'ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే క్యూ కడతారు' | Ysrcp mla meka pratap apparao denis spreading of ysrcp mlas joining tdp | Sakshi

'ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే క్యూ కడతారు'

Published Thu, Jun 23 2016 2:20 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM

కృష్ణా జిల్లాలో ఓ ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు.

హైదరాబాద్: కృష్ణా జిల్లాలో  ముగ్గురు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని నూజివీడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. గురువారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఏడాది తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడతారని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి  కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైందంటూ ఆయన  ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఎందుకు వచ్చామా అని ఇప్పుడు వారంతా బాధ పడుతున్నారని మేకా ప్రతాప్ అప్పారావు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement