బస్టాండ్‌లోనే మహిళ ప్రసవం | woman delivery in bus stand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లోనే మహిళ ప్రసవం

Published Fri, Dec 2 2016 12:36 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

woman delivery in bus stand

కదిరి టౌన్ : కదిరి ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలోనే గురువారం ఓ మహిళ ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వాయలపాడులోని రామయ్యకాలనీకి చెందిన జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి ఓ పని నిమిత్తం కదిరికి వచ్చారు. గురువారం స్వగ్రామానికి వెళ్లేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. జ్యోతికి ఉన్నఫలంగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. పైలట్‌ మహబూబ్‌బాషా, ఈఎంటీ లక్ష్మినారాయణ, ఆ సమయంలో అక్కడే అందుబాటులో ఉన్న మలేరియా నివారణ యూనిట్‌ సూపర్‌వైజర్‌ మహబూబ్‌బాషా వెంటనే అక్కడికి చేరుకున్నారు. వాహనంలోకి చేర్చేలోపే బస్టాండు ప్రాంగణంలోనే ఆమె మగశిశువుకు జన్మనిచ్చింది. తర్వాత తల్లీబిడ్డను సురక్షితంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేర్చారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement