delivery
-
ఒకే కాన్పులో ముగ్గురు జననం..! ఇలా ఎందుకు జరుగుతుందంటే..?
హైదరాబాద్కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.'జన్యుపరమైన కారణాల వల్లే'మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు వైద్యులు. (చదవండి: అత్యంత ధనవంతుడైన ఐఏఎస్ అధికారి! జీతం ఒక్క రూపాయే..!) -
మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, బీఈ6: బుకింగ్స్.. డెలివరీ వివరాలు
దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా & మహీంద్రా' (M&M) దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఎక్స్ఈవీ 9ఈ (XEV 9e), బీఈ 6 (BE 6) ఎలక్ట్రిక్ కార్ల కోసం బుకింగ్స్ స్వీకరించడానికి సన్నద్దమైంది. కంపెనీ ఫిబ్రవరి 14 నుంచి బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీకి సంబంధించిన వివరాలను కూడా సంస్థ వెల్లడించింది.ఫిబ్రవరి 14న మహీంద్రా కంపెనీ బుకింగ్లను స్వీకరిస్తే డెలివరీలు 2025 ఆగష్టు నాటికి పూర్తవుతాయి. సంస్థ అన్ని వేరియంట్లకు బుకింగ్స్ స్వీకరించనుంది.మహీంద్రా BE 6 ఐదు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మహీంద్రా XEV 9e నాలుగు వేరియంట్లలో ఉంటుంది. దీని ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.మహీంద్రా BE 6 ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 18.90 లక్షలుప్యాక్ వన్ అబోవ్ (59 kWh): రూ. 20.50 లక్షలుప్యాక్ టూ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 24.50 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 26.90 లక్షలుమహీంద్రా XEV 9e ఎక్స్-షోరూమ్ ధరలుప్యాక్ వన్ (59 kWh): రూ. 21.90 లక్షలుప్యాక్ వన్ ఎబౌ (59 kWh): NAప్యాక్ టూ (59 kWh): రూ. 24.90 లక్షలుప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kWh): రూ. 27.90 లక్షలుప్యాక్ త్రీ (79 kWh): రూ. 30.50 లక్షలు -
ప్రాణం లేని బిడ్డను నెలరోజులు కడుపులో మోసిన నటి.. ఎట్టకేలకు..! (ఫోటోలు)
-
గుట్కా లేటుగా ఇచ్చాడని.. చాయ్వాలాపై కాల్పులు
నలంద:బీహార్లోని నలందలో ఘోరం చోటుచేసుకుంది. మత్తుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బీహార్లోని నలంద జిల్లాలో టీ దుకాణదారునిపై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగుచూసింది. గుట్కా ఇవ్వడంలో ఆలస్యం చేశాడనే కారణంతో దుండగులు ఆ చాయ్వాలాపై కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ శబ్దం విని చుట్టుపక్కలవారు టీ దుకాణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణదారుడిని గాయపడిన స్థితిలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన నలంద జిల్లాలోని సారే పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ముగ్గురు సాయుధ దుండగులు టీ దుకాణానికి వచ్చి, చాయ్వాలాను గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. అతను వాటిని ఇవ్వడంతో కొంత జాప్యం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ దుండగులు దుర్భాషలాడుతూ, చాయ్వాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ దుకాణదారుడి వీపు గుండా దూసుకెళ్లింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దుకాణదారుడిని నరేష్ యాదవ్ కుమారుడు రాకేష్ యాదవ్గా గుర్తించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ధర్మేష్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని దర్యాప్తు ప్రారంభించారని, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ముగ్గురు యువకులు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు.ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
ఆఫ్లైన్లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలు
ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులు అందించే డంజో మొబైల్ యాప్, వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు కంపెనీ సీఈఓగా వ్యవహరించిన కబీర్ బిశ్వాస్ డంజోకు రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఇలా సర్వీసులు ఆఫ్లైన్లోకి వెళ్లాయి. తాను ఫిప్కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.గత ఏడాది కాలంగా డంజో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే ఇలా సర్వీసులు ఆఫ్లైన్లోకి వెళ్లేందుకు కారణమని కొందరు చెబుతున్నారు. జనవరి 2022లో రిలయన్స్ రిటైల్ నుంచి గణనీయంగా 200 మిలియన్ డాలర్ల(రూ.1,600 కోట్లు) పెట్టుబడితో సహా 450 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.3500 కోట్లు) పైగా నిధులు సమీకరించినప్పటికీ డంజో తన మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. ఇప్పటికే సమీకరించిన నిధులతో కంపెనీ కార్యకలాపాల నిర్వహణ భారంగా మారింది. అదనపు ఈక్విటీని సమీకరించలేకపోవడంతో కంపెనీ మరింత నష్టాల్లో జారుకుంది. తీసుకున్న బకాయిలు చెల్లించకపోవడంతో డంజో రుణదాతలు కంపెనీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు తీసుకెళ్లాయి. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. డంజోలో 26% వాటాను కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్, గూగుల్తో సహా ఇతర పెట్టుబడిదారులు అదనపు నిధుల సమీకరణకు సంబంధించిన చర్చల నుంచి దూరంగా ఉన్నారు.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ బిశ్వాస్ సంస్థను వీడడం పెద్దదెబ్బగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకమీదట డంజోను నిర్వహించడానికి బోర్డు లేదా నాయకత్వం లేకుండా పోయింది. పెండింగ్ జీతాలు, ఇన్వెస్టర్ల నిష్క్రమణ కారణంగా కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడారు. తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొందరు ఉద్యోగులు బిశ్వాస్పై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఆయన ఫ్లిప్కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరుతున్నారనే వార్తలు రావడం గమనార్హం. -
మళ్లీ జొమాటో క్విక్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది. -
అర్ధరాత్రి ఆర్డరిచ్చి లాగించేస్తున్నారు
సాక్షి, అమరావతి: కాలం మారింది.. అభిరుచులు, అలవాట్లూ మారిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో చాలా విందులు జరిగిపోతున్నాయి. రాత్రి పెందరాళే పడుకోవాలన్న పెద్దల మాట ఇప్పుడు చెల్లుబాటు కావడంలేదు. అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత మొదలు తెల్లారేవరకు దేశంలో చాలా ఫుడ్ డెలివరీ జరిగిపోతోంది. లక్షలాది మంది నిశిరాత్రిలో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో చిప్స్, కూల్డ్రింక్స్దే అగ్రస్థానం. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ కామర్స్ సంస్థలు విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుఝామున 4 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్లు అత్యధికంగా వస్తున్నట్లు ఈ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి సంస్థల డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. 2024లో ఈ సమయంలో ఏకంగా రెండు కోట్లపైగా ఆర్డర్లు స్నాక్స్ కోసం వచ్చినట్లు ఈ కామర్స్ సంస్థలు వెల్లడించాయి. ఒక్క ముంబైలోనే ఈ సమయంలో 31.5 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపాయి. నిరంతరం భారీ ఆర్డర్లుపగలూ రాత్రీ నిరంతరం ఆన్లైన్లో భారీ ఆర్డర్లు వస్తున్నట్లు ఈ సంస్థలు చెబుతున్నాయి. చాలా మంది నిత్యావసర సరుకులూ ఆన్లైన్లో భారీగానే తెప్పించేస్తున్నారు. గోధుమ పిండి, ఆయిల్, దోశ పిండి, పాలు, పెరుగు, చిప్స్, కూల్డ్రింక్స్, పచ్చి మిరపకాయలు, టమోటాలు వంటివి ఆన్లైన్ ద్వారా కొంటూ లక్షల్లో బిల్లులు చేస్తున్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్లలో స్విగ్గీ ఇన్స్టామార్ట్ ద్వారా కొందరు ఏడాదికి రూ. 20 లక్షలు విలువైన కొనుగోళ్లు చేశారంటే ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చిప్స్, కూల్డ్రింక్స్దీ పెద్ద మార్కెట్టే. బ్లింకిట్ ఒక్కటే ఈ సంవత్సరం 1.75 కోట్ల మ్యాగీ ప్యాకెట్లను డెలివరీ చేస్తే, జెప్టో 12 లక్షల లేస్ మ్యాజిక్ మసాలా చిప్స్ సరఫరా చేసింది. అంతేకాదు.. బ్లింకిట్ 1.85 కోట్ల కోకోకోలా కాన్స్, 84 లక్షల బాటిల్స్ థమ్సప్, 14.6 లక్షల మజా బాటిల్స్ను డెలివరీ చేసింది. ఒక్క వ్యక్తే ఏకంగా 1,203 స్స్రైట్ బాటిల్స్ ఆర్డరు పెట్టాడు. 43 మంది ఒకొక్కరు రూ.75,000 విలువైన చిప్స్ ప్యాకెట్లను ఈ ఏడాదిలో కొన్నారు.హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోల్కతా వంటి పట్టణాల్లో చిప్స్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్కు చెందిన ఒకాయన ఫ్రూటీ కోసం ఒక్క ఏడాదిలో రూ.35,000 ఖర్చుచేస్తే, మరో వ్యక్తి గ్యాస్ సమస్య తగ్గించే ఈనో ప్యాకెట్లు 217 కొనేశాడు. వాలెంటైన్స్ డే రోజున ప్రతి నిమిషానికి 307 గులాబీ పువ్వులు ఈ సంస్థలు డెలివరీ చేశాయి. జెప్టో ఏడాది మొత్తం మీద 8.25 లక్షల గులాబీ పువ్వులను సరఫరా చేసింది.ముంబైకి చెందిన జంతు ప్రేమికుడు ఒకాయన కుక్కలు, పిల్లుల ఆహారం కోసం రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశాడట. చెన్నైకి చెందిన మరో జంతు ప్రేమికుడు జెప్టో నుంచి 5,234 క్వింటాళ్ల ఆహారం జంతువుల కోసం ఆర్డర్లు పెట్టారు. విజయవాడ వాళ్లకి పాలు, పెరుగుంటే చాలురాష్ట్రంలోని విజయవాడ విషయానికి వస్తే ఇన్స్టామార్ట్లో అత్యధికంగా పాలు, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, సన్ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని అత్యధికంగా కొంటున్నారు. రోజువారీ ఆర్డర్లలో బ్రెడ్, కోడిగుడ్లు కూడా ఉంటున్నాయి. విజయవాడలో పది నిమిషాలకు ఒకసారి ఎల్రక్టానిక్ వస్తువులను కొంటున్నారు. పండుగల సమయంలో సుమారుగా రూ.1.5 లక్షల విలువైన ఎల్రక్టానిక్ వస్తువులను ఆన్లైన్ ద్వారా కొంటున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. -
తెగ కొనేశారు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలో క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశాయి. వివిధ వస్తువులు, ఆహారం వంటివాటి విక్రయాల్లో సాధించిన రికార్డులను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ తదితర ప్లాట్ఫామ్ల ఎగ్జిక్యూటివ్లు, ప్రతినిధులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ‘రియల్ టైమ్ ఆర్డర్ల’గణాంకాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 2023 డిసెంబర్ 31వ తేదీతో పోల్చితే 2024 డిసెంబర్ 31న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకే అధిక ఆర్డర్లు వచ్చినట్టు బ్లింకిట్ సహ–వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు. 2023తో పోల్చితే 2024 చివరి రోజు తమకు 200 శాతం అధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో కో–¸ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలిచా తెలిపారు. బ్లింకిట్, జెప్టోల మాదిరిగానే స్విగ్గీ ఇన్స్టామార్ట్ డిసెంబర్ 31న గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆర్డర్లు సాధించినట్లు ఆ సంస్థ కో–ఫౌండర్ ఫణి కిషన్ ఆద్దెపల్లి తెలిపారు. ఆర్డర్లలో రికార్డులివే.. » గోవాలోని ఒక కస్టమర్ అత్యధికంగా రూ.70,325లకు ఇన్స్టామార్ట్ ప్లాట్ఫామ్పై ఆర్డర్ చేశాడు. » కోల్కత్తాకు చెందిన ఒక వినియోగదారుడు బ్లింకిట్లో రూ.64,988లకు ఆర్డర్ ఇచ్చాడు. » అన్ని క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్పై డిస్పోజబుల్ గ్లాసులు, ఆలుగడ్డ చిప్స్, ఐస్క్యూబ్స్, చాక్లెట్లు, టానిక్వాటర్, నిమ్మకాయలు, సోడాలు, కూల్డ్రింక్లు, ఇతర వస్తువుల ఆర్డర్లు అధికంగా వచ్చాయి. » ఫుడ్ డెలివరీ యాప్లలో వివి ధరకాల ఆహార పదార్థాలను కస్టమర్లు ఆర్డర్ చేశారు. స్విగ్గీలో బిర్యానీ ప్రాధాన్యత ఆహారంగా నిలిచింది. » ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఆర్డర్ చేసిన 164 సెకండ్లలోనే (మూడు నిముషాలలోపే) బిర్యానీని వినియోగదారుడి ఇంటి ముంగిటికి స్విగ్గీ చేర్చింది. » కేక్ల కోసం మొత్తం 2,96,711 ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. » తమ డెలివరీ భాగస్వాములతో కలిపి స్విగ్గీ సంస్థ డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లను అందజేసేందుకు మొత్తం 65,19,841 కి.మీ దూరం ప్రయాణించారు (ఇది భూమి నుంచి చంద్రుడిపైకి ఎనిమిది మార్లు వెళ్లి వచి్చనదానికంటే అధిక దూరం) » రెస్టారెంట్ రిజర్వేషన్ సర్వీస్ స్విగ్గీ డైనౌట్లో మొత్తం ఆర్డర్లలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలిచింది. » ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘మ్యాజిక్ పిన్’బిజినెస్ టైమ్లో నిమిషానికి 1,500 ఆర్డర్లు అందుకుంది. ఈ పాŠల్ట్ఫామ్పై ఢిల్లీకి చెందిన కస్టమర్ రూ.30 వేల అతిపెద్ద ఆర్డర్ ఇచ్చాడు. అత్యధిక టిప్ హైదరాబాదీదే.. » బ్లింకిట్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లకు సంబంధించి డిసెంబర్ 31న ఓ హైదరాబాదీ ఫుడ్ ఆర్డర్ తెచి్చన డెలివరీ ఏజెంట్కు అత్మధికంగా రూ.2,500 టిప్గా ఇచ్చాడు. » మొత్తంగా అన్ని నగరాలు కలుపుకుంటే.. అత్యధికంగా బెంగళూరు వాసులు రూ.1,79,735 టిప్పులు ఇచ్చారు. » బర్గర్లకు సంబంధించి మొత్తం 35 వేలకు పైగా ఆర్డర్లు రాగా.. వీటిలో బెంగుళూరు కస్టమర్లు అగ్రభాగాన నిలిచారు. » డిసెంబర్ 31న క్యూకామర్స్ ప్లాట్ఫామ్స్పై చేసిన ప్రతీ 8 ఆర్డర్లలో ఒకటి కూల్డ్రింక్. » కాక్టెయిల్ మిక్సర్లు, సోడా, మింటీ ఫ్రెస్ ఇంట్రీడియెంట్స్కు స్విగ్గీలో 2,542 శాతం డిమాండ్ నమోదైంది. » నాన్ ఆల్కహాలిక్ బీర్లకు 1,541 శాతం డిమాండ్ పెరిగింది. » గేమ్స్, పజిల్స్ వంటి వాటి డిమాండ్ 600 శాతం పెరిగింది. » క్లౌడ్ కిచెన్ స్టార్టప్ క్యూర్ఫుడ్స్కు 2023 కంటే 2024 చివరి రోజు అధిక ఆర్డర్లు వచ్చారు. అధికంగా ఇచి్చన ఆర్డర్లవారీగా చూస్తే వరుసగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. » బ్లింకిట్లో 1,22,356 ప్యాకెట్ల కండోమ్స్, 45,531 మినరల్ వాటర్ బాటిళ్లకు ఆర్డర్లు వచ్చాయి. » ఇదే ప్లాట్ఫామ్పై 2,34,512 ఆలూ బుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్ వాటర్ కాన్లు, 6,834 ప్యాకెట్ల ఐస్క్యూబ్లు, 1,003 లిప్స్టిక్లు, 762 లైటర్స్ అమ్ముడయ్యాయి. -
2024లో స్విగ్గీ హవా.. హైదరాబాద్లో రికార్డ్ డెలివరీలు
ఫుడ్ డెలివరీ సంస్థగా మొదలైన 'స్విగ్గీ' (Swiggy) నేడు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని డెలివరీ చేస్తోంది. అత్యధిక డెలివరీలతో రికార్డ్ బ్రేక్ చేసి.. అర్ధరాత్రి వరకు కూడా కస్టమర్లను సేవలను అందిస్తూనే ఉంది. హైదరాబాద్లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంది.జూన్ 2021లో ప్రారంభమైన స్విగ్గీ.. రోజువారీ అవసరాలు, బొమ్మలు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, అలంకరణ సామాగ్రి, పండుగల సమయంలో కావాల్సిన వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ (Fast Delivery) చేస్తున్న వాటిలో పాలు, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలు, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయని స్విగ్గీ ఇన్స్టామార్ట్ సీఈఓ 'అమితేష్ ఝా' అన్నారు.హైదరాబాద్ (Hyderabad)లో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకొని డెలివరీ చేసిన ఘనత స్విగ్గీ సొంతం. అంతే కాకూండా.. నగరంలో 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్లకు స్వీకరించింది.లోదుస్తుల కోసం 18,000 కంటే ఎక్కువ ఆర్డర్లు, కండోమ్ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్లను స్విగ్గీ స్వీకరించింది. 2024లో 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది. ప్రజలు ఆర్డర్ చేసిన మ్యాగీ ప్యాకెట్లను ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 25 కిలోమీటర్ల ఎత్తు అవుతుందని సమాచారం. మొత్తం మీదీ అదీ.. ఇదీ అని తేడా లేకుండా ప్రజలకు అవసరమైన వస్తువులను డెలివరీ చేసి అందరికీ అందుబాటులో ఉంది. -
తల్లి ప్రేమకు దూరమైన పసికందు
బొమ్మనహళ్లి: బళ్లారిలో బాలింతల మరణాల పరంపర మరువక ముందే బెంగళూరులో ప్రసవించిన ఓ మహిళ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అవయవ వైఫల్యం, ఇతర సమస్యలతో మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూష మృతితో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు...చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూషను తరికెరెలోని రాజ్ నర్సింగ్ హోంలో చేర్పించారు.సాధారణ ప్రసవం ద్వారా పాప పుట్టింది. కాన్పుకు ముందు స్కానింగ్ చేయగా కిడ్నీలో స్టోన్ ఉందని, డెలివరీ అయిన నెల తరువాత షిమోగాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో సర్జరీ చేశారని సమాచారం. అయితే పేగులు దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాళ్లు, చేతులు వాపు కనిపించింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా సమస్య లేదని వైద్యుడు చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య క్షీణించడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకువచ్చి నగరంలోని నాగరబావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. లివర్ సమస్యకు మరో ఆపరేషన్ చేసి సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, సర్జరీ అంటూ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అనూష స్పృహలో లేదు. ఆమెకు గుండె సమస్య ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. నిరంతర చికిత్స, వైద్య పరిశీలన లేక పోవడంతో తన భార్య మరణించిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. అనూష ఎలా చనిపోయిందనేది కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని ఆమె బంధువులు, భర్త రోదించారు. ఆమె మృతితో రోజుల బిడ్డ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్స్ జంట (ఫొటోలు)
-
ఫుడ్ డెలివరీ యాప్పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్ను ప్రచారం చేయడానికి బిల్బోర్డ్లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్కామర్స్లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్స్టామార్ట్, ఫ్లిప్కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
ఫుడ్ డెలివరీ వేగంగా రావాలంటే?.. ఇలా చేయండి
ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్ఫామ్లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు. -
రోడ్డుపై మహిళ డెలివరీ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్ వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్లో ఫుట్పాత్పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు. Short of words to express my appreciation for the presence of mind & composure displayed by Dongri Pstn Nirbhaya Squad, in helping a lady deliver a baby on road. The Dongri Pstn Nirbhaya squad while patrolling found a 45-year-old lady bleeding in labour pain on the road near… pic.twitter.com/QPKqmkOhTc— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) September 20, 2024ఇది కూడా చదవండి: సీల్కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్లోనే పెట్టి పడేస్తున్నారా?
మనం సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్ క్రియేటర్స్ ఓ వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్ ఓ పేపర్ బ్యాగ్లో ప్లాస్టిక్ బాక్స్లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు. ఆ తర్వాత ఆ డిజిటల్ క్రియేటర్లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్లైన్లో ఫుడ్ని ఆర్డర్ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది. కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్ బెన్లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్ని క్లీన్ చేసి పడేయాలి. అప్పుడే అది రీసైకిలింగ్కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jordindian (@thejordindian) (చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!) -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్కు లొకేషన్తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్లో ప్యాక్చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్ప్రెస్బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
క్విక్ డెలివరీకి క్రేజ్
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల అభిరుచులు..అవసరాలకు తగ్గట్టుగా వేగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి వంటి వాటిని అందించేందుకు క్విక్ (క్యూ)కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తకొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురావడంతోపాటు, విభిన్నమైన సర్వీసులను త్వరితంగా అందించడం ద్వారా వినియోగదారుల మనసును గెలుచుకునే దిశగా ఈ సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ‘ప్రీ ప్రిపేర్డ్ ఫుడ్’క్విక్ డెలివరీ పేరిట టీ, కాఫీ, సమోసా, ఇతర స్నాక్స్ అందించేందుకు జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి క్యూ–కామర్స్ దిగ్గజాలు పోటీకి సై అంటున్నాయి. తమతమ యావరేజ్ ఆర్డర్ వాల్యూ (ఏవోయూ)లను పెంచుకునేందుకు 10 నిమిషాల్లో కుక్కుడ్ ఫుడ్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో ఈ సేవలు ›మొదలై ఆదరణ పొందుతున్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర నగరాలకు తమ ప్రణాళికలను ఈ సంస్థలు విస్తరించనున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలతోపాటు నా¯Œన్ మెట్రో నగరాలకు ఈ సేవల విస్తరణకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. రోజువారీ బిజీ జీవితం, ఆఫీసు నుంచి ఇళ్లకు సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ సమస్యలు తదితరాలతో క్విక్ ఫుడ్ డెలివరీ యాప్స్ వైపు వినియోగదారుల మొగ్గు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. » జెప్టో ప్రయోగాత్మకంగా గతేడాది ముంబైలో ‘జెప్టో కేఫ్’ను ప్రారంభించింది. ఇప్పుడు ముంబైతోపాటు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది. » స్విగ్గీ కూడా బెంగళూరులో ఇన్స్టామార్ట్ ద్వారా ఇన్స్టాకేఫ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. » క్యూ– కామర్స్ సంస్థల మధ్య పోటీ తీవ్రంకావడంతో తమతమ సరాసరి ఆర్డర్ల విలువలను గణనీయంగా పెంచుకోవడంపై ఇవి దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న స్నాక్స్ , ఇతర ఆహార పదార్థాలు దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ చెయిన్లలో రూ.30 నుంచి 300 లోపు అందుతున్నా, హోం డెలివరీ రూపంలో కోరుకున్న సమయానికి వేగంగా ఇళ్లకు ఆర్డర్లు అందజేయడమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికైతే కస్టమర్లు ఈ సంస్థలు అందిస్తున్న సేవలను ఆహా్వనిస్తున్నారు. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్ల మాదిరిగా కాకుండా వివిధ రకాల వస్తువులతో (రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా) పాటుగా ఫుడ్ ఐటెమ్స్ కూడా ఒకేసారి తెప్పించుకునేందుకు అవకాశం ఉండటమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. యూఎస్ఏ, యూకే, లాంటి దేశాల్లో ఈ ఐడియాను ముందుగా అమలు చేయడంతోపాటు వినియోగదారులు చేసే ఆర్డర్ల సంఖ్యను పెంచేందుకు స్నాక్స్ ఇతర ఆహార పదార్థాలను చేర్చారు. ఎల్రక్టానిక్ గాడ్జెట్స్, ఇతర లగ్జరీ వస్తువులతో పోలి్చతే స్నాక్ ఐటెమ్స్కు వచ్చే మార్జిన్ అంత హెచ్చుస్థాయిలో లేకపోయినా రోజువారీ నిత్యావసర వస్తువుల కంటే మాత్రం స్నాక్స్ రేట్స్కు అధిక మార్జిన్తో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నట్టుగా నిపుణులు లెక్కలు వేస్తున్నారు. » కోల్కతాకు చెందిన సౌమాసేన్ ప్రతీరోజు ఆఫీస్కు వెళ్లడానికి ముందు లోకల్ మార్కెట్కు వెళ్లి తాజా పండ్లు, కూరగాయలు తెచ్చుకోవడంతోపాటు అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో అత్యవసరంగా ఎండు మిర్చీ, మస్టర్డ్ ఆయిల్, తదితర వస్తువుల కోసం దగ్గరలోని మార్కెట్కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడేది. అదే ఇప్పుడు క్విక్ డెలివరీ యాప్, సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఆయన కోరుకున్న రోజువారి వస్తువులు కేవలం ఏడు నిమిషాల సమయంలోనే హోం డెలివరీ ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. అయితే మామూలుగా కొనుగోలు చేస్తున్న దాని కంటే ఈ సర్వీసులకు కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తున్నా సేన్, ఆయన భార్య ఉద్యోగులు కావడంతో యాప్లపై ఆర్డర్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. నేడు వేగంగా మారుతున్న పరిస్థితులు..క్విక్ కామర్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో వస్తువుల ఆర్డర్ అనేది సులభమై పోయింది. » రోజువారీ జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులను 10 నుంచి 15 నిమిషాల్లో ఇళ్ల వద్దనే తెప్పించుకోవడం అనేది నవయువ తరానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. రోజువారీ జీవనశైలి అలవాట్లలో మార్పులు, వేగం పెరిగిన బిజీలైఫ్ తదితరాలకు తగ్గట్టుగా వివిధ వర్గాల కస్టమర్ల అభిరుచులు, అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. వీటన్నింటిని తీర్చేలా క్విక్ కామర్స్ సంస్థలు పోటీపడి కొత్త కొత్త ఆలోచనలతో డెలివరీ యాప్స్కు పదును పెడుతున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు ఈ విధమైన వ్యాపారంలో ముందంజలో ఎందుకు నిలవడం లేదన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇవేకాకుండా దేశీయంగా పెద్ద పెద్ద కంపెనీలు, దేశవ్యాప్తంగా సప్లయి చెయిన్లు ఉన్న బడా సంస్థలు కూడా క్యూ–కామర్స్ మార్కెట్ను అధిగమించలేకపోవడం కూడా ఓ సవాల్గానే నిలుస్తోంది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు డెలివరీ
ఏదైనా వస్తువులను ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్సైట్లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.Thank you Amazon for delivering my order after 2 years. The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024 -
చౌకలో ఫుడ్, క్యాబ్.. ఇలా బుక్ చేసుకోండి
అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్లో లభ్యమయ్యే కొన్ని యాప్లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్లను ఒకసారి వినియోగించి చూడండి. -
బుక్ చేసుకున్న 7 నిమిషాల్లో డెలివెరీ!.. ఫిదా అయిన కస్టమర్
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ ఇటీవల క్విక్ కామర్స్ సర్వీస్ ప్రారంభించింది. అంటే ఏదైనా వస్తువు బుక్ చేసుకుంటే నిమిషాల వ్యవధిలోనే డెలివరీ చేస్తారన్నమాట. బెంగళూరు వాసి ల్యాప్టాప్ బుక్ చేసుకున్న ఏడు నిమిషాల్లోనే ఫ్లిప్కార్ట్ అతనికి డెలివరీ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.బెంగళూరుకు చెందిన సన్నీ గుప్తా అనే వ్యక్తి ల్యాప్టాప్ ఆర్డర్ చేసుకున్నారు. అతినికి నిమిషాల వ్యవధిలోనే డెలివరీ అయింది. ఈ అనుభవాన్ని అతడు సోషల్ మీడియాలో వివరించారు. ఫ్లిప్కార్ట్ మినిట్స్ నుంచి ల్యాప్టాప్ని ఆర్డర్ చేసాను. 7 నిమిషాలలోనే డెలివరీ అయింది. బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే అని తెలుస్తోంది.చాలాకాలంగా గుప్తా ల్యాప్టాప్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు, ఇందులో భాగంగానే ఏసర్ ప్రిడేటర్ ల్యాప్టాప్ ఆర్డర్ చేశారు. దీని ధర రూ. 95000 నుంచి రూ. 2.5 లక్షల మధ్య ఉంది. ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలో డెలివరీ రావడం చాలా గొప్ప విషయం. దీనికి గుప్తా ఫ్లిప్కార్ట్కు ధన్యవాదాలు తెలిపారు.గుప్తా తన అనుభవాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీనిపైన పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు ఇది నా కొత్త భారతదేశం, ఇలాంటి సేవలు మున్ముందు ఇంకా వేగంగా ఉంటాయని అన్నారు. మరొకరు ఇది నిజంగా ఒక విప్లవం. ఫ్లిప్కార్ట్ విజయవంతమైతే, ఇది ఖచ్చితంగా అమెజాన్కు గట్టి పోటీ ఇస్తుందని అన్నారు.Just ordered a laptop from @Flipkart minutes.7 minutes delivery.Will keep this thread posted.— Sunny R Gupta (@sunnykgupta) August 22, 2024 -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
విమానంలోనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి
విమానం గాల్లో ఉండగానే ఓ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చారు.విజయవాడకు చెందిన దీప్తి సరసు వీర వెంకటరామన్(28) అనే గర్భిణి సింగపూర్ నుంచి చెన్నైకి బయలుదేరారు. గురువారం తెల్లవారుజామున విమానం గాల్లో ఉన్నప్పుడే పురిటి నొప్పులు మొదలయ్యాయి. విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే దీప్తి కూర్చున్న చోట చుట్టూ వస్త్రాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం అందించారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఒక డాక్టర్, ఫ్లైట్ అటెండెంట్లు, మహిళా ప్రయాణికుల సహాయంతో గర్భిణి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇదీ చదవండి: సీప్లేన్ ఏరోడ్రోమ్ నిబంధనల సడలింపుపైలట్ అప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించడంతో ఉదయం 4:30కు ల్యాండ్ అయ్యే సమయానికి గ్రౌండ్ సిబ్బంది, వైద్యులు చేరుకుని వైద్య పరీక్షలు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులు, సిబ్బంది, డాక్టర్ను పలువురు ప్రశంసించారు. అనంతరం తల్లి, బిడ్డలను అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
ఆర్టీసీ బస్సులో పురుడు పోసుకున్న మహిళ
-
డార్క్ వెబ్లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ : రెడ్ హ్యాండెడ్గా దొరికిన డెలివరీ బోయ్, వైరల్ వీడియో
అసలే వర్షాకాలం.. ఆపైన నక నకలాడే ఆకలి. ఉందిగా ఆన్లైన్ ఫుడ్ అంటూ ఆర్డర్ చేసుకొని తినేయడం చాలామందికి అలవాటు. అలాగే నోయిడాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఓలా ఫుడ్స్ నుండి భోజనాన్ని ఆర్డర్ చేశాడు. కానీ అతని ఆకలి తీరలేదు సరికదా కడుపు రగిలిపోయే చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్టోరీ నెట్టిజనుల ఆగ్రహానికి గురవుతోంది. విషయం ఏమిటంటే... వ్యాపారవేత్త అమన్ బీరేంద్ర జైస్వాల్ ఓలా ఫుడ్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. డెలివరీ ఏజెంట్ ఫోన్ చేసి అదనంగా పది రూపాయిలివ్వాలని డిమాండ్ చేశాడు.దీనికి తొలుత నిరాకరించిన జైస్వాల్ ఆ తరువాత సరే అన్నాడు. ఆసగా ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నాడు. అలా 45 నిమిషాలు గడిచిపోయాయి. ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదుగానీ తన ఫుడ్ను ఎంచక్కా లాగించేస్తున్న దృశ్యాన్ని షాక్ అయ్యాడు. అంతేకాదు హాన్ తో కర్తే రహో జో కర్నా హై" (ఏం చేసుకుంటావో చేస్కో) అన్న అతగాడి సమాధానం విని మరింత దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తన ఫుడ్ ఎందుకు తిన్నారని ప్రశ్నించగా మరి ఏం చేయాలి అంటూ ఉదాసీనంగా సమాధానం చెప్పాడు. మోటార్సైకిల్పై కూర్చుని డెలివరీ డ్రైవర్లు కస్టమర్ల ఫుడ్ను భోంజేస్తున్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, ఆ వీడియోను జైస్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Aman Birendra Jaiswal (@amanbjaiswal)దీనిపై చాలామంది ఎక్స్ యూజర్లు స్పందించారు. తమకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డర్ ప్లేస్ అవుతుంది. డెలివరీ బోయ్ జాడ ఉండదు. కాల్కి సమాధానం ఉండదు. ఓలా ఫుడ్స్కి ఫిర్యాదు లేదా పరిష్కార వ్యవస్థ లేదని తరువాత తెలిసిందే. చివరికి ఫుడ్ కేన్సిల్ అయింది అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు ఒక యూజర్. ఈ ప్లాట్పాంలో సీవోడీ(క్యాష్ అన్ డెలివరీ) అప్షన్లేదని మరొకరు ఆరోపించారు. రెండు సార్లు ఓటీపీ షేర్ చేయకుండానే ఫుడ్ డెలివరీ అయిందని వచ్చింది. రెండు సార్లు ఇలా జరిగిందని, ఓలాలోనే ఇలా జరగుతుందని ఒకరు, ఓలాలో మాత్రమే కాదు, స్విగ్గీలో కూడా ఇంతే అని మరొక వినియోగదారు తన గోడు వెళ్లబోసుకోవడం గమనార్హం. ఈ ఉదంతంపై ఓలా ఫుడ్ ఇంకా స్పందించలేదు. -
ఆరేళ్లుగా అందని డెలివరీ.. ఇన్నాళ్లకు స్పందించిన ఫ్లిప్కార్ట్
ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్కార్ట్లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్సైట్లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.After 6 yrs @Flipkart called me for this order 😂Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024 -
జెప్టోకు నిధుల పంట
న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్స్పీడ్, అవ్రా క్యాపిటల్సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్లో ఉంది. -
మొబైల్ ఆర్డర్ పెడితే.. ఏమొచ్చిందో తెలుసా? ఖంగుతిన్న కస్టమర్
ఆన్లైన్ ఆర్డర్ పెడితే.. డెలివరీ తీసుకునే వరకు వచ్చింది మనం పెట్టిన ఆర్డర్ అవునా? కాదా? అని సందేహమే. ఎందుకంటే గతంలో కొందమంది పెట్టిన ఆర్డర్స్ కారకుండా రాళ్లు వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది.ఒక వ్యక్తి అమెజాన్లో వివో వై20ఏ మొబైల్ ఆర్డర్ చేశారు. డెలివరీ కూడా వచ్చింది. వచ్చిన డెలివరీని అన్బాక్సింగ్ చేసి చూస్తే ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకంటే మొబైల్ ఫోన్కు బదులు అందులో మూడు సబ్బులు ఉన్నాయి. ఇది చూసి ఖంగుతిన్న కస్టమర్ అమెజాన్ కస్టమర్ కేర్ నుంచి సహాయం పొందటానికి ప్రయత్నించి విఫలమయ్యడు.తాను ఎదుర్కొన్న సమస్యను ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫోటోలను కూడా షేర్ చేశారు. అమెజాన్లో మొబైల్ ఆర్డర్ పెడితే.. సబ్బులు వచ్చాయని, దీనిపైన అమెజాన్ స్పందించలేదని పేర్కొన్నారు. ఆన్లైన్ మార్కెట్లో ఎంత పెద్ద మోసాలు జరుగుతున్నాయో ఆలోచించండి అంటూ ట్వీట్ చేసాడు.मेरी भांजी @Anuja7Jha ने @amazonIN से फ़ोन मंगाया। उसमें फ़ोन की जगह साबुन का टुकड़ा भेज दिया गया है। @AmazonHelp कोई मदद भी नहीं कर रहा है। सोचें,क्या ऐसे ऑनलाइन मार्केटिंग चल सकती है? इतना बड़ा फ्रॉड। आग्रह कि आमेजन पर दबाव बनाएँ। थैंक्स pic.twitter.com/8udb1uzTUB— Narendra Nath Mishra (@iamnarendranath) June 14, 2024 -
జొమాటో ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ హీరోలు: గిన్నిస్ వరల్డ్ రికార్డ్
మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి సాయం అందించవచ్చో ట్రైనింగ్ ఇచ్చిన.జొమాటో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. తమ డెలివరీ ఏజెంట్లకు ముంబైలో ఒకే చోట ఈ శిక్షణ అందించింది. ఒకేసారి 4,300 మందికి జూన్ 12వ తేదీన ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్లో చోటు సంపాదించింది. అత్యవసర సమయాల్లో స్పందించేలా అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించి ఈ రికార్డు సొంతం చేసుకుంది.ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ నుంచి వచ్చిన సర్టిఫికెట్ను జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఎక్స్లో షేర్ చేశారు. ‘ఎమర్జెన్సీ హీరోస్ ఆఫ్ ఇండియా’ అనే క్యాప్షన్తో డెలివరీ పార్ట్నర్స్ శిక్షణా ఫొటోలను ట్వీట్ చేశారు.జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కేవలం ఫుడ్ డెలివరీ చేయడమే కాకుండా ఇకపై అత్యవసర సమయాల్లో కూడా సాయం అందిస్తారని గోయల్ తెలిపారు దాదాపు 30 వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిపారు. "ఒకే చోట 4,300 మందికి ఇలా ట్రైనింగ్ ఇచ్చి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాం. దాదాపు 30 వేల మంది ఈ ప్రాథమిక చికిత్సలో శిక్షణ పొందారు. ఇకపై వీళ్లంతా అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడతారు. ఎమర్జెన్సీ హీరోలందరికీ నా సెల్యూట్" అని పోస్ట్ పెట్టారు. -
పచారీ కొట్లకు 10 మినిట్స్ సవాల్
సాక్షి, హైదరాబాద్: అగ్రరాజ్యం అమెరికా కంటే కూడా భారత్లో వివిధ డెలివరీ యాప్లు వేగంగా కస్టమర్లను చేరుకుని సంచలనం సృష్టిస్తున్నాయి. యూఎస్లోని డెలివరీ దిగ్గజ కంపెనీలు యాప్లపై ఆర్డర్ అందుకున్నాక లొకేషన్ ఆధారంగా అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేస్తున్నట్టు వెల్లడైంది. అందుకు భిన్నంగా మన దేశంలో ‘క్విక్ సర్వీస్’అనేది నాణ్యమైన సేవకు గీటురాయిగా మారింది. స్విగ్గీ, జెప్టో, బ్లింకిట్ వంటి యాప్లు...చిన్న చిన్న నిత్యావసరాలను సైతం అత్యంత వేగంగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తున్నాయి. గతంలో మనదేశంలో... ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నాక అక్కడక్కడా ఏర్పాటు చేసుకున్న ఔట్లెట్ల నుంచి నిత్యావసర వస్తువులు తీసుకుని కస్టమర్లకు చేర్చేవారు. ఐతే గత దశాబ్దకాలంలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి వాటి ద్వారా ఈ–కామర్స్ ఒక్కసారిగా పుంజుకోవడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో భారత్లో వేగంగా నిత్యావసర సరుకులు అందించే డెలివరీ సంస్థలు ఆన్లైన్ షాపింగ్పై అధిక నమ్మకాలు పెట్టుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్సంస్థలు ఉనికిలో నిలిచేందుకు కష్టపడుతుంటే, అదేకోవలోని భారత్ మార్కెట్ మాత్రం అంతకంతకు వృద్ది చెందుతున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్–19 లాక్డౌన్తో... ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ డెలివరీ స్టార్టప్లు పెరగగా..ఆ తర్వాత కొన్నిదేశాల్లో షాపులకు వెళ్లి వస్తువులు కొనుక్కునేందుకు మొగ్గుచూపడంతో అవి వెనకడుగు వేయక తప్పలేదు. భారత్లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ స్టార్టప్లు మరింత వృద్ది చెందడంతో పాటు సేవలో వేగం, నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టడం గమనార్హం. పచారీ కొట్లకు తప్పని పోటీ ఇప్పుడు డెలివరీ యాప్లు వేగం పుంజుకోవడంతో...పది నిమిషాల్లోనే కస్టమర్లు ఆర్డర్ చేసిన వస్తువులు చేరవేయడం అనే దాన్ని ఈ సంస్ధలు ఒక అలవాటుగా మార్చుకుంటున్నాయి. వినియోగదారులు ఆర్డర్ చేశాక పదినిమిషాల వ్యవధిలోనే నిత్యావసరాలను డెలివరీ ఏజెంట్లు అందజేయడాన్ని కూడా సెకన్ల వారీగా ట్రాక్ చేస్తుండటం విశేషం. ఆన్లైన్లో ఆర్డర్లను అందించే క్రమంలో ఏ కారణంచేతనైనా ఏజెంట్లు నెమ్మదిస్తే వారి ఫోన్లలో ‘ఎరుపు ఫ్లాష్’ద్వారా హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దేశంలోని వివిధ డెలివరీ యాప్ల ద్వారా పాలు, పండ్లు మొదలు గులాబీల దాకా నిమిషాల వ్యవధిలోనే కస్టమర్ల వద్దకు చేరేలా సర్వీసులు అందిస్తున్నారు. నగరాలు, పట్టణాల్లో పలు రకాల నిత్యావసరాలకు ఆర్డర్ అందగానే పది నిమిషాల్లో ఇళ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సరుకులను నిమిషాల్లో డెలివరీ చేసే యాప్లు పచారీ కొట్లకు సవాల్గా మారాయి. సంప్రదాయ కిరాణా దుకాణాలు, వీధి చివర్లలోని షాపులకు గట్టి పోటీ తప్పడం లేదు. మనదేశంలోని వివిధ వర్గాల ప్రజలు... తమ ఇళ్లకు దగ్గరలోని షాపుల నుంచి బియ్యం, పప్పులు, ఇతర వస్తువులను తెచ్చుకోవడమో లేదా ఫోన్లో ఆర్డర్ చేసే ఆ దుకాణాల్లో పనిచేసే వారు ఇళ్లకు చేరవేయడమో చేస్తూ వచ్చారు. ఇప్పుడు డెలివరీ యాప్ల యుగంలో...రోజువారీ అవసరాలకు ఉపయోగపడే చిన్న చిన్న వస్తువులను సైతం ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లోని ఇంటి గుమ్మం వద్దకు తెప్పించుకుంటున్నారు. స్విగ్గీలో ఐతే ఒకేఒక మామిడిపండును ఆర్డర్ చేసినా దానిని కూడా కస్టమర్కు డెలివరీ చేస్తోంది. వేగం, కచ్చితత్వం గత ఏప్రిల్లో భారత్లోని ఆన్లైన్ సరుకుల మార్కెట్, క్విక్ డెలివరీని గోల్డ్మాన్ సాక్స్ విశ్లేíÙంచినపుడు... ప్రస్తుతం భారత్ ఆన్లైన్ సరుకుల మార్కెట్ 11 బిలియన్ డాలర్లుగా నిలుస్తుండగా వాటిలో క్విక్ డెలివరీ మార్కెట్ 5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టుగా తేలింది. ఆన్లైన్ కస్టమర్ల ప్రాధాన్యతలకు తగ్గట్టుగా సరుకులను చేరవేయడంలో వేగం, కచ్చితత్వం పెరుగుదలతో 2030 కల్లా 60 బిలియన్ డాలర్లుగా చేరుకుని ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్లో క్విక్ కామర్స్ 70 శాతంగా నిలుస్తుందని ఈ సంస్ధ అంచనా వేస్తోంది. దేశవ్యాప్తంగా 1.30 కోట్ల నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాలు, షాపులు ఉండగా, వీటికి సంబంధించిన రిటైల్ అసోసియేషన్ల అంచనాల ప్రకారం... క్విక్ కామర్స్యాప్ల ద్వారా అమ్మకాలు తగ్గుదల పుంజుకోవడంతో... వివిధ ప్రధాన నగరాలు, పట్టణాల వారీగా చూస్తే సంప్రదాయ దుకాణాల్లో పది నుంచి 60 శాతం దాకా అమ్మకాలు నమోదైనట్టుగా తెలుస్తోంది. -
మొబైల్ ఫోన్ టార్చ్లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్హౌస్లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్ఫామ్లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్వర్క్ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
FASTag: పార్క్ ప్లస్తో చేతులు కలిపిన స్విగ్గీ - 10 నిమిషాల్లో ఫాస్ట్ట్యాగ్..
భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన స్విగ్గీ ఇన్స్టామార్ట్.. పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ఏర్పడటానికి కారణం ఏంటి? దీని వల్ల ఉపయోగాలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పది నిమిషాల్లోపు ఇండస్ఇండ్ బ్యాంక్ ఫాస్ట్ట్యాగ్ను స్విగ్గీ ఇన్స్టామార్ట్.. వినియోగదారులకు అందించడానికి ఈరోజు భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ట్యాగ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ పార్క్ ప్లస్తో చేతులు కలిపింది. ఈ సౌలభ్యం ప్రస్తుతం 29 నగరాల్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్లోని వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇప్పుడు ఫాస్ట్ట్యాగ్ని నేరుగా వారి ఇంటి వద్దకే 10 నిమిషాల్లో డెలివరీ చేసుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ హెడ్ 'ఫణి కిషన్' మాట్లాడుతూ.. ఫాస్ట్ట్యాగ్ని కొనుగోలు చేయడానికి బ్యాంక్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేస్తారు. అయితే కార్డు డెలివరీ అండ్ యాక్టివేషన్ కోసం 3 నుంచి 7 రోజుల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఫాస్ట్ట్యాగ్ అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు దీన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు. డెలివరీ కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుందని అన్నారు. ఈ భాగస్వామ్యం గురించి పార్క్ ప్లస్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అమిత్ లఖోటియా' మాట్లాడుతూ.. మా ప్రధాన లక్ష్యం కారు యజమానికి ఆనందాన్ని కలిగించడమే. ఈ ప్రయత్నంలో భాగంగానే ఫాస్ట్ట్యాగ్ కొనుగోలు చేసే వారు త్వరితగతిని డెలివరీ పొందటానికి స్విగ్గీ ఇన్స్టామార్ట్ సహకరిస్తుందని అన్నారు. -
నైన్ ఆల్ ఫైన్
ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం ఎప్పుడైనా చూశారా? లేదా.. ఇప్పుడు చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో.. ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుప్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే మొత్తం సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్సే, అబ్దెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అర కిలో నుంచి కిలో మధ్యే ఉంది. దీంతో పిల్లలు 19 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. -
త్వరలోనే ఇంటి నుంచి పార్శిళ్ల సేకరణ, డెలివరీ
సాక్షి, హైదరాబాద్: టికెటేతర ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వ సహకా రంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్క్ను మరింత గా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. విని యోగదారులకు వేగవంతమైన సేవలను అందజేసేందుకు త్వరలో ఇంటి నుంచే పార్శిళ్ల సేక రణ, డెలివరీ సేవలను అందుబాటులోకి తేను న్నట్లు వెల్లడించారు. దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన లాజి స్టిక్స్ మోడల్ కౌంట ర్ను గురువారం ఆయ న ప్రారంభించారు. లాజిస్టిక్స్ విభాగం కొత్త లోగో, బ్రోచర్ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం విని యోగించే కొత్త వాహనాన్ని కూడా ఎండీ జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్ఆర్టీసీ లాజి స్టిక్స్ విభాగం ద్వారా ప్రతిరోజూ సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నట్లు వివరించా రు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శి ళ్లను ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామన్నారు. దీంతో ఈ ఏడాది తమకు సుమారు రూ.120 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో మాత్రమే విని యోగదారుల ఇంటి నుంచి వస్తువుల సేకరణ, డెలివరీ సేవలు అందుబాటులోకి తెచ్చామని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు... నగరవాసులు ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040–69440069 కు సంప్రదించవచ్చు.లేదా ఆర్టీసీ వెబ్సైట్ జ్టి్టpట://ఠీఠీఠీ.్టటట్టఛి ౌజజీట్టజీఛిట.జీnలో కూడా లాగిన్ కావచ్చు. -
డెలివరీ తర్వాత పొట్ట అధిక బరువు తగ్గాలంటే|
నేను డెలివరీ అయ్యి రెండు వారాలు. మా ఫ్రెండ్స్ కొందరికీ డెలివరీ తర్వాత పొట్ట వదులుగా తయారైంది. నాకు అలా అవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – సీహెచ్. శ్రావణి, విజయనగరం ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల పొట్టలోని కండరాలు ముఖ్యంగా రెక్టస్ మజిల్, కనెక్టివ్ టిష్యూ మృదువుగా మారుతాయి. పెరిగే గర్భసంచిని, బిడ్డను అకామడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతాయి. కానీ ప్రసవం తరువాత ఆ కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామాలు చేయకపోతే పొట్ట కండరాలు బలహీనపడతాయి. దానివల్ల వెన్ను నొప్పి, నడుము నొప్పి, మోషన్కి వెళ్తున్నప్పుడు సమస్యలు, కీళ్ల నొప్పులు వస్తాయి. స్మాల్ రెక్టస్ సపరేషన్ చాలావరకు 6–8 వారాల్లో మజిల్ స్ట్రెచింగ్తో కవర్ అవుతుంది. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ని ప్రసవం అయిన రెండు నుంచి నాలుగు వారాల్లో నెమ్మదిగా మొదలుపెట్టాలి. ఈ ఎక్సర్సైజెస్ కోసం ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే మంచిది. ఈ వ్యాయామాలు చేసేటప్పుడు నొప్పి, అసౌకర్యం ఉంటే గనుక అసలు చేయకూడదు. ఇప్పుడు చాలా క్లినిక్స్లో పోస్ట్నాటల్ అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అని స్పెషల్ కేర్ ఎక్సర్సైజెస్ని నేర్పిస్తున్నారు. మీ శరీర తత్వం, మీది ఏరకమైన ప్రసవం.. అనే అంశాలను బట్టి మీ గైనకాలజిస్ట్, ఫిజియోథెరపీ టీమ్ కలసి మీకు తగిన వ్యాయామాలను సూచిస్తారు. ఈ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు అబ్డామినల్ బైండర్ లేదా టమ్మీ సపోర్ట్ బెల్ట్ను పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మీ శరీరం మునుపటిలా ఫిట్గా మారడానికి టైమ్ పడుతుంది. ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట కండరాలు నెలల పాటు స్ట్రెచ్ అయి ఉంటాయి. కాబట్టి అవి మళ్లీ మునుపటిలా టైట్ అవడానికి అంతే టైమ్ పట్టొచ్చు. త్వరగా పూర్వపు స్థితికి రావాలని హడావిడిగా అన్ని ఎక్సర్సైజెస్ చేస్తే వెన్ను నొప్పి ఎక్కువవొచ్చు. సిజేరియన్ అయిన వారు ఇంకొంచెం ఎక్కువ టైమ్ తీసుకుని శరీరం, మనసు సిద్ధమైన తర్వాతే ఎక్సర్సైజెస్ మొదలుపెట్టాలి. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ చాలా మంచివి. ప్రసవమైన రెండు వారాలకు వీటిని స్టార్ట్ చేయొచ్చు. ఆఫ్లైనే కాదు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని నేర్పిస్తారు. ఈ వ్యాయామాల వల్ల యూరినరీ మజిల్స్ టైట్ అవుతాయి. ప్రసవం తరువాత తలెత్తే యూరిన్ లీకేజ్, అర్జెన్సీ వంటి సమస్యలు తగ్గుతాయి. కవలలను.. అధిక బరువు బిడ్డను మోసినప్పుడు స్ట్రెచ్ ఎక్కువ అవుతుంది. అలాంటివారు ఎక్కువ టైమ్ తీసుకుని డాక్టర్ పర్యవేక్షణలో స్ట్రెంతెనింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ప్రెగ్నెన్సీ లేదా డెలివరీ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే పూర్తిగా కోలుకునే వరకు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయొద్దని డాక్టర్ చెప్తారు. అది ఫాలో కావాలి. సరైన గైడెన్స్ అవసరం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రసవం తరువాత ఏడాది వరకు బిడ్డకు చనుబాలు అవసరం కాబట్టి క్రాష్ డైట్ అసలు చేయకూడదు. కూర్చుని చేసే తేలికపాటి యోగాసనాలు, ధ్యానం వంటివి ప్రసవం తరువాత కాస్త ఎర్లీగానే మొదలుపెట్టవచ్చు. మా కుటుంబంలో అందరికీ హై బీపీ ఉంది. బీపీ వల్ల మా అక్కకి 9వ నెల ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వచ్చాయి. నాకు ఇప్పుడు మూడవ నెల. మేము ఉండేది విలేజ్లో. ఏ కాంప్లికేషన్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి. – వాణీపద్మజ, బోథ్ ప్రెగ్నెన్సీ టైమ్లో బీపీ, సుగర్ విషయంలో ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. మీ వయసు, బరువును బట్టి బీపీ రిస్క్ ఎంత ఉంది అనేది కాలిక్యులేట్ చేయొచ్చు. మూడవ నెలలో అందరికీ చేసే Nఖీ స్కాన్లో ఇవన్నీ అసెస్ అవుతాయి. ఇలాంటి హై రిస్క్ ప్రెగ్నెన్సీలో మూడవ నెల నుంచి అటpజీటజీn మాత్రలను సజెస్ట్ చేస్తారు. ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీని జెస్టేషనల్ హైపర్టెన్షన్ లేదా ప్రీఎక్లమ్సియా అంటారు. వందలో 2–8 ప్రెగ్నెన్సీల్లో ఇది కనిపిస్తుంది. ఈ కేసెస్లో హై బీపీతోపాటు మూత్రంలో ప్రొటీన్స్ పోతుంటాయి. బిడ్డ ఎదుగుదల మీదా ప్రభావం పడుతుంది. ప్లెసెంటాలో జరిగే మార్పుల వల్ల బీపీ పెరిగి తల్లికి, బిడ్డకు ప్రమాదం సంభవిస్తుంది. ఫ్యామిలీ హిస్టరీ లేదా అంతకుముందు బీపీ ఉన్నవారిలో రిస్క్ ఎక్కువ. దీన్ని తగ్గించేందుకు బీపీని కంట్రోల్ చేసే మాత్రలతోపాటు ప్రివెంటివ్ కేర్ కింద అటpజీటజీn మాత్రలనూ వాడాలి. హై బీపీని గుర్తించకపోతే తలనొప్పి, బ్లర్డ్ విజన్, కడుపు నొప్పి, ముఖము, పాదాల్లో వాపు వస్తుంది. బిడ్డ ఎదుగుదల మందగించడం, లోపల బ్లీడింగ్ అవడం, బిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడవచ్చు. అందుకే హై రిస్క్ కేసెస్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఏడవ నెల వరకు నెలకు రెండుసార్లు.. ఏడవ నెల తరువాత నుంచి వారానికి ఒకసారి చెకప్స్కి వెళ్లాలి. తగిన సమయంలో బ్లడ్, యూరిన్ టెస్ట్లు, స్కాన్స్ చేయించుకోవాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీలను చూసే ఆసుపత్రిలో రెగ్యులర్ యాంటీనాటల్ కేర్కి వెళ్లడం మంచిది. మీకు ఇప్పుడు మూడవ నెల కాబట్టి ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించి రిస్క్ అసెస్మెంట్ చేయించుకోండి. ఇందులో హై రిస్క్ వస్తే రెగ్యులర్ చెకప్స్ తప్పనిసరి. మూడవ నెల నుంచి 36 వారాల వరకు అటpజీటజీn మాత్రలను ఇస్తారు. ఈ మాత్రల వల్ల కొంచెం ఎసిడిటీ వస్తుంది. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ మాత్రలను తీసుకోవాలి. ఒకవేళ వెజైనల్ బ్లీడింగ్ లేదా అల్సర్స్ ఉంటే మోతాదు మారుస్తారు. డైట్, జీవనశైలిని మారిస్తే బీపీ వచ్చే రిస్క్ తగ్గుతుంది. పౌష్టికాహారం, ఎక్సర్సైజెస్తో బరువు పెరగకుండా చూసుకోవాలి. విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ను తీసుకోవాలి. క్రమం తప్పకుండా ఫోలిక్ యాసిడ్ మాత్రలను వాడాలి. ఈ జాగ్రత్తలతో పాటు ప్రెగ్నెన్సీలో మీకు ఎప్పుడైనా విపరీతమైన తలనొప్పి, బ్లర్డ్ విజన్, వాంతులు, ఛాతీ నొప్పి వంటివి వస్తే వెంటనే హై రిస్క్ యూనిట్ని సంప్రదించాలి. వెంటనే బీపీ మెడిసిన్ని స్టార్ట్ చేస్తారు. ఇలా ప్రివెంటివ్ మెడిసిన్, లైఫ్స్టయిల్ చేంజెస్, క్రమం తప్పని యాంటీనాటల్ చెకప్స్తో బీపీ వచ్చే చాన్సెస్ను తగ్గించుకోవాలి. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
కస్టమర్లకు సైలెంట్ షాకిచ్చిన స్విగ్గీ!
ప్రముఖ ఫుడ్ డెలివరీ దగ్గజం స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది. స్విగ్గీని వినియోగిస్తూ ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్న కస్టమర్ల నుంచి ప్లాట్ఫామ్ ఛార్జీలను వసూలు చేస్తుంది. తాజాగా ఆ ఛార్జీలను పెంచుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం స్విగ్గీ ఎక్కువ మంది యూజర్ల నుంచి ఆర్డర్ను బట్టి రూ.3 ప్లాట్ఫామ్ ఫీజులు వసూలు చేస్తుంది. అయితే, పెరిగిపోతున్న డెలివరీలను దృష్టిలో ఉంచుకుని ఆదాయాన్ని గడించేందుకు కొత్త వ్యాపార ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా రూ.10 ప్లాట్ఫామ్ ఛార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమైంది. అందుకు అనుగుణంగానే ఆర్డర్ చేసిన తర్వాత బిల్లులో ప్లాటఫామ్ ఛార్జీ రూ.10 చూపిస్తుంది. డిస్కౌంట్ ఇస్తున్నామంటూ రూ.5 మాత్రమే వసూలు చేస్తుంది. రానున్న రోజుల్లో దీనిని పది రూపాయలకు పెంచే యోచనలో ఉందని, కాబట్టే బిల్లులో ఇలా చూపిస్తుందని వినియోగదారులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా స్విగ్గీ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫ్లాట్ఫామ్ ఫీజుల్ని పెంచే ఉద్దేశం లేదన్నారు. కాకపోతే కస్టమర్లను అర్ధం చేసుకునేందుకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ఇది కూడా ఓ భాగమేనని అన్నారు. జనవరి 1న,జొమాటో వినియోగదారుల నుంచి ప్లాట్ఫారమ్ రూ.3 నుండి రూ.4 పెంచిందని ఎకనమిక్స్ టైమ్స్ నివేదించింది. ఈ కొత్త ఏడాది సందర్భంగా ఎంపిక చేసిన కస్టమర్లకు తాత్కాలికంగా ప్లాట్ఫారమ్ ఛార్జీలను కొన్ని ప్రాంతాల్లో ఆర్డర్కు రూ.9 వసూలు చేసింది. స్విగ్గీ గత ఏడాది ఏప్రిల్లో ఫ్లాట్ ప్లాట్ఫారమ్ రుసుమును వసూలు చేయడం ప్రారంభించగా జొమాటో ఆగస్టు నుంచి ప్రారంభించింది. రెండు ప్లాట్ఫారమ్లు ఆర్డర్కు రూ.2 రుసుముతో ప్రారంభమయ్యాయి. ఇప్పుడు స్విగ్గీ మరోమారు ప్లాట్ఫారమ్ ఛార్జీలను పెంచేందుకు సిద్ధమైంది. -
ఆన్లైన్లో ఫింగర్ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్!
కరీంనగర్: ఆన్లైన్లో ఫింగర్ప్రింట్ స్కానర్ బుక్ చేస్తే రాళ్లు వచ్చిన సంఘటన కోనరావుపేట మండలం కనగర్తిలో వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన కొల్లూరి వికాస్ ఆన్లైన్లో ఫింగర్ప్రింట్ స్కానర్ కోసం జనవరి 1న బుక్ చేశాడు. 12న డెలివరీ ఇస్తామని షాపింగ్ సంస్థ స్పష్టం చేయగా.. ఆదివారమే పార్సిల్ ఇంటికొచ్చింది. డెలివరీ బాయ్కి రూ.2,718 చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు. పార్సిల్ తెరిచి చూడగా రాళ్లు కనిపించడంతో కంగుతినడం యువకుడి వంతైంది. మోసం జరిగిందని వెంటనే డెలివరీ బాయ్కి చెప్పగా ఐటమ్ రిటర్న్ పెట్టమంటూ వెళ్లిపోయాడు. -
రూ.97 లక్షల టిప్స్ - సీఈఓ రియాక్షన్ ఇలా..
2024 సంవత్సరానికి ఆహ్వానం పలకడానికి ప్రపంచంలోని చాలా దేశ ప్రజలతో పాటు భారతీయులు కూడా సిద్ధమయ్యారు. ఈ సందర్భంలో ఫుడ్, డ్రింక్స్ వంటి వాటి కోసం జొమాటో, స్విగ్గీ వంటి యాప్ల మీద పడ్డారు. 2023 డిసెంబర్ 31 రోజు మాత్రమే జొమాటో లెక్కకు మించిన డెలివరీలు చేసి ఏకంగా రూ. 97 లక్షల టిప్స్ పొందినట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఇండియన్ జొమాటో డెలివరీ భాగస్వాములకు కస్టమర్లు ఏకంగా రూ. 97 లక్షలకు పైగా టిప్ ఇచ్చినట్లు జోమాటో సీఈవో 'దీపిందర్ గోయల్' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. 2015 నుంచి 2020 వరకు కంపెనీ ఎన్ని ఆర్డర్లను స్వీకరించిందో.. ఒక్క 2023 డిసెంబర్ 31న ఒకే రోజు స్వీకరించి గతంలో నెలకొన్ని అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సుమారు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్ట్నర్స్ ఈ డెలివరీలను చేసినట్లు తెలిపారు. ఇదీ చదవండి: టెస్టింగ్ దశలో కొత్త ఫీచర్.. నచ్చిన ధరకే రైడ్! దేశంలో ఎక్కువ ఆర్డర్స్ మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు, కలకత్తాకు చెందిన ఓకే వ్యక్తి 125 ఐటెమ్లను ఆర్డర్ చేసుకున్నాడు. ప్రజలు 1.47 లక్షల చిప్స్ ప్యాకెట్లు, 68,231 సోడా బాటిళ్లు, 2,412 ఐస్ క్యూబ్స్ ప్యాకెట్లు, 356 లైటర్లను ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Love you, India! You’ve tipped over ₹97 lakhs till now to the delivery partners serving you tonight ❤️❤️❤️ — Deepinder Goyal (@deepigoyal) December 31, 2023 -
ఆ సమయంలో తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యా: పోకిరి భామ
పోకిరి భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. అయితే గతేడాది పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఆ తర్వాత ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడితో ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అంతే కాకుండా తన కుమారుడికి కోవా ఫీనిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టింది. అయితే ప్రస్తుతం బిడ్డతో మాతృత్వం ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. ప్రసవం తర్వాత ఎదురైన ఇబ్బందులను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్కు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో తన భాగస్వామి మైఖేల్ డోలన్కు సపోర్ట్గా ఉన్నారని వివరించింది. ఇలియానా మాట్లాడుతూ.. 'ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్కు గురయ్యా. కానీ ఇంట్లో నాకు మంచి సపోర్ట్ ఉన్నందుకు సంతోషిస్తున్నా. నేను నా గదిలో ఒంటరిగా ఉంటూ ఏడ్చాను. ఇది నిజంగా తెలివి తక్కువ పని నాకు తెలుసు, కానీ నా కొడుకు వేరే గదిలో నిద్రిస్తున్నాడు. అందుకే నేను అతన్ని కోల్పోతున్నట్లు అనిపించింది. తనను బాగా చూసుకున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు చెప్పా' అని అన్నారు. తన భాగస్వామిని గురించి మాట్లాడుతూ.. 'బిడ్డ పుట్టిన తర్వాత మేము కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాం. నేను ఇప్పటికీ వాటిని అనుభవిస్తున్నా. మైక్ ఇంత అద్భుతమైన భాగస్వామి అయినందుకు నేను నిజంగా లక్కీ. అతనికి నేను ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పి.. ఆ తర్వాత తనే బిడ్డను చూసుకుంటూ ఉంటాడు." అంటూ ఆనందం వ్యక్తం చేసింది. అయితే పర్సనల్ విషయాల్లో ప్రైవసీ మెయింటెన్ చేస్తున్న ఇలియానా.. తన పార్ట్నర్ గురించి పెద్దగా మాట్లాడలేదు. కాగా.. ఇలియానా చివరిసారిగా ది బిగ్ బుల్లో అభిషేక్ బచ్చన్తో కలిసి కనిపించింది. ప్రస్తుతం ఆమె రణదీప్ హుడా సరసన అన్ఫెయిర్ అండ్ లవ్లీలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది.. కట్ చేస్తే.. ఆరు సార్లు డెలివరీ
టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న సమయంలో లెక్కకు మించిన యాప్స్ పుట్టుకొచ్చాయి. గ్యాడ్జెట్స్, ఎలక్ట్రిక్స్ వంటివి మాత్రమే కాకుండా నిత్యావసర వస్తువులు కావాలంటే కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుని.. ఉన్న చోటుకే తెప్పించుకుంటున్నారు. యాప్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గురుగ్రామ్కు చెందిన 'ప్రణయ్ లోయా' స్విగ్గీ ఇన్స్టామార్ట్లో కొన్ని సరకులను ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ పెట్టగానే అమౌంట్ కట్ అయినప్పటికీ.. ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు స్టేటస్లో కనిపించింది. అంతటితో ఆగకుండా మళ్ళీ ఆర్డర్ పెట్టాడు.. మళ్ళీ అదే అనుభవం ఎదురైంది. ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయిందనుకున్న ప్రణయ్ లోయా ఇంటికి కొంత సమయానికే ఒక్కొక్కటిగా డెలివరీ వచ్చాయి. ఇలా ఒక్కో వస్తువు ఆరు సార్లు డెలివరీ చేసుకోవాల్సి వచ్చింది. ఇది చూసి లోయా ఆశ్చర్యానికి గురయ్యాడు. తనకెదురైన ఈ వింత అనుభవాన్ని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసాడు. దీనికి ఎంత ఖర్చు అయిందనే విషయం స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఇదీ చదవండి: చదువుకునే రోజుల్లోనే పునాది.. తాత పేరుతో కంపెనీ - పునీత్ గోయల్ సక్సెస్ స్టోరీ అతడు డెలివరీ చేసుకున్న వాటిలో 20 లీటర్ల పాలు, 6 కేజీల దోశ పిండి, 6 ప్యాకెట్ల ఫైనాపిల్స్ ఉన్నట్లు సమాచారం. ఇన్ని ఎక్కువ సరుకులతో నేను ఏమి చేసుకోవాలి అంటూ ఎక్స్ ఖాతలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Suddenly my phone started ringing with multiple calls from the delivery executives The customer support didn’t respond to a single query and the delivery guys came all the way bringing the orders pic.twitter.com/uiZiwyX8T3 — Praanay Loya (@pranayloya) December 14, 2023 -
ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో)
Mahindra Dealership In Austrelia: ఇటీవల ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ 'మాథ్యూ హేడెన్' కుమార్తె 'గ్రేస్ హేడెన్' ఇండియన్ బ్రాండ్ కారుని ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసింది. కారు డెలివరీకి సంబంధించిన వీడియోను 'మహీంద్రా ఆస్ట్రేలియా' తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. ఇందులో మహీంద్రా డీలర్షిప్ ఆస్ట్రేలియాలో ఎలా ఉందనేది స్పష్టంగా చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మహీంద్రా సంస్థ కార్లు, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. అక్కడ ఇండియన్ బ్రాండ్ కార్లకు మంచి డిమాండ్ ఉన్న కారణంగానే ఈ ఎగుమతులు జరుగుతాయి. ఇటీవల గ్రేస్ భారతదేశానికి వచ్చినప్పుడు మహీంద్రా తయారీ కర్మాగారాన్ని సందర్శించే అవకాశం లభించిందని, అక్కడే మహీంద్రా కార్లు ఎలా తయారవుతాయనేది చూసినట్లు ఆమె వెల్లడించింది. ఆ తరువాత తాను మహీంద్రా XUV700 కారుని కొనుగోలు చేయాలనుకుని.. ఆస్ట్రేలియాలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది. యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో గ్రేస్ డీలర్షిప్ సందర్శించడం, అక్కడ తనకు నచ్చిన మిడ్నైట్ బ్లాక్ షేడ్లోని XUV700 డెలివరీ తీసుకోవడం వంటివి చూడవచ్చు. ఈ డీలర్షిప్ లోపల ఇతర కార్లు కూడా ఉండటం చూడవచ్చు. ఇదీ చదవండి: ఏం ప్లానింగయ్యా.. ఏమీ చేయకపోయినా నెలకు రూ.9 లక్షలు సంపాదన ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం చూస్తుంటే ఓ కొత్త ఎనర్జీ వస్తుందని ట్వీట్ చేశారు. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే తెగ వైరల్ అయింది. వేలమంది వీక్షించిన వీడియోపై కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. Very few things in business more energizing than seeing your brand expand globally… pic.twitter.com/3S5rijDbvS — anand mahindra (@anandmahindra) December 10, 2023 -
Akanksha Gupta: మొక్కవోని ఆకాంక్ష
ఈ రోజుల్లో ఇంట్లో కూర్చోనే షాపింగ్ చేసి లక్షలు ఖరీదు చేసే వస్తువులను సైతం క్షణాల్లో కొనేస్తున్నారు. వంట చేయడం కుదరనప్పుడో, తినడానికి ఏమీ లేనప్పుడో, బయటకు వెళ్లే ఓపిక లేనప్పుడో వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలోపు వేడివేడి ఆహారం ఇంటి గుమ్మం ముందుకు వచ్చేస్తుంది. ఈ డెలివరీ యాప్లను ఆధారంగా చేసుకుని మొక్కల వ్యాపారం ప్రారంభించింది ఆకాంక్ష గుప్తా. ఫుడ్ డెలివరీ అయినట్టుగానే మొక్కలు, విత్తనాలు, ఎరువులను ఆర్డర్ ఇచ్చిన గంటల వ్యవధిలో కస్టమర్లకు అందిస్తోంది. కంపెనీ ప్రారంభించిన రెండేళ్లలో కోట్ల టర్నోవర్తో నడుస్తోంది. మొక్కలను ఎలా డెలివరీ చేస్తోందో ఆకాంక్ష మాటల్లోనే..... ఢిల్లీలోని మోడల్ టౌన్లో నివసించే సాంప్రదాయ ఉమ్మడి కుటుంబం మాది. నాన్న వ్యాపారి. అమ్మ ఇంటిపనులు చూసుకునేది. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో బీకామ్ హానర్స్ పూర్తయ్యాక...ఉద్యోగం చేస్తాను అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మాయిలు ఇంట్లో ఉండి పనులు చూసుకుంటుంటే, అబ్బాయిలు బయటకు వెళ్లి పనిచేసి సంపాదించడం పద్ధతి అనేది వాళ్ల నమ్మకం. దీంతో వాళ్లను ఒప్పించడానికి చాలా సమయం పట్టింది. నేను ఉద్యోగం ఎందుకు చేయాలనుకుంటున్నానో అన్నివిధాలుగా వివరించాను. అందుకు వాళ్లు సమ్మతించి ప్రోత్సహించారు. దీంతో ఈఎక్స్ఎల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ఇక్కడ రెండేళ్లు పనిచేశాక, 2016లో అహ్మదాబాద్ ఐఐఎమ్లో ఎమ్బీఏ పూర్తిచేశాను. తర్వాత ‘డెలాయిట్’ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేరాను. ► లాక్డౌన్ మార్చేసింది... డెలాయిట్లో పనిచేస్తున్నప్పుడు... తెలిసిన వాళ్ల అబ్బాయి సంభవ్ జైన్ పరిచయమయ్యాడు. సంభవ్ కూడా ఎమ్ఎన్సీలో పనిచేస్తుండడం, ఇరుకుటుంబాలకు నచ్చడంతో 2019లో మా పెళ్లి జరిగింది. పెళ్లి అయిన కొన్నినెలలకే లాక్డౌన్ విధించారు. ఇంట్లో ఉండి పనిచేస్తున్నప్పటికీ వారాంతపు సెలవుల్లో చాలా సమయం దొరికేది. మొక్కలు పెంచడం అంటే ఎంతో ఆసక్తి చూపే సంభవ్ సమయం మొత్తం గార్డెనింగ్కు కేటాయించేవాడు. సంభవ్ నిర్వహించే వర్క్షాపుల్లో ‘‘మొక్కలు ఎలా పెంచాలి? మొక్కలు బాగా పెరిగేందుకు సలహాలు సూచనలు’’ సంభవ్తో కలిసి నేను చెప్పేదాన్ని. ఆరేడు నెలల్లోను మేము నిర్వహించిన వర్క్షాపులకు మూడువేల మందికి పైగా హాజరై గార్డెనింగ్ గురించి తెలుసుకున్నారు. ఇలా లాక్డౌన్లో మా జీవితాలు గార్డెనింగ్ వైపు మళ్లాయి. ఈ మార్పే మమ్మల్ని వ్యాపార వేత్తలుగా మార్చింది. ► సమస్యల నుంచి... వర్క్షాపుల్లో చాలా మంది.. మొక్కలు పెంచాలని ఉంది కానీ, మంచి మొక్కలు, కుండీలు, ఎక్కడ కొనాలో తెలియడం లేదు. ఆన్లైన్లో కూడా మంచి స్టోర్లు ఏవీ లేవు. అరకొర ఆన్లైన్ స్టోర్లు కస్టమర్లకు నచ్చడం లేదు’’ అని చెప్పారు. దీంతో 2020లో సంభవ్ ఉద్యోగం వదిలేసి ‘ది బన్యన్ కంపెనీ’ పెట్టాడు. తనకి నేను సాయంగా ఉన్నాను. ఒక దగ్గర నర్సరీ పెంచుతూ అక్కడ నుంచి కస్టమర్లకు ఆర్డర్లు ఇవ్వడానికి రవాణా ఖర్చు ఎక్కువ అవడంతోపాటు, కొన్నిసార్లు రవాణాలో మొక్కలు పాడైపోయేవి. దీంతో మా కంపెనీ బాగా నష్టపోయింది. ► ఫుడ్ లా మొక్కలు కూడా... కంపెనీ అనేక నష్టాలను చూశాక ఎలా కంపెనీని నిర్వహించాలని తీవ్రంగా ఆలోచించాను. అప్పుడే నాకు ఫుడ్ డెలివరీ యాప్స్ గుర్తుకొచ్చాయి. ఫుడ్ను డెలివరీ చేసే యాప్స్లా మొక్కలను ఎందుకు డెలివరీ చేయకూడదు... అనిపించింది. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయి అనుకుని వెంటనే 2021లో ‘ఉర్వాన్.కామ్’ కంపెనీని ప్రారంభించాను. అర్బన్, ఫారెస్ట్ ల నుంచి పదాలను తీసుకుని ఉర్వాన్ పేరు పెట్టాను. ఈ కంపెనీ ప్రారంభించిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాను. కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. ‘‘ఉద్యోగం వదిలేసి సంభవ్ చేసిన వ్యాపారంలో నష్టం వచ్చింది. మళ్లీ ఆకాంక్ష కూడా అదే పనిచేస్తోంది. ఈ వ్యాపారం కూడా నష్టపోదని గ్యారెంటీ ఏంటీ? సంభవ్ నువ్వు అయినా ఉద్యోగం చెయ్యి’’ అందరు సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే ఈ వ్యాపారం ఎప్పటికీ విజయవంతం కాదన్నారు. కానీ నేను, సంభవ్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగాం. చివరకు ఒక బిజినేస్ అడ్వైజర్ దగ్గరకు వెళ్లి సలహా అడిగితే... ‘‘ఇది అంత మంచి వ్యాపారం కాదు. దీనివల్ల ఆదాయం ఏమీ రాదు. మీ ఇద్దరూ ఉద్యోగాలు చేసుకోవడం మంచిది’’ అని సలహా ఇచ్చారు. వెబ్సైట్ క్రియేట్ చేసిన తరువాత నర్సరీ నిర్వాహకులను కలిసి వెబ్సైట్లో యాడ్ చేశాము. కొంతమందికి కనీసం వాట్సాప్ మెస్సేజ్లు కూడా పంపడం రాదు. ఆన్లైన్లో మొక్కలు విక్రయించిన అనుభవం ఎవరికీ లేదు. దీంతో అందరికి దీనిలో శిక్షణ ఇచ్చాము. ప్రారంభంలో పెద్దగా ఆదాయం ఏమీ రాలేదు. కానీ రెండు వారాల తరువాత మేము పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రావడం మొదలైంది. కస్టమర్లు పెరగడంతో..స్నేహితులు, బంధువులు మా కంపెనీలో పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టారు. ఆర్డర్ ఇచ్చిన మరుసటిరోజుకల్లా దగ్గర్లోని నర్సరీల నుంచి కస్టమర్లకు మొక్కలు డెలివరీ ఇస్తున్నాం. దీనికి అదనపు ప్యాకింగ్ చార్జీలు లేకపోవడం, బయటి రేటుకే ఆన్లైన్లో దొరుకుతుండడంతో ఎక్కువమంది మా దగ్గర కొనడం ప్రారంభించారు. తొలినాళ్లల్లో నెలకు ఐదువందల మొక్కలు విక్రయించడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు నెలకు మూడులక్షలకు పైగా మొక్కలను డెలివరీ ఇస్తున్నాము. ఇద్దరితో ప్రారంభమైన మా వ్యాపారం నేడు పాతిక మందికి చేరింది. మూడు నర్సరీల నుంచి నలభై నర్సరీలు అయ్యాయి. ఢిల్లీ, ఎన్సీఆర్లోనేగా బెంగళూరులోనూ మా మొక్కలు డెలివరీ ఇస్తున్నాము. వచ్చే సంవత్సరం వందకోట్ల టర్నోవర్ లక్ష్యంగా పనిచేస్తున్నాము. ‘‘కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు ఎవరికీ నచ్చకపోవచ్చు. కానీ ఆ నిర్ణయం మీద, మన మీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కొని విజయం సాధించవచ్చు’’ అని ఆకాంక్ష గుప్తా నిరూపించి చూపిస్తోంది. -
AP: గ్యాస్ సిలిండర్ డెలివరీకి చార్జీలు చెల్లించొద్దు
సాక్షి, అమరావతి: గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో రశీదులో ఉండే మొత్తానికి మించి ఎటువంటి అదనపు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ మంగళవారం తెలిపారు. పట్టణ ప్రాంతం, గ్రామీణ/పట్టణ ప్రాంతంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెంటర్ నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, గిరిజన, కొండ ప్రాంతాలకు ఎటువంటి డెలివరీ చార్జీలు తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి 15 కిలో మీటర్లు పైబడిన ప్రాంతాలకు మాత్రమే నిర్దిష్ట రుసుము వసూలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. కానీ గ్యాస్ డెలివరీ సమయంలో ఎక్కువ రుసుము వసూలు చేస్తే పౌరసరఫరాల శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ టోల్ఫ్రీ నంబర్ 1967, 1800 2333555కు ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఇటలీలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మూడు నెలల్లో ఒక్క డెలివరీ కూడా లేదా?
ప్రపంచంలో వృద్ధుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. చైనా, జపాన్ లాంటి దేశాలు దీనికి పెద్ద ఉదాహరణగా నిలిచాయి. ఇప్పుడు ఇటలీ కూడా ఈ జాబితాలో చేరింది. దీనికి కారణం అక్కడ పిల్లలు పుట్టకపోవడమే. పలు రిపోర్టులలో వెల్లడైన వివరాల ప్రకారం గత మూడు నెలలుగా ఇటలీలో ఏ ఒక్క శిశు జననం కూడా జరగలేదు. ఇది జాతీయ సమస్యగా పరిణమించింది.ఈ నేపధ్యంలో ఇటలీ ప్రధాని దీనిని జాతీయ అత్యవసర పరిస్థితిగా చూడాలన్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటలీ ఇటీవల వినూత్న ప్రపంచ రికార్డును సృష్టించింది. అయితే ఈ ప్రపంచ రికార్డులో సంతోషించాల్సిన విషయమేమీ లేదు. దేశం శరవేగంగా వృద్ధాప్య దశకు చేరుతోంది. ఈ నివేదిక ప్రకారం గత మూడు నెలల్లో ఇటలీలో ఒక్క శిశువు కూడా జన్మించలేదు. రాయిటర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం నేషనల్ స్టాటిస్టిక్స్ బ్యూరో ఐఎస్టీఏటీ గణాంకాలను పరిశీలిస్తే.. జనవరి 2023 నుండి జూన్ 2023 వరకు ఇటలీలో జన్మించిన పిల్లల సంఖ్య జనవరి 2022- జూన్ 2022 మధ్య జన్మించిన వారి కంటే 3500 తక్కువ. దేశంలో 15 నుంచి 49 ఏళ్లలోపు మహిళల సంఖ్య తక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక ద్వారా వెల్లడైంది. అంటే ఇటలీలో పునరుత్పత్తి వయసు గల మహిళల కొరత తీవ్రంగా ఉంది. ఈ వయసు కలిగిన మహిళల సంఖ్య 2021తో పోలిస్తే 2023లో చాలా వరకూ తగ్గింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ దీనిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు. ఇటలీలో రోజుకు ఏడుగురు పిల్లలు పుడుతుండగా, అదే సమయంలో దేశంలో 12 మరణాలు నమోదువున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే అక్కడి జనాభా వేగంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు. ఇది కూడా చదవండి: హమాస్ను మట్టికరిపించిన 13 మంది మహిళలు -
పార్శిల్ బిజినెస్లోకి జొమాటో.. ఎవరు వినియోగించుకోవచ్చంటే?
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా జొమాటొ ఎక్స్ ట్రీం పేరుతో కొత్త పార్శిల్ సర్వీసుల్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ ఎక్స్ట్రీమ్ కింద 3 లక్షల మంది డెలివరీ పార్టనర్లు ఉన్నట్లు తెలిపిన జొమాటో.. ఈ పార్శిల్ సర్వీసుల్ని చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద రీటైల్ షాపుల వరకు ఈ సేవల్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇది ఫుడ్ డెలివరీ తరహాలో వ్యాపారులు తమ సరుకులను ప్రత్యక్షంగా ట్రాక్ చేసుకోవచ్చు. 35 రూపాయలతో ప్రారంభమయ్యే 10 కిలోగ్రాముల బరువున్న ఇంట్రా-సిటీ ప్యాకేజీలను మాత్రమే పంపగలరని జొమాటో వెల్లడించింది. ఇక ఈ ఎక్స్ట్రీమ్ యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయి వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ స్టోర్లో ఈ యాప్ అందుబాటులోకి రాలేదు. దీనిపై జొమాటో మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
కత్తెర కాన్పులు ఇక కట్.. సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన
మహిళలకు మాతృత్వం వరం. గర్భిణి అని నిర్ధారణ అవగానే ఆ యువతి కళ్లలో ఆనందం తొంగి చూస్తుంది. నెలలు నిండే కొద్దీ ఆ ఆనందం స్థానంలో క్రమంగా ఆందోళన చోటు చేసుకుంటుంది. తనకు సుఖప్రసవం అవుతుందా..?, సిజేరియన్ చేయాల్సి వస్తుందా..? అన్న ఆవేదనకు గురవుతుంది. ఇకపై ఆ చింత తొలగనుంది. షీ సేఫ్ విధానంతో కత్తెర కాన్పులకు చెక్ పడనుంది. ప్రైవేటు ఆస్పత్రులపైనా నిఘా పెరగనుంది. సుఖప్రసవానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తూ అమ్మకు ఆలంబన చేకూర్చనుంది రాష్ట్రప్రభుత్వం. చిత్తూరు రూరల్: అమ్మ కడుపుకోతకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. షీ సేఫ్ పేరుతో సహజ ప్రసవాలకు రూపకల్పన చేసింది. గర్భిణులకు అవగాహన కలి్పంచి సిజేరియన్లు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యాధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం పూర్తి అయ్యింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్న సిజేరియన్లపై నిఘా పెట్టేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో ఒక జిల్లా ప్రభుత్వాస్పత్రి, 4 ఏరియా ఆస్పత్రులు, 7 సీహెచ్సీలు, 50 పీహెచ్సీలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రసవాలు చేస్తున్నారు. గత నెల నుంచి పీహెచ్సీలు కూడా 24 గంటలు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మాతాశిశు మరణాలు తగ్గించాలని, సహజ ప్రసవాల సంఖ్య పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 70 నుంచి 80 శాతం నమోదవుతున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 500 పైగా ఉన్నాయి. వీటిలో 60 నుంచి 70 శాతం శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండడంతో మహిళలకు ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. షీ–సేఫ్తో... బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అది సహజపద్ధతిలో జరిగితే తల్లీబిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహంతో అమ్మ కడుపును కోసేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్ ఆపరేషన్లు చేసేస్తున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేస్తే తప్పు కాదు, కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా ప్రైవేటు వైద్యులు శస్త్ర చికిత్సలను ప్రోత్సహిసున్నారు. సిజేరియన్కు రూ.50 వేల నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి (కోత కనబడని శస్త్రచికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్రచికిత్సలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్యశాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్లతో కలిగే అనర్థాలు, సహజ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు ప్రోత్సాహించేందుకు షీ–సేఫ్ విధానాన్ని రూపకల్పన చేసి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. షీ సేఫ్ అంటే.. అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియన్లు చేయాలన్నదే షీ–సేఫ్ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాత శిశుమరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. ఆఫరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తోంది. సాధారణ కాన్పు..సిజేరియన్కు తేడాలివీ.. సాధారణ కాన్పు జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితి ఆధారంగా రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్రచికిత్స చేస్తుంటారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నారు. ఆపరేషన్ల కుదింపుపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మే నుంచి ఆగస్టు వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 5,945 ప్రసవాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వాస్పత్రుల్లో మొత్తం 3,092 ప్రసవాలు జరగ్గా, 2,173 సుఖ ప్రసవాలు, 919 మాత్రమే సిజేరియన్ ఆపరేషన్లు చేశారు. అలాగే ప్రైవేటు ఆస్పత్రుల్లో 2,853 జరగ్గా.. 1,187 శస్త్ర చికిత్సలు, సాధారణ ప్రసవాలు 1,666 జరిగాయని అధికారులు వెల్లడిస్తున్నారు. సిజేరియన్ల సంఖ్యను మరింత కుదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ ప్రభుత్వాస్పత్రుల్లో వీలైనంత వరకు సుఖ ప్రసవం అయ్యేలా చూస్తున్నాం. ఆస్పత్రికి వచ్చే 50 శాతం కేసులు బీపీ, రక్తహీనత లోపంతో వచ్చేవారే. అలాంటి వారికి కూడా ఆస్పత్రుల్లో సుఖ ప్రసవం జరిగేలా చూస్తున్నాం. కానీ పక్షంలో సిజేరియన్ చేస్తున్నాం. దీంతో పాటు క్షేత్రస్థాయిలో సిజేరియన్తో కలిగే నష్టాలపై అవగాహన కలి్పంచాలి. – ఉషశ్రీ, గైన కాలజిస్ట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరు వైద్యుల సలహాలు తీసుకోవాలి గర్భిణులు వైద్యుల సూచనలు పాటించాలి. అలాగే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. రక్తహీనత లోపమే మాతా శిశుమరణాలు, ఆపరేషన్లకు కారణమవుతుంది. అనవసర సిజేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకోసం గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం. ఈ క్రమంలో సీ–సీఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ప్రభావతిదేవి, డీఎంఅండ్హెచ్ఓ, చిత్తూరు -
HYD: యాచకురాలికి పురుడు పోసిన 108 సిబ్బంది, కానిస్టేబుల్
సాక్షి, జీడిమెట్ల: పురిటి నొప్పులు భరించలేక రోడ్డుపై పడిపోయిన ఓ యాచకురాలికి 108 సిబ్బంది ఓ మహిళా కానిస్టేబుల్ సహాయంతో పురుడు పోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 11.30గంటల ప్రాంతంలో ఐడీపీఎల్లోని డొమినోస్ సందులో ఓ గర్బిని పురిటి నొప్పులతో అవస్థ పడుతున్నట్లు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు 108 సిబ్బంది రాజు, శ్రీనివాస్లకు విషయం తెలిపి ఐడీపీఎల్ వద్దకు వాహనం పంపించారు. అప్పటికే ప్రసవ వేదనతో తల్లడిల్లుతున్న మహిళకు 108 సిబ్బంది ఓ లేడీ కానిస్టేబుల్ పురుడు పోయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జీడిమెట్ల సీఐ వపన్ సూచన మేరకు సదరు మహిళను 108 సిబ్బంది గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరు ఆమె! సదరు మహిళను పోలీసులు, 108 సిబ్బంది వివరాలు అడగగా తన పేరు కృష్ణవేణి అని తాను యాచకురాలిని అని తెలిపింది. దీంతో పాటు తనకు ఎవరూ లేరంటూ ఒంటిరిగా ఉంటూ భిక్షాటన చేస్తున్నట్లు మాత్రమే తెలిపిందని పోలీసులు అంటున్నారు. -
''43 ఏళ్లకు ప్రెగ్నెన్సీ వచ్చింది.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారా''?
నాకిప్పుడు 43 ఏళ్లు. అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ వయసులో పిల్లల్ని కంటే ఆరోగ్యంగా పుడతారా? ఇది నాకు తొలి కాన్పు. పిల్లల కోసం మందులు వాడీవాడీ విసిగిపోయి ఆపేశాక వచ్చిన ప్రెగ్నెన్సీ అండీ...! – ఎన్. చంద్రప్రభ, సిర్పూర్ కాగజ్నగర్ నలభై ఏళ్లు దాటిన ప్రెగ్నెన్సీలో చాలా రిస్క్స్ ఉంటాయి అనేది చాలామంది భయం. కానీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ సాఫీగా సాగే అవకాశం లేకపోలేదు. 25– 35 ఏళ్ల మధ్య ఉండే కాంప్లికేషన్స్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్ ఉండొచ్చు. వాటిలో ఆపరేషన్ ద్వారా డెలివరీ అవటం, నెలలు నిండక ముందే కాన్పు అయ్యే రిస్క్ వంటివి ఎక్కువ. ఐవీఎఫ్, కవలల ప్రెగ్నెన్సీలో ఈ రిస్క్ ఇంకాస్త పెరుగుతుంది. మొదటి మూడునెలల్లో పుట్టుక లోపాలు ..డౌన్సిండ్రోమ్ లాంటివి, గర్భస్రావం, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వంటి ప్రమాదాలు ఎక్కువుంటాయి. బాడీ పెయిన్స్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులూ ఎక్కువుండొచ్చు. డాక్టర్ని సంప్రదించినప్పుడు వాటికి తగిన ట్రీట్మెంట్ను ఇస్తారు. తొలి మూడునెలల్లో తప్పనిసరిగా జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ చేయించుకోవాలి. ప్రతినెల బీపీ, సుగర్, థైరాయిడ్ పరీక్షలూ చేయించుకోవాలి. ప్రతినెల తప్పకుండా గైనకాలజిస్ట్ను సంప్రదిస్తూ టైమ్కి చేయవలసిన స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూండాలి. సరైన చికిత్సతో నలభై ఏళ్లు దాటిన తర్వాత కూడా సురక్షితమైన, ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ, కాన్పూ సాధ్యమే. - డా భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్ను చేయించుకుంటూ ఫాలో అప్లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
భార్య డెలివరీ చూసి, మతిస్థిమితం కోల్పోయిన భర్త.. డబ్బుల కోసం డిమాండ్!
గర్భధారణ, పిల్లలు పుట్టడం గురించి బహిరంగంగా చర్చించని సమయం గతంలో ఉండేది. నాటి రోజుల్లో ఈ విషయాలను గోప్యంగా ఉంచడం సరైనదని చాలామంది భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్య గర్భం ధరించినది మొదలు అడుగడుగునా ఆమెకు తోడుగా భర్త ఉంటున్నాడు. కొన్ని దేశాల్లో భార్య డెలివరీ సమయంలో భర్త అక్కడే ఉండి, డెలివరీ ప్రక్రియనంతా చూసే అవకాశం కూడా ఉంది. భార్యకు భరోసానిచ్చేందుకే భర్తకు ఇటువంటి అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో కొన్నిసార్లు విచిత్రమైన సంఘటనలు కూడా చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన భార్య ప్రసవ సమయంలో శస్త్రచికిత్స గదిలోనికి వెళ్లి, డెలివరీ ప్రక్రియనంతా చూశాడు. భార్యకు జరిగిన సి-సెక్షన్ డెలివరీ, బిడ్డ పుట్టడం మొదలైనవి చూసిన తర్వాత కళ్లు తిరిగి పడిపోయాడు. కోలుకున్న తరువాత అతను.. తన భార్యకు జరిగిన డెలివరీ తన మనసుపై తీవ్ర ప్రభావం చూపిందని, అది తనకు మానసిక వ్యాధిగా పరిణమించిందని ఆరోపిస్తూ ఆసుపత్రిపై కేసు వేశాడు. ఆ భర్త పేరు అనిల్ కొప్పుల. 2018లో అతని భార్య ఒక బిడ్డకు జన్మనిచ్చింది. సి-సెక్షన్ ద్వారా ఆమెకు డెలివరీ జరిగింది. అమెకు డెలివరీ జరిగిన దృశ్యాన్ని చూసిన వెంటనే తాను మానసికంగా అస్వస్థతకు లోనయ్యానని అనిల్ ఆరోపించాడు. తరువాత అతను మెల్బోర్న్లోని రాయల్ ఉమెన్స్ హాస్పిటల్పై కేసు పెట్టాడు. ప్రసవాన్ని చూసేందుకు ఆసుపత్రి యాజమాన్యం తనను ప్రోత్సహించిందని కొప్పుల ఆరోపించారు. సర్జరీ దృశ్యాన్ని చూశాక తన మానసిక పరిస్థితి క్షీణించిందని, అందుకే ఆసుపత్రి వర్గాలు తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోరాడు. కోర్టులో విచారణ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ తన మానసిక అనారోగ్యం కారణంగా భార్యతో విడాకులు కూడా తీసుకోవలసి వచ్చిందని, అందుకే తాను పరిహారం పొందేందుకు అర్హుడని పేర్కొన్నాడు. అయితే భార్య ప్రసవ సమయంలో అనిల్ ఆరోగ్యం బాగానే ఉన్నదని, అతను ఎటువంటి ఇబ్బంది పడలేదని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఇటువంటి నిరాధారమైన కేసును మూసివేయాలని ఆసుపత్రి వర్గాలు కోర్టును కోరాయి. ఇది కూడా చదవండి: టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా? -
ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఐఫోన్ 15 డెలివరీ! అదరగొడుతున్న బ్లింకిట్..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనకు ఏమి కావాలన్నా మనచెంతకే వచ్చేలా చేసుకుంటున్నాం. అలాంటి వాటి కోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఒకటి 'బ్లింకిట్' (Blinkit). కిరాణా, ఆహార ఉత్పత్తుల వంటి నిత్యావసరాలను డెలివరీ చేసే ఈ ప్లాట్ఫామ్ ప్రస్తుతం ఐఫోన్స్ కూడా డెలివరీ చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఐఫోన్ 15 సిరీస్ మోడల్స్కి డిమాండ్ భారీగా ఉంది. ఈ మొబైల్ సేల్స్ నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. యాపిల్ స్టోర్లు ఓపెన్ చేయక ముందు నుంచే కస్టమర్లు గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్లింకిట్ ఐఫోన్ డెలివరీలను ప్రారంభించింది. ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ సూపర్ కారు - ధర తెలిస్తే షాకవుతారు! ఆర్డర్ చేసిన కేవలం 10 నిమిషాల్లో బ్లింకిట్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ డెలివరీ చేస్తున్నట్లు నెటిజన్లు ట్విటర్ ద్వారా పోస్ట్ చేస్తున్నారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం బ్లింకిట్ యాపిల్ ప్రీమియం రీసెల్లర్ యూనికార్న్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Love this 🫶 https://t.co/qhCUjDqbKc — Albinder Dhindsa (@albinder) September 22, 2023 -
భార్య సిజేరియన్ వల్లే..అనారోగ్యానికి గురయ్యానంటూ ఓ భర్త..
చాలా విచిత్రమైన కేసులు చూసుంటాం. ఇలాంటి విచిత్రమైన కేసు చూసే అవకాశం లేదు. అవకాశం దొరకాలే కానీ చిన్న కారణంతో అవతల వాళ్లని ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజాలని చూస్తుంటారు కొందరూ. అలాంటి కోవకు చెందని వాడే భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ వ్యక్తి. ఎంత విచిత్రమైన ఆరోపణలతో కోర్టు మెట్లు ఎక్కాడో వింటే ఆశ్చర్యపోతారు. కేసు నిలబడుతుందనుకున్నాడో, తన వాదన నెగ్గుతుందనో తెలియదు చాలా హాస్యస్పదమైన ఆరోపణలతో కేసు వేశాడు. చివరికీ ఏమైందంటే.. ఆస్ట్రేలియాకు చెందిన భారత సంతతి వ్యక్తి అనిల్ కొప్పుల అనే వ్యక్తి భార్యకు 2018లో రాయల్ ఉమెన్స్ హాస్పటల్స్ సీజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అక్కడ ఆస్పత్రి నిబంధనల ప్రకారం భార్య ఆపరేషన్ టైంలో భర్త పక్కనే ఉండి ధైర్యం చెప్పేలా ప్రోత్సహిస్తారు. అతడు కూడా ఆపరేషన్ థియోటర్లో వైద్యుల తోపాటే ఉన్నాడు. అప్పటి నుంచి మెంటల్గా డిస్ట్రబ్ అయ్యాను. మానసిక అనారోగ్యానకి గురయ్యాను. ఆ ఆపరేషన్లో నా భార్య అంతర్గత అవయవాలు, బ్లీడింగ్ చూడటం కారణంగా తన వైవాహిక జీవితం కూడా సరిగా లేదని ఆరోపణలు చేస్తూ కోర్టు మెట్లు ఎక్కాడు అనిల్ కొప్పుల. తన మానసికా ఆరోగ్యం, వైవాహిక జీవితం దెబ్బతినడానికి కారణమైన సదరు ఆస్పత్రిపై చర్యలు తీసుకోవడమే గాక అందుకు ప్రతిగా రూ. 5వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసు పెట్టాడు. సోమవారం విక్టోరియాలోని సుప్రీం కోర్టు వాదోపవాదనలు విన్నాక తల్లి బిడ్డల సంరక్షణ విషయమై వైద్యులు సీజేరియన్ ఆప్షన్ ఎంచుకుంటారు. తల్లి, బిడ్డల సంరక్షణ కోసం భర్తను థియెటర్లోని అనుమతించడం అనేది కూడా సర్వసాధారణ విషయం. దీని వల్ల అతను ఎలాంటి ఆర్థిక నష్టాన్ని చవిచూడలేదు. పైగా అతను ఆరోపిస్తున్న మానసికి అనారోగ్యం అనేది తీవ్రమైన గాయం కింద పరిగణించేది కాదని తేల్చి చెప్పింది. అందువల్ల అతనికి ఎలాంటి నష్ట పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ..కోర్టు అతడి కేసుని తోసిపుచ్చింది. (చదవండి: బొప్పాయి గింజలు పడేస్తున్నారా..? తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే..) -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
నాలుగేళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
రాజస్థాన్లోని టోంక్లో ఒక గర్భిణి ఒకేసారి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఉదంతం వజీర్పురా గ్రామంలో చోటుచేసుకుంది. ఆ మహిళ పెళ్లయిన నాలుగేళ్లకు గర్భం దాల్చింది. ఆమె ఒకే కాన్పులో ఏకంగా నలుగురు శిశువులకు జన్మనివ్వడంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గర్భిణికి చికిత్సనందించిన డాక్టర్ షాలినీ అగర్వాల్ మాట్లాడుతూ ఆదివారం సాయంతం ఆ మహిళను ఆసుపత్రికి తీసుకు వచ్చారని, అర్ధరాత్రి దాటాక ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయన్నారు. తరువాత ఆమెకు డెలివరీ చేశామన్నారు. సోమవారం ఉదయం 5 గంటల 51 నిముషాలకు తొలి శిశువు జన్మించిందని, తరువాత ఒక్కొక్కరుగా నాలుగు నిముషాల్లో ముగ్గురు శిశువులు జన్మించారని తెలిపారు. ఆ నలుగురు శిశువుల్లో ఇద్దరు మగశిశువులు, ఇద్దరు ఆడ శిశువులని, వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. ఆ మహిళ గర్భం ధరించిన రెండవ నెలలోనే ఆమె కడుపులో నాలుగు పిండాలు ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ షాలిని తెలిపారు. నాల్గవ నెలలో గర్భశ్రావం అయ్యే పరిస్థితి ఉండటంతో ప్రత్యేక చికిత్స అందించామన్నారు. దీంతో ఆమెకు గర్భం నిలిచిందని, ఇప్పుడు డెలివరీ చేయగలిగామని డాక్టర్ షాలిని తెలిపారు. మెడికల్ సైన్స్లో కవల పిల్లలు, ముగ్గురు పిల్లలు జన్మించడం అనేది జరుగుతుంటుంది. కానీ నలుగురు శిశువులు జన్మించడం అనేది బహ అరుదుగా జరుగుతుంది. 10 వేల ప్రసవాలలో ఒక గర్భిణి విషయంలోనే ఇలా జరుగుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: నరహంతకుడు జనరల్ డయ్యర్ను మహాత్మాగాంధీ ఎందుకు క్షమించారు? -
ఫుడ్ ఆర్డర్ బిల్ చూసి ఖంగుతిన్న మహిళ - జొమాటో రిప్లై ఇలా..
టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరుణంలో ఏమి కావాలన్నా.. ఇంట్లో కూర్చుని పొందగలుగుతున్నారు. కేవలం వస్తువులు మాత్రమే కాకుండా, ఫుడ్ కూడా ఉన్న చోటికే ఆర్డర్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు బిల్లు చూస్తే చుక్కలు కనిపిస్తాయి. ఇలాంటి సంఘటనే తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, అహ్మదాబాద్కి చెందిన ఒక మహిళ జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఆమెకు వచ్చిన బిల్ చూసి ఒక్క సారిగా అవాక్కయింది. ఎందుకంటే బిల్లులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి ఉన్నారు. ఆమె మూడు ప్లేట్స్ 'దూది తెప్లా' (Dudhi Thepla) ఆర్డర్ చేసింది. ఒక ప్లేట్ ధర రూ. 60 కావడంతో మొత్తం బిల్లు రూ. 180 అయింది. కానీ ఇందులో కంటైనర్ చార్జీలు కూడా కలిపి రూ. 249గా నివేదించారు. బిల్ అందుకున్న మహిళ, దానిని స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ (ట్విటర్) ద్వారా షేర్ చేసింది. ఆర్డర్ చేసిన ఆహారానికి కంటైనర్ చార్జీలు కూడా వసూలు చేస్తారా అంటూ వాపోయింది. దీనికి స్పందించిన కంపెనీ కంటైనర్ చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఆర్డర్ చేసిన ఆహారానికి 5 నుంచి 18 శాతం వరకు చార్జీలు రెస్టారెంట్లు విధిస్తాయని తెలిపింది. ఇదీ చదవండి: భయపడుతున్న ఫోన్పే & గూగుల్ పే! యూజర్లకు ఇది శుభవార్తే.. సోషల్ మీడియాలో వెల్లడైన ఈ పోస్ట్ మీద నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అదనపు చార్జీలు చిరాకును తెప్పిస్తాయని, మరికొందరు బిల్లు ముందుగానే చూసుకోవాలి కదా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి అదనపు ఛార్జీలకు సంబంధించిన సంఘటనలు గతంలో కూడా చాలా వెల్లడయ్యాయి. Hi Khushboo, while taxes are universal and vary from 5 - 18% depending on the type of food. Packaging charges are levied by our restaurant partners, they are the ones who implement and earn from this practice. For further clarification please feel free to initiate a private (1/2) — zomato care (@zomatocare) August 2, 2023 -
కొత్త కారు కొన్న ఆనందంతో చిందులేసిన యూట్యూబర్ - వీడియో వైరల్
Youtuber New Toyota Innova Hycross: సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు తమకంటూ ఓ మంచి ఇల్లు, కారు ఉండాలని కలలు కంటూ ఉంటారు. కన్న కలలు నిజం చేసుకోవడం మాటల్లో అనుకునేంత సులభమైతే కాదు. దీనికోసం అహర్నిశలు కష్టపడాలి. ఈ మార్గంలో ఎవరి ఆలోచన వారిదే..! కొంతమంది జాబ్ చేస్తే మరికొందరు సొంతంగా ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. ఈ మార్గంలో నేటి యువత ఎక్కువగా యూట్యూబ్ మీద పడి సంపాదించడం మొదలెట్టారు. గతంలో చాలా సందర్భాల్లో కొంత మంది యూట్యూబర్స్ ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి మరో సంఘటన తాజాగా మళ్ళీ వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైడర్ గర్ల్ విశాఖ అనే యూట్యూబర్ (ప్రముఖ ఉమెన్ మోటార్సైకిలిస్ట్) తాజాగా టయోటా కంపెనీకి చెందిన కొత్త ఇన్నోవా హైక్రాస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో తన ఛానల్లో అప్లోడ్ చేసింది. కారుని డెలివరీ చేసుకోవడానికి తన ఫ్యామిలీతో షోరూంకి రావడం డెలివరీ తీసుకునే సమయంలో చేసిన హంగామా మొత్తం ఈ వీడియో చూడవచ్చు. ఇప్పటికే ఈమె మహీంద్రా థార్ కూడా కొనుగోలు చేసింది. టయోటా ఇన్నోవా హైక్రాస్.. టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్ లేటెస్ట్ మోడల్. దీని ధర రూ. 18.82 లక్షల నుంచి రూ. 30.26 లక్షల వరకు ఉంటుంది. అయితే ఇక్కడ యూట్యూబర్ కొనుగోలు చేసిన కారు బ్రాండ్ హైఎండ్ మోడల్. కావున ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో స్టాండర్డ్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 172 బిహెచ్పి పవర్ అండ్ 205 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇక 2.0 లీటర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ 184 బిహెచ్పి పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారులో డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లేదు. -
ఎక్స్ బాయ్ ఫ్రెండ్పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి..
ఎవరికైనా ఆకలేస్తే ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి స్విగ్గి, జొమాటో వంటి యాప్స్ ఉపయోగిస్తారు. కానీ ఒక యువతీ తన బాయ్ ఫ్రెండ్ మీద రివేంజ్ తీసుకోవడానికి జొమాటో వాడింది. వినటానికి వింతగా అనిపించినా ఇది నిజం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న ఒక యువతికి తన బాయ్ ఫ్రెండ్తో మనస్పర్థలు రావడంతో రివెంజ్ తీసుకోవడానికి.. అతని అనుమతి లేకుండానే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్తో జొమాటో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసింది. తీరా డెలివరీ బాయ్ ఆ యువకుని అడ్రస్కి వెళితే నేను ఆర్డర్ పెట్టలేదని, డబ్బు ఇవ్వనని వాదించాడు. (ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి!) ఇలా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్కి మూడు సార్లు ఫుడ్ ఆర్డర్ చేసింది. మూడు సార్లు నేను ఆర్డర్ చేయలేదని ఆ యువకుడు డబ్బు ఇవ్వకుండా డెలివరీ బాయ్ని వెనక్కి పంపించాడు. దీంతో విసిగిపోయిన కంపెనీ నేరుగా ఆ యువతికి దయచేసి ఇలా చేయడం ఆపండి అంటూ ట్వీట్ చేసింది. ఇది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. Ankita from Bhopal please stop sending food to your ex on cash on delivery. This is the 3rd time - he is refusing to pay! — zomato (@zomato) August 2, 2023 -
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
రజియా సుల్తాన్ అనే సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బుల్లితెర నటి పంకురీ అవస్తీ. ఆ తర్వాత పలు సీరియల్స్లో నటించింది. ఆ తర్వాత సూర్యపుత్ర కరణ్, మేడమ్ సార్, యే రిస్తా క్యా కెహ్లాతా పై లాంటి సీరియల్స్లో కనిపించింది. సూర్యపుత్ర కరణ్ టీవీ షో నటించిన గౌతమ్ను ప్రేమ వివాహాం చేసుకుంది భామ. తాజాగా ఈ జంటకు కవల పిల్లలు జన్మనిచ్చారు. ఈనెల 25న బుల్లితెర భామకు ఓ పాప, బాబు జన్మించినట్లు తన ఇన్స్టాలో పంచుకుంది. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!) ఇన్స్టాలో రాస్తూ..' ఆనందం, కృతజ్ఞతతో నిండిన రెండు మనసులు.. ఇప్పుడు నలుగురిగా ప్రయాణం ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భాన్ని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మా పట్ల మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు నటీనటులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. గౌహర్ ఖాన్, రాజ్పుత్ పాయల్తో పాటు దివ్యాంక త్రిపాఠి, దేవోలీనా భట్టాచార్జీ, మొహ్సిన్ ఖాన్, అమీర్ అలీ, భారతీ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గౌతమ్-పంకురి ప్రేమకథ 'రజియా సుల్తాన్' షో ద్వారా పంకురికీ గుర్తింపు దక్కింది. 'సరస్వతీచంద్ర' అనే సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్.. ఆ తర్వాత 'సూర్యపుత్ర కరణ్' సీరియల్లో కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 2018లో రాజస్థాన్లోని అల్వార్ తిజారా ఫోర్ట్ ప్యాలెస్లో జరిగిన గొప్ప వేడుకలో పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!) View this post on Instagram A post shared by Pankhuri Awasthy Rode (@pankhuri313) -
జొమాటో బాయ్గా పనిచేస్తూనే.. చిరకాల స్వప్నాన్ని సాధించాడు..
చెన్నై: ఆశయాలు స్వప్నాలతో సాకారం కావు. నిబద్ధతతో పనిచేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చు. ఇది నిజమని నిరూపించిన వారి నిజజీవిత కథలెన్నోమనం చూశాం. అలాంటి కోవలోకే చేరారు తమిళనాడుకు చెందిన విగ్నేష్. ఓ వైపు జొమోటో బాయ్గా పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకున్నాాడు. విగ్నేష్ తమిళనాడుకు చెందిన యువకుడు. డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఖర్చుల కోసం ఓ వైపు జొమోటోలో ఉద్యోగం చేస్తూనే మిగిలిన సమయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేవాడు. చివరికి తన చిరకాల స్వప్నాన్ని సాధించాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ కొలువును చేజిక్కించుకున్నాడు. drop a like for Vignesh, who just cleared Tamil Nadu Public Service Commission Exam while working as a Zomato delivery partner ❤️ pic.twitter.com/G9jYTokgR5 — zomato (@zomato) July 24, 2023 ఈ విషయాన్నే జొమోటో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఓ వైపు తమ సంస్థలో పనిచేస్తూనే రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో రాణించిన తమ ఉద్యోగి అంటూ విగ్నేష్ కుటుంబంతో సహా ఉన్న ఫొటోను పంచుకుంది. ఈ పోస్టు నెట్టింట వేగంగా వైరల్గా మారింది. 1337 లైకులు, 59 రీట్వీట్లు వచ్చాయి. నెటిజన్లు విగ్నేష్కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై.. వీడియో వైరల్.. -
పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!
నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్తో రిలేషన్లో ఉంది. కాగా.. ఇప్పటికే 2019లో ఈ జంటకు అరిక్ రాంపాల్ అనే కుమారుడు జన్మించారు. దీంతో దాదాపు 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు బాలీవుడ్ నటుడు రాంపాల్. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. కాగా.. 2018లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అర్జున్ రాంపాల్ తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను, నా కుటుంబం ఓ అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీ, కొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. అద్భుతంగా సేవలందించిన వైద్యులు, నర్సులకు నా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. అర్జున్ రాంపాల్ గర్ల్ఫ్రెండ్ గాబ్రియెల్లా.. నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన ఊపిరి చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2018 నుంచి ఈ జంట రిలేషన్లో ఉన్నారు. కాగా.. అర్జున్కు మొదటి భార్య మెహర్ జెసియాకు మహికా రాంపాల్, మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ జంట 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అర్జున్ చివరిగా కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం 'ధాకడ్'లో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తదుపరి బాబీ డియోల్తో 'పెంట్హౌస్'లో కనిపించనున్నాడు. దీంతో అర్జున్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ 'క్రాక్'లో నటించనున్నారు. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
Klin Kaara Konidela First Video: ఉపాసన డెలీవరీ వీడియో రిలీజ్ చేసిన రామ్చరణ్
-
ప్రముఖ వ్యాపారులను బురిడీ కొట్టించిన ఘనుడు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో తమను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ కె.శ్రీనివాసరావును నగరంలోని ప్రముఖ వ్యాపారులు ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఆయన కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. బాధితులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా కడప మండలం రూకవారిపల్లికి చెందిన పసుపులేటి అంకుశం 24 రోజుల క్రితం బీకేఎస్ పరిధిలోని పసుపులేటి మాతా గోదాములో నిప్పీ డెలివరీ సర్వీసు పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. నగరంలోని ప్రముఖ వ్యాపారులను పిలిపించి ప్రారం¿ోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపించాడు. తన వ్యాపారం గురించి వివరించాడు. తనతో కలసి వ్యాపారం చేయడం ద్వారా ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని నమ్మబలికాడు. సరుకును విక్రయించిన అనంతరం తన కమీషన్ పట్టుకుని మిగులు మొత్తాన్ని అందజేస్తానని అంకుశం తెలపడంతో అందరూ ఒప్పుకున్నారు. అతని మాయలో చిక్కుకున్న వ్యాపారులు తమ వద్ద సరుకులను అప్పగించారు. వీటితో గోదాము నిండిపోయింది. అది చూసిన వ్యాపారులు వ్యాపారం బాగా చేస్తున్నాడని మురిసిపోయారు. అయితే రాత్రికి రాత్రే లారీల కొద్ది సరుకును తీసుకుని అంకుశం మాయమయ్యాడు. దీంతో మోసపోయిన వ్యాపారులు ముందుగా అతని గురించి ఆరా తీశారు. అనంతలోనే రూ.70 లక్షలకు పైగా సరుకుతో ఉడాయించిన అంకుశం అక్రమాలకు నెల్లూరు జిల్లాలో రూ.3 కోట్లు, కర్నూలు జిల్లాలో రూ. కోటికి పైగా వ్యాపారులు మోసపోయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే అంకుశం జాడ తెలుసుకుని అతని ఇంటికి వెళితే కుటుంబసభ్యులు ఎదురు దాడికి దిగడంతో చేసేది లేక అనంతపురం తిరిగి వచ్చి ఎస్పీ శ్రీనివాసరావును కలసి జరిగిన మోసాన్ని వివరించారు. వ్యాపారుల ఆవేదనపై స్పందించిన ఎస్పీ కేసును బుక్కరాయసముద్రం పోలీసులకు బదిలీ చేశారు. మోసగాడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట
30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది. కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు. ఈ జనరేషన్లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్పై పెట్టడం లేదు. లైఫ్లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
బిడ్డకు జన్మనిచ్చిన నటి.. ఏకంగా 53 ఏళ్లకు!
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ నవోమి కాంప్బెల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దాదాపు 53 ఏళ్ల వయసులో మరోసారి తల్లయ్యారు. ఈ విషయాన్ని నవోమి తన ఇన్స్టా ద్వారా పంచుకున్నారు. ఇప్పటికే మే 2021లో నవోమి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మళ్లీ రెండేళ్ల వ్యవధిలోనే మరో రెండో బిడ్డను స్వాగతించారు. తల్లి కావడానికి వయసుతో సంబంధం లేదని నవోమి నిరూపించింది. ఆమె శిశువును తన చేతుల్లో పట్టుకొని ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: రాకేశ్ మాస్టర్ ఇచ్చిన ఆస్తి పేపర్లు చించేశాడు.. ఎందుకో తెలిస్తే ) నవోమి తన ఇన్స్టాలో రాస్తూ..' మై లిటిల్ డార్లింగ్! నీ రాకతో మాకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చావు. మా ప్రేమ నీకు ఎల్లప్పుడు అండగా ఉంటుంది. నువ్వు దేవుడిచ్చిన బహుమతి. వెల్కమ్ టూ బేబీబాయ్.' క్యాప్షన్ పెట్టింది. ఇది చూసిన ఆమె అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. పిల్లలను కనేందుకు వయసుతో పనిలేదని రుజువు చేసిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. (ఇది చదవండి: దిల్ రాజు కుమారుడి బర్త్డే పార్టీలో సెలబ్రిటీల సందడి) View this post on Instagram A post shared by Dr Naomi Campbell (@naomi) -
విస్తరణ బాటలో డన్జో4బిజినెస్
న్యూఢిల్లీ: ఇన్స్టంట్ డెలివరీ సేవల సంస్థ డన్జోలో లాజిస్టిక్స్ విభాగమైన డన్జో4బిజినెస్ (డీ4బీ) తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే 12–18 నెలల్లో 10–15 నగరాల్లో ప్రవేశించనున్నట్లు డన్జో సహ వ్యవస్థాపకుడు దల్వీర్ సూరి తెలిపారు. ప్రస్తుతం తాము 10 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డన్జో ద్వారా నిత్యావసరాల డెలివరీలకు వచ్చే ఆర్డర్లతో పాటు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ) ప్లాట్ఫాంపై వచ్చే ఆర్డర్లను కూడా అందిస్తున్నట్లు సూరి చెప్పారు. చివరి అంచె వరకు ఉత్పత్తులను డెలివరీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఓఎన్డీసీ యూజర్లకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై నుంచి అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయని సూరి చెప్పారు. 70,000 మంది డెలివరీ పార్ట్నర్లతో కలిసి డీ4బీ పనిచేస్తోంది. యూజర్లు ఎక్కువగా నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు, ఔషధాలకు ఆర్డరు ఇస్తున్నారని సూరి చెప్పారు. సగటున ఆర్డరు పరిమాణం రూ. 200–4,000 వరకు ఉంటోందని తెలిపారు. ద్విచక్ర వాహనాలపై రవాణా చేయగలిగే అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. -
డెలివరీకి ముందు ఉపాసన ఏం చేసిందంటే.. వీడియో వైరల్!
మెగా కుటుంబం, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మధుర క్షణాలు ఈ నెల 20న ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లయిన 11 ఏళ్లకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన తల్లిదండ్రులయ్యారు. జూన్ 20న మంగళవారం మెగా కోడలు ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భం కోసం మెగా ఫ్యామిలీతో ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ ప్రత్యేకమైన సందర్భానికి జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ వేదికైంది. (ఇది చదవండి: మెగాప్రిన్సెస్కు ఘనస్వాగతం, ఫోటో షేర్ చేసిన ఉపాసన) కాగా.. డెలివరీ కోసం ఒకరోజు ముందుగానే మెగా కుటుంబం అపోలో ఆస్పత్రికి చేరుకుంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియోనూ ఉపాసన తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ఆస్పత్రిలో వీల్ చైర్పై వెళ్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. 'అంతేకాకుండా ఐదు రోజుల క్రితం జరిగిన అత్యంత మధురమైన క్షణమిదే. మీ అందరికీ ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోతో పాటు మై లిటిల్ ప్రిన్సెస్ రావడానికి ముందు అంటూ కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: ఆదిపురుష్పై వీరేంద్ర సెహ్వాగ్ ఎలాంటి కామెంట్ చేశాడంటే..) Moments before the #MegaPrincess arrived ❤️ Love this emotion video of #UpasanaKonidela. We spot #RamCharan𓃵 at the end too! 😍🫶🏼pic.twitter.com/1FYOijRvtS — ᴠᴇɴᴋᴀ𝟽ᴋᴜᴍᴀʀᴍsᴅɪᴀɴ (@venkysayzzz) June 25, 2023 -
బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ దీపికా కక్కర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త సోయబ్ తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేశాడు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఆమెకు నెలలు నిండకుండానే డెలివరీ అయినట్లు ఇన్స్టాలో వెల్లడించారు. కానీ ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. తల్లీ, బిడ్డ క్షేమంగానే ఉన్నారని తెలిపారు. (ఇది చదవండి: హద్దులు దాటేస్తున్న తమన్నా.. 'లస్ట్ స్టోరీస్ 2'లో కూడా!) కాగా.. దీపీకా కక్కర్ ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్లో సోనాక్షి పాత్రలకు బాగా పేరు తెచ్చుకుంది. దీపికా రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్గా పాల్గొని విజేతగా నిలిచింది. ఆమె నాచ్ బలియే 8 అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో 2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. (ఇది చదవండి: దీపికా పదుకొణె స్థానంలో దిశా పటానీ? లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ) View this post on Instagram A post shared by Shoaib Ibrahim (@shoaib2087) -
ఇండియన్ ఆర్మీ మరింత పటిష్టం - రంగంలోకి మహీంద్రా ఆర్మడో
భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు చెప్పుకోదగ్గవి. కేవలం రోజు వారి వినియోగానికి, ఆఫ్ రోడింగ్ చేయడానికి మాత్రమే కాకుండా భారత సైన్యం కోసం కూడా కంపెనీ వాహనాలను సిద్ధం చేసి డెలివరీలను ప్రారంభించింది. మహీంద్రా సాయుధ వాహనాలను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా యాజమాన్యంలో ఉన్న మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ (MDS) భారత సాయుధ దళాలకు ఆర్మడో వాహనాల డెలివరీలను ప్రారంభించింది. ఆర్మడో అనేది ఆర్మర్డ్ లైట్ స్పెషలిస్ట్ వెహికల్స్ (ALSV). ఇవి పూర్తి భారతదేశంలోనే రూపుదిద్దుకున్నాయి. కావున పటిష్టమైన భద్రత లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి అధిక తీవ్రత ఉన్న ప్రాంతాల్లో పెట్రోలింగ్, స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటాయి. సరిహద్దు భూభాగాల్లో, ఎడారి ప్రాంతాల్లో దాడులకు ఉపయోగించడానికి కూడా అవి ఉపయోగపడతాయి. ఇంజిన్ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ ఆర్మడో వాహనాలు 3.2 లీటర్, టర్బోచార్జ్డ్, డైరెక్ట్-ఇంజెక్షన్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 215 హార్స్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ వెహికల్స్ కేవలం 12 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వేగవంతమవుతాయి. గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లు. పేలోడ్ కెపాసిటీ 1000 కేజీలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర ఎంతో తెలుసా?) ఆర్మడో వెహికల్ బిల్స్టెయిన్ ఇండిపెండెంట్ సస్పెన్షన్ కలిగి 318/80 ఆర్17 టైర్లను పొందుతుంది. టైర్లలో గాలి లేకుండా పోయినా 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల కెపాసిటీ కలిగి ఉంటాయి. ఇందులో పవర్ స్టీరింగ్ సిస్టమ్ ఉంటుంది, కావున లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ లేదా రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగర్ చేయవచ్చు. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా వైరల్ ట్వీట్.. నితిన్ గడ్కరీ జీ అంటూ..!!) ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డ్రైవర్తో సహా ఆరుగురు ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది, అవసరమైతే ఎనిమిది మంది కూర్చునేలా సీట్లు కాన్ఫిగర్ చేయవచ్చు. ఇది పబ్లిక్ అడ్రస్ (PA) సిస్టమ్, జీపీఎస్ (GPS), ఆటోమేటిక్ గ్రెనేడ్ లాంచర్, ఎలక్ట్రిక్ వించ్, HF/UHF/VHF రేడియోతో పాటు సెల్ఫ్-క్లీనింగ్-టైప్ ఎగ్జాస్ట్ స్కావెంజింగ్ వంటి వాటిని పొందుతుంది. మహీంద్రా వాహనాల డెలివరీకి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా కూడా షేర్ చేశారు. My gratitude to Sukhvinder Hayer & his entire team who made this project a reality through their patience, persistence & passion… 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/wYttXVMKKq — anand mahindra (@anandmahindra) June 17, 2023 -
సింపుల్ వన్ డెలివరీలు మొదలయ్యాయ్ - అక్కడ మాత్రమే
Simple One Electric Scooter: గత కొన్ని నెలల నిరీక్షణ తరువాత 'సింపుల్ ఎనర్జీ' దేశీయ మార్కెట్లో ఇటీవల 'సింపుల్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కంపెనీ డెలివరీలను కూడా ప్రారంభించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సింపుల్ ఎనర్జీ సుమారు ఒక లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ స్వీకరించింది. అయితే ఇప్పుడు కేవలం 15 యూనిట్లను మాత్రమే డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డెలివరీలు కేవలం బెంగళూరులో మాత్రమే ప్రారంభమయ్యాయి. త్వరలోనే దేశంలోని మరిన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. (ఇదీ చదవండి: రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన.. కీలక వడ్డీ రేట్లు యధాతథం) సింపుల్ ఎనర్జీ కంపెనీ దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 40 నుంచి 50 నగరాల్లో 160 నుంచి 180 రిటైల్ స్టోర్లను ప్రారంభించింది. వీటి ద్వారానే కంపెనీ దేశంలో తన ఉనికిని విస్తరాయించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.45 లక్షలు. ఇది ఒక సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 212 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక డిజైన్, ఫీచర్స్ పరంగా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. -
IPL సీజన్లో స్విగ్గిలో అత్యధికంగా చికెన్ బిర్యానీ ఆర్డర్..!
-
ఫోన్ పే గూగుల్ పే పేటియంల కొంపముంచిన జొమాాటో
-
మాకు తిరుగులేదు..ఫుడ్ డెలివరీ బిజినెస్లో అదరగొట్టేస్తున్నాం!
న్యూఢిల్లీ: స్విగ్గీ ఫుడ్ వ్యాపారం లాభాల్లోకి ప్రవేశించినట్టు కంపెనీ సీఈవో, సహ వ్యవస్థాపకుడు శ్రీహర్ష మాజేటి ప్రకటించారు. కంపెనీ ఏర్పాటైన తొమ్మిదేళ్ల లోపే ఈ మైలురాయిని చేరుకున్నామని, అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కేవలం కొన్ని కంపెనీల్లో స్విగ్గీ ఒకటిగా ఉన్నట్టు తెలిపారు. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల తాము బుల్లిష్గా ఉన్నట్టు బ్లాగ్పోస్ట్లో పేర్కొన్నారు. వచ్చే రెండు దశాబ్దాల కాలానికి వృద్ధి సామర్థ్యాల పట్ల స్విగ్గీ ఎంతో ఆశావహంగా ఉందని ప్రకటించారు. ఫుడ్ డెలివరీలో ఇక ముందూ వృద్ధిని కొనసాగిస్తామన్నా రు. ‘‘ఆవిష్కరణలపై మా తీక్షణ దృష్టి, బలమైన నిర్వహణ మరో మైలురాయిని చేరుకోవడానికి తోడ్పడ్డా యి. 2023 మార్చి నాటికి స్విగ్గీ ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయంగా మారింది (అన్ని వ్యయాలు కలిపి చూసుకుంటే)’’అని శ్రీహర్ష వెల్లడించారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో సాయపడిన భాగస్వాములు అందరికీ అభినందనలు తెలిపారు. కస్టమర్లతో స్విగ్గీకి బలమైన అనుబం ధం ఉన్నట్టు చెప్పారు. పరిశ్రమలోనే మెరుగైన రిపీట్, రిటెన్షన్ (కస్టమర్ల నుంచి మళ్లీ ఆర్డర్లు పొందడం, కస్టమర్లను నిలబెట్టుకోవడంలో) రేటు ను కలిగి ఉన్నట్టు చెప్పారు. ద్వితీయ, తృతీ య శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. స్విగ్గీతో రెస్టారెంట్ భాగస్వాముల అనుభవం కూడా మెరుగ్గా ఉందంటూ, ఇది పరస్పర విజయంగా పేర్కొన్నారు. ఆరంభంలోనే ఉన్నాం: 2014లో స్విగ్గీ ఫుడ్ డెలివరీని ప్రధాన వ్యాపారంగా మొదలు పెట్టినప్పడు, చాలా మంది దీన్ని గిట్టుబాటు కాని వ్యాపార నమూనాగా భావించినట్టు శ్రీహర్ష తెలిపారు. కానీ, ఇంత కాలం తాము చేసిన పెట్టుబడులు ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలైందన్నారు. ‘‘ఈటింగ్ అవుట్ (రెస్టారెంట్లతో తినడం/డైన్ అవుట్), ఫుడ్ డెలివరీ వ్యాపారం భారత్లో ఇంకా ఆరంభ దశలోనే ఉందని మేము బలంగా నమ్ముతున్నాం. వచ్చే రెండు దశాబ్దాల పాటు వృద్ధి పట్ల ఆశాభావంతో ఉన్నాం. ఫుడ్ డెలివరీ మరింత వృద్ధి చెందేందుకు బాధ్యతాయుత, కావాల్సిన చర్యలు చేపడతాం. దేశంలో ఇంకా సేవలు అందని ప్రాంతాలు, వినియోగ వర్గాలు చాలానే ఉన్నాయి. సరైన విభాగాల్లో పెట్టుబడులు పెడుతూ పరిశ్రమ సగటు కంటే ఎక్కువ వృద్ధిని సాధించడమే మా లక్ష్యం’’అని శ్రీహర్ష తెలిపారు. క్విక్కామర్స్ వ్యాపారం విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు ప్రకటించారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్ నేడు క్విక్ కామర్స్లో ప్రముఖ సంస్థగా ఉన్నట్టు చెప్పారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ముగిసినట్టేనని స్పష్టం చేశారు. ఇన్స్టామార్ట్ను లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా మంచి పురోగతి సాధించామని, వచ్చే కొన్ని వారాల్లో తటస్థ స్థితికి చేరుకుంటామన్నారు. డైన్ అవుట్ విభాగంలోనూ తాము లీడర్గా ఉన్నట్టు చెప్పారు. 34 పట్టణాల్లో తమకు 21,000 రెస్టారెంట్ భాగస్వాములు ఉన్నట్టు తెలిపారు. -
మరో దిగ్గజ కంపెనీలో 30% ఉద్యోగులపై వేటు... కారణాలు తెలిస్తే షాక్ అవుతారు
-
ఆగని ఉద్యోగాల కోత! ఆ సంస్థ నుంచి మళ్ళీ 340 మంది..
కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను భారీగా తొలగించింది. ఆ ప్రభావం ఇప్పటికి కూడా ఉద్యోగులపైన అలాగే ఉందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన మరో కంపెనీ తాజాగా సుమారు 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. అమెరికాకు చెందిన అటానమస్ డెలివరీ రోబోట్ స్టార్టప్ న్యూరో తన క్యాపిటల్ రన్వేను మరింత విస్తరించడానికి 30 శాతం మంది లేదా 340 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలిపింది. గత వారంలో న్యూరో కో-ఫౌండర్స్ 'డేవ్ ఫెర్గూసన్ అండ్ జియాజున్ ఝూ' మాట్లాడుతూ.. కంపెనీ సిబ్బందిని తగ్గించి వనరులను వాణిజ్య కార్యకలాపాల నుంచి రీసర్చ్ & డెవెలప్మెంట్ వైపు మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది కంపెనీ తమ మూడవ జనరేషన్ డెలివరీ రోబోట్స్ వాణిజ్య కార్యకలాపాలను పెంచడంతో పాటు వాల్యూమ్ ఉత్పత్తిని ఆలస్యం చేయడానికి తమ ప్రణాళికలను ఫాజ్ చేస్తుంది. ఈ మార్పుల వల్ల కంపెనీ మునుపటికంటే రెండు రెట్లు ఎక్కువ పని చేసే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: Apna Founder Success Story: వారెవ్వా.. 21 నెలలు, రూ. 9000 కోట్లు - జీవితాన్ని మార్చేసిన ఒక్క యాప్!) గతంలో కూడా కంపెనీ అటానమస్ సిస్టం అభివృద్ధి చేసింది. దీని కోసం కస్టమ్ వెహికల్స్ కూడా రూపొందించింది. అయితే ఈ కొత్త విధానం న్యూరో ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేసే అవకాశం ఉందని బలంగా భావిస్తున్నారు. వ్యయాలను తగ్గించుకోవడంతో పాటు క్యాపిటల్ రన్వేను విస్తరించుకోవడం కోసం ఉద్యోగులను తొలగించింది. కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇది రెండవ సారి. కంపెనీ గత ఏడాది నవంబర్ నెలలో కూడా సుమారు 20 శాతం లేదా 300 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే ఇప్పుడు మరో సారి ఉద్యోగాల కోతలు సుమారు 340 మంది ఉద్యోగులపైన ప్రభావం చూపుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ONDC తక్కువ రేట్లతో దూకుడు: స్విగ్గీ, జొమాటోకు దబిడి దిబిడే!
సాక్షి,ముంబై: ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటోకు పోటీగా ప్రభుత్వ సంస్థ దూసుకుపోతోంది. తక్కువ ధరలతో ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీ జొమాటో, స్విగ్గీలకు సవాల్ విసురుతోంది. చిన్న స్థాయి సంస్థలకు టెక్నాలజీ పరంగా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడంతో కేంద్రం ఓపెన్ సోర్స్డ్ మెథడాలజీతో ఈ నూతన ఒపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఓఎన్డీసీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూర్ ఢిల్లీ సహా 240 నగరాల్లో తన సేవల్లో దూసుకుపోతోంది. ఆహారంతోపాటు నిత్యావసర సరుకుల రోజువారీ డెలివరీల సంఖ్య 10 వేల దాటేసింది. డిజిటల్ కామర్స్ ఇన్ ఇండియాలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్క్ష్యంతో ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది ఏప్రిల్లో కేంద్రం ప్రారంభించింది. ఓఎన్డీసీ ప్రత్యేకత ఏంటి? వాణిజ్య మంత్రిత్వ శాఖకు కెందిన పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం (DPIIT) ప్రవేశపెట్టిన ఓపెన్ ఇ-కామర్స్ ప్రోటోకాల్. థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండా నెట్వర్క్లోని క్రయ విక్రయ దారులు చేసుకోవచ్చు. వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రకారం, ఓఎన్డీసీ చిన్న రిటైల్ సంస్థలు పెద్ద టెక్-ఆధారిత ఇ-కామర్స్ కంపెనీల దాడిని తట్టుకుని నిలబడేలా సహాయం చేస్తుంది. అలాగే పేమెంట్ సిస్టంలో సంచలనాలకు యూపీఐ ఎలా ఉపయోగపడిందో ఇ-కామర్స్ రంగంలో ఇది పెను మార్పులకు దారితీయనుంది. కొనుగోలుదారులు వివిధ బ్రాండ్లు, లోకల్ వ్యాపారవేత్తలనుంచి విస్తృత ఉత్పత్తులను సెర్చ్ చేయవచ్చు. కొనుగోలు చేయవచ్చు. ఆహారం, పానీయాలు, బ్యూటీ, వ్యక్తిగత సంరక్షణ, హోం డెకరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫ్యాషన్తో సహా పలు ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. పేటీఎం మీషో, స్పైస్ మనీ, క్రాఫ్ట్స్విల్లా మేజిక్ పిన్, పిన్కోడ్, లాంటి ఇతర ఆన్లైన్ స్టోర్లనుండి కూడా కస్టమర్లు ONDC ద్వారా ఆర్డర్ చేయవచ్చు. ప్లాట్ఫారమ్కు ప్రస్తుతం అంతర్గత డెలివరీ భాగస్వాములు లేరు. eKart, Dunzo, Delhivery మొదలైన థర్డ్ పార్టీల ద్వారా డెలివరీ చేస్తుంది. సోషల్మీడియాలో కస్టమర్ల పోస్ట్లు చక్కర్లు స్విగ్గీ, జొమాటోతో పోలిస్తే ఓఎన్డీసీ 3 శాతం కమీషన్ను వసూలు చేస్తుంది. స్విగ్గీ తదితర ఫుడ్ డెలివరీ యాప్లు 25 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు ఓఎన్డీసీని ఎంచుకుంటున్నారు. దీంతో గత వారం రోజులుగా ఓఎన్డీసీ ఫుడ్ ఆర్డర్ల ధరలను పోల్చుతూ అనేక పోస్ట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్ట్లలో చాలా వరకు, ఫుడ్ డెలివరీ యాప్లతో పోలిస్తే, తక్కువకే, కొన్ని సందర్భాల్లో సగం రేటుకే లభిస్తోందంటూ యూజర్లు సంబర పడుతున్నారు. సేమ్ ఆర్డర్, సేమ్ ప్లేస్, సేమ్ టైం అంటూ ధరలను కంపేర్ చేస్తుండటం గమనార్హం. ఇది లాభాపేక్ష లేని ప్లాట్ఫారమ్ అని మధ్యవర్తి లేకపోవడం దీనికి పెద్ద ఎసెట్ అని ఇన్ఫోసిస్ కోఫౌండర్, ఓఎన్డీసీ సలహా మండలి సభ్యుడు నందన్ నీలేకని గతం లోనే ప్రకటించారు. నేరుగా విక్రేతకు చెల్లించడం గొప్పవిషయం, యాప్ కమీషన్ లేకపోవడంతో తక్కువ చార్జీలతో కస్టమర్ల ఆదరణ లభస్తుందన్నారు. There are over 29,000+ Merchants from 236 Cities in India on ONDC Seller Network Currently You can search for the Listed Merchants & City here - https://t.co/xelXMQJYTx pic.twitter.com/dZ6JJt4LNq — Ravisutanjani (@Ravisutanjani) May 8, 2023 Now you know the ONDC impact! Same order, same place and same time. The difference are clearly visible. pic.twitter.com/JG7xpjN8NB — Ankit Prakash (@ankitpr89) May 4, 2023 A very interesting find. Same pizza store but one is 20% cheaper. ONDC 👇 Zomato 👇 pic.twitter.com/pWWPjvHJFt — Udit Goenka (@iuditg) May 3, 2023 -
ప్రసవ నొప్పి.. అంబులెన్స్లో ప్రసవం
చెన్నై: కడలూరు ముత్తునగర్ సమీపంలో గురువారం వేకువజామున అంబులెన్స్లో ఓ మహిళ ప్రసవించింది. వివరాలు.. కడలూరు ముత్తునగర్ సమీపంలోని సేదపాళ్యం గ్రామానికి చెందిన ప్రశాంత్ భార్య శరణ్య (22). గురువారం తెల్లవారుజామున ప్రసవ నొప్పి రావడంతో బంధువులు ఆమెను 108 అంబులెన్స్లో తొండమానత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. దారిలో శరణ్యకు ప్రసవం నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో డ్రైవర్ చరణ్ రాజ్ అంబులెనన్స్ను రోడ్డు పక్కన ఆపాడు. ఎమర్జెన్సీ టెక్నీషియన్ (నర్సు) దశరథ డెలివరీ చేశారు. శరణ్య అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, బిడ్డనితొండమానత్తం పీహెచ్సీలో చేర్పించారు. 8 వరకు మెడ్ స్టార్ సమ్మిట్ సాక్షి, చైన్నె: చైన్నెలో మెడ్ స్టార్ సమ్మిట్–2023 ఈనెల 8వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సవిత వైద్య కళాశాల, ఐసీఎంఆర్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం గత కొద్దిరోజులుగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ పద్మ ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠ్యాంశాలు, పరిశోధనలు, అసాధారణ ఏకీకరణ తదితర అంశాల గురించి చర్చించారు. 540 మంది పోస్టర్ ప్రెజెంటేషన్ చేశారు. ఇందులో ప్రత్యేకంగా 1000 అడుగులతో రూపొందించిన పోస్టర్ ప్రెజెంటేషన్, విద్యార్థుల పరిశోధన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బిగ్ బాస్ నటి.. అప్పుడే పేరు కూడా!
టాలీవుడ్లో నిఖిల్ హీరోగా నటించిన 'స్వామి రారా' నటి పూజా రామచంద్రన్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె భర్త జాన్ కొక్కెన్ తన ఇన్స్టాలో పంచుకున్నారు. బాబు వేలిని పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశారు. అప్పుడే తమ బిడ్డకు కియాన్ కొక్కెన్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..) తమిళంలో బిగ్ బాస్ ద్వారా పూజాకు ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత కాంచన-2, దోచేయ్, త్రిపుర, దళం, వెంకీమామ, పవర్ ప్లే లాంటి సినిమాల్లో నటించారు. మరో వైపు ఆమె భర్త జాన్ కొక్కెన్ విలన్గా పలు చిత్రాల్లో మెప్పించారు. ముఖ్యంగా కేజీఎఫ్, కబ్జా, వీరసింహారెడ్డి, తెగింపు లాంటి విలన్గా నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీతారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by John Kokken (@highonkokken) -
ఇంట్లోనే ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్రూం బకెట్లో పెట్టి..
తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్రూంలోని బకెట్లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది. ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్రూంలో బకెట్లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు. శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్లో.. -
బిడ్డకు జన్మనిచ్చిన 'దసరా' నటి.. పిక్స్ వైరల్
సీమటపాకాయ్ చిత్రంతో టాలీవుడ్కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాలతో మెప్పించింది. అయితే హీరోయిన్గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్ అయిన పూర్ణ దుబాయ్కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకే గర్భం ధరించినట్లు ప్రకటించి ఫ్యాన్స్కు షాకిచ్చింది ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. ఇటీవలే నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా సినిమాలోనూ కనిపించింది. తాజాగా ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు పూర్ణ వెల్లడించింది. ఈ మేరకు తన ఇన్స్టాలో ఫోటోలు పంచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆస్పత్రికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ ఫోటోలు షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు పూర్ణకు అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. గతంలో ఆమె గర్భం ధరించినప్పటి నుంచి సీమంతం వరకు ప్రతి సందర్భంలోనూ తన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
ఒకే రోజు 400 కార్లు డెలివరీ చేసిన మహీంద్రా.. బుక్ చేసుకున్న వారికి పండగే!
భారతీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు తన XUV400 ఎలక్ట్రిక్ డెలివరీలు ప్రారంభించింది. గుడి పడ్వా సందర్భంగా కంపెనీ మొదటి రోజే ఏకంగా 400 యూనిట్లను డెలివరీ చేసి డెలివరీలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వేరియంట్స్ & ధరలు: 2023 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలైన సరికొత్త ఎలక్ట్రిక్ SUV ఎక్స్యూవీ400 మొత్తం EC (3.2kw), EC (7.2kw), EL (7.2kw) అనే మూడు వేరియంట్లలో విడుదలైంది. వీటి ధరలు వరుసగా రూ. 15.99 లక్షలు, రూ. 16.49 లక్షలు, రూ. 18.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం జనవరిలోనే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కలర్ ఆప్సన్స్: ఎక్స్యూవీ400 ఐదు కలర్ ఆప్సన్స్లో లభిస్తుంది. అవి ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, కాపర్ ఫినిషింగ్ రూఫ్తో నాపోలి బ్లాక్ మరియు బ్లూ శాటిన్ కలర్లు ఉన్నాయి. డిజైన్: మహీంద్రా ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ కారు కావున కొత్త డిజైన్ పొందుతుంది. దీని ముందు భాగంలోని ఫేక్ ఫ్రంట్ గ్రిల్పై కాపర్-కలర్ ఎలక్ట్రిఫైడ్ ట్విన్ పీక్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది, అంతే కాకుండా కాపర్ కలర్ ఎలిమెంట్స్ ప్రంట్ బంపర్, సైడ్ డోర్స్, రూఫ్, వెనుక లోగో, ఇంటీరియర్లో అక్కడక్కడా కనిపిస్తాయి. ఫీచర్స్: మహీంద్రా ఎక్స్యూవీ400 అడ్రినోఎక్స్ సాఫ్ట్వేర్తో కూడిన 7.0 ఇంచెస్ టచ్స్క్రీన్, సింగిల్ పేన్ సన్రూఫ్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్డేట్లతో కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఏసీ కంట్రోల్స్ వంటి వాటితోపాటు ఇతర ఆధునిక ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. Great start to the new year with 400 Deliveries Of XUV400. Wishing you all a very #HappyGudiPadwa#MahindraXUV400 #AllElectric #XUV400 pic.twitter.com/uRdVLnBSGk — MahindraXUV400 (@Mahindra_XUV400) March 22, 2023 బ్యాటరీ ప్యాక్ & రేంజ్: ఎక్స్యూవీ400 రెండు బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. అవి ఒకటి 34.5kWh బ్యాటరీ కాగా, మరొకటి 39.4kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండూ 150 హెచ్పి, 310 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేసే ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 150 కిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులోని 34.5 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో 375 కిమీ రేంజ్, 39.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో 456 కిమీ రేంజ్ అందిస్తుంది. ఛార్జింగ్ ఆప్షన్స్: మహీంద్రా ఎక్స్యూవీ400 ఫాస్ట్ ఛార్జర్ (50kW DC) ద్వారా 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది, అదే సమయంలో 7.2kW ఛార్జర్ ద్వారా 6 గంటల 30 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఇక చివరగా 3.3kW AC ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ చేసుకోవడానికి 13 గంటల సమయం పడుతుంది. -
వైరల్ వీడియో: భూకంపం వచ్చినా ఆపకుండా సర్జరీ చేసిన వైద్యులు
న్యూఢిల్లీ: మంగళవారం అర్థరాత్రి ఉత్తర భారతదేశాన్ని భూకంపం వణికించింది. దీని ప్రభావం జమ్మూ కాశ్మీర్లోనూ గట్టిగానే ఉంది. భూప్రకంపనల వల్ల ప్రజలంతా భయభ్రాంతులకు గరవుతున్న సమయంలో కొందరు వైద్యులు ఏ మాత్రం బెదరకుండా ఓ మహిళకు డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్లోని ఎస్డీహెచ బిజ్బెహరా ఆస్పత్రి వైద్యులు ఓ మహిళకు సిజేరియన్ పద్ధతిలో డెలివరీ చేస్తున్నారు. ఆ సమయంలో భూకంపనలు వచ్చాయి. అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా వైద్యులు సురక్షితంగా సర్జరీ చేసి బిడ్డను వెలికితీశారు. అంతటి క్లిష్ట సమయాల్లో కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా తమ బాధ్యతను పూర్తి చేశారు. ఒక్క కాశ్మీర్ మాత్రమే కాదు, ఉత్తర భారతదేశం చాలా వరకు ఈ ప్రకంపనల ప్రభావం ఉన్నట్లు సమాచారం. అంతర్జాతీయ భూకంప కేంద్రం ప్రకారం.. పాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి ఇతర దేశాలు కూడా ఈ ప్రకంపనల వల్ల ప్రభావితమయ్యాయి. Emergency LSCS was going-on at SDH Bijbehara Anantnag during which strong tremors of Earthquake were felt. Kudos to staff of SDH Bijbehara who conducted the LSCS smoothly & Thank God,everything is Alright.@HealthMedicalE1 @iasbhupinder @DCAnantnag @basharatias_dr @DHSKashmir pic.twitter.com/Pdtt8IHRnh — CMO Anantnag Official (@cmo_anantnag) March 21, 2023 -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య
టాలీవుడ్ యాంకర్ లాస్య మరోసారి తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. హోలీ సందర్భంగా బిడ్డ పుట్టడంతో లాస్య కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. చేతులకు రంగులు అద్దుకుని సెలబ్రేట్ చేసుకున్న ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు లాస్యకు కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో సోషల్ మీడియాలో పలుసార్లు ఫోటోలు, వీడియోలు పంచుకున్నారు. ఇటివలే ఆమెకు కుటుంబ సభ్యులు సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. ఒక రోజు ముందే బిడ్డ ఆమెను గందరగోళానికి గురి చేస్తున్నాడంటూ ఇన్స్టాగ్రామ్లో వీడియోను కూడా షేర్ చేసింది. కాగా.. చీమ ఏనుగు జోక్స్తో బాగా పాపులర్ అయిన లాస్య పలు టీవీ షోలకు యాంకర్గా వ్యవహరించింది. పెళ్లి తర్వాత కెరీర్కు కాస్త గ్యాప్ ఇచ్చిన లాస్య సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ను ఫ్యాన్స్తో షేర్ చేస్తుంటుంది. View this post on Instagram A post shared by Lasya Chillale (@lasyamanjunath) -
హారిబుల్ ఎక్స్పీరియన్స్: జొమాటో మరో నిర్వాకం వెలుగులోకి!
సాక్షి, ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు సంబంధించిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసిన మహిళకి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ చేసి కస్టమరుకు భారీ షాకిచ్చింది. తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విటర్లో ఆమెషేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్ చేశారు. దీంతో ఇది వైరల్గా మారింది. పలువురు నెటిజనులు జొమాటోపై మండిపడుతున్నారు. ఫలితంగా ఈ పోస్ట్ 6 లక్షలకు పైగా వ్యూస్, 700 లైక్లను పొందింది. జొమాటోలో శాఖాహారం ఆర్డర్ చేస్తే.. చికెన్ పంపించారంటూ నిరుపమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్విటర్లో షేర్ చేసిన నాలుగు సెకన్ల చిన్న క్లిప్లో చికెన్ ముక్కను చిదుముతూ తన షాకింగ్ అనుభవాన్ని తెలిపారు. ఇదేం సర్వీసురా బాబూ, భయంకరమైన అనుభవం అని ఆమె పేర్కొన్నారు. దీనిపై జొమాటో స్పందించింది. జరిగిన సంఘటనపై హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పింది. దర్యాప్తు చేస్తామని వెల్లడించింది. (జెరోధా నితిన్ నెల జీతం ఎంతో తెలుసా? ఈ తప్పులు చేయొద్దన్న బిలియనీర్) అయితే యూజర్లకు ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఓ యూజర్ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కాఫీలో చికెన్ ముక్క దర్శనమిచ్చింది. ఈ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అయితే స్పందించి క్షమాపణలు చెప్పినప్పటికీ జొమాటోతో తన "అసోసియేషన్" అధికారికంగా ఆ రోజు ముగిసిందని పేర్కొనడం గమనార్హం. Hi @zomato , ordered veg food and got all non veg food. 4/5 of us were vegetarians. What is this service, horrible experience. pic.twitter.com/6hDkyMVBPg — Nirupama Singh (@nitropumaa) March 4, 2023 -
యూట్యూబ్ చూస్తూ ఇంట్లోనే డెలివరీ చేసుకున్న బాలిక.. తల్లి రావడంతో
ముంబై: సోషల్మీడియా పరిచయాలు ఊహించని ప్రమాదంలో పడేయడంతో పాటు పలు ఇబ్బందులకు గురి చేసిన ఘటనలు చూస్తునే ఉన్నాం. తెలిసిన వాళ్లే మోసం చేస్తున్న రోజులివి, అలాంటిది కొందరు ఆన్లైన్ స్నేహాలను నమ్మి ఘోరంగా మోసపోతున్నారు. ప్రత్యేకంగా యువత కాలక్షేపం కోసం నెట్టింట్లోకి వెళ్లి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఈ తరహాలోనే 15 ఏళ్ల బాలిక ఇంటర్నెట్లో పరిచయమైన వ్యక్తని నమ్మి గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా యూట్యూబ్లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటు చేసుకుంది. యూట్యూబ్ చూసి... పోలీసుల వివరాల ప్రకారం..నాగ్పూర్లోని అంబజారీ ప్రాంతానికి చెందిన బాలికకు ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తితో పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో సదరు వ్యక్తి బాలికకు లైంగికంగా దగ్గరవ్వడంతో ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని బాలిక ఇంట్లో కూడా చెప్పలేదు. ఓ దశలో పొట్ట పెద్దగా ఉందని బాలిక తల్లి ప్రశ్నించగా.. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కడుపు ఉబ్బందని అబద్దం చెప్పింది. అలా బాలిక గర్భవతినన్న విషయాన్ని తన తల్లి నుండి దాచి పెట్టగలిగింది. అనంతరం డెలివరీ ఎలా చేసుకోవాలో యూట్యూబ్ వీడియోలను చూసి తెలుసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును గొంతునులిమి చంపేసి ఇంట్లోనే ఓ బాక్స్లో దాచిపెట్టింది. తల్లి ఇంటికి తిరిగి రాగానే బాలిక తీవ్ర అనారోగ్యంతో నీరసంగా కనిపించింది. దీంతో బాలికను గట్టిగా నిలదీయగా విషయాన్ని మొత్తం తల్లికి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. -
మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా.. ఉపాసన ట్వీట్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించింది మెగా ఫ్యామిలీ. పెళ్లైన పదకొండేళ్ల తర్వాత ఉపాసన తల్లి కాబోతుండటంతో మెగా ఇంట సంతోషం నెలకొంది. ఇటీవలే స్నేహితులు ఆమెకు సీమంతం వేడుక కూడా నిర్వహించారు. ఆ ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తమకు పుట్టబోయే బిడ్డ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది ఉపాసన. తన ప్రసవానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. అయితే ఇటీవల ఉపాసన డెలివరీ ఎక్కడనే విషయంపై నెటిజన్లు కొన్నిరోజులుగా ఉత్సాహం చూపిస్తున్నారు. విదేశాల్లో డెలివరీకి ప్లాన్ చేస్తున్నారంటూ రూమర్స్ సృష్టించారు. తాజాగా ట్వీట్తో వాటన్నింటికీ చెక్ పెట్టారు ఉపాసన. ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపారు. ఇటీవలే ‘హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్’ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొనేందుకు రామ్చరణ్ అమెరికా వెళ్లారు. ప్రముఖ అమెరికన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లోనూ ఆయన సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆస్టన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. అప్పుడు మీరు అందుబాటులో ఉండాలి’ అని అన్నారు. దీనికి ఆస్టన్ స్పందిస్తూ.. మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడమంటే తనకు అదో గౌరవమని.. ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని తెలిపారు. దాంతో, ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం సాగింది. తాజాగా ఉపాసన ట్విటర్లో రాస్తూ..' డాక్టర్ జెన్ ఆస్టన్ మిమ్మల్ని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. దయచేసి ఇండియాలోని మా అపోలో ఆస్పత్రుల ఫ్యామిలీలో చేరండి. డాక్టర్ సుమనా మనోహర్, డాక్టర్ రూమా సిన్హాతో కలిసి మా బిడ్డ ప్రసవంలో భాగం కావాలని కోరుకుంటున్నా.' అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన రామ్ చరణ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్లీజ్ టేక్ కేర్ సిస్టర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే మెగా ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. కాగా.. 2012లో ఉపాసన- రామ్ చరణ్ వివాహం జరిగింది. ఉపాసన తాతయ్య, అపోలో వ్యవస్థాపకుడు ప్రతాప్ రెడ్డి కావడం విశేషం. అందుకే అపోలో ఆస్పత్రిలోనే బిడ్డను ప్రసవించనున్నట్లు ఉపాసన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Dr Jen Ashton, ur too sweet. Waiting to meet you. Pls join our @HospitalsApollo family in India along with Dr Sumana Manohar & Dr Rooma Sinha to deliver our baby 🤗❤️ A big shout out to all the viewers of @ABCGMA3 & @AlwaysRamCharan ‘s fans & well wishers. U are much loved https://t.co/byeGqOllsK — Upasana Konidela (@upasanakonidela) February 25, 2023 -
బిడ్డకు జన్మనివ్వడంతోనే..వికలాంగురాలిగా మారిన ఓ తల్లి..
ఏ తల్లికి అయినా మాతృత్వం అనేది చాలా గొప్ప అనుభూతి. ఆ మధుర క్షణాలు ప్రతి తల్లికి గొప్ప జ్ఞాపకంలాంటివి. అలాంటి మాతృత్వమే ఆమెకు శాపంగా మారింది. డెలివరీ అయ్యి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది. హాయిగా తన బిడ్డతో గడపాలనుకునేలోపే మళ్లీ ఆస్పత్రి పాలై వికలాంగురాలిగా మారిపోయింది. ఈ ఘటన యూఎస్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. అమెరికాలోని క్రిస్టినా పచెకో అనే మహిళ రెండో బిడ్డకు జన్మినిచ్చింది. ఆమెకు సీజెరియన్ చేసి బిడ్డను తీశారు. ఆమె ఆపరేషన్ చేయించుకుని.. రెండు రోజుల అనంతరమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఐతే ఇంటికి వచ్చిన తర్వాత నుంచే నలతగా ఉండటం ప్రారంభించింది. ఆపరేషన్ వల్లే అలా అనిపిస్తుందంటూ నర్సు ఒక ఇంజక్షన్ని కూడా ఇచ్చింది. అయినా క్రిస్టినా ఇంకా అలా డల్గానే ఉంది. విపరీతమైన జ్వరంతో చాలా నీరసించిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా.. ఆస్పత్రికి తరలించారు. ఐతే అక్కడ ఆమె శరీరం సెప్టిక్కి గురయ్యిందని తేలింది. ఆ ఇన్ఫెక్షన్ అంతా కాళ్లు, చేతులకు వ్యాపించినట్లు వెల్లడించారు వైద్యులు. దీంతో ఆమె రెండు చేతులు, పాదాలను తొలగించాల్సి వచ్చింది. ఇలా మొత్తం ఆమె ఆస్పత్రిలోనే సుమారు నాలుగుల నెలల వరకు ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు క్రిస్టినా మాట్లాడుతూ.. ఆరోజు ఇప్పటికి మర్చిపోలేనంటూ నాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగానే..అలా కళ్లు మూతబడిపోయాయని చెబుతుంది. తన భర్త ప్లీజ్ కళ్లు తెరు మన పిల్లలు అంటూ ఏడుస్తున్న మాటలు వినిపిస్తున్నా.. తాను లేవలేకపోతున్నట్లు అనిపించిందని, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదంటూ.. చెప్పకొచ్చింది. ఏది ఏమైతే తాను ఆ భయానక పరిస్థితి నుంచి ప్రాణాలతో బయటపడిగలిగానూ అదే చాలు, ఇప్పుడూ నా ఇద్దరూ పిల్లలను బాగా చూసుకోవాలి అని ఆనందంగా చెబుతోంది. (చదవండి: ముఖంపై నీళ్లు పోసినందుకు ఏకంగా 30 ఏళ్లు జైలు శిక్ష!) -
వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ!
సాక్షి,బళ్లారి(బెంగళూరు): సర్కార్ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు అంటూ వైద్యాధికారులు, వైద్యులు నిత్యం చెబుతుండే మాటలు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కళ్లెదుటే ఆస్పత్రులు ఉన్నా రోగులకు వైద్యం అందడం లేదు. ఒక మహిళ పురిటినొప్పులతో కాన్పు కోసం రాగా ఆస్పత్రిమూసి ఉంది. దీంతో ఆమె ఆస్పత్రి ముందే ప్రసవమైంది. వైద్యుల నిర్లక్ష్యానికి ఈఘటన అద్దం పట్టింది. వివరాలు.. విజయపుర జిల్లా నాగఠాణలోని చౌహాన్దొడ్డికి చెందిన మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆస్పత్రిని మూసివేశారు. అప్పటికే నొప్పులు అధికంగా ఉన్న ఆ గర్భిణి ఆస్పత్రి ముందే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ కుమారుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రి సిబ్బంది పనితీరు, నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చదవండి ఫుల్ కిక్కు, తెగ తాగేస్తున్నారుగా.. ఐదేళ్లుగా రికార్డ్ సేల్స్! -
Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే
ఆర్డర్ చేసిన నిముషాల్లోనే డెలివరీ చేసే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడీస్ కోసం అదిరిపోయే సర్వీస్ తీసుకువచ్చింది. జొమాటో ఎవిరిడే (Zomato Everyday) పేరుతో ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ను అందిస్తుంది. మార్కెట్లో జొమాటో ఎప్పటికప్పుడు తమ ఇన్స్టంట్ సర్వీస్ను రీమోడలింగ్ చేయడంలో భాగంగానే ఈ కొత్త సర్వీసుని అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో దీపేంద్ర గోయల్ తెలిపారు. ఈ సర్వీస్ కింద సరసమైన ధరలోనే హోమ్ స్టైల్ ఫుడ్ అందిస్తామన్నారు. 2022-23 క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించే సమయంలో ఈ కొత్త సర్వీస్ తీసుకువస్తామని తెలిపారు. జొమాటో ఎవిరిడే సర్వీస్ ప్రారంభంలో గురుగావ్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫుడ్ పార్ట్నర్ హోమ్ చెఫ్తో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ కస్టమర్లకు హోమ్ స్టైల్ మీల్స్ అందిస్తారు. కంపెనీ అందించే ఈ హోమ్ స్టైల్ మీల్స్ ప్రారంభ ధర కేవలం రూ. 89 మాత్రమే. (ఇదీ చదవండి: ఎగబడి మరీ 'మారుతి ఈకో' కొంటున్న జనం.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్!) జొమాటో సంస్థకు ప్రధాన ప్రత్యర్థి గతంలో స్విగ్గీ 2019 లో స్విగ్గీ డెయిలీ పేరుతో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీస్ ప్రారభించింది. అయితే అనుకున్నంత సక్సెస్ సాధిచకపోవడంతో 2020లో హోమ్ స్టైల్ ఫుడ్ సర్వీసులను నిలిపేసింది. అయితే ఇప్పుడు జొమాటో అలాంటి సర్వీసుని త్వరలోనే ప్రారంభిస్తుంది. జొమాటో కంపెనీ తమ కస్టమర్ల కోసం ప్రారంభించే ఈ కొత్త సర్వీస్ ఎంత వరకు సక్సస్ సాధిస్తుందనేది త్వరలోనే తెలుస్తుంది, అంతే కాకుండా కంపెనీ డెలివరీ బాయ్స్ కోసం రెస్ట్ రూమ్స్ నిర్మిస్తున్నట్లు తెలిపింది. డెలివరీ బాయ్స్ ఈ రూమ్స్లో కొంత విశ్రాంతి తీసుకోవచ్చు. -
24 గంటలు.. 19 కాన్పులు
సాక్షి,నెహ్రూ సెంటర్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు జరిగాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 19 ప్రసవాలు జరిగాయని, వాటిలో 15 సాధారణ, 4 సిజేరియన్ శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రసవాల్లో అధిక రిస్క్ కేసులు కూడా ఉన్నాయని, కానీ తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు సిజేరియన్ ప్రసవాలను తగ్గించి.. సాధారణ కాన్పులను పెంచే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది ఈ విజయం సాధించారని వివరించారు. కాన్పుల విభాగం అధిపతి డాక్టర్ బి.వెంకట్రాములు ఆధ్వర్యంలో స్త్రీ వైద్య నిపుణులు అలేఖ్య, శస్త్ర చికిత్స డ్యూటీ నిపుణులు శైలజ, శ్రావణి, మత్తు విభాగం వైద్యులు శ్రవణ్కుమార్, శ్రీనివాస్ సేవలందించారని తెలిపారు. వారందరనీ కలెక్టర్ శశాంక అభినందించారని పేర్కొన్నారు. -
రూ.346.6 కోట్ల నష్టం.. జొమాటో సంచలన నిర్ణయం!
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 225 చిన్న నగరాల్లో తమ సంస్థ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించింది. జొమాటో త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆ ఫలితాల్లో ఫుడ్ డెలివరీ రంగంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల కారణంగా డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.346.6 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది. కాబట్టే పనితీరు ప్రోత్సాహకరంగా లేని చిన్న నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు తెలిపింది. ప్రస్తుతం డిమాండ్లో మందగమనం ఊహించని విధంగా ఉంది. ఇది ఫుడ్ డెలివరీ లాభాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ లాభదాయకత లక్ష్యాన్ని చేరుకునే స్థితులో ఉన్నామని భావిస్తున్నట్లు కంపెనీ తన క్యూ3 నివేదికలో పేర్కొంది. అందుబాటులో గోల్డ్సబ్స్క్రిప్షన్ జొమాటో దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఫుడ్ డెలివరీ యాప్లలో ఒకటి నిలిచింది.మార్కెట్ డిమాండ్ను క్యాష్ చేసుకునేందుకు గోల్డ్ సబ్స్క్రిప్షన్ను తిరిగి ప్రారంభించింది. మరోవైపు 225 చిన్న నగరాల నుండి వైదొలగాలని కంపెనీ నిర్ణయం తీసుకున్న తరుణంలో దాదాపు 800 మంది నియమించుకోవాలని యోచిస్తోంది. -
టాటా ఏస్ ఎలక్ట్రిక్ డెలివరీలు షురూ. ధర ఎంతంటే!
వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ఏస్ ఎలక్ట్రిక్ మినీ ట్రక్ డెలివరీలు ప్రారంభించింది. ధర ఎక్స్షోరూంలో రూ.9.99 లక్షల నుంచి మొదలు. ముందుగా 10 నగరాల్లో డెలివరీలను చేపట్టినట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. ఢిల్లీ, పుణే, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలో ఉన్నాయని వెల్లడించింది. ఈవీజెన్ పవర్ట్రైయిన్తో టాటా నుంచి తొలిసారిగా ఇది రూపుదిద్దుకుంది. 130 ఎన్ఎం గరిష్ట టార్క్తో 27 కిలోవాట్ పవర్ మోటార్ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్తో 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 2022 మే నెలలో ఏస్ ఎలక్ట్రిక్ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఆ సందర్భంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, సిటీలింక్, డీవోటీ, లెట్స్ట్రాన్స్పోర్ట్, మూవింగ్, యేలో ఈవీ తదితర కంపెనీలతో మొత్తం 39,000 యూనిట్ల ఎలక్ట్రిక్ ఏస్ సరఫరాకు ఒప్పందం కుదిరింది. కాగా, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్లలోనూ ఇది లభిస్తుంది. ఇప్పటి వరకు భారత్లో 20 లక్షల పైచిలుకు ఏస్ వాహనాలు రోడ్డెక్కాయి. -
సంగారెడ్డి: నరకయాతన.. నడిరోడ్డుపైనే ప్రసవం
సాక్షి, సంగారెడ్డి: బిజీ లైఫ్.. మనిషి కళ్లకు గంతలు కట్టేసింది. సాయానికి ప్రయత్నిస్తే.. లేనిపోని సమస్యలు మెడకు చుట్టుకుంటాయేమోనని వెనుకంజ వేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో కనీస సాయాన్ని కూడా బాధ్యతగా స్వీకరించడం లేదు. తాజాగా.. జిల్లాలోని రామచంద్రాపురం అశోక్నగర్ జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది ఓ యువతి. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. రోడ్డు మీద పడిపోయి విలవిలలాడిందామె. అటుగా వెళ్తున్న కొందరు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. కాసేపటికి ఆమె అవస్థను గమనించిన కొందరు షాపుల వాళ్లు.. అట్టముక్కలు అడ్డుపెట్టి అక్కడే ఆమెకు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలకు కొంత డబ్బుసాయం అందించి పఠాన్చెరువు ఏరియా ఆసుపత్రికి ఆటోలో తరలించారు. ఆ యువతిని ఇస్నాపూర్కు చెందిన బబితగా గుర్తించారు. స్థానికులు సకాలంలో స్పందించడంతోనే ఆ తల్లీబిడ్డకు గండం తప్పిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
‘మీతో పోటీ పడలేం!’,భారత్లో మరో బిజినెస్ను మూసేస్తున్న అమెజాన్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి భారత్లో ఫుడ్ డెలివరీ బిజినెస్ను షట్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయా ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో తరహాలో లాభాలు గడించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. 2020 కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సమయంలో ఇతర నిత్యావసరాల కోసం షాపింగ్ చేయడంతో పాటు అమెజాన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టాలని కస్టమర్లు భావించారు. దీంతో వినియోగదారుల డిమాండ్ మేరకు అమెజాన్ సంస్థ భారత్లో 20 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి ‘అమెజాన్ ఫుడ్’ సర్వీసుల్ని ప్రారంభించింది. తొలత ఈ అమెజాన్ ఫుడ్ సేవలు బెంగళూరు కేంద్రంగా ప్రారంభయ్యాయి. అయితే ఇప్పుడు ఆ సేవల్ని అమెజాన్ నిలిపి వేస్తున్నట్లు టెక్ క్రంచ్ తన నివేదికలో పేర్కొంది. డిసెంబర్ 29వరకు అమెజాన్ ఒప్పొందం చేసుకున్న రెస్టారెంట్లతో భాగస్వామ్యం కొనసాగించనుంది. అప్పటి వరకు అమెజాన్ ఫుడ్లో బుక్ చేసుకున్న ఆర్డర్లను అందిస్తామని ఈకామర్స్ దిగ్గజం తెలిపింది. అమెజాన్ అకాడమీ షట్డౌన్ మరోవైపు భారత్లో ఖర్చుల్ని తగ్గించేందుకు ఉద్యోగుల్ని స్వచ్ఛందంగా తొలగించడం, ఏ మాత్రం లాభసాటి లేని లాభాల్ని మూసేయాలని అమెజాన్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కొద్దిరోజుల క్రితం అమెజాన్ అకాడమినీ షట్డౌన్ చేస్తున్నట్లు వెల్లడించింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఊపందుకుంది.దీంతో దేశానికి చెందిన పలు స్టార్టప్తో పాటు అమెజాన్ సైతం ఆన్లైన్ ఎడ్యుటెక్ రంగంలోకి అడుగు పెట్టింది. కానీ ఇప్పుడు యధావిధిగా ఆఫ్లైన్ క్లాస్లు ప్రారంభం కావడంతో ఎడ్యుటెక్ కంపెనీలు భారీ నష్టపోతున్నాయి. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు అమెజాన్ అకాడమినీ మూసివేస్తున్నట్లు అమెజాన్ ప్రతినిధులు ప్రకటించారు. చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
జొమాటో యూజర్లకు గుడ్ న్యూస్!
ప్రముఖ ఫుడ్ ఆగ్రిగేటర్ జొమాటో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవల జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్ను నిలిపివేసింది. తాజాగా ఆఫర్ స్కీమ్ స్థానంలో ‘లాయల్టీ ప్రోగ్రామ్’ను అందించనున్నట్లు జొమాటో సీఎఫ్వో అక్షాంత్ గోయల్ తెలిపారు. ఇటీవల జొమాటో జులై - సెప్టెంబర్ వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా..యాప్లో ఆర్డర్ ఫీచర్పై యూజర్ల నుంచి ఫిర్యాదులు అందాయని అక్షాంత్ గోయల్ చెప్పారు.అందుకే కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా యాప్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్ను నిలిపివేసి.. ఆ స్థానంలో కస్టమర్లకు డిస్కౌంట్ ఇచ్చేలా లాయల్టీ ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెస్తామన్నారు. మరి ఆ లాయల్టీ ప్రోగ్రాం వల్ల కస్టమర్లు ఎలాంటి లబ్ధి పొందనున్నారు? ఆ స్కీమ్ ఎలా ఉంటుందనే అంశంపై జొమాటో ప్రతినిధులు స్పష్టత ఇవ్వలేదు. స్విగ్గీలో మరో ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ లాయల్టీలో స్కీమ్ కింద స్విగ్గీ ఇన్స్టా మార్ట్ ఆర్డర్లపై కస్టమర్లకు సంస్థ నిర్దేశించిన దూరం వరకు అన్ లిమిటెడ్ ఫ్రీ డెలివరీలు అందించనుంది. దీంతో పాటు పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోసం అదనపు సౌకర్యాలు అందించేందుకు 3నెలల సబ్స్క్రిప్షన్ కింద రూ.399, 12నెలల సబ్ స్క్రిప్షన్ కింద రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదే సబ్ స్క్రిప్షన్ మోడల్ను ( జొమాటో ప్రో అండ్ ప్రో ప్లస్ స్కీమ్) జొమాటో తొలగించిన విషయం తెలిసిందే. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి
రామాయణం సీరియల్ నటి దెబీనా బొనర్జీ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త, నటుడు గుర్మీత్ చౌదరి తెలిపారు. రెండోసారి పేరెంట్స్గా ప్రమోట్ అయినందుకు సంతోషంగా ఉందని, అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాగా ‘అమ్మాయిలు అబ్బాయిలు’ అనే సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన డెబీనా ఆతర్వాత రెండు, మూడు సినిమాల్లోనూ నటించింది. కానీ వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఎక్కువగా గుర్తింపు పొందింది. రామాయణం సీరియల్తో మరింత పాపులర్ అయిన డెబీనా ఈ సీరియల్లో రాముడిగా నటించిన గుర్మీత్ చౌదరినే 2011లో పెళ్లాడింది. ఈ ఏడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చిన డెబీనా తాజాగా రెండోసారి బేబీ గర్ల్కు జన్మనిచ్చింది. దీనికి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ను షేర్ చేయడంతో పలువురు సెలబ్రిటీలు సహా నెటిజన్లు ఈ జంటకు శుభాకంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) -
సోనాలిక ట్రాక్టర్ అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ నేపథ్యంలో సోనాలిక ట్రాక్టర్స్ అక్టోబర్లో 20,000 ట్రాక్టర్లను విక్రయించింది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసిన 7అమ్మకాల వృద్ధిని అధిగమించి ఏకంగా 16 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఒక నెలలో తమకు ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ జాయింట్ ఎండీ రమణ్ మిట్టల్ తెలిపారు. తమ ట్రాక్టర్ల తయారీలో అత్యాధునిక సాంకేతికత వినియోగిస్తున్నందున రైతుల నుంచి తమ బ్రాండ్కు విశేషమైన ఆదరణ లభిస్తుందని రమణ్ అన్నారు. -
ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం నిండు గర్భిణీగా ఉన్న ఆలియా మరికొద్ది గంటల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఈ క్రమంలో డెలివరీ కోసం నేడు(ఆదివాం)ఉదయం 7.30నిమిషాలకే ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేరింది. ఆలియా వెంట భర్త రణ్బీర్ కపూర్తో పాటు నీతూ కపూర్, సోనీ రజ్దాన్, షాహిన్ భట్ కూడా ఉన్నారు. మరికాసేపట్లో ఆలియా, రణ్బీర్ గుడ్న్యూస్ చెప్పనున్నారు. దీంతో కపూర్ ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ ఆలియా బేబీ కోసం ఎదురుచూస్తున్నారు. బేబీ కపూర్కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆలియా పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని వెల్లడించింది. అయితే గర్భిణీగా ఉన్నా షూటింగ్స్తో పాటు ప్రమోషన్స్లోనూ ఆమె యాక్టివ్గా పాల్గొంది. ప్రసవం తర్వాత ఆలియా తిరిగి సినిమాల్లో నటించనుంది. -
పురిటిలో మృత్యు ఘోష.. వైద్యుల నిర్లక్ష్యం.. తల్లి, కవలలు మృతి
వైద్యో నారాయణ హరి అన్న నానుడికి కళంకం తెస్తున్నారు కొందరు వైద్యసిబ్బంది. ఏమాత్రం కనికరం లేకుండా వైద్యాన్ని నిరాకరించడం తమ గొప్పగా భావిస్తారు వీరు. నిరుపేద గర్భిణి కాన్పు కోసం వస్తే వైద్యం చేయడానికి బదులు, దయాదాక్షిణ్యం లేకుండా వెనక్కి పంపేశారు. ఇంట్లో ఆ అభాగ్యురాలు కవలలకు జన్మనిచ్చి తుదిశ్వాస విడిచింది. అమ్మ లేని లోకం దండగ అనుకున్నారో ఏమో.. ఆ శిశువులు కూడా తల్లి వెంటే వెళ్లారు. ఈ దారుణం ఏ మారుమూలో పల్లెలోనో కాదు, విద్యా వైద్య సేవలకు పేరుగన్న తుమకూరు నగరంలో చోటుచేసుకుంది. సాక్షి, బెంగళూరు: తుమకూరు నగరంలో ఉన్న జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల నిండు బాలింత ప్రాణం గాలిలో కలిసింది. పురుటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది, అయితే నీకు ఆరోగ్య కార్డు లేదు, చికిత్స చేయలేం అని వైద్యసిబ్బంది కఠినంగా తిరస్కరించారు. దీంతో ఆమె ఇంటికి వెళ్లిపోగా, అక్కడ కవల పిల్లలు జన్మించారు, కానీ తీవ్ర రక్తస్రావం జరిగి కన్నుమూసింది. వైద్యసిబ్బంది అలసత్వం ముగ్గురి ప్రాణాలు తీసిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తెల్లవారుజామున ఆస్పత్రికి వెళ్లగా ఈ అమానుష సంఘటన తుమకూరులో జరిగింది. భారతీ నగరలోని అభయాంజనేయ స్వామి దేవాలయం వీధిలో కస్తూరి (30) అనే మహిళ నివసిస్తోంది. తమిళనాడుకు చెందిన కస్తూరి ఇక్కడకు వచ్చి నెల రోజులు అవుతోంది. ఆమె ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆర్థిక సమస్యలతో భర్త 4 నెలల కిందట బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నాడు. నిండు గర్భిణి అయిన కస్తూరికి గురువారం తెల్లవారుజామున 4 గంటలకు ప్రసవ వేదన ప్రారంభం కావడంతో చుట్టుపక్కల మహిళలు ఆమె చేతికి కొంత డబ్బిచ్చి ఒక వృద్ధురాలిని తోడిచ్చి ఆటోలో జిల్లా ఆస్పత్రికి పంపించారు. జిల్లా ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు వైద్యం చేయడానికి బదులుగా గర్భం దాల్చినప్పుడు ఆస్పత్రిలో నమోదు చేసుకుని కార్డు తీసుకున్నారా? అని అడగ్గా ఆమె లేదు అని చెప్పింది. ఆధార్, రేషన్ కార్డు అడిగారు. ఆధార్ కార్డు అడ్రస్ చూపగా తమిళనాడు చిరునామాతో ఉంది. అంతే.. మేం వైద్యం చేయం, బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి వెళ్లండి అని వైద్యసిబ్బంది సలహా ఇచ్చారు. తీవ్ర రక్తస్రావమై దిక్కుతోచని కస్తూరి ఆటోలో ఇంటికి తిరిగివచ్చింది. కొంతసేపటికి ఆమెకు ప్రసవమై ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. కానీ తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు చూసేవారెవరూ లేకపోయారు. కొంతసేపటికి విలవిలలాడి తల్లీ బిడ్డలు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. తల్లిని కోల్పోయి కూతురు విలపిస్తూ ఉండగా అందరూ అక్కడకు చేరారు. ముగ్గురు సస్పెండ్ అంతా జరిగాక ఉన్నతాధికారులు చర్యలకు దిగారు. డాక్టర్ ఉషా, మరో ఇద్దరి సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మంజునాథ్ ప్రకటించారు. రాత్రికి ఆరోగ్యమంత్రి సుధాకర్ చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మేయర్, కార్పొరేటర్ల నిరసన ఈ దారుణంపై స్థానిక ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 22వ వార్డు కార్పొరేటర్ శ్రీనివాస్, మేయర్ ప్రభావతి, ఉప మేయర్ టి.కే.నరసింహమూర్తి, కార్పొరేటర్ నయాజ్ అహ్మద్లు బాధితురాలి ఇంటికి వెళ్లి చుట్టుపక్కలవారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. తల్లీపిల్లల మృతదేహానికి నివాళులర్పించారు. జిల్లా ఆస్పత్రి వైద్యులు, డిహెచ్ఈ ఇక్కడికి వచ్చేదాకా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, వైద్యులు అందరు లంచాలకు అలవాటు పడి సక్రమంగా వైద్యం చేయడంలేదని, ఆస్పత్రి మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. జిల్లా ఆస్పత్రి సర్జన్ డాక్టర్ వీణా వచ్చి ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. కస్తూరికి తల్లి కార్డు లేక పోవడంతో వెనక్కి పంపించారని చెప్పారు. గర్భిణి ప్రతినెలా ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయంచుకునే సమయంలో వారికి తల్లి కార్డు ఇస్తారని అన్నారు. ఇకపై ఇలా జరగుకుండా చూసుకుంటామని, దీనికి ఎవరు బాధ్యులు అనేదానిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్.. హరీశ్రావు ప్రశంసలు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసవించారు. సోమవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధ్యం కాలేదు. గైనకాలజిస్టులు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేశారు. ఇలా త్రిపాఠి మగ శిశువుకు జన్మనిచ్చారు. శిశువు 3కిలోల 400 గ్రాముల బరువుతో పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ను అందరూ ప్రశంసిస్తున్నారు. హరిశ్రావు ట్వీట్ తెలంగాణ ఆరోగ్యమంత్రి హరీశ్రావు కూడా ఈ విషయంపై స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన అదనపు కలెక్టర్కు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రులు చాలా మెరగుపడ్డాయని, అందరికీ మొదటి ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇది ఎంతో గర్వించాల్సిన సమయం అని ట్వీట్ చేశారు. Congratulations to @Collector_JSK & Addl Collector Mulugu on delivering baby boy at district Area hospital. It is a matter of immense pride that health infrastructure in the state under able leadership of #CMKCR Garu, became first choice of people. pic.twitter.com/XNJRepCCoZ — Harish Rao Thanneeru (@trsharish) October 4, 2022 చదవండి: రాహుల్ యాత్ర విచ్ఛిన్నం కోసమే ఈడీ, ఐటీ దాడులు -
అమెజాన్: వారి కోసం నాలుగు గంటల్లో డెలివరీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈ –కామర్స్ కంపెనీ అమెజాన్ ఎప్పటికప్పుడు ఆకర్షనీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వీటితో పాటు కస్టమర్ల సర్వీసు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా అందిస్తుంది. తాజాగా ప్రైమ్ కస్టమర్లకు నాలుగు గంటల్లోగా ఉత్పత్తులను డెలివరీ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రైమ్ సభ్యులు దేశవ్యాప్తంగా 50కిపైగా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా ఈ సేవలు పొందవచ్చని వెల్లడించింది. ఆర్డర్ ఇచ్చిన రోజే ఉత్పత్తులను డెలివరీ చేసే విధానాన్ని కంపెనీ 2017 నుంచి అమలు చేస్తోంది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
స్విగ్గీలో ఐస్క్రీం, చిప్స్ ఆర్డర్ చేస్తే.. డెలీవరీ చూసి షాక్ అయిన వ్యక్తి
చెన్నై: ఒకప్పుడు ఏదైనా కావాలి అంటే స్వయంగా వెళ్లి కొని తెచ్చుకునే వాళ్లం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. ఫుడ్ నుంచి గ్రాసరీస్, మెడిసిన్, ఎలక్ట్రానిక్స్, హోం నీడ్స్ ఇలా ప్రతిదీ.. ఫోన్లో ఆర్డర్ చేస్తే క్షణాల్లో మన ముందు వాలుతోంది. అయితే అప్పుడు ఆర్డర్లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్ అవ్వడం లేదా మనం చెప్పినా వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం వంటి పొరపాట్లు సాధారణంగా జరుగుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం(ఆగస్టు 27) రాత్రి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆర్డర్ చేశాడు. అయితే తీరా ఆర్డర్ డెలివరీ అయ్యాకి.. పార్శిల్ ఓపెన్ చేసి అందులో ఉన్న వస్తువును చూసి ఖంగుతున్నాడు. ఐస్క్రీం, చిప్స్కు బదులు కండోమ్లు ఉన్నాయి. ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చదవండి: 14 సింహాలు వెంటపడినా జడవలేదు.. ఒంటరైనా బెదరలేదు! ఇక జరిగిన పొరపాటుపై స్విగ్గీ సంస్థ స్పందించింది. తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది. అయితే ఓ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఇలాంటి వస్తువులు డెలివరీ చేయడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. -
కవల పిల్లలతో దైవ దర్శనం చేసుకున్న నమిత
Namitha Visits Temple With Her Twin Baby Boys: బ్యూటిఫుల్ హీరోయిన్ నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. కారణం ఆమె వారిని ఎక్కడ చూసినా మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్ల వర్షం కురిపించడమే. ఇక సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందాల ఆరబోతతో యువతను గిలిగింతలు పెడుతుంది. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్కు కథానాయికిగా దిగుమతి అయింది ఈ గుజరాతి భామ నమిత. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అదేవిధంగా తెలుగు, మలయాళం వంటి ఇతర చిత్రాలలో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె 2017లో వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఆ మధ్య తను గర్భిణిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి త్వరలో మాతృమూర్తిని కాబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్లు.. ఎక్కడో తెలుసా? తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం ఇక ఈ శుక్రవారం (ఆగస్టు 19) అనూహ్యంగా భర్త, ఇద్దరు పురిటి బిడ్డలతో దైవ దర్శనం చేసుకుంటున్న ఫొటోలతో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం అయ్యింది. అందులో తాను చెన్నైలోని రేలా ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఇద్దరూ మగ పిల్లలే అని, క్షేమంగా ఉన్నారనీ తెలిపింది. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన ఆ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈమె ప్రసవం ఎప్పుడు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
Zomato: వీల్చైర్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు అధికమవ్వడంతో డెలివరీ బాయ్లు కూడా పెరిగిపోయారు. చాలా మంది యువత పార్ట్టైం జాబ్ కింద డెలివరీబాయ్లా పనిచేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేయాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎండలు, వానలు, ట్రాఫిక్ వంటి ఆటంకాలను దాటుకొని కస్టమర్లకు టైంలోగా ఆర్డర్ అందించాల్సిందే. తాజాగా వీల్చైర్లో కూర్చొని ఫుడ్ డెలివరీ చేస్తున్న ఓ దివ్యాంగుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు వ్యక్తి కృషి, పట్టుదల పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చెన్నైకి చెందిన 37 ఏళ్ల గణేష్ మురుగన్ జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అతను దివ్యాంగుడు. వీల్చైర్లో కూర్చొని ఆర్డుర్లు డెలివరీ చేస్తూ బతుకు బండి లాక్కొస్తున్నాడు. దేశంలోనే తొలి వీల్చైర్ డెలివరీబాయ్గా అతను రికార్డు సృష్టించాడు. నడవలేని స్థితిలో ఉన్న గణేష్.. వీల్చైర్లో కూర్చొని ఆర్డర్లు అందిస్తున్న వీడియోను యూట్యూబ్లో షేర్ చేశాడు. గత నాలుగు రోజులుగా ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వీటిని రీపోస్టు చేస్తూ ‘గొప్ప స్ఫూర్తికి నిజమైన ఉదాహరణ' అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఆయన ధైర్యాన్ని, సంకల్ప శక్తిని కొనియాడుతున్నారు. అంతేగాక గణేష్కు ఉపాధి కల్పించినందుకు జోమాటోను కూడా ప్రశంసించారు. చదవండి: చిత్రం భళారే విచిత్రం.. రాజమౌళి మూవీనే తలదన్నే వీడియో.. ఆరేళ్ల క్రితం ప్రమాదంలో వెన్నెముకకు గాయం కావడంతో మురుగన్ వీల్చైర్కే పరిమితమయ్యాడు. అయితే అదే అతన్ని సంకల్ప దైర్యాన్ని రెట్టింపు చేసింది. మురుగన్ లైఫ్ స్టోరీని జూన్లో ఛత్తీస్గఢ్ ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా మొదటిసారి ట్విట్టర్లో పంచుకున్నారు. కష్టాలపై పోరాడటం మానేసి చేతులెత్తేసే వారందరికీ ఇది స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇక మురుగన్ వీల్ చైర్ను మద్రాస్లోని ఐఐటీ స్టార్టప్ రూపొందించింది. దీనిని నాలుగు గంటలు పూర్తిగా ఛార్జ్ చేస్తే.. 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. -
కొంపముంచిన డెలివరీ ఇన్స్ట్రక్షన్.. కేక్ చూసి షాక్ అయిన యువతి
స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు.. ఇందులో కొన్ని ఆర్డర్ తెచ్చే బాయ్కు సంబంధించి ఉంటే.. మరికొన్ని రెస్టారెంట్ను ఉద్దేశించి ఉంటాయి. ‘మసాలా తగ్గించండి’ లాంటివి. అయితే ఇవి ఒక్కోసారి తేడా కొడితే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు తాజాగా మహారాష్ట్రలోని ముంబై, నాగపూర్లో చోటుచేసుకున్నాయి. ముంబైకి చెందిన వైష్ణవి ఇటీవల బర్త్డే కోసం ఒక కేక్ ఆర్డర్ ఇచ్చారు. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టారు. అందులో వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని బాయ్కు డెలివరీ ఇన్స్ట్రక్షన్ పెట్టారు. తీరా కేక్ ఇంటికొచ్చిన కేక్ను చూసి ఆమె షాకయ్యారు. హ్యాపీ బర్త్డేకి బదులు.. కేక్పై సదరు బేకర్ రూ.500కి చిల్లర తీసుకురా అని రాశాడు. దీన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు నవ్వు ఎమోజీలు పెడుతూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరో ఘటనలో నాగ్పూర్కు చెందిన కపిల్ నగరంలోనే పేరొందిన బేకర్ నుంచి కేక్ ఆర్డర్ చేశారు. అందులో డెలివరీ ఇన్స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టారు. ఆయన ఉద్దేశం డెలివరీ చేసినప్పుడు.. అది ఎగ్తో చేసిన కేక్ అని చెప్పడం కోసం ఈ బేకర్ డైరెక్టుగా కేక్ మీదే.. ఇది ఎగ్తో చేసినది అని రాశాడు. దాన్ని చూశాక నాకు నోట మాట రాలేదు అని కపిల్ తన అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు. -
ఆసుపత్రిలోకి నో ఎంట్రీ.. రోడ్డుపైనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్!
న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్గంజ్ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ — Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022 గాజియాబాద్లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్గంజ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు -
ఎంత మోసమో?..నెటిజన్ పోస్ట్కు కామెంట్ల వరద, స్పందించిన జొమాటో!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆన్లైన్, ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ బిల్లుల వివాదంపై జొమాటో స్పందించింది. రాహుల్ కాబ్రా ఆఫ్లైన్ ఫుడ్ ఆర్డర్ ధరను జొమాటో డెలివరీ చేసే ఫుడ్ ఆర్డర్ ధరను పోల్చుతూ పోస్ట్ చేశాడు. ఆఫ్లైన్లో ఉన్న ధర కంటే జొమాటో పెద్ద మొత్తంలో కస్టమర్ల దగ్గర నుంచి వసూలు చేస్తుందని ఆరోపించాడు.ఆ ఆరోపణలపై జొమాటో రిప్లయి ఇచ్చింది. కస్టమర్లకు,రెస్టారెంట్ల మధ్య జొమాటో అనుసంధానంగా పనిచేస్తుంది.ఆఫ్లైన్లో అందించే ధరలకు జొమాటోకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే కాబ్రా పోస్ట్పై స్పందిస్తూ.. కస్టమర్ ఫిర్యాదుల్ని రెస్టారెంట్ల దృష్టికి తీసుకొని వెళ్తామని వెల్లడించింది. కామెంట్ల వరద రాహుల్ కాబ్రా ఓ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. అయితే రెండు మూడు రోజుల క్రితం రాహుల్కు బాగా ఆకలి వేయడంతో ఆఫ్లైన్లో చెక్ చేసి వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలను ఆర్డర్ పెట్టాడు. ఫుడ్తో పాటు,ఇతర అదనపు ట్యాక్స్లు అన్నీ కలుపుకొని బిల్లు రూ.512 అయ్యింది. జొమాటోలో చెక్ చేస్తే ఆ ధర కాస్త రూ.75 డిస్కౌంట్ తీసేస్తే రూ.689.90గా ఉండడంతో కంగుతిన్నాడు. అంతా మోసం, దగా జొమాటో కస్టమర్ల దగ్గరనుంచి ఎంత మొత్తం వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ తాను ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఆఫ్లైన్, ఆన్లైన్ బిల్స్ను లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ఆఫ్లైన్లో ఫుడ్ ఆర్డర్పై ఉన్న ధర కంటే జోమాటో ఎక్కువగానే 34.76% శాతంతో 690-512 =రూ.178 వసూలు చేసినట్లు రాహుల్ మండిపడ్డాడు. ఫుడ్ ఆర్డర్పై ఇక రాహుల్ పెట్టిన లింక్డ్ఇన్ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది.ఫుడ్ ఆర్డర్ పెట్టిన కస్టమర్ల నుంచి జొమాటో ఎంత వసూలు చేస్తుందో మీరే చూడండి అంటూ బిల్స్కు సంబంధించిన బిల్స్ను సైతం షేర్ చేశాడు. వీటిపై స్పందించిన నెటిజన్లు ఈ దిగ్గజ ఫుడ్ ఆగ్రిగ్రేటర్పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలా ఇప్పటి వరకు కాబ్రా పెట్టిన పోస్ట్కు 2వేల కామెంట్లు, 12వేలకు మందికి పైగా నెటిజన్లు అతనికి సపోర్ట్ చేస్తూ లైక్ కొట్టారు. -
షాకింగ్.. కడుపు నొప్పితో టాయిలెట్లోకి వెళ్లి.. బిడ్డతో బయటకొచ్చిన యువతి
కడుపు నొప్పితో విలవిల్లాడుతూ వాష్రూమ్లోకి వెళ్లిన యువతి అనుకోకుండా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. యువతికి కనీసం పొట్ట పొరగడం, ప్రెగ్నెన్సీకి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం మరింత చోద్యంగా మారింది. ఈ వింత ఘటన యూనైటెడ్ కింగ్డమ్లో వెలుగు చూసింది. జెస్ డేవిస్ అనే 20 ఏళ్ల యువతి యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్లో చదువుతోంది. ఓ రోజు రాత్రి యువతికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పీరియడ్స్(నెలసరి) అని భావించి వాష్రూమ్లోకి వెళ్లింది. టాయిలెట్లో కూర్చొని ఉండగా అకస్మాత్తుగా 3 కేజీల మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆశ్చర్యపోయింది. అసలు తాను గర్భవతిననే విషయం కూడా ఆమెకు తెలియదు. ఇక బిడ్డను ప్రసవించిన మరుసటి రోజే జెస్ డేవిస్ తన 20వ పుట్టిన రోజును జరుపుకోవడం విశేషం. విషయంపై సదరు యువతి మాట్లాడుతూ.. ‘నాకు పీరియడ్స్ ఎప్పుడూ రెగ్యులర్గా రావు. కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు వికారంగా అనిపించేది. అందుకు కొన్ని మందులు వాడటం ప్రారంభించాను. ఆ రోజు ఉదయం తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. పీరియడ్స్ మొదలవుతున్నాయేమో అనుకున్నా. నడవలేని స్థిలిలో ఉన్నాను. కనీసం మంచం మీద పడుకోలేకపోయాను. అర్ధరాత్రి దాటాక కడుపునొప్పి ఎక్కువైంది. వెంటనే లేచి వాష్రూమ్కు వెళ్లా. నా పొట్టను కిందకు పుష్ చేశా. చదవండి: అక్కడ పానీ పూరీ అమ్మకాలు నిషేధం! ఎందుకంటే?... అప్పటికీ నాకు అనుమానం రాలేదు. కొద్దిసేపటి తర్వాత బిడ్డ ఏడుపు వినిపించింది. ఆ తరువాతే గానీ జరిగిందేంటో అర్థం కాలేదు. బాత్రూమ్లో బిడ్డను చూసి ముందు నేను కల కంటున్నానేమో అనుకున్నాను. కానీ జీవితంలో ఇంత కంటే పెద్ద షాక్ మరొకటి లేదు. వెంటనే షాక్ నుంచి తేరుకొని బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే నా స్నేహితురాలికి ఫోన్ చేసి విషయం చెప్పా. తాను అంబులెన్స్లో హాస్పిటల్కు వెళ్లామని చెప్పింది. మొదట్లో శిశువుతో సమయం గడిపేందుకు కొంత టైం పట్టింది. కానీ ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని వివరించింది. ఆసుపత్రిలో శిశువును ఇంక్యుబేటర్లో ఉంచారు. శిశువు 35 వారాలకే జన్మించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ కోలుకుంటున్నారని పేర్కొన్నారు. చదవండి: రోడ్డు మీద వెళ్తున్న మహిళ.. తలపై పడిన కొబ్బరికాయ.. వైరలవుతోన్న వీడియో -
ప్రైవేట్ ఆస్పత్రులు తగ్గేదేలే.. 94 శాతం సిజేరియన్లే!
భైంసాటౌన్(ముధోల్): జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని సాక్షాత్తు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గత మార్చిలో జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు, అంగన్వాడీలకు సూచించారు. సిజేరియన్లపై దృష్టి పెట్టాలని సూచించగా, ఆరునెలల్లో మార్పు వస్తుందని కలెక్టర్ సైతం మంత్రికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తరచూ వైద్యాధికారులు, అంగన్వాడీలతో సమావేశాలు నిర్వహిస్తూ సాధారణ కాన్పులు పెంచాలని కలెక్టర్ సూచిస్తున్నారు. అలాగే జిల్లాలో సిజేరియన్ కాన్పులు ఎక్కువగా నిర్వహిస్తున్న పలు ఆస్పత్రులపై చర్యలు సైతం తీసుకున్నారు. అయినా సానుకూల మార్పు కనిపించడం లేదని వైద్యారోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తుండడం గమనార్హం. 94 శాతం సిజేరియన్లే... రాష్ట్రంలో 2021–22లో సిజేరియన్ ఆపరేషన్లపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో నాలుగు జిల్లాల్లో 94శాతం సిజేరియన్లే నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో నిర్మల్ జిల్లా మూడో స్థానంలో ఉండడం కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే కడుపుకోతలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. ఈఏడాది జనవరి నుంచి మే వరకు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 2600 వరకు ప్రసవాలు జరుగగా, వీటిలో 2146 సిజేరియన్లే కావడం గమనార్హం. కేవలం 454 సాధారణ కాన్పులు జరిగాయి. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిశీలిస్తే.. 2,925 ప్రసవాలు జరుగగా, 1171 సాధారణ, 1754 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. ప్రైవేట్తో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. ఇంకా తగ్గాల్సిన అవసరముంది. అవగాహన కల్పిస్తేనే... ఒకప్పుడు సర్కారు దవాఖాన్లలో లేదంటే ఇళ్లలోనే ఎక్కువగా కాన్పులు చేసేవారు. చాలావరకు సాధారణ కాన్పులే జరిగేవి. ఇంటి వద్ద నొప్పులొస్తే మంత్రసాని ఇంటికే వచ్చి ప్రసవం చేసేది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మారిన ఆçహార అలవాట్ల కారణంగానో, నొప్పులు భరించలేకనో సిజేరియన్ ప్రసవాలకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కొందరు సమయం, ముహూర్తం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. సిజేరియన్లతో తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమేనని చెబుతున్న ప్రభుత్వం సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టాలని పదేపదే సూచిస్తోంది. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వంటి పథకాలు ప్రవేశపెట్టి మరీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులపై దృష్టి పెట్టింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అవగాహన లేకనో, గర్భిణుల బంధువుల ఒత్తిడితోనో సిజేరియన్లు చేస్తున్నారు. సుఖప్రసవానికి వీలులేనప్పుడో, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడో చేయాల్సిన సిజేరియన్లు.. అవసరం లేకున్నా చేస్తున్నారని విమర్శలున్నాయి. ఫలితంగా కడుపు కోతల్లో నిర్మల్ జిల్లా టాప్లిస్ట్లోకి చేరింది. అనవసరంగా సిజేరియన్లు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే జిల్లాలో వీటిని తగ్గించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవగాహన కల్పిస్తున్నాం ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలపై దృష్టి పెడుతున్నాం. తరచూ నిర్వహించే సమావేశాల్లోనూ సిజేరియన్ కాన్పులు తగ్గించాలని సూచిస్తున్నాం. కలెక్టర్ సైతం ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులతో సిజేరియన్లు తగ్గించాలని సూచిస్తున్నారు. మార్పు రాని పక్షంలో చర్యలు తీసుకుంటాం. –ధన్రాజ్, డీఎంహెచ్వో -
జొమాటో డెలివరీ పార్ట్నర్స్కి గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తన ఉదారత చాటుకున్నారు. సంస్థ డెలివరీ పార్ట్నర్స్ పిల్లల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే దిశగా జొమాటో ఫ్యూచర్ ఫౌండేషన్ (జెడ్ఎఫ్ఎఫ్)కు 90 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 700 కోట్లు) విలువ చేసే ఎసాప్స్ను (స్టాక్ ఆప్షన్స్) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంస్థ అంతర్గతంగా ఉద్యోగులకు ఆయన లేఖ రాశారు. జొమాటో పబ్లిక్ ఇష్యూకి వెళ్లడానికి ముందు .. ఇన్వెస్టర్లు, బోర్డు ఆయన పనితీరు ప్రాతిపదికన కొన్ని ఎసాప్స్ను కేటాయించింది. వీటన్నింటినీ ఫౌండేషన్కు అందిస్తున్నట్లు గోయల్ తెలిపారు. ఇద్దరు పిల్లలకు గత నెలలో షేరు సగటు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. అయిదేళ్లకు పైగా తమ డెలివరీ పార్ట్నర్స్గా పనిచేస్తున్న వారి పిల్లల (గరిష్టంగా ఇద్దరికి) చదువు ఖర్చుల కోసం ఏటా ఒక్కొక్కరికి రూ. 50,000 వరకూ ఈ ఫండ్ నిధులు అందిస్తుంది. అదే పదేళ్ల పైగా పని చేస్తున్న వారి పిల్లలకు ఏటా రూ. 1 లక్ష వరకూ లభిస్తుంది. మహిళా డెలివరీ పార్ట్నర్లకు ఈ పని కాలానికి సంబంధించి కొంత వెసులుబాటు ఉంటుంది. ఫండ్కు నిధులు సమకూర్చేందుకు తొలి ఏడాది తన ఎసాప్స్లో 10 శాతాన్ని విక్రయించనున్నట్లు గోయల్ పేర్కొన్నారు. చదవండి: శబాష్!! జొమాటో.. చెప్పింది చేసింది! -
స్విగ్గీ మరో సంచలనం, ఒక్క ఫోన్ కొడితే చాలు!
డెలివరీ రంగంలో సరికొత్త విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీకి చెందిన ఇన్స్టామార్ట్ ఇకపై కస్టమర్లకు కావాల్సిన గ్రాసరీస్ను డ్రోన్ల ద్వారా డ్రోన్ పోర్ట్కు డెలివరీ చేయనుంది. బెంగళూరు కేంద్రంగా స్విగ్గీకి చెందిన గ్రాసరీ సర్వీస్ ఫ్లాట్ ఫామ్ 'ఇన్ స్టామర్ట్'లో ఇన్ని రోజులు కస్టమర్లకు వారికి కావాల్సిన నిత్యవసర వస్తువుల్ని డెలివరీ బాయ్స్తో అందిస్తుండేది. కానీ ఇకపై డెలివరీ బాయ్స్ బదులు..డ్రోన్లు డెలివరీ చేయనున్నాయి. ఇందులో భాగంగా స్విగ్గీ డ్రోన్ సర్వీస్లు అందించే నాలుగు సంస్థల భాగస్వామ్యంలో డ్రోన్ డెలివరీ సర్వీస్ ట్రయల్స్ను నిర్వహిస్తుంది. డ్రోన్తో సరుకుల రవాణా డిల్లీ -ఎన్సీఆర్, బెంగళూరులో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ డ్రోన్ డెలివరీ ట్రయల్స్ను రెండు సార్లు నిర్వహించనున్నట్లు స్విగ్గీ తన బ్లాగ్ పోస్ట్లో తెలిపింది. ముందస్తుగా గరుడా ఏరోస్పేస్ సంస్థ బెంగళూరులో, స్కైఎయిర్ మొబిలిటి సంస్థ ఢిల్లీ- ఎన్సీఆర్'లలో డ్రోన్స్ ద్వారా కస్టమర్లకు కావాల్సిన సరుకుల్ని డ్రోన్ పోర్ట్కు చేరవేయనుంది. తొలిఫేజ్ ట్రయల్స్ను పరిశీలించిన తర్వాత ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు సెకండ్ ఫేజ్లో ట్రయల్స్ జరపనున్నాయి. డ్రోన్లతో సరుకుల్ని కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తుందా? డార్క్ స్టోర్ అంటే రీటైల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లేదా అవుట్ లెట్లలో ఉన్న సరుకుల్ని డ్రోన్లే..డ్రోన్లు ఉండే ఏరియా(డ్రోన్ పోర్ట్) కు తీసుకొస్తాయి. డ్రోన్ పోర్ట్ నుంచి స్విగ్గీ డెలివరీ పర్సన్ ప్యాకేజీని పికప్ చేసుకొని కస్టమర్కు డెలివరీ చేస్తారు. కేంద్ర అనుమతుల్లేవు..కానీ ఈ డ్రోన్ డెలివరీకి కేంద్రం అనుమతులు ఇవ్వులేదు. డ్రోన్ డెలివరీ బి హైండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్స్ (బీవీఎల్ఓఎస్) మీద ఆదారపడి పనిచేస్తుంది. ఈ ఆపరేషన్స్ నిర్వహించేందుకు కేంద్రం ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదు. కానీ గతేడాది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియన్స్ శాఖ కేవలం 20సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో స్విగ్గీతో పాటు ఏఎన్ఆర్ఏ అండ్, టెక్ ఈగల్, మరుట్ డ్రోన్ టెక్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయ్! మనదేశంలో డ్రోన్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాయి. ముఖ్యంగా కరోనా కారణంగా హెల్త్ కేర్ రంగంలో డ్రోన్ టెక్నాలజీ అవసరం ఏర్పడించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సమయంలో వ్యాక్సిన్లు, కరోనా బాధితులకు కావాల్సిన మెడిసిన్లు డ్రోన్ల సాయంతో డెలివరీ చేసేందుకు ట్రయల్స్ నిర్వహించాయి. ఇప్పటికే మన దేశానికి గుర్గావ్ కేంద్రంగా లాజిస్టిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఢిల్లీ వేరి సంస్థ డ్రోన్ డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా డ్రోన్లను తయారు చేసే అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ట్రాన్సిషన్ రోబోటిక్స్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంటర్నెట్ దిగ్గజం ఆల్ఫాబెట్ డ్రోన్ డెలివరీ యూనిట్ వింగ్ టెక్సాస్, డల్లాస్ వాల్గ్రీన్స్ నుండి మెడిసిన్లను డ్రోన్ డెలివరీ చేసింది. చదవండి👉స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్..కళ్లు చెదిరేలా జీతాలు! -
డెలివరీ సర్వీస్ టార్గెట్గా ఈ కామ్ ఎక్స్ప్రెస్
ఈ కామ్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్లో తమ టూవీలర్లను పరిచయం చేసింది. ఈ కామర్స్ రంగానికి ఊతం ఇవ్వడంతో పాటు వాయు కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ కామ్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కామర్స్ రంగానికి సంబంధించి గిగా ఎకానమి వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని డెలివరీ సర్వీస్ ఫస్ట్ టార్గెట్గా ఈ కామ్ టూ వీలర్లు తీసుకువచ్చింది. 2025 నాటికి ఈ కామర్స్ డెలివరీ వాహనాల్లో సగం వాటా సాధించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్ ఫెసిలిటీతో సహా ఈవి రోల్-అవుట్ సర్వీస్లను ఈకామ్ ఎక్స్ప్రెస్ అందిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో గణనీయమైన మార్కెట్ను సొంతం చేసుకున్న ఈకామ్ ఎక్స్ప్రెస్.. ప్రస్తుతం అక్కడ 3 వీలర్ మార్కెట్పై ఫోకస్ చేసింది. కంపెనీతదుపరి విస్తరణలో భాగంగా హైదరాబాద్, జైపూర్లో సేవలు ప్రారంభించింది. -
ఫుడ్ డెలివరీ ఏజెంట్గా టీసీఎస్ ఉద్యోగి.. ఆ తర్వాత ఏమైందంటే..?
TCS Techie Turns Zomato, సాక్షి, చెన్నై: అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతున్న క్రమంలో ఓ వారం గ్యాప్ దొరికింది. ఇంతలో ఆ వారం రోజులు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్గా పార్ట్ టైమ్ జాబ్ను ఎంచుకున్నాడు. అప్పుడు మొదలయ్యాయి ఆయన తిప్పులు. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ బాయ్గా చేయడం ఎంత కష్టమో వివరించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. టీసీఎస్ మాజీ ఉద్యోగి, తమిళనాడుకు చెందిన శ్రీనివాసన్ జయరామన్.. జాబ్కు రిజైన్ చేసి మరో కంపెనీలో చేరాడు. కొత్త కంపెనీలో జాయినింగ్ కోసం ఓ వారం గ్యాప్ తీసుకున్నారు. ఆ వారం రోజులు ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక ఫుడ్ డెలివరీ ఏజెంట్గా మారాడు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను స్వయంగా అనుభవించి.. ఇబ్బందుల గురించి లింక్డ్ ఇన్లో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో పెట్రోల్ ధరలు మొదలుకొని స్పీడ్గా ఫుడ్ డెలివరీ చేయడం వరకు సమస్యల జాబితాను తయారు చేసి వివరించాడు. పోస్ట్ ప్రకారం.. డెలివరీ ఏజెంట్లు త్వరగా డెలివరీ ఇవ్వడానికి కాలంతోపాటు పరుగెత్తాలి. చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్లను కరెక్ట్గా చెప్పరు. లొకేషన్ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్ నంబర్లను అప్డేట్ చేయరు. ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్ వివరించాడు. తరచుగా డెలివరీ కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇది చాలా పెద్ద సమస్య. తాను ఓ సారి ఏకంగా 14 కిలో మీటర్లు ప్రయాణించి డెలివరీ ఇవాల్సి వచ్చిందని తెలిపాడు. గూగుల్స్ మ్యాప్స్ సాయంతో కొన్ని సార్లు అడ్రస్లు సరిగా తెలియవు. ఇటీవల కాలంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అది నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని చెప్పాడు. కాగా, ఇటీవలే ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కామెంట్స్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో డెలివరీ విషయంలో ఉద్యోగులపై ఒత్తిడి చేయమని వివరణ ఇచ్చారు. -
హైటెక్ డబ్బావాలా, ఆఫీస్కు శ్రీమతి భోజనం!
ముంబైలో డబ్బావాలాలు చాలా ఫేమస్. ఆఫీసుల్లో పనులు చేసుకునే ఉద్యోగులకు వారి వారి ఇళ్ల నుంచి లంచ్బాక్సులు సేకరించి, వేళకు ఇంటి భోజనాన్ని అందించే డబ్బావాలాల వ్యవస్థ ఇప్పటివరకు మరే నగరంలోనూ లేదు. అయితే, త్వరలోనే హైటెక్ డబ్బావాలాల వ్యవస్థ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తున్న బుల్లి వాహనాలే హైటెక్ డబ్బావాలాలు. డ్రైవర్ అవసరం లేని రోబో వాహనాలు ఇవి. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ హైటెక్ డబ్బావాలాలు ఇళ్ల నుంచి లంచ్బాక్సులు సేకరించి, ఆఫీసుల్లో పనిచేసుకునే ఉద్యోగులకు సురక్షితంగా అందించగలవని వీటి తయారీదారులు చెబుతున్నారు. అమెరికాలోని లీపెక్స్ డిజైన్ సంస్థలో పనిచేసే చైనీస్ డిజైనర్లు సియూన్ కిమ్, యుఫెంగ్ షాంగ్ ఈ హైటెక్ డబ్బావాలాలను రూపొందించారు. -
వాళ్ల సంతోషం కంటే ఏదీ ఎక్కువ కాదన్న ఓలా సీఈవో.. మండిపడుతున్న కస్టమర్లు
OLA CEO Bhavish Aggarwal: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ చేసింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్ సాధించింది. రిలీజ్కు ముందు వచ్చిన హైప్ని సరిగా ఉపయోగించుకోవడంలో ఓలా విఫలమైంది. డెలివరీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో సందర్భం ఏదైనా సరే ఓలా స్కూటర్స్ సీఈవో భవిష్య అగర్వాల్పై కస్టమర్లు విరుచుకు పడుతున్నారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులు పంజాబ్లోని లుథియానాలో నివసిస్తున్నారు. దేశంలో మిగిలిన కస్టమర్లలాగే 2021 ఆగస్టు 15న వారు కూడా ఓలా స్కూటర్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంచు మించు ఆరు నెలల తర్వాత ఆ స్కూటర్ని లుథియానాలో భవీష్ అగర్వాల్ తల్లిదండ్రులకు డెలవరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ఎంతో సంతోషంగా తెలిపారు భవీష్ అగర్వాల్. @OlaElectric @varundubey No updates regarding dispatch by taking amount early and customer support wont reply those people paid after me got delivered.why to show first come first serve when r not following it.and you people only reply for good response who will ans complaints? — ashwin (@ashwinas92) February 25, 2022 భవీష్ అగర్వాల్ ట్వీట్కి నెటిజన్ల నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. ఆరు నెలలుగా ఇంచుమించు లక్షన్న రూపాయలు చెల్లించి స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నామని ఇంత వరకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేట్ అవకుండా ఓలా స్కూటర్ అందుకోవడం కష్టమంటున్నారు. My dad is waiting for his @OlaElectric scooter too. Super frustrated by seeing those copy-paste tweet replies from you people. I was a fool to pay money every time in first place when you people opened the payment windows 3 times. The limit is reached now. @consumerforum_ — अभिषेक राय (@Abhishek_Rai555) February 25, 2022 మేము చెల్లించిన డబ్బలుకు వడ్డీ ఎవరు ఇస్తారు ? ఎన్ని సార్లు అడిగినా కాపీ పేస్ట్ సమాధానాలు తప్పితే మీ నుంచి ఏమీ రావడం లేదు ? ఒక మోడల్ బుక్ చేస్తే మరో మోడల్ డెలివరీ చేశారంటూ ఒకరి తర్వాత ఒకరుగా నెటిజన్లు భవీష్ అగర్వాల్పై మండిపడుతున్నారు. -
రూటు మార్చనున్న ఓలా.. ఏ విషయంలో అంటే ?
అనేక అంచనాల మధ్య గ్రోసరీస్ డెలివరీ బిజినెస్లోకి వచ్చిన ఓలా తన వ్యూహంలో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ విభాగంలో ఉన్న ఇతర కంపెనీల నుంచి వస్తోన్న పోటీని తట్టుకుని సరికొత్త రూపంలో మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సృష్టించిన సంచలనం చల్లారకముందే 2021 నవంబరులో ఓలా స్టోర్స్ పేరుతో మార్కెట్లో సందండి మొదలైంది. న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, పూనే బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో సేవలు ప్రారంభించింది. కేవలం మూడు నెలల వ్యవధిలోనే రోజకు సగటున 6000 ఆర్డర్డు బుక్ అయ్యే స్థితికి చేరుకుంది. అయితే ఈ వేగం సరిపోదని ఓలా భావిస్తోంది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే గ్రోసరీస్ మీ ఇంటికి చేరుస్తామంటూ బ్లింకిట్, జెప్టోలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు త్వరలో టాటా, జియోలు సైతం గ్రోసరీస్ బిజినెస్లోరి రాబోతున్నారు. దీంతో తన మార్కెట్ స్ట్రాటజీలో మార్పులు చేర్పులో చేస్తోంది ఓలా. అందులో భాగంగా ముందుగా బ్రాండ్ నేమ్ చేంజ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఓలా స్టోర్స్ పేరుతో గ్రోసరీస్ డెలివరీ సర్వీస్ అందిస్తోంది. త్వరలో ఈ పేరును ఓలా డ్యాష్గా మార్చాలని నిర్ణయించినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గతంలో సైతం ఓలా సంస్థ వేగంగా తన స్ట్రాటజీల్లో మార్పులు చేర్పులు చేసిన ఉదంతాలు ఉన్నాయి. చదవండి:సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్ కారు..! -
2 గంటల్లో సిలిండర్ డెలివరీ.. నిమిషం ఆలస్యమైనా..
సాక్షి, హైదరాబాద్: వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసి రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. బుకింగ్ చేసిన రెండు గంటల్లో బండ ఇంటికొచ్చేస్తుంది. ‘ఇండేన్ తత్కాల్ సేవ’ పేరిట ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఈ తరహా సేవలను ప్రారంభించింది. దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్గా తొలిసారిగా హైదరాబాద్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నెల రోజుల వ్యవధిలో హెచ్పీ గ్యాస్ కూడా ఈ తరహా సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘ప్రియారిటీ’ సర్వీస్ పేరిట కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ డెలివరీ సేవలను భారత్ గ్యాస్ దశాబ్ధ క్రితం నుంచే అందిస్తుంది. ►సింగిల్ సిలిండర్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు సిలిండర్ బుకింగ్ చేశాక.. డెలివరీ కోసం ఎందుకు ఎదురుచూడాలనే ప్రశ్నకు సమాధానమే ‘తత్కాల్ సేవ’. పాలు, కూరగాయల తరహాలోనే వంట గ్యాస్ కూడా అత్యవసర సర్వీసే. సాధారణంగా గ్యాస్ డెలివరీకి 48–72 గంటల సమయం పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతుంది. గంటల వ్యవధిలోనే సిలిండర్ను డెలివరీ చేయాలన్న లక్ష్యంతో తత్కాల్ సేవను ప్రారంభించినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఏపీ, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో 15.20 లక్షల ఇండేన్ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ఇందులో గ్రేటర్ హైదరాబాద్లో 6.15 లక్షలు సింగిల్ బాటిల్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద తత్కాల్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. బుకింగ్ చేసేది ఇలా.. ►ఐవీఆర్ నంబర్ 77189 55555, సీఎక్స్.ఇండియ న్ ఆయిల్.ఇన్, ఇండియన్ఆయిల్ వన్ యాప్ వీటిల్లో ఏ మాద్యమం ద్వారా అయినా తత్కాల్ సేవను వినియోగించుకోవచ్చు. ►ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 4 గంట ల మ«ధ్య పని దినాల్లో మాత్రమే బుకింగ్ చేయా ల్సి ఉంటుంది. ►సింగిల్ సిలిండర్ గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవచ్చు. తత్కాల్ సేవకు సిలిండర్ ధరతో పాటు అదనంగా రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ►తత్కాల్ సేవలో గ్యాస్ బుకింగ్ కాగానే.. ఐఓసీ డెలివరీ పర్సన్ అప్లికేషన్కు ఆర్డర్ నోటిఫికేషన్ వెళుతుంది. వెంటనే ఆర్డర్ డెలివరీ కోసం ప్రాసెస్ అవుతుంది. ►సిలిండర్ డెలివరీ నిమిషం ఆలస్యమైనా .. గ్యాస్ బండను కస్టమర్కు అందించి.. తత్కాల్ కింద చెల్లించిన రూ.25 చార్జీ కస్టమర్కు తిరిగి ఇస్తారు. నెల రోజుల్లో హెచ్పీ కూడా.. ఇండేన్ తత్కాల్ సేవ ఫీడ్ బ్యాక్ను విశ్లేషించి.. ఇంకా మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్పీ గ్యాస్ సన్నాహాలు ప్రారంభించింది. కస్టమర్ సౌకర్యార్థం, అదరపు చార్జీల వసూలు చేసి గంటల వ్యవధిలోనే సిలిండర్ను డెలివరీ చేస్తామని హెచ్పీ గ్యాస్ హైదరాబాద్ హెడ్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో హైదరాబాద్తో పాటూ మరో నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తెలంగాణ లో 35 లక్షల హెచ్పీ కనెక్షన్లు ఉండగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 15 లక్షల కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ ఎల్పీజీ మార్కెట్లో హెచ్పీ కంటే ఐఓసీఎల్ వాటా 5 శాతం ఎక్కువగా ఉంటుంది. భారత్ గ్యాస్ ‘ప్రియారిటీ’ సేవలు.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు చెందిన ఎల్పీజీ విభాగం భారత్ గ్యాస్... 15 ఏళ్ల క్రితమే ప్రియారిటీ సర్వీసెస్ను ప్రారంభించింది. భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాలు ప్రియారిటీ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 6 తర్వాత కస్టమర్ కోరిన సమయంలో గ్యాస్ సిలిండర్ను డెలివరీ సమయాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందన్నమాట. ప్రియారిటీ సర్వీసెస్కు సిలిండర్ మీద రూ.15–25 చార్జీ ఉంటుందని భారత్ గ్యాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తెలంగాణలో 28 లక్షల భారత్ గ్యాస్ కనెక్షన్లుండగా.. వీటిల్లో 14.4 లక్షల కనెక్షన్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నట్లు ఆయన వివరించారు. -
స్విగ్గీ డెలివరీలు సరికొత్తగా..! ప్రణాళికలు సిద్ధం..!
డెలివరీ విషయంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ సరికొత్త ప్రణాళికలకు సిద్దమైన్నట్లు కన్పిస్తోంది. సంప్రాదాయ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకు పావులు కదుపుతోంది స్విగ్గీ. టీవీఎస్ మోటార్స్తో ఒప్పందం..! డెలివరీ సేవల్లో ఎలక్ట్రిక్ వాహనాలను వాడేందుకుగాను స్విగ్గీ ప్రముఖ దేశీయ టూవీలర్ దిగ్గజం టీవీఎస్ మోటార్స్తో జతకట్టింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను ఫుడ్ డెలివరీలతో పాటు ఆన్-డిమాండ్ సేవలు, ఇతర కార్యక్రమాల కోసం వినియోగించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రతిరోజు 8 లక్షల కిలోమీటర్లు ఎలక్ట్రిక్ వాహనాలు తిరిగేలా ప్రణాళికలను స్విగ్గీ ప్రకటించింది. వీలైనంతా త్వరగా ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ సేవలను అందిస్తామని స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్ మిహిర్ రాజేష్ షా వెల్లడించారు. వివిధ మొబిలిటీ విభాగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని టీవీఎస్ మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తమ వినియోగదారులకు అవసరమైన స్థాయిలో వాహనాలను అందించడంలో ముందుంది. ఈ ఒప్పందం దేశీయ వాహన మార్కెట్లో ఈవీలకు మరింత ఆదరణను పెంచుతుందని ఆశిస్తున్నట్లు టీవీఎస్ మోటార్స్ కంపెనీ ఫ్యూచర్ మొబిలిటీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ మను సక్సెనా చెప్పారు. స్విగ్గీ-టీవీఎస్ మోటార్స్ ఒప్పందంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోగా ప్రధాన నగరాల్లో స్విగ్గీ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, పూణె, కొచ్చి, కోయంబత్తూరుతో సహా 33 నగరాల్లో అందుబాటులో ఉంది. చదవండి: బిగ్ బాస్కెట్, జియో మార్ట్లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..! -
ఎలన్ మస్క్ మరో రికార్డ్, కారు ఏదైనా..టెస్లాకు దాసోహం అవ్వాల్సిందే
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని ఆటోమొబైల్ ఇండస్ట్రీని చిప్ కొరత వేధిస్తున్నా..ఎలన్ మస్క్ మాత్రం టెస్లాకార్ల అమ్మకాల జోరును పెంచుతున్నారు. బ్లూమ్బెర్గ్ 4వ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. క్యూ4 (అక్టోబర్,నవంబర్,డిసెంబర్)లో వరల్డ్ వైడ్గా 308,600 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో టెస్లా వన్ ట్రిలియన్ మార్కెట్ వ్యాల్యూ కంపెనీల జాబితాలో చేరింది ఊహించిన దానికంటే ఎక్కువే 2021లో టెస్లా సంస్థ ఊహించిన దానికంటే ఎక్కువగానే అమ్ముడైనట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్లో 2021లో సంవత్సరం 87శాతం వృద్దితో మొత్తం టెస్లా 936,000 కార్ల అమ్మకాలు జరిపింది. బ్లూమ్బెర్గ్ సర్వే చేసిన 13 మంది అనలిస్ట్లు క్యూ4 లో టెస్లా సంస్థ సగటున 263,000 వాహనాలను డెలివరీ చేసినట్లు అంచనా వేశారు. చెప్పిందే చేస్తున్నారు. టెస్లా అధినేత ఎలన్ మస్క్ మల్టీ ఇయర్ పిరియడ్ (రెండు లేదా మూడు సంవత్సరాలు)మొత్తం కాలంలో కార్ల డెలివరీ 50 శాతం వార్షిక పెరుగుదలను ఆశిస్తున్నట్లు తెలిపారు. వరల్డ్ వైడ్గా సెమీకండక్టర్ తిరోగమనం మధ్య వరుసగా ఏడవ త్రైమాసికంలో టెస్లాకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ఎలన్ మస్క్ ప్రతి త్రైమాసికంలో టెస్లా కార్ల డెలివరీలను పెంచుతూనే ఉన్నప్పటికీ, 2021లో సప్లయ్ చైన్ అంశాన్ని ఓ పీడకలగా అభివర్ణించారు. ఇక ఇతర ప్రయోజనాల కోసం చిప్లను ఉపయోగించేలా సాఫ్ట్వేర్లను తయారు చేయడంలో టెస్లా ఇంజినీర్లు ప్రయత్నాలు చేయడంతో ఇతర వాహన తయారీదారుల కంటే టెస్లా కంపెనీ మెరుగైన ఫలితాల్ని రాబడుతోంది. టెస్లాకు తిరుగులేదని టెస్లా కార్లలో ఆటో పైలెట్ ఫీచర్పై వివాదాలు, రియర్ వ్యూ కెమెరా, ట్రంక్లో సాంకేతిక లోపాలు, టెస్లా కారు రిపేర్కి లక్షల ఖర్చు అవుతుందని ఆ కారు ఆనవాళ్లు లేకుండా 30 కేజీల డైనమెట్తో బ్లాస్ట్ చేశారని వార్తలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పతాక స్థాయిలో టెస్లా వైఫల్యం గురించి కథనాల్ని ప్రచురించినా ఆ కార్ల హవా తగ్గడం లేదు సరికాదా రోజు రోజుకీ ఆ కార్ల అమ్మకాలు పెరగడంతో ఎలక్ట్రిక్ కార్లలో టెస్లాకు తిరుగులేదని ఎలన్ మస్క్ మరోసారి నిరూపించినట్లైంది. చదవండి: పాపం ఎలన్ మస్క్..! తినడానికి తిండి లేక, కడుపు నింపుకునేందుకు ఏం చేసేవాడో తెలుసా? -
బాత్రూంలో ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బాలింత బాత్రూంలో ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమా(30) ఈ నెల 12న మగ శిశువు కు జన్మనిచ్చింది. మొదటి కాన్పు కావటంతో కుటుంబసభ్యులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సిజరియన్ చేసిన తర్వాత ఐసియుసిలో ఉంచారు. వాస్తవానికి ఏడు రోజులకు డిశ్చార్జ్ చేయవలసి ఉండగా సర్జరీ వల్ల కుట్లు మానకపోవటంతో వైద్యులు మరోసారి కుట్లు వేస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో మరోసారి సర్జరీ, కుట్లు అతుక్కోపోవడంతో మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
హైదరాబాద్ కంటే ముందే విశాఖకి వస్తున్న ఓలా !
కాలుష్యం తగ్గించడంతో పాటు పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనంగా ఎలక్ట్రిక్ వాహనాలను భావిస్తున్నారు. ఈ తరుణంలో సంచలన రీతిలో మార్కెట్లో అడుగు పెట్టింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఆగష్టు 15న ఈ స్కూటర్లకు ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరులో ఈ బైకుల డెలివరీ చేయాల్సి ఉంది. అప్పుడు వాయిదా అయితే అనివార్య కారణాల వల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మార్కెట్లో హైప్ తగ్గకుండా చూసుకునేందుకు నవంబరులో టెస్ట్ డ్రైవ్ పేరిట దేశమంతగా ఓలా స్కూటర్లను తిప్పారు. కాగా డిసెంబరు ద్వితీయార్థంలో ఓలా స్కూటర్ల డెలివరీ ప్రారంభమైంది. ముందుగా బెంగళూరు, చెన్నైలలో వీటి డెలివరీ చేశారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో డెలివరీ ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రెండో విడతలో ఓలా స్కూటర్ల డెలివరీపై ఉన్న సందేహాలకు సమాధానంగా ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. బెంగళూరు, చెన్నై తర్వాత ఎక్కడ డెలివరీ చేయబోయే నగరాల వివరాలను వెల్లడించారు. భవీశ్ అగర్వాల్ చెప్పిన వివరాల ప్రకారం రెండో విడత డెలివరీలో వైజాగ్, పూనే, అహ్మదాబాద్, ముంబైతో పాటు మరికొన్ని సిటీలు ఉన్నాయి. అయితే ఇందులో హైదరాబాద్లో డెలివరీ ఉందా? లేదా అనే అంశంపై స్పస్టత కరువైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓలా స్కూటర్లు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా వైజాగ్ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి, Addressing the most popular question - yes, deliveries are on! Wonderful to see happy customers with their Ola scooters. Bangalore, Chennai last week. Vizag, Pune, Ahmedabad, Mumbai & many more cities this week & next! Scooters are en-route! Thanks for your patience & ❤️ pic.twitter.com/JLyX0y6nDB — Bhavish Aggarwal (@bhash) December 23, 2021 చదవండి: గుడ్న్యూస్.. నెక్సాన్ రేంజ్ పెరిగింది! మార్కెట్లోకి ఎప్పుడంటే? -
స్మార్ట్వాచ్ బదులు రాయి.. నటుడికి చేదు అనుభవం
ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో.. బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్వాచ్ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు. అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది. ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్తో పాటు, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది. చదవండి: వావ్.. క్లోజప్ షాట్లో సూర్యుడు -
ఆటోపైలట్ మోడ్లో ఉండగా... టెస్లా కారులో పుట్టిన తొలి పాపగా రికార్డు!!
న్యూఢిల్లీ: ఒక్కొసారి చాలా అరుదైన ఘటనలు జరుగుతుంటాయి. ఇంతవరకు బాత్రుంలో మహిళ ప్రసవించడం (లేదా) విమానంలో ఒక మహిళకు నొప్పులు తీవ్రమైతే వెంటనే సమీపంలోని విమానాశ్రయంలో ఆపడం తదితర ఘటనలు గురించి విన్నాం. అయితే అచ్చం అలానే యూఎస్ మహిళ కారులో ప్రయాణిస్తున్నప్పుడూ నొప్పులు మొదలవుతాయి. అయితే అత్యధునిక టెక్నాలజీ కలిగిన టెస్లా కారు సాయంతో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. (చదవండి: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది') అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలోని యిరాన్ షెర్రీ (33) నిండు గర్భిణీ. ఒక రోజు ఆమె తన భర్త కీటింగ్ షెర్రీ (34) తో కలిసి తమ మూడేళ్లు కొడుకును ఫ్రీ స్కూలుకి తీసుకువెళ్లే నిమిత్తం టెస్లా కారులో పయనమయ్యారు. అయితే యిరాన్ షెర్రీ (33)కి అనుకోకుండా నొప్పులు రాగా, దీంతో ఆ దంపతులు వెంటనే సమీపంలో ఆసుపత్రికి వెళ్లడానికి ప్రయత్నించగా, విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఆస్పత్రికి చేరుకోవడం కష్టమైంది. దీంతో ఆమె భర్త కీటింగ్ షెర్రీ కారుని ఆటో పైలెట్ మోడ్లో పెట్టి(అంటే కారుదానంతట అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లుతుంది) ఆస్పత్రికి తీసుకువెళ్లమని ఆర్డర్ చేస్తాడు. అంతే కారు జీపీఎస్ నేవిగేషన సిస్టమ్ ఆసుపత్రికి వెళ్లడానికి ఇంకా 20 నిమిషాలు పడుతుందని చెబుతుంది. దీంతో అతను ఒక చేయిని స్టీరింగ్ పై వేసి మరో చేత్తో భార్యను ఓదారుస్తాడు. మరోవైపు ట్రాఫిక్ కారణంగా కారు వేగంగా వెళ్లే అవకాశం లేదు. ఆ పరిస్థితుల్లో ఆమె కారు ఫ్రంట్ సీట్లో బిడ్డకు జన్మనిచ్చింది. అలా టెస్లా కారు ఆటో పైలట్ మోడ్లో ఉండగా పుట్టిన తొలి పాపగా ఆ బిడ్డ రికార్డ్ సృష్టించింది. దీన్ని అధికారికంగా గుర్తించారు. అయితే కారు ఆస్పత్రికి చేరేటప్పటికే బిడ్డ పుట్టేసింది. అంతేకాదు కారులోనే బిడ్డ నుంచి తల్లి పేగును కట్ చేశారు డాక్టర్లు. ఈ మేరకు తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అంతేకాదు ఆ దంపతులు కూడా ఆ పాపకు టెస్లా అని పేరు పెట్లాలని భావించారు కాని నిర్ణయం మార్చుకొని మాయెవ్ లిలీ అని పెట్టారు. ఈ అత్యధునిక టెక్నాలజీ కారణంగానే తన భార్యకు సురక్షితంగా ప్రసవం అయ్యిందని ఆటోపైలట్ మోడ్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసి ఇచ్చినందుకు టెస్లా కార్ల ఇంజినీర్లకు సదరు మహిళ భర్త కీటింగ్ షెర్రీ ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: రాయ్ తుపాను ధాటికి 208 మంది మృతి) -
టిక్టాక్ సంచలన నిర్ణయం..! వైరల్ వీడియోస్ నేరుగా యూజర్ల వద్దకు..!
ప్రముఖ షార్ట్ వీడియో ప్లాట్ఫాం టిక్టాక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవలను అమెరికాలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టిక్టాక్లో వైరలైన ఫుడ్ వీడియోస్లోని ఆహారాన్ని యూజర్లకు డెలివరీ చేసే అవకాశాలపై ప్రణాళికలు రచిస్తోన్నట్లు 9To5Mac నివేదించింది. ఫుడ్ డెలివరీ సేవతో వైరల్ ఫుడ్ వీడియోలను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫుడ్ను టిక్టాక్ కిచెన్ పేరిట అమెరికాలోని ఆయా ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేయనుంది. వర్చువల్ డైనింగ్ కాన్సెప్ట్లతో భాగస్వామ్యమై టిక్టాక్ కిచెన్ సేవలను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. 2022లో ప్రారంభం..! టిక్టాక్ కిచెన్ సేవలను అమెరికాలో 2022లో ప్రారంభించనుంది. అమెరికాలోని దాదాపు 300 ప్రాంతాల్లో ఈ సేవలు ప్రారంభంకానున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 1,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో సేవలందించేందుకు కంపెనీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వైరల్ ఫుడ్ వీడియోస్ మెనూగా..! టిక్టాక్లో వైరలైన ఫుడ్ వీడియోస్ మెనును కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. ఇప్పటివరకు టిక్టాక్లో వైరల్ అయిన బేక్డ్ ఫెటా పాస్తా, స్మాష్ బర్గర్, కార్న్ రిబ్స్ , పాస్తా చిప్స్ వంటి వంటకాలను కస్టమర్లు ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని కంపెనీ కల్పించనుంది. కాగా ఒక నివేదిక ప్రకారం ఈ డిషెస్ టిక్టాక్ కిచెన్ మెనూలో శాశ్వతంగా ఉంటాయా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. వైరలైన ఫుడ్ డిషెస్కు ఆయా క్రియేటర్లకు క్రెడిట్ను టిక్టాక్ అందజేయనుంది. చదవండి: రూ.10 వేల కంటే తక్కువ ధర..! హాట్కేకుల్లా అమ్ముడైన 30 లక్షల స్మార్ట్ఫోన్స్ ..! -
అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శ
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. డెలివరీ ఎంప్లాయిస్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న తీరు తాజాగా వెలుగు చూసింది. తుపానుల సమయంలోనూ డెలివరీలు చేయాలంటూ డెలివరీ పార్ట్నర్ను బెదిరించిన వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఇల్లినాయిస్లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. భీకరమైన తుపాను నేపథ్యంలో హెచ్చరికలు జారీకాగా, అది కేవలం హెచ్చరికే కదా అంటూ డెలివరీ పార్ట్నర్కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు అమెజాన్ ఎగ్జిక్యూటివ్స్. డెలివరీ కోసం వెళ్లాల్సిన ఓ యువతికి ఈ అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. తుపాను లేదు గిఫాను లేదు. అది కేవలం హెచ్చరిక మాత్రమే. ఆర్డర్లు డెలివరీ చేయకుండా వెనుదిరిగితే ఉద్యోగం ఊడుతుందని ఆ డెలివరీ గర్ల్ను అమెజాన్ ప్రతినిధులు బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ ఛాటింగ్కు సంబంధించి స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అమెజాన్పై పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతేకాదు అమెజాన్లో డెలివరీ ఎంప్లాయిస్ల పట్ల మేనేజ్మెంట్ తీరు ఇలాగే ఉంటుందని, ప్రతికూల వాతావరణంలో తమ కోసం ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరంటూ పలువురు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. చదవండి: అమెజాన్కు భారత్లో షాక్.. 200 కోట్ల జరిమానా -
ఎట్టకేలకు డెలివరీకి సిద్ధమైన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
ఓలా ఎలక్ట్రిక్ కొన్నవారికి శుభవార్త. ఎట్టకేలకు రేపటి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేయనున్నట్లు కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ తెలిపారు. ఇంతకు ముందు తెలిపినట్లుగా తమిళనాడుకు చెందిన ఈవీ స్టార్టప్ డిసెంబర్ 15 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభిస్తుంది. డెలివరీ ప్రక్రియకు ముందు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను 30,000 మందికి పైగా టెస్ట్ రైడ్ చేసినట్లు తెలిపింది. త్వరలో ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల టెస్ట్ రైడ్స్ మరిన్ని నగరాలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రక్రియ గురుంచి ట్విటర్ వేదికగా భవిష్ అగర్వాల్ ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో "తమిళనాడు కేంద్రంగా ఉన్న తన ఫ్యూచర్ ఫ్యాక్టరీలో డెలివరీ కోసం తొలి బ్యాచ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సిద్ధం చేయడంలో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది". అక్టోబర్ 25 - నవంబర్ 25 మధ్య మొదటి బ్యాచ్ స్కూటర్లు డెలివరీలు చేయలని సంస్థ భావించింది. అయితే, సెమీకండక్టర్ చిప్ కొరత వల్ల తేదీని వెనక్కి నెట్టాల్సి వచ్చింది. ఓలా వచ్చే సంవత్సరం 2022 తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉందని సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. ఈ ఇష్యూ ద్వారా 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం స్టాక్మార్కెట్ ఒడుదొడుకుల మధ్య కదలాడుతుండటం, ఇటీవల కొన్ని కంపెనీల షేర్లు పేలవంగా నమోదైన నేపథ్యంలో ఆయన ఇలా పేర్కొనడం గమనార్హం. Gaddi nikal chuki! 🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵🛵 pic.twitter.com/ZjttmnqBZo — Bhavish Aggarwal (@bhash) December 13, 2021 (చదవండి: ఎల్ఐసీ ఉద్యోగులకు, పెన్షన్ పాలసీదారులకు గుడ్న్యూస్..!) -
మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి
సాక్షి, చెన్నై: రాత్రి వేళ పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు ప్రసవం చేశారు.. తల్లీ బిడ్డా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ విషాదకర ఘటన పెరంబలూరు జిల్లాలో జరిగింది. వెప్పంతడై తాలూకా అంకూర్ గ్రామానికి చెందిన దిలీప్కుమార్ భార్య సెల్వరాణి (36) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సెల్వరాణి మూడో గర్భం దాల్చింది. ఈ నెల 4వ తేదీ రాత్రి నొప్పులు రావడంతో ఇరుగుపొరుగు మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆడబిడ్డ పుట్టింది. కొద్ది సమయానికి ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో బంధువులు 108లో పెరంబలూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మంగళమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: దొంగ అనుకుని చావబాదారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి -
బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!
న్యూజిలాండ్లోని గ్రీన్కు చెందిన పార్లమెంటు సభ్యురాలు (ఎంపీ) తన బిడ్డ పుట్టడం కోసం సైకిల్పై ఆసుపత్రికి వెళ్లి నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ మేరకు ఎంపీ జూలీ అన్నే జెంటర్ గతంలో తన మొదటి బిడ్డ, కొడుకు పుట్టిన సమయంలో కూడా ఇలాగే చేయడం గమనార్హం. ఈ మేరకు ఆమె కడుపుతో ఉండి సైక్లింగ్ చేసిన విధానాని వివరిస్తూ ఫోటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) ఈ మేరకు జెంటర్కి సైకిల్ తొక్కాలని ముందుగా ఎటువంటి ప్లాన్ చేయలేదు. అయితే జెంటర్కి తెల్లవారుఝామున 2 గంటలకు నొప్పులు రావడంతో ఆస్పత్రికి వెళ్లాలని నిర్ణయించుకుంది. పైగా ఆ నొప్పులు అంత ఎక్కువగా ఏమి రావడం లేదుకదా అని సైక్లింగ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాలనుకుంది. ఆ తర్వాత ఆమెకు ఉదయ 3 గంటల సమయంలో సుఖ ప్రసవం అయ్యి ఆరోగ్యవంతమైన మగపిల్లాడు పుట్టాడు. అంతేకాదు జెంటర్ తాను సైక్లింగ్ చేయడం వల్ల ఎక్కువ సేపు నొప్పుల పడాల్సిన అవసరం లేకుండానే చాలా తొందరగా ప్రసవం అయిపోయిందంటూ క్యాప్షన్ పెట్లి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసించడమేకాక సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల డెలివరీ సమయంలో మంచి ప్రయోజనం ఉంటుందంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!) -
ఆయుర్వేద మెడిసిన్ పేరిట అమెజాన్ ద్వారా భారీగా గంజాయి రవాణా
సాక్షి, విశాఖపట్నం: అమెజాన్ ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను విశాఖ ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేశారు. డయాబెటీస్ వ్యాధి నివారణకు తయారయ్యే ఆయుర్వేద మెడిసిన్లో వాడే ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్’ పేరిట రవాణా చేస్తున్న ఐదుగురు ముఠాను అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జేడీ సతీష్కుమార్ వెల్లడించారు. చదవండి: రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకి వెల్లడించారు. గత ఏడు లేదా ఎనిమిది నెలల నుంచి అమెజాన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని సుమారుగా 900 కేజీల గంజాయి రవాణా చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి విశాఖకు చెందిన ఐదుగురు వ్యక్తులను విశాఖ ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించామని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు అమెజాన్ ఆన్లైన్ యాప్ ద్వారా గంజాయి రవాణా జరుగుతుందని మధ్యప్రదేశ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 21వ తేదీన కంచరపాలెంకు చెందిన చిలకపాటి శ్రీనివాసరావు ఇంటిలో తనిఖీలు నిర్వహించామని సతీష్కుమార్ తెలిపారు. ఇంటిలో 48 కేజీల డ్రై గంజాయితో పాటు ఓ ఎలక్ట్రానిక్ వెయిట్మిషన్, గంజాయి ప్యాకెట్లకు ఉపయోగించే రెండు కార్డ్ బోర్డు బాక్స్లు, అమెజాన్ బ్లాక్ అండ్ గ్రే కలర్ పాలిథీన్ బ్యాగ్స్, అమెజాన్ టేప్స్ దొరికాయని చెప్పారు. శ్రీనివాసరావుని అరెస్టు చేసి విచారించగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురజ్ పావయ్య, ముకుల్ జైశ్వాల్ ఇద్దరూ ‘సూపర్ నేచురల్ స్టేవియా లీవ్స్’ పేరిట అమెజాన్ యాప్లో బుక్ చేసినట్లు చెప్పాడని తెలిపారు. చిలకపాటి శ్రీనివాసరావు కుమారుడు చిలకపాటి మోహన్రాజు, అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, డ్రైవర్ వెంకటేశ్వర్లును అరెస్టు చేశామని సతీష్కుమార్ వివరించారు. -
ఓలాకు తప్పని పాట్లు..! వారికి మాత్రం తీవ్ర నిరాశే..!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల లాంచ్తో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చిప్ కొరత పలు ఆటోమొబైల్ కంపెనీలను తీవ్రంగా వేధిస్తూనే ఉంది. చిప్ కొరతతో సతమతమవుతున్న కంపెనీల్లో ఓలా ఎలక్ట్రిక్ కూడా చేరింది. దీంతో ఓలా ఎలక్ట్రిక్ బైక్ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. డెలివరీ వాయిదా పడటంతో కొనుగోలుదారులకు మరోసారి నిరాశే ఎదురుకానుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! డెలివరీ ఎప్పుడంటే..! ఓలా ఎలక్ట్రిక్ బైక్ల తొలి బ్యాచ్ డెలివరీ నవంబర్ 30న జరగాల్సి ఉండగా...అది కాస్త డిసెంబర్ 15కు వాయిదా పడింది. చిప్సెట్స్, ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా బైక్ల డెలివరీ మరోసారి వాయిదా పడింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్లను ప్రిబుక్ చేసుకొని పూర్తి అమౌంట్ను చెల్లించిన కొనుగోలుదారులకు డిసెంబర్ 31న డెలివరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షమాపణలు కోరిన ఓలా..! ఓలా ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ బృందం , గ్లోబల్ సప్లై చైన్ల మధ్య శనివారం జరిగిన సమావేశంలో చిప్స్ , ఎలక్ట్రానిక్ విడిభాగాల డెలివరీ మరింత అధ్వాన్నంగా ఉండడంతో తొలి బ్యాచ్ స్కూటర్ల డెలివరీని వాయిదా వేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. డెలివరీ మరోసారి వాయిదా పడటంతో కొనుగోలుదారులకు కంపెనీ క్షమాపణలను చెప్పింది. ఓలా ఎలక్ట్రిక్ బైక్ల 4జీ కనెక్టివిటీలో భాగంగా కంపెనీ క్వాలకమ్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా? -
108 సిబ్బందికి కమిషనర్ అభినందన
సాక్షి, అమరావతి: అంబులెన్స్ (108)లో గర్భిణికి ప్రసవం చేసిన ఏఎన్ఎం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ)లను వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 3వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం రెంటికోట పీహెచ్సీ పరిధిలో పురిటి నొప్పులతో బాధపడుతున్న సవర మహేశ్వరిని ఆస్పత్రికి తీసుకెళ్లే సమయం లేకపోవడంతో ఏఎన్ఎం రాజేశ్వరి, ఈఎంటీ సత్యం 108లోనే కాన్పు చేశారు. కమిషనర్ మంగళవారం వీరిని అభినందించడంతోపాటు ఒక్కొక్కరికి రూ.5 వేల నగదు బహుమతి ప్రకటించారు. -
డెలివరీ వ్యాన్లో అమ్మాయి.. ఎలా వెళ్లిందని నెటిజన్ల కామెంట్లు
కొంతమంది వాహనదారులకు తెలియకుండా వెనక నుంచి వాహనంలోకి ఎక్కి ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా గూడ్స్ డెలివరీ చేసే వాహనాల్లో అయితే ఇటువంటి ఘటనలు ఆధికంగా జరగుతుంటాయి. తాజాగా అటువంటి ఓ ఘటన అమెజాన్ డెలివరీ వాహన డ్రైవర్కు ఎదురైంది. ఓ అమ్మాయి అమెజాన్ డెలివరీ వాహనం డ్రైవర్కు తెలియకుండా ఆ వాహనంలోకి ఓ మహిళ ఎక్కి కూర్చుకుంది. ఈ ఘటన అమెజాన్ డెలివరీ ఫ్లొరిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... ఫ్లొరిడాలోని ఓ రోడ్డుపై ఉన్న అమెజాన్ డెలివరీ వాహనం నుంచి ఓ మహిళ కిందకు దిగి నడుచుకుంటూ వెళ్లుతుంది. అయితే వాహనదారుడికి తెలియకుండా అందులోకి ఎక్కడంతో విషయం తెలుసుకున్న వాహనదారుడు ఆమెను కిందకు దించివేశాడు. అయితే ఈ వీడియోను ట్విటర్లో ఓ నెటిజన్ షేర్ చేశాడు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు ఫన్నీగా జోకులు పేల్చుతున్నారు. ‘అందుకే నా డెలివరీ ప్యాకేజీలు అలస్యం అవుతన్నాయా?’.. ‘ఆమె ప్రైమ్ ప్లస్ మెంబర్షిప్ తీసుకున్నట్లు ఉంది’.. ‘అసలు ఆ అమ్మాయి వ్యాన్లోకి ఎలా వెళ్లింది?’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ.. తాము ఉత్పత్తులను డెలివరీ చేసే సయమంలో జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేవలం కంపెనీ గుర్తింపు ఉన్నవాళ్లు డ్రైవర్లు మాత్రమే.. డెలివరీ వాహనాలను నడుపుతారని అన్నారు. Amazon delivery drivers are different! 😅😂 (via @patrickhook01/TT) pic.twitter.com/sS0kzEw0Ij — i SEENT it (@iseentit_online) October 25, 2021 -
మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లోనే డెలివరీ..
కొచ్చి: కేరళలోని మలప్పురంలో ఓ మైనర్ బాలిక తను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. అయితే ఆ విషయం ఇంట్లో తల్లికి కూడా తెలియకుండా జాగ్రత్తపడింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్లో వీడియోలు చూసి ఆ బాలికే స్వయంగా చేసుకుంది. బాలిక తల్లి పాక్షికంగా అంధురాలు కావడంతో డెలివరీ రోజు ఇంట్లో పసికందు ఏడుపు వినిపించేంతవరకు ఈ విషయాన్ని గ్రహించలేకపోయింది. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పాక్షికంగా అంధురాలైన ఓ మహిళ తన 17 ఏళ్ల కూతురితో కలిసి కొట్టకల్లో నివసిస్తోంది. బాలిక తన ఇంటి సమీపంలోని ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం వారివురి కుటుంబాలకు తెలిసింది. దీంతో బాలిక మైనర్ కావడంతో తనకి 18 ఏళ్లు నిండిన తర్వాత వారిద్దరికి పెళ్లి చేయాలని వారి కుటుంబీకులు నిర్ణయించుకున్నారు. అయితే, ఈ మధ్యలోనే బాలిక తన ప్రియుడితో శారీరకంగా కలవడంతో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా ఆన్లైన్ తరగతుల పేరుతో ఎక్కువగా తన గదిలోనే ఉంటున్నట్లు తన తల్లిని నమ్మించింది. చివరకు డెలవరీ కూడా యూట్యూబ్ వీడియోలు తన ఇంట్లోనే చేసుకుంది. ఇంట్లో పసికందు ఏడుపు వినపడడంతో బాలిక తల్లికి ఈ విషయం తెలిసింది. డెలివరీ చేస్తుండగా ప్రక్రియలో తనకు ఇన్ఫెక్షన్ సోకడంతో బాలికతో పాటు బిడ్డని మంజేరిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. దీనంతటికి కారకుడైన 21 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడితో రిలేషన్షిప్లో ఉన్నందున అతనిపై బాలిక వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Miss Telangana 2018: లైవ్ వీడియోతో ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ మిస్ తెలంగాణ -
తెలంగాణలో అరుదైన సంఘటన: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
హైదరాబాద్: హైదరబాద్ నగరంలో.. మెహదీపట్నంలో గల మీనా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన సంఘటన జరిగింది. 27 ఏళ్ల ఒక మహిళ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, వారిలో ముగ్గురు ఆడపిల్లలుకాగా, ఒక మగ పిల్లవాడు జన్మించాడు. ప్రస్తుతం తల్లి, నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నారని.. ఆసుపత్రి గైనకాలజిస్ట్ సోహేబా షుకో తెలిపారు. Telangana | A 27-year-old woman gives birth to quadruplets in Hyderabad The women gave birth to a baby boy and three baby girls. All the babies and the mother are healthy: Dr. Soheba Shukoo, Obstetrician and gynaecologist, Mina Multispeciality Hospital pic.twitter.com/nI5xvGLV2l — ANI (@ANI) October 27, 2021 చదవండి: బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్సైడే: ఎమ్మెల్యే రోజా -
AP: హైరిస్క్ ప్రెగ్నెన్సీలు.. ఉండవిక
సాక్షి, అమరావతి: మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పండంటి బిడ్డతో ఇంటికి తిరిగి వచ్చేవరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారం, మంచి వైద్యం ఇందులో ప్రధానమైనవి. పౌష్టికాహార లోపం వల్ల రక్తహీనత, ఇతర సమస్యలు వస్తాయి. అటువంటి సమయాల్లో తల్లీ, బిడ్డకు ప్రమాదమేర్పడుతుంది. ఇటువంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి, గర్భిణికి మంచి వైద్యం అందించడానికి ప్రభత్వం పలు చర్యలు చేపట్టింది. అందులోనూ ప్రసవ సమయంలో తల్లుల మరణాలకు ప్రధాన కారణమైన హైరిస్క్ (ప్రసవ సమయంలో ఎక్కువ సమస్యలు) ప్రెగ్నెన్సీలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా 9వ తేదీన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు చేస్తున్నారు. గర్భం దాల్చిన మూడు నెలల లోపు ఒకసారి, ఆరు నెలల లోపు మరోసారి వారికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేసి, బిడ్డ ఎదుగుదల, తల్లి ఆరోగ్యాన్ని తెలుసుకుని, దానికి అనుగుణంగా వైద్యం అందిస్తున్నారు. 7వ నెల దాటాక కూడా హైరిస్క్ ప్రెగ్నెన్సీ అని తేలిన వారికి ఎంసీపీ (మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్) కార్డులో రెడ్ స్టిక్కర్ వేస్తారు. వీరు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లగానే అక్కడి వైద్యులు, సిబ్బంది తక్షణమే స్పందించాలి. ప్రత్యేక వైద్యం అందించాలి. ఇలాంటి గర్భిణుల కోసం ఒక ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్ను కేటాయిస్తారు. గర్భిణులకు ప్రసవం అయ్యేవరకూ వెంట ఉండి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించడం వీరి బాధ్యత. ప్రధానమంత్రి మాతృత్వ స్వాస్థ్య అభియాన్ కార్యక్రమం కింద ఏపీలో విజయవంతంగా ఈ సేవలు అందిస్తున్నారు. 13.47 శాతం హైరిస్క్ ప్రెగ్నెన్సీలు రాష్ట్రంలో గత ఆరు నెలల్లో 3,56,979 మంది గర్భిణులను గుర్తించగా, వారిలో 57,124 మంది హైరిస్క్ గర్భిణులే. అంటే 13.47 శాతం. పాశ్చాత్య దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. గతంలో 19 శాతంపైనే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత ఆరు నెలల్లో టీనేజీ ప్రెగ్నెన్సీ (18 ఏళ్ల నిండకుండా గర్భం దాల్చిన వారు) 2,222 మంది ఉన్నారు. ఎక్కువగా విశాఖ జిల్లాలో 333 టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. రక్తహీనతే ప్రధాన కారణం హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు పలు కారణాలు ఉంటాయి. రక్తహీనత, 35 ఏళ్ల తర్వాత (ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ) గర్భం దాల్చడం, పద్దెనిమిదేళ్ల కంటే ముందే గర్భం దాల్చడం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ తదితర కారణాలతో కాన్పు కష్టమవుతుంది. వీటిలో రక్తహీనత ప్రధాన కారణంగా గుర్తించారు. గర్భిణు ల్లోని రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12 గ్రాములు (డెసిలీటర్కు) ఉండాలి. అయితే, హైరిస్క్ గర్భిణుల్లో 11,437 మందికి హిమోగ్లోబిన్ 7 గ్రాములు, అంతకంటే తక్కువగా ఉన్నట్టు తేలింది. రక్తహీనతే మాతృ మరణాలకు అతిపెద్ద సమస్య. దీనికోసం ఐరన్ ఫోలిక్ మాత్రలు ఇవ్వడం, క్రమం తప్పకుండా యాంటినేటల్ చెకప్(గర్భస్థ పరీక్షలు) చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైరిస్క్ ఉంటే పీహెచ్సీ కాకుండా పెద్దాసుపత్రికి హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటే వారిని పీహెచ్సీలో కాకుండా సీహెచ్సీ, జిల్లా, ఏరియా ఆస్పత్రులకు అనుసంధానం చేస్తున్నాం. వీళ్ల వివరాలు 104, 108 వాహనాలకు ఇస్తాం. అత్యవసరమైతే వారు వెళ్లి గర్భిణిని ఆస్పత్రికి తీసుకురావాలి. ఏఎన్ఎం ఒకరిని అటాచ్ చేస్తాం. హైరిస్క్ ప్రెగ్నెన్సీపై అవగాహన పెరిగింది. ఎక్కువ మంది పరీక్షలకు వస్తున్నారు. దీనివల్ల మాతృమరణాలు తగ్గించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ప్రతి గర్భిణీ ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తే ఉచితంగా వైద్యపరీక్షలు అందుతాయి. –డా.గీతాప్రసాది, సంచాలకులు,ప్రజారోగ్యశాఖ గడిచిన ఆరుమాసాల్లో ఇలా.. -
టాయిలెట్కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది
బ్రిటన్: ఈ మధ్యకాలంలో టాయిలెట్లోనూ, బస్స్టేషన్లోనూ, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్రూంలోనూ అనుకోకుండా ప్రసవం జరగడం గురుంచి మనం వినే ఉంటాం కదా. అచ్చం అలాంటి సంఘటన యూకేలో జరిగింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అనోకోకుండా కైట్లిన్కి టాయిలెట్ రావడంతో సమీపంలో ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్లోని బాత్రూంలోకి వెళ్లింది. (చదవండి: "థింక్ బి ఫోర్ యూ డయల్") అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏం చేయాలో తోచదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అనుకోకుండా ఇలా జరిగితే ఎవరికైన భయంగానూ, ఆశ్యర్యంగానూ అనిపిస్తుంది కదా. (చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!") -
డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల సరఫరా... ఎలానో చూస్తారా?
తెలంగాణ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే మొట్టమొదటి సారి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను ఆస్పత్రులకు , ఏజెన్సీ ప్రాంతాలకు సరఫరా చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. గత నెల పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు డ్రోన్లను సరఫరా చేశారు. ఇది సక్సెస్ కావడంతో ఈ రోజు వికారాబాద్ ఏరియా ఆస్పత్రి నుంచి బొమ్రాస్పేట పీహెచ్సీకి డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు సరఫరా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. వికారాబాద్ నుంచి బొమ్రాస్పేట వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 35 నిమిషాల్లో డ్రోన్ చేరుకుంది. 300 డోసుల రేవాక్ బీ, 15 డోసుల టుబెర్వాక్ వ్యాక్సిన్లను డ్రోన్ చేరవేసింది. 4.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా గమ్యస్థానికి వ్యాక్సిన్లు డ్రోన్ ద్వారా అందాయి. రోడ్డు మార్గంలో అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 46 కిలోమీటర్లు ఉండగా ప్రయాణ సమయం గంటకు పైగానే పడుతుంది. India's first organized trials for drones in healthcare, i.e. Medicine from the Sky has achieved a new record today by travelling a distance of 26 Km fully autonomous and without any manual interventions during the flight. @JM_Scindia @MinisterKTR @jayesh_ranjan @ramadevi_lanka pic.twitter.com/Lzbc3I149P — Emerging Technologies Govt. of Telangana (@EmergingTechTS) October 9, 2021 చదవండి :డ్రోన్ ద్వారా ఆయుధాల తరలింపు యత్నం భగ్నం -
గర్భిణీకి తీవ్ర రక్తస్రావం.. ప్రాణం పోసిన మేయర్
సాక్షి,రామగుండం(కరీంనగర్): ప్రజాపాలనలో నిత్యం బిజీగా ఉంటున్న రామగుండం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్ సకాలంలో స్పందించి గర్భిణీకి మంగళవారం ఆపరేషన్ నిర్వహించి ప్రాణం పోశారు. మంథని మండలం గుంజపడుగు ప్రాంతానికి చెందిన దుస్స రమ్యకృష్ణ అనే గర్భిణికి పురుటి నొప్పులు ఎక్కువకావడంతో మంగళవారం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి రెండోకాన్పుకోసం తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసవంకోసం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేస్తున్న సమయంలో రమ్యకృష్ణకు తీవ్ర రక్తస్రావం అయింది. వైద్యం అందిస్తున్నప్పటికీ రక్తస్రావం అదుపులోకి రాలేదు. కంట్రోల్ కాలేదు. వెంటనే విషయాన్ని సీనియర్ జనరల్ సర్జన్ అయిన నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్కు తెలిపారు. సకాలంలో స్పందించిన మేయర్ హుటాహుటిన ఆపరేషన్ థియేటర్కు చేరుకుని, సదరు గర్భిణికి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ సక్సెస్కావడంతో పండంటి బాబుకు రమ్మకృష్ణ జన్మనిచ్చింది. తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండడంతో ఆమె భర్త అశోక్కుమార్, కుటుంబసభ్యులు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. సకాలంలో స్పందించి శస్త్రచికిత్స అందించిన నగర మేయర్ను ఆస్పత్రి వైద్యులతోపాటు రమ్యకృష్ణ కుటుంబసభ్యులు అభినందించారు. డాక్టర్లు శౌరయ్య, శ్రవంతి, కళావతితోపాటు ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: మూసీ ప్రవాహంలో మృతదేహం కలకలం