విజయవాడ(పడమట): నగరంలోని రామవరప్పాడులో ఓ యువతి(24) ఇంటి యజమాని కుమారుడి చేతిలో అత్యాచారానికి గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ యుతిపై ఏడాదికాలంగా ఇంటి ఓనర్ కుమారుడు రాఘవేంద్ర అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అత్యాచారాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించాడు.
వాటిని తన స్నేహితులకు పంపించాడు. దీంతో వారు ఆ వీడియోను బాధితురాలికి చూపించి డబ్బులు ఇవ్వాలని బెదిరించే ప్రయత్నం చేశాడు. దీనిని ప్రతిఘటించేందుకు ఆమె ప్రయత్నం చేయడంతో ఆమె ఇంటిపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు పరారీలో ఉన్నారు.
ఇంటి యజమాని కుమారుడి లైంగిక దాడి
Published Fri, Aug 21 2015 11:26 PM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM
Advertisement
Advertisement