిపోయాడు..
సాక్షి, కరీంనగర్(సిరిసిల్ల): ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తమ సీనయ్య వస్తాడంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన తల్లి, భార్యాబిడ్డలకు కన్నీరే మిగిలింది. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తంగళ్లపల్లి గ్రామ అధ్యక్షుడు జంగపెల్లి శ్రీనివాస్(33) గత ఆదివారం సిద్దిపేట జిల్లా బద్దిపడిగె వాగులో కారుతో సహ గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు వారం రోజులపాటు నిరాటంకంగా కొనసాగగా, శనివారం నంగునూరు మండలం దర్గపల్లి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన స్థానికులకు చెక్ డ్యామ్ సమీపంలోని చెట్లపొదల్లో మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోలీసులు పరిశీలించి శ్రీనివాస్గా గుర్తించారు. మృతి వార్త తెలియగానే తల్లి సత్తవ్వ, భార్య మానస గుండెలుపగిలేలా రోదించారు. శ్రీనివాస్ మరణవార్త విని మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అంత్యక్రియల్లో సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బొల్లి రాంమోహన్, ఎస్సై అభిలాష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు కృతిక, లాస్య, సోదరుడు శేఖర్ ఉన్నారు. -
అగ్రహారం గుట్టల్లో భూతవైద్యుడి బాగోతం
సాక్షి, సిరిసిల్లా : మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత బలై మూడు రోజులు గడవక ముందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో భూతవైద్యం వెలుగులోకి వచ్చింది. సిరిసిల్ల సమీపంలోని పెద్దూరుకు చెందిన భూతవైద్యుడు వేములవాడ మండలం అగ్రహారం గుట్టల్లో భూతవైద్యం చేస్తుండగా స్థానికులు పట్టుకున్నారు. వీడియో చిత్రీకరణ చేయడంతో భూతవైద్యుడితోపాటు దంపతులు పారిపోయారు. (భూతవైద్యం: ప్రాణాలు కోల్పోయిన రజిత) ఇంట్లో ఒంట్లో సమస్యలు ఉంటే నయం చేస్తామని నమ్మించి గుట్టలోకి తీసుకెళ్లి పూజలు మొదలుపెట్టగానే స్థానికులు అక్కడికి చేరుకుని నిలదీశారు. ఇక్కడ ఏం పూజలు చేస్తున్నారు, ఏం వైద్యం చేస్తున్నారంటూ నిలదీస్తూ వీడియో తీయడంతో ఆరోగ్యం బాగు లేకుంటే పూజలు చేస్తున్నామని దంపతులతో పాటు వారి వెంట వచ్చినవారు తెలిపారు. ఇంటి వద్దే వైద్యం చేయించుకోవచ్చు కదా అని సూచించడంతో కరోనా వల్ల ఇంటి వద్దకు కుదరక గుట్టల్లో పూజలు చేస్తున్నామని బ్రతిమాలుతూ భూతవైద్యుడితో పాటు దంపతులు పారిపోయారు. మంచిర్యాల జిల్లాలో భూత వైద్యానికి బాలింత ప్రాణాలు కోల్పోయిన నాలుగు రోజులు గడవక ముందే సిరిసిల్ల జిల్లాలో భూతవైద్యం వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే భూత వైద్యుల నకిలీబాబా ల పట్ల పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
కరోనా వస్తే ఆగం కావొద్దు
సిరిసిల్ల: ప్రపంచమంతా కరోనా వైరస్ విస్తరిస్తుంటే కొందరు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోబోమని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును, ఐసోలేషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనాపై ప్రతిపక్షాలది విజ్ఞత లేని విమర్శలని పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎందుకు తిరుగుతున్నారని పలువురు అంటున్నారని, కానీ ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తాను పర్యటనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా సోకిన వారికి వైద్యం చేయడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మాత్రమే ధైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి అందరూ అండగా ఉండాలని కోరారు. మీడియా కూడా నెగెటివ్ కోణాన్ని వీడి పాజిటివ్గా ఆలోచించాలని సూచించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ చేయడం పరిష్కారం కాదని తేలిపోయిందని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారి పట్ల మానవతా కోణంలో స్పందించి సాయం అందించాలని, వారిని వెలివేసినట్లుగా చూడొద్దని కోరారు. వృద్ధుల ఆత్మహత్య కలచివేసింది హైదరాబాద్లో ఇద్దరు వృద్ధులకు కరోనా సోకడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. నిజానికి కరోనాకు మందే లేదని, నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. ఎంతో మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని వివరించారు. వయసులతో సంబంధం లేకుండా.. బాగయ్యారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావును ఉదహరించారు. మరణాలు చాలా తక్కువ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో కరోనా మరణాలు చాలా తక్కువని, ఒక్క శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా వస్తే.. భయపడి బెంబేలెత్తాల్సిన పని లేదన్నారు. అలాగని నిర్లక్ష్యం తగదన్నారు. ఎవరికి వారు ధీమాగా ఉంటూనే.. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ సూచించారు. నాకు కరోనా వస్తే కోలుకుని ప్లాస్మా ఇస్తా.. తనకు కరోనా వస్తే కోలుకున్నాక ప్లాస్మా ఇచ్చి ఆదర్శంగా ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకి కోలుకున్న టీఆర్ఎస్ నాయకులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని ఆగస్టు నుంచి సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోని శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. జిల్లాలో మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కోసం తాను సొంతంగా రూ.20 లక్షలు ఇస్తున్నానని, సీఎస్ఆర్లో మరో రూ.2.28 కోట్లు సమకూర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. కొత్తగా మంజూరైన ఐదు అంబులెన్స్లను మంత్రి ప్రారంభించారు. నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి పూల మాల వేశారు. -
అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా..
సాక్షి, సిరిసిల్ల : తన బుడిబుడి నడకలతో ఇంటిల్లిపాదిని అలరిస్తూ.. తన చిట్టిచిట్టి మాటలతో అందరినీ ఆనందపజేసే బంగారు కొండ.. ముక్కుపచ్చలారని చిట్టి తండ్రి విగతజీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మూడేళ్ల బుడతడు రుత్విక్ మరణ వార్త విన్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా అని ఆ తల్లి విలపించిన తీరు కలచివేసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కొమిటి దేవయ్య– రేణుక దంపతులకు రుత్విక్ (3) ఒక్కగానొక్క సంతానం. ప్రేమానురాగాలతో సాగిపోతున్న వారి కుటుంబంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. దేవయ్య– రేణుక ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా రుత్విక్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి పక్కన ఉన్న నీటి సంపులో పడిపోయాడు. అతడిని ఎవరూ గమనించలేదు. కొంత సేపటికి తల్లిదండ్రులు రుత్విక్ కోసం వెతుకుతుండగా నీటి సంపులో పడిఉండడం చూసి అతన్ని హుటాహుటిన సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుత్విక్ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఒక్కగానోక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఐఏఎస్లకు జలసిరి పాఠాలు
సిరిసిల్ల: దేశ భవిష్యత్కు బాటలు వేస్తూ.. పాలనా విభాగానికి ప్రాణం పోసే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్)కు ఎంపికైన అధికారులకు శిక్షణనిచ్చే ముస్సోరీలోని లాల్ బహదూర్శాస్త్రి అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కు సిరిసిల్ల ‘జలసంరక్షణ’పాఠ్యాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ఆరేళ్లుగా చేపట్టిన నీటి నిర్వహణ పద్ధతి ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. జిల్లా లో భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందడమే ఇందుకు కారణం. కరువు కోరల్లో చిక్కిన ఈ జిల్లాలో ఇప్పుడు భూగర్భ జలాల మట్టం ఆరు మీటర్లకు పెరగడం విశేషం. కరువు నుంచి జలసిరుల వైపు.. రాజన్న సిరిసిల్ల జిల్లా మెట్ట ప్రాంతం. సముద్ర మట్టానికి సుమారు 1,250 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఒకప్పుడు ఎండిపోయిన వాగులు, చెరువులు.. చుక్క నీరివ్వని బోర్లు.. బీళ్లుగా మారిన పంట భూములు.. వెరసి ముంబై, దుబాయ్లకు వలసలు. ఇదీ రాజన్న సిరిసిల్ల జిల్లా దుస్థితి. కానీ ఇప్పుడు జలసిరులు పొంగుతున్నాయి. మధ్యమానేరు జలాశయానికి గోదావరి జలాలు చేరా యి. ఎల్లంపల్లి ద్వారా వచ్చిన నీటితో సాగునీటి వనరుల్లో నీరు చేరింది. గతేడాది సమృద్ధిగా వర్షాలు పడటంతో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. జిల్లాలో 6 మీట ర్ల లోతుల్లోనే నీటి ఊటలు ఉండటం విశేషం. యువ ఐఏఎస్ల శిక్షణకు ఎంపిక.. ఐఏఎస్కు ఎంపికైన అధికారులకు వివిధ అంశాలపై ముస్సోరీలో శిక్షణ ఇస్తారు. జాతీయ, అంతర్జాతీయ, స్థానిక అంశాలపై ఆదర్శ విధానాలు, పాలనాపరమైన సంస్కరణలపై ఇందులో చర్చిస్తారు. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చేపట్టిన జల నిర్వహణ ఎంపికైంది. ఇక్కడ గత ఆరేళ్లుగా చేపడుతున్న నీటి నిర్వహణ పనులు సత్ఫలితాలు ఇచ్చాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో ముస్సోరీ అకాడమీ సిరిసిల్ల జిల్లాలో చేసిన పనులను డాక్యుమెంట్ రూపంలో అందించాలని ఇక్కడి అధికారులను కోరింది. కలెక్టర్తో మాట్లాడిన అధికారులు.. కలెక్టర్ కృష్ణభాస్కర్తో అకాడమీ అధికారులు ఫోన్లో మాట్లాడారు. జిల్లాలో చేపట్టిన వాటర్ మేనేజ్మెంట్ పనుల వివరాల ను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మధ్యమానేరు జలాశయం, పునరావాస అంశాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. జిల్లాలో పర్యటిం చేందుకు పలువురు శిక్షణలో ఉన్న ఐఏఎస్ అధికారులు ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు. ఆనందంగా ఉంది జాతీయస్థాయిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. తెలంగాణ జల విధానాన్ని సీఎం కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేశారు. బీళ్లకు గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకురావడం విశేషం. జిల్లాకు సాగునీటి ఫలాలు అందాయి. దీంతో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. శిక్షణ ఐఏఎస్లకు సిరిసిల్ల జల సంరక్షణ పాఠ్యాంశం కావడం సంతోషంగా ఉంది. –కె.తారక రామారావు, రాష్ట్రమంత్రి -
సంక్షోభంలోనూ సంక్షేమం
సిరిసిల్ల: కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు ఆపలేదని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. మంగళవారం ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలసి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వేములవాడ, బోయినపల్లి మండలాల్లో పర్యటించారు. నియంత్రిత పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించి, రైతు వేదిక నిర్మాణా లకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల రాష్ట్రం లో 95 శాతం ప్రభుత్వ ఆదాయం తగ్గినా సం క్షేమ పథకాల అమలును ఎక్కడా ఆపలేదన్నారు. తొలివిడతగా 5.5 లక్షల మంది రైతుల పంటల రుణాలను రూ.1,200 కోట్లమేర మాఫీ చేశామన్నారు. ఏ ప్రధానీ చేయని విధంగా రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు అందించామని, రూ.1,400 కోట్లతో రైతుబీమా అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే రైతులకు ఎరువులు, విత్తనాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాళేశ్వరం, సీతారామ, పాలమూరు సాగునీటి పథకాల ద్వారా వ్యవసాయ రంగానికి నిరంతరం నీరందిస్తామని పేర్కొన్నారు. అక్కరకు రాని, మద్దతు ధరలేని పంటలు వేయొద్దని రైతులకు మంత్రి కేటీఆర్ సూచించారు. రైతులకు మేలు చేయడం తప్ప సీఎం కేసీఆర్కు వేరే ఎజెండా లేదన్నారు. అనేక మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందా? అని ప్రశ్నించారు. బీడు భూములకు నీళ్లు వచ్చి పల్లెలు పచ్చబడుతుంటే ప్రతిపక్షాలకు కళ్లు మండుతున్నాయని, రాష్ట్రంలో ప్రతీ రైతుకు రైతుబంధు ఇస్తుంటే మొసలికన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. రైతులను సంఘటితం చేయడమే రైతు వేదిక లక్ష్యమన్నారు. రైతు వేదికలో కంప్యూటర్లు ఏర్పాటుచేసి ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. సేద్య ఆలయాలుగా రైతు వేదికలు: రాష్ట్రంలో రైతు వేదికలు సేద్యానికి ఆలయాలుగా ఉంటాయని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, వేములవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2,602 క్లస్టర్లు ఉన్నాయ ని, ప్రతీ క్లస్టర్లో రైతు వేదికలు నిర్మిస్తామని తెలిపారు. రైతుల కు నీళ్లు, పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తూ.. రైతు బీమా కల్పిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదన్నారు. రైతులకు లాభసాటిగా ఉండే పంటలనే ప్రభుత్వం సూచిస్తుందన్నారు. అయితే ప్రతిపక్షాలు దీనిని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని, అవి ప్రజలకు అందనంత దూరంలో ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రైతులను సీఎం కేసీఆర్ నెత్తినపెట్టుకుని పూజిస్తున్నారన్నారు. బడ్జెట్లో ఏ టా రూ.60 వేల కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నారని ఆయన వివరించారు. వ్యవసాయం బాగుంటేనే అన్నీ బాగుంటా యని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారన్నారు. రైతు వేదికల ఏర్పాటు ద్వారా పంట మార్పులతో తెలంగాణ రైతులు దేశ చిత్రపటంలో అగ్రస్థానంలో ఉంటారన్నా రు. పంట మార్పిడి విధానం పాటించాలని, శాస్త్రవేత్తలు, నిపుణులతో సంప్రదించే ఏయే పంటలు వేయాలో నిర్ణయిస్తామన్నారు. చాలామంది రైతులు ప్రభుత్వ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతుల గురించి సీఎం కేసీఆర్ కంటే ఎక్కువగా ఆలోచించే మొనగాడు ఉన్నాడా.. అని మంత్రి ప్రశ్నిం చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గోదావరి జలాలను చూసి సంతోషం అనిపించిందని నిరంజన్రెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్ తం డ్రికి తగిన తనయుడిగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా ఉన్నారని మంత్రి కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సొంత ఖర్చులతో 6 రైతు వేదికలు జిల్లాలో తాను సొంత ఖర్చులతో ఆరు రైతు వేదికలను నిర్మిస్తానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి మండ లాలతోపాటు తమ అమ్మమ్మ ఊరు అయిన బోయినపల్లిలో వీటిని నిర్మిస్తానని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ వేదికలను అందుబాటులోకి తేవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేదికలు వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాందిపలుకుతాయని మంత్రి స్పష్టం చేశారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. ఇద్దరు మహిళల మృతి
సాక్షి, సిరిసిల్ల : వైద్యుల నిర్లక్ష్యంతో జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందారు. ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయడంతోనే ఈ అనర్థం జరిగిందని తెలుస్తుంది. ఈ విషయం బయటకు పొక్కకుండా ఆసుపత్రి యాజమాన్యం జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇద్దరు మహిళలు మృతి చెందారని బంధువుల ఆరోపించడంతో జిల్లా కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన డీఎంహెచ్వో ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలిపారు. -
అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డు
సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్ సెన్సార్ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్ సౌండ్ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్ స్మార్ట్వాచ్ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు. -
కరచాలనం చేస్తున్నారా.. జాగ్రత్త
సాక్షి, సిరిసిల్ల : మనం ఆదమరిస్తే అప్రమత్తం చేసేలా ఓ సెన్సర్ స్మార్ట్ వాచ్ను రూపొందించింది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ఓ విద్యార్థిని. కరోనా వైరస్ కట్టడి కోసం కరచాలనం చేయొద్దని, చేతితో కళ్లను, నోటిని, ముక్కును ముట్టుకోవద్దని వైద్యులు చెపుతున్న విషయం తెలిసిందే. అయితే అలవాటులో పొరపాటులా చెయ్యి ముఖాన్ని తాకుతూనే ఉంటుంది. ఇలాంటి అలవాటును దూరం చేసే లక్ష్యంతో సెన్సర్ స్మార్ట్ వాచ్ను తయారు చేసింది బుధవారపు స్నేహ. స్మార్ట్ సెన్సర్ వాచ్ను చూపుతున్న స్నేహ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతున్న స్నేహ.. ఓ వాచ్ను రూపొందించి, దానికి సెన్సర్ డివైస్ను ఏర్పాటు చేసింది. మనం కరచాలనం చేయబోయినా.. ముక్కు, నోరు, కళ్లను తాకబోయినా వెంటనే ఆ సెన్సర్ గుర్తించి శబ్దం చేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయత్నాన్ని విరమించుకునేలా స్మార్ట్ వాచ్ హెచ్చరిస్తుంది. తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్ను తయారు చేసినట్లు స్నేహ తెలిపింది. స్నేహ కృషిని జిల్లా అధికారులు సోమవారం అభినందించారు. -
పథకం ప్రకారం భర్తను చంపించిన భార్య..
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన యువకుడి దారుణ హత్య కేసులో కొత్తకోణాలు వెలుగుచూస్తున్నాయి. పథకం ప్రకారమే మమత ఆమె ప్రియుడు సురేశ్తో తిరుపతిని హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం. ఇల్లంతకుంట మండలం రామోజీపేటకు చెందిన తిరుపతి బద్దెనపల్లిలో టెంట్హౌజ్ నిర్వహిస్తున్నాడు. తిరుపతి వద్ద పని చేస్తున్న సురేశ్ యజమాని భార్య మమతపై కన్నేశాడు. అప్పటి నుంచి ఇద్దరు అక్రమసంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ విషయం తిరుపతికి తెలిసి పద్ధతి మార్చుకోవాలని మందలించడంతో అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడు సురేశ్తో కలిసి మమత పథకం రచించింది. ప్లాన్ ప్రకారం తిరుపతిని హతమార్చేందుకు సురేశ్ రూ.40 వేలకు నలుగురు వ్యక్తులతో సుపారి కుదుర్చుకున్నాడు. మమత తనకు కడుపునొప్పి వచ్చిందని భర్తను అర్ధరాత్రి బస్వాపూర్కు తీసుకెళ్లింది. అప్పటికే గ్రామశివారులో మాటువేసిన సురేశ్ అతడి స్నేహితులు కారుతో అటకాయించి కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి విచక్షణారహితంగా పొడిచి హత్యచేశారు. ఇక చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత కారులో అక్కడి నుంచి పరారయ్యారు. హ త్యను ప్రమాదంగా మార్చేందుకు మమత శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ నిజం బయటకు వచ్చింది. హత్యకేసును చేధించడంలో పోలీసులు చురుగ్గా వ్యవహరించారు. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.? త్వరలో హంతకులను మీడియా ఎదుట ప్రవేశపెట్టేనున్నట్లు పోలీసులు తెలిపారు. -
కులబహిష్కరణ: మాట్లాడితే రూ. 30 వేలు జరిమానా
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వెంకటాపూర్లో కులసంఘ స్థలం రిజిస్ట్రేషన్ వివాదంలో ఓ కుటుంబాన్ని కులపెద్దలు కులబహిష్కరణ చేశారు. గ్రామంలోని ముదిరాజ్ కులసంఘం స్థలాన్ని దుండిగాల శంకరయ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలాన్ని ప్రస్తుత కులసంఘం అధ్యక్షుడు పాండావుల రవి పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తెచ్చారు. వ్యక్తిపేరున కాకుండా సంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేస్తానని శంకరయ్య తెలిపాడు. నిరాకరించిన కులపెద్దలు.. ఆర్నెల్లుగా గ్రామంలో పంచాయితీలు నిర్వహిస్తున్నారు. సమస్య కొలిక్కి రాలేదు. శంకరయ్యను కులబహిష్కరణ చేశారు. ఆయనతో మాట్లాడినందుకు గ్రామస్తుడు దుండిగాల రాజుకు రూ.30వేల జరిమానా విధించారు. రాజుకు జరిమానా విధించడం, తనను కులబహిష్కరణ చేయడంతో విసిగిపోయిన శంకరయ్య బుధవారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై వెంకటకృష్ణ విచారణ జరిపి బాధ్యుతలైన కులపెద్దలు పాండావుల రవి, కంకనాల కిషన్, కంకనాల పర్శయ్య, కంకనాల బాలయ్య, కంకనాల రమేశ్పై కేసు నమోదు చేశారు. -
‘కీచక దేవయ్య’ వీడియో వైరల్
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన నాయకుడు సిరిసిల్లలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులను లైంగిక వేధిపులకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడు తంగళ్లపల్లి దేవయ్య మాట్లాడిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. దేవయ్య మాట్లాడుతూ ‘పెద్దలు చిక్కాల రామన్న, నర్సింగరావుకు ఇందులో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయంగా తనను అణచివేయాలని, పార్టీని బదనాం చేయాలని వారి మీద నిందారోపణలు చేయడం సరైంది కాదన్నాడు. పెద్దలను బలిచేయడం కరెక్టు కాదని తెలిపాడు. కొంతమంది విలేకరులకు తనకు భూమి విషయమై ఐదు, ఆరునెలల నుంచి సెటిల్మెంట్ జరుగుతోందని, దానికోసం ఇద్దరు న్యాయవాదులు కొంతమంది పెద్దనాయకులు కలిసి రాజకీయంగా తొక్కేయాలని కుట్రపన్ని తనను ఇరికించారని పేర్కొన్నాడు. తాను ఉన్నత విద్యావంతుడినని, సర్పంచ్గా కూడా పని చేశానని.. దయచేసి టీఆర్ఎస్ పెద్దలను ఇరికించడం సరికాదని, వారికి ఎటువంటి సంబంధం లేదన్నాడు..’ 53 సెకండ్ల నిడివి గల వీడియో సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం దేవయ్య జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అతడు మాట్లాడుతున్న వీడియో విడుదల కావడం వెనక పెద్దతలకాయల హస్తం ఉందని తంగళ్లపల్లిలో చర్చ జరుగుతోంది. భూమి వ్యవహారంలో సెటిల్మెంట్లు చేసిన విలేకరులు ఎవరు? దానికి సహకరించిన న్యాయవాదులు ఎవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీస్స్టేషన్ ఆవరణలో ఈ వీడియో తీయడంతో పోలీసుల తీరుపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియోను తీసేందుకు ఎలా అనుమతించారని, పోలీసులు సహకారం అందించారని అఖిలపక్షం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కీచక మాజీ సర్పంచ్ వ్యవహారంలో మరెన్ని కోణాలు, ఎంతమంది పెద్దతలకాయలు బయటకు వస్తారోనని ఆసక్తిగామారింది. -
సిరిసిల్లలో మాటల మాంత్రికులు..
సాక్షి, సిరిసిల్ల: ‘చిన్నా.. అంటే.. నేనున్న అన్నా అని వచ్చే నాయకుడు.. మన ఆకుల చిన్న.. ఓటరు మహాశయులారా.. మీ అమూల్యమైన ఓటును మన ఆకుల చిన్న గుర్తుకు వేయండి..ఒక్క నాటి పొరపాటు.. కాకూడదు ఐదేళ్ల గ్రహపాటు.. ఆలోచించండి.. మీ ఓటును.. అభ్యర్థికి వేయండి’’ అంటూ వినిపించే గొంతుకలు అవి. ‘బడుగు బలహీన వర్గాల నేత మన స్థానికుడు. ఏ రాత్రి పిలిచినా నేనున్నానని పరుగెత్తుకొచ్చే నిస్వార్థ ప్రజాసేవకుడు మన అన్న’.. అంటూ అభ్యర్థి పక్షాన ప్రచారం. ‘వట్టి మాటలు కట్టిపెట్టండి.. మన ప్రాంతానికి గట్టిమేలు తలపెట్టే నేతను ఎన్నుకోండి. మాయమాటలతో వచ్చేవాళ్ల మాటలు నమ్మకండి.. సమస్యల సుడిగుండంలో ఉన్న మన వార్డులో అభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటేద్దాం. వాగ్ధానాలను నమ్మకండి.. మాట మీద ఉండి మనకు సేవ చేసే వ్యక్తులకే ఓట్లు వేయండి.. నోటుకు ఓట్లు అమ్ముకోకండి’.. అంటూ ఓటర్లను అప్రమత్తం చేసే ఆ గొంతుకలు సిరిసిల్లవి. నాలుగు దశాబ్దాలుగా ప్రచార రంగంలో వినిపిస్తున్న సిరిసిల్ల స్వరాలివి. వాణిజ్య ప్రకటనలే కాదు.. ఎన్నికల ప్రచార పర్వంలో ఆ గొంతులకు ప్రత్యేక స్థానం. పాటలు మధ్యమధ్యలో మాటల తూటాలు. ప్రజలకు స్పష్టంగా గుండెలకు హత్తుకునేలా, అర్థమయ్యేలా చెప్పడమే కాదు ఒక్క క్షణం ఆలోచింపజేసే మాటల తూటాలు పేల్చే మాటల మాంత్రికులు వాళ్లు. పార్టీ ఏదైనా ఎజెండాలు ఏవైనా ప్రచారం చేసే గొంతుకలు అవి. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అనౌన్సర్లుగా రాణిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా.. 1974లో పద్నాలుగేళ్ల ప్రాయంలో మొదటిసారిగా అనౌన్సర్ అయ్యాను. అప్పట్నుంచి వివిధ వ్యాపార, వాణిజ్య ప్రకటనలకు వ్యాఖ్యాతగా పని చేస్తున్న. ఎన్నికల సీజన్లో తీరిక లేకుండా ప్రచార ప్రకటనలు వస్తాయి. ఆదిలాబాద్, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి చాలా మంది ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చి మరీ రికార్డింగ్లు అడుతున్నారు. ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తూ రికార్డ్ చేస్తా. ఈ సారి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 155 మందికి ప్రచార ప్రకటనలు చేసిన. ఒక్కో దానికి సమయాన్ని బట్టి.. వాళ్ల డిమాండ్ను బట్టి డబ్బులు తీసుకుంటాం. అంతా ఆన్లైన్లోనే వ్యాపారం సాగుతుంది. – ఎండీ సలీం, గోరెమియా సౌండ్స్, రాజన్న సిరిసిల్ల పాటలు.. మాటలతో.. ఎన్నికల్లో పోటీ చేసినవారి పేరు, గుర్తు, ప్రాంతం పేరు చెబితే చాలు పాటలతో పాటు వ్యాఖ్యానం జోడిస్తాను. 15 ఏళ్లుగా ఈ రంగంలో పని చేస్తున్న. మా బాబాయి ప్రదీప్కుమార్ స్ఫూర్తితో ఈ రంగంలోకి వచ్చిన. పలు జిల్లాల నుంచి అభ్యర్థులు వచ్చి రికార్డులు చేయించుకుంటున్నారు. ఒక్కో ప్రచారానికి రూ.2000 నుంచి రూ.3000 వేల వరకు తీసుకుంటున్న. నా గొంతుతో పాటు మరో మహిళ గొంతును కూడా జోడించి ప్రచారం చేస్తాం. బయట జిల్లాల గిరాకే ఎక్కువ. చిన్నప్పట్నుంచే ఈ రంగంపై ఆసక్తితో వ్యాఖ్యాతగా ఉంటున్న. ఎన్నికల ప్రచారం చేయడం ఆనందంగా ఉంది. అందరు నాయకులకు నా గొంతుతో ప్రచారం చేయడం బాగుంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్లో 260 మంది ఆర్డర్లు తీసుకుని రికార్డు చేసిన. – సాంబారి రాజు, వ్యాఖ్యాత, రాజన్న సిరిసిల్ల 45 ఏళ్లుగా.. 45 ఏళ్లుగా వ్యాఖ్యాతగా పని చేస్తున్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి వ్యాఖ్యాత నేనే కావచ్చు. 12 ప్రాయంలోనే ప్రకటనలకు వాయిస్ అందించిన. ఎన్నికల సమయంలో ప్రకటనలకు చాలా మంది వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వంద మందికి రికార్డింగ్ చేసిన. ప్రభుత్వ పరంగా అనేక ప్రకటనలు నేనే రికార్డ్ చేశా. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రచారం చేయడం ఆనందంగా ఉంది. ఇతర రోజుల్లో పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక అంశాలపై కూడా ప్రచారం చేసిన. – షేక్ ఖాజా, శేఖ్ చాంద్ సౌండ్స్, రాజన్న సిరిసిల్ల అభ్యర్థులను ఆకట్టుకునేలా.. ఏదైనా అంశం ఇస్తే చాలు.. వారిని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ రాస్తా. హైదరాబాద్లో ఎంబీఏ చేసిన. మాటలు, పాటలు సందర్భానికి అనుగుణంగా రాయడం నా వంతు. వ్యాఖ్యాతగానూ వ్యవహరించిన. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే 200 మందికి మాటలు రాసిన. కానీ ఈ సారి ఎక్కువ సమయం లేదు.. దీంతో హడావుడిగా రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. మాకు మంచి ఉపాధి లభిస్తుంది. – సాంబారి కిరణ్, స్క్రిప్ట్ రైటర్, రాజన్న సిరిసిల్ల -
'తాగుబోతెవరో..తిరుగుబోతెవరో తేలుస్తం'
సాక్షి, సిరిసిల్ల : తెలంగాణలో అరాచక శక్తుల కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళిక అమలు చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలో గురువారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘దిశ’ ఘటన దారుణమైందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సీఎం కేసీఆర్ పటిష్టమైన ప్రణాళిక అమలు చేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు. ఊరూరా మహిళా కమిటీలు వేస్తామని, తాగుబోతులు ఎవరు, తిరుగుబోతులు ఎవరో గుర్తించి ముందే పోలీసులకు పట్టిచ్చేలా సీఎం ఆలోచన చేస్తున్నారని చెప్పారు. స్వశక్తి సంఘాలకు వడ్డీ మాఫీ కోసం రూ.2,196 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. వేములవాడలో మహిళా సంఘాలకు రూ.10 కోట్ల రుణాల చెక్కులను, మహిళలకు లోన్కార్డులను, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేసిన మంత్రి డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, మార్క్ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, కలెక్టర్ డి.కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. -
రెవె‘న్యూ’ సవాళ్లు..!
సాక్షి, సిరిసిల్ల: భూమి సూర్యుడి చుట్టు తిరిగితే.. మనిషి భూమి చుట్టు తిరుగుతున్నారు. మార్కెట్లో భూమి విలువ గణనీయంగా పెరిగడంతో భూవివాదాలు తలెత్తుతున్నాయి. భూమి కోసం మనిషి ఎంతకైనా తెగించే పరిస్థితి దాపురించింది. పట్టణీకరణ నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరిట సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం ఇవ్వడంతో పట్టా ఉంటే చాలు.. కబ్జాలో లేకున్నా సరే అన్న రీతిలో భూమి హక్కుల కోసం రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. ఆరు నెలలపాటు భూరికార్డుల ప్రక్షాళన పేరిట అధికారులు తాతల నాటి భూరికార్డులను శుద్ధి చేసేందుకు ఉపక్రమించగా.. ఇదే అదనుగా అనేక ప్రాంతాల్లో కొత్త సమస్యలకు తెరలేచింది. భూరికార్డుల శుద్ధీకరణలో లోటుపాట్లుతో.. రెవె‘న్యూ’ సవాళ్లను ఎదుర్కొంటోంది. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవంగా దహనం చేయడంతో రెవెన్యూ యంత్రాంగంలో అభద్రతాభావం నెలకొంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన భూప్రక్షాళన కొత్త సమస్యలకు తెరలేపినట్లు అయింది. ఉమ్మడి జిల్లాలో భూ సమస్యలు.. సవాళ్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సాంకేతిక సమస్యలు.. రెవెన్యూ శాఖను సాంకేతిక సమస్యలు వేధిస్తున్నాయి. ఆన్లైన్ సమస్యలు, ధరణి సైట్ సరిగా లేకపోవడం, స్థానిక అధికారులకు తెలియకుండానే రికార్డుల్లో తప్పులు రావడం వంటి సమస్యలు ఉన్నాయి. కానీ కొన్ని మండలాల్లో పైరవీకారుల ప్రవేశంతో రికార్డుల్లో అధికారులు చేయి చేసుకుని కావాలనే మార్పులు చేసినట్లు ఆరోపణలున్నాయి. పార్క్–బీ పేరిట వివాదాస్పదమైన భూములను, కోర్టు కేసులు, అటవీ భూములు, దేవాదాయ భూములు, చెరువు శిఖం భూములు, అన్నదమ్ముల వివాదాలు ఉన్న భూములను పార్ట్–బీలో చేర్చారు. దీంతో ఆ భూముల జోలికి వెళ్లకుండానే రెవెన్యూ అధికారులు ఉమ్మడి జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేశారు. దీంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. తాము కబ్జాలో ఉన్నామని, తమకు పాస్ బుక్కులు ఎందుకు జారీ కావడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. క్షేత్రస్థాయి సర్వేలు సమగ్రంగా లేక.. సాంకేతిక సమస్యలు అడ్డు రావడంతో రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో రికార్డులను శుద్ధిచేయలేకపోయారు. ఈ కారణంగా ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. కొందరు రెవెన్యూ అధికారులు రైతులను డబ్బులు డిమాండ్ చేస్తూ.. ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు రెవెన్యూ అవినీతికి అద్దం పడుతోంది. పని ఒత్తిడి కారణంగా సాప్ట్వేర్ సమస్యలతో రెవెన్యూ యంత్రాంగం సతమతమవుతోంది. ఏదీ ఏమైనా టైటిల్ గ్యారంటీ లేక.. భూవివాదాల పరిష్కరం లేక.. రెవెన్యూ క్షేత్రస్థాయి సిబ్బందికి భూరికార్డులపై అవగాహన లేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. ఏడాదిగా చర్యలు లేవు.. మాది పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగారం. గ్రామ శివారులోని సర్వే నంబర్ 91లో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎస్సీ కార్పేషన్ ద్వారా కొనుగోలు చేశారు. ఊరిలోని ఎస్సీలకు పంపిణీ చేశారు. అదే భూమిని సదరు పట్టాదారు సోలార్ కంపెనీకి విక్రయించాడు. గ్రామ వీఆర్వో.. ఆర్ఐను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. చిన్న ఉద్యోగులను బలి చేసి ఊరుకున్నారు. ఏడాదిగా అసలు బాధ్యులపై ఎలాంటి చర్యలు లేవు. – రవీందర్రెడ్డి, నాగారం పని ఒత్తిడి ఉంది.. రెవెన్యూ అధికారులపై చాలా పని ఒత్తిడి ఉంది. ఏళ్ల నాటి భూసమస్యలు స్వల్ప కాలంలో తీర్చాలంటే కాదు. సాంకేతిక సమస్యలు ఉన్నాయి. సాఫ్వేర్ సమస్యలు ఉన్నాయి. భూమి విషయంలో సొంత అన్నదమ్ములే కొట్టుకుంటున్నారు. కోర్టు వివాదాలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు ఉండగా.. అన్నింటికీ రెవెన్యూను బాధ్యులను చేస్తున్నారు. తహసీల్దార్ సజీవ దహనం ఎంతో బాధించింది. – ఎన్.ఖిమ్యానాయక్, డీఆర్వో, రాజన్న సిరిసిల్ల -
అమానుషం: భర్తను ఇంట్లోంచి గెంటేసిన భార్య
సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో చనిపోతే అరిష్టమని మూఢత్వం పెనవేసుకున్న కార్మికక్షేత్రం సిరిసిల్లలో మరో అమానుషం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య తాళి బంధం కాదనుకుంది. పేగు బంధంతో కొడుకు అక్కున చేర్చుకున్నా.. చచ్చిపోయే వృద్ధున్ని ఇంట్లోకి తీసుకురావద్దని అద్దింటి యజమాని కర్కశత్వం అడ్డుకట్ట వేసింది. ఓ నేతన్న బతికుండగానే శవంలా మారిన ఈ అమానుష సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం గాంధీనగర్కు చెందిన కోడం భూమయ్య(65) నేతకార్మికుడు. భార్య బాలలక్ష్మి కొడుకు దేవదాస్, కూతరు జ్యోతిలను పోషించేవాడు. అతడి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే కొడుకు, కూతురుకు పెళ్లిల్లు చేశాడు. బాలలక్ష్మి ఐదేళ్ల క్రితం కొడుకు, కొడలు, వారి పిల్లలతో గొడవపడి వారిని ఇంట్లోంచి వెళ్లగొట్టగా వేరే కాపురం ఉంటున్నారు. ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్న దేవదాస్ భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం వరకు భూమయ్య ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే బాలలక్ష్మి గొడవపడి ఇంట్లోంచి వెళ్లగొట్టింది. తాము ఉంటున్న ఇల్లు తన పుట్టింటి వారు ఇచ్చిందని దీనిపై భర్తకు, పిల్లలకు ఏలాంటి హక్కులు లేవని తేల్చిచెప్పి ఒక్కతే ఇంట్లో పిండిగిర్నీ నడిపిస్తూ బతుకుతుంది. భూమయ్య కూడా చేతనైనన్ని రోజులు అక్కడ ఇక్కడా పనిచేస్తూ..కాలం వెళ్లదీసిండు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదు. ఈక్రమంలో స్థానిక గాంధీనగర్ హనుమాన్ ఆలయం వద్ద వారం రోజులుగా ఎండకు ఎండుతూ..వానకు నానుతూ..పడి ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న కొడుకు నాలుగురోజుల క్రితం తానుంటున్న అద్దె ఇంటికి తీసుకెళ్లి సపరిచర్యలు చేస్తుండగా..భూమయ్య చనిపోతే అరిష్టంగా పేర్కొంటూ..ఇంట్లో ఉండొద్దని యజమాని హుకుం జారీచేశాడు. దీంతో దేవదాస్ తన తండ్రి బాగోగులు చూడలేకుండా అయ్యాడు. ఈక్రమంలోనే భూమయ్య గుడివద్ద అచేతన స్థితిలో వారం రోజులుగా పడి ఉంటున్నాడు.. పరిమళించిన మానవత్వం.. సిరిసిల్ల ధర్మాసుపత్రిలో వైద్యం అందిస్తున్న దృశ్యం.. హనుమాన్ ఆలయం వద్ద చేతకాకుండా పడిఉన్న భూమయ్యను స్థానిక సామాజిక కార్యకర్త దీకొండ అశోక్ మంగళవారం ఆలయ దర్శనానికి వచ్చి గమనించాడు. వెంటనే వివరాలు తెలుసుకున్నాడు. భూమయ్య పరిస్థితిని చూసి జాలేసి స్థానిక జిల్లాసుపత్రిలో చేర్పించగా..సిబ్బంది చికిత్స చేస్తున్నారు. బతికుండగానే భర్తను ఇంట్లోకి రానివ్వని భార్య, మూఢాచారాలతో అమానవీయంగా ఇంట్లోకి రానివ్వని అద్దె ఇంటి యజమాని నిర్వాకంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తాయి. -
రక్షణ విధుల్లో.. రక్తపుధారలు
సాక్షి, సిరిసిల్ల : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండాల్సిందే. రక్షణ విధుల్లో పోలీసుల అమరత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రక్తంచిందింది. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి హోంగార్డు దాకా జిల్లాలో విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులున్నారు. అసాంఘిక శక్తులను కట్టడి చేసే క్రమంలో తమ ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. కల్లోల ఖిల్లాగా పేరున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో దశాబ్దకాలం కిందల నక్సలైట్లు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక హింసాత్మక ఘటనలు జరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పోలీసులు విధి నిర్వహణలో నక్సలైట్ల చేతుల్లో ప్రాణత్యాగాలు చేసి అమరత్వం పొందారు. జిల్లాలో సంఘటనలు 1991లో ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో శ్రీనివాస్రావు అనే హోంగార్డును నక్సలైట్లు గాంధీ విగ్రహం వద్ద హతమార్చారు. 1994లో అక్టోబర్ 28న గంభీరావుపేట మండలకేంద్రంలో అప్పటి ఎస్సై సాబీర్ఖాన్ను మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. ఆయన నమాజ్కు వెళ్లి వస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. 1996లో కోనరావుపేట మండలం నిజామాబాద్ శివారులో మావోయిస్టు నక్సలైట్లు కల్వర్టు కింద మందుపాతర పేల్చగా మోహన్రావు, నజీరోద్దీన్ అనే కానిస్టేబుల్ మృత్యువాతపడ్డారు. 1997లో కోనరావుపేట ఎస్సై ఎం.శ్రీనివాస్గౌడ్ను ఎగ్లాస్పూర్ గుట్టల్లో మావోయిస్టు నక్సలైట్లు కాల్చిచంపారు. 1997 సెప్టెంబర్ 7న చందుర్తి ఎస్ఐ శ్రీనివాస్రావును లింగంపేట– రుద్రంగి మధ్య మందుపాతర పేల్చి హతమార్చారు. 1999లో కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద తిరునగరి శ్రీనివాసచారి అనే హోంగార్డును మావోయిస్టు నక్సలైట్లు హతమార్చారు. 2003 ఫిబ్రవరి 11న కోనరావుపేట మండలం వట్టిమల్ల వద్ద కొడిమ్యాల పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే హెంకు నాయక్, కృష్ణ అనే పోలీసు కానిస్టేబుళ్లను జనశక్తి నక్సలైట్లు కాల్చిచంపారు. -
భర్తను కడతేర్చిన భార్య రిమాండ్
సాక్షి, సిరిసిల్ల: కష్టసుఖాల్లో జీవితాంతం కలిసుంటానని ఏడడుగులు వేసిన భార్యే అతికిరాతకంగా భర్తను కడతేర్చగా నిందితురాలిని రాజన్న సిరిసిల్ల పోలీసులు ఆదివారం రిమాండ్కు పంపారు. భార్య, పుట్టిన పిల్లలల బాగోగుకోసం ఏడారి దేశం వెళ్లి నాలుగు పైసలు సంపాదించుకొచ్చిన భర్తను ప్రేమగా చూసుకోవాల్సిన భార్య అతడిని అతికిరాతకంగా హత్య చేయడం సంచలనం సృష్టించిన విష యం తెలిసిందే. జిల్లా ఎస్పీ రాహుల్హెగ్డే తెలి పిన వివరాల ప్రకారం..రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి చెందిన మంచాల లక్ష్మణ్ (27)కు 2010లో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన మౌనికతో 2010లో వివాహం జరిగింది. రిశికుమార్, శ్రీనిధి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ పోషణకోసం ఉన్న ఊరిలో పని లేక లక్ష్మణ్ 2014లో దుబాయి వెళ్లి ఈ ఏడాది మేలో స్వగ్రామం వీర్నపల్లికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక తన భర్తను ఎలాగైనా చంపాలనే పన్నాగం తన తల్లితో చర్చించింది. దీనిలో భాగంగా గతనెల16న కుటుంబ సభ్యులతో కలిసి కొండగట్టు వెళ్లాలని నిర్ణయించి అక్కడే లక్ష్మణ్ను పథకం రచించింది. అక్కడ వీలుకాకపోవడంతో 17న వేములవాడకు వచ్చి గది అద్దెకు తీసుకున్నారు. పథకం ప్రకారం ఇద్దరు పిల్లలకు, తల్లికి, భర్తకు భోజనం తీసుకువస్తానని చెప్పి ఆహారంతోపాటు గడ్డిమందును వెంట తీసుకు వచ్చింది. తెచ్చిన ఆహారాన్ని అందరూ తినే క్రమంలో అగ్రహారం అంజన్న దర్శనానికి వెళ్దామని భర్తను వెంట తీసుకెళ్లిన మౌనిక అక్కడ కూల్డ్రింక్ కొనుగోలు చేసి అందులో గడ్డిమందు కలిపి లక్ష్మణ్కు తాగించింది. దీంతో ఆగకుండా అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుట్టపైకి తీసుకెళ్లి నెట్టిసింది. అప్పటికీ అతడి చావుపై అనుమానించిన మౌనిక తనవెంట తీసుకొచ్చిన కిరోసిన్ను లక్ష్మణ్పై పోసి నిప్పంటించింది. ఆనవాళ్లు గుర్తుపట్టకుండా పర్సు, సెల్ఫోన్ తీసుకుని ఏమీ తెలియదన్నట్లు వీర్నపల్లికి చేరింది. దాదాపు ఐదు రోజులకు హత్య జరిగిన ప్రాంతంలోని ఆభయాంజనేయ స్టోన్ క్రషర్ సూపర్వైజర్ అమీర్ గుట్టలోపడిన శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వేములవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో వీర్నపల్లి లక్ష్మణ్ కనబడడం లేదనే కేసు నమోదుకావడంతో వేములవాడ పరిధిలో జరిగిన హత్యకు వీర్నపల్లిలో నమోదైన కేసుకు సంబంధం ఉందా అనే క్రమంలో జరిగిన దర్యాప్తులో హత్య చేసింది మౌనిక అని తేలింది. హత్యకు వినియోగించిన కిరోసిన్ బాటిల్, సెల్ఫోన్, థమ్సప్ బాటిల్, చెప్పులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యలో మౌనిక తల్లి సత్తవ్వ, ఇంకెవరైనా ఉన్నారా అనే దిశగా దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. హత్యలో పోలీసులున్నారనే దానిపై కూడా ఎస్పీ స్పందిస్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, వేములవాడ సీఐ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.